పోస్ట్‌లు

మరుగున పడ్డ కథ

మరుగున పడ్డ కథ " ఏవండీ వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. ఈసారైనా కనీసం నాలుగు ప్రోగ్రాములు కుదిరితే బాగుండు ను. కనీసం పండగ రోజుల్లో కూడా ఎవరు మీ ప్రోగ్రాం పెట్టించుకోవడానికి రావడం లేదు. ఇదివరకైతే ఎప్పుడూ ఖాళీ ఉండేది కాదు. వినాయక చవితి ,దసరా ఉత్సవాలు, దీపావళికి, కార్తీక మాసం సంక్రాంతి సంబరాలు, శివరాత్రి ఉత్సవాలంటూ ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. ఏదో శాపం తగిలింది. కనీసం బతిమాలుతున్న ఎవరు ఈ ప్రోగ్రాం పెట్టించుకోవడం లేదు.  ఏమిటో ఈ రోజులు? కాలం మారిపోయింది ప్రాచీనమైన కళలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఈ కళనీ నమ్ముకుని బతుకుతున్న మనలాంటి కుటుంబాలకి గడిచేది ఎలాగా? గతంలో ప్రతి ఏడాది మీ ప్రోగ్రామ్ తప్పనిసరిగా ఉండేది కదా పల్లిపాలెం వినాయక చవితి ఉత్సవాల్లో ,వాళ్లు పిలవకపోతేనే మీరే ఒక్కసారి వెళ్లి అడిగి వస్తే మంచిది కదా !అవసరం మనది అనీ చెప్పింది పతంజలి శాస్త్రి భార్య సుమతి.  "చూడండి పండగ పూట కనీసం పచ్చడి మెతుకులతోనైనా పిల్లల కడుపు నింపాలి కదా!. ఇంక అంతకంటే మీకు నేను ఏం చెప్పను?. మనం ఏదో సర్ది చెప్పుకుని పడుకుంటాం, పిల్లలు ఎలాగండి ?అని చెప్తున్న భార్య మాటలకి దుఃఖం వచ్చింది...

కృష్ణ

కృష్ణ ఉదయం  పది గంటలు అయింది.  చుట్టూ పోలీసులు మధ్య చేతులకు బేడీలు వేసుకొని ఉన్న సుమారు ముప్పై సంవత్సరములు యువతి నడుచుకుంటూ కోర్టు లోపలికి అడుగుపెట్టింది  కోర్ట్ ఆవరణలో ఉన్న అందరూ ఆమెకేసి వింతగా చూస్తున్నారు. ఈమె కూడా నేరం చేసిందా అన్నట్లు! ఆవిడకు మినహాయింపు ఏమిటి ?అని చూస్తే పాపం ఆవిడ నిండు గర్భిణీ.  న్యాయదేవతకు అవి ఏమీ సంబంధం లేదు. సాక్ష్యం బలంగా ఉంటే ఎవరైనా నేరస్తులు. అది దొంగ సాక్ష్యం కావచ్చు ,దొరల సాక్ష్యం కావచ్చు. సాక్ష్యాన్ని నమ్మి ఇంకేముంది యావత్ జీవిత కారాగర శిక్ష  విధించింది. సాధారణంగా ప్రతి స్త్రీ  పురిటి కోసం పుట్టింటికి వెళ్తారు. కానీ  విధి వ్రాత అలా ఉంది. జైలు గోడలే పుట్టిల్లు అయింది. మానవతా దృక్పథంతో  కోర్టు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిస్తే మరో ప్రాణికి జన్మనిచ్చింది సరిత.  ఆ బిడ్డను చూసి కుమిలి కుమిలి ఏడ్చింది  సదరు ఖైదీ సరిత.  రేపటి సమాజంలో దీని బ్రతుకేమిటి?   సరిత భర్త ఎప్పుడో పారిపోయాడు. ఇంక నా అన్న వాళ్ళు ఎవరూ లేరు సరితకి. ఆ నాలుగు గోడల మధ్య ఆ పిల్లని పెంచుకోవడానికి అనుమతించింది ప్రభుత్వం. శ్రీకృష్ణ పరమాత్...

ఇది ఏమి ఉప్మా చెప్మా!

ఇది ఏమి ఉప్మా చెప్మా!  ప్రతిరోజు ఇంటి ఇల్లాలికి అనేక సమస్యలు. ఏమిటా సమస్యలు? ఆర్థిక సమస్యలు కాదు. అల్పాహారం సమస్యలు. పదుగురు మెచ్చే అల్పాహారం చేయాలని తాపత్రయం. అందుకే ప్రతి ఉదయం కాఫీ తాగిన వెంటనే ఇవాళ ఏం టిఫిన్ చేసుకుందాం అoటు పిల్లలు మరియు భర్త మనోగతం తెలుసుకుంటుంది. ఎవరు ఏమి చెప్పకపోతే మౌనంగా తనకు నచ్చినది తయారు చేసుకుంటుంది. ఇంటి పనులతో అలసిపోయి ఉంటే కాస్తంత ఉప్మా కలియబెట్టి పెట్టేస్తుంది. ఆ అల్పాహారం చూడగానే కుటుంబ సభ్యుల మొహాలు మాడిపోయిన పెసరట్టులా అయిపోతాయి. అయినా తప్పదు మరి. అయితే ఒకటి ఉంది చెయ్యి తిరిగిన ఇల్లాలు చేసిన ఉప్మా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.  ఇప్పుడైతే రకరకాల టిఫిన్లు వచ్చేయ్ గాని ఒకప్పుడు సదరు ఉప్మాయే పెళ్లి వారికి అల్పాహారం. ఆకుపచ్చటి అరిటాకులో నూనెలో తేలియాడుతూ తెల్లగా మెరిసిపోయే ఆ ఉప్మా ఆ పెళ్లి వారికి అమృతమే.ఆ రోజులు కాబట్టి అలా ఉండేది. ఈ రోజుల్లో ఉప్మా చూస్తే తేలికగా చూస్తారు. పెసరట్టు కాంబినేషన్తో అయితే మారు అడుగుతారు. మాట్లాడకుండా తినేస్తారు. అప్పట్లో ఈ ఉప్మాలో పసుపు రంగులో మెరిసిపోయే శనగపప్పు తప్ప ఈ రోజుల్లో లాగ రకరకాల పప్పులు ఉప్మా తో పాటు ఉడికే...

గుండెల్లో నిలిచిన వైద్యుడు

గుండెల్లో నిలిచిన వైద్యుడు  ప్రతిరోజు ఎంతోమంది రోగుల గుండెలకి స్వాంతన చేకూర్చే డాక్టర్ రామారావు కి ఆరోజు గుండెల్లో చాలా గుబులుగా ఉంది. ఆ వయసులో కూడా చాలా ఉత్సాహంగా జూనియర్ డాక్టర్లతో కలిసిమెలిసి పని చేస్తూ గుండె శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ రామారావు మనసు అదోలా ఉంది. నాలుగు దశాబ్దాల పాటు గవర్నమెంట్ డాక్టర్ గా సేవలందించిన రామారావు కి ఆ రోజుతో ఆసుపత్రితో అనుబంధం తెగిపోతోంది డాక్టర్ రామారావు గుండె సంబంధిత వ్యాధులు చికిత్స చేసే డాక్టర్ గా ఆ మండలంలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. వృత్తిపరంగా ఎన్నో సమస్యలున్న తన తోటి ఉద్యోగులతో మంచిగా ఉంటూ కాలక్షేపం చేశాడు ఇన్ని రోజులు. ఎప్పటిలాగే సాయంకాలం ఆరోజు కూడా ఐదు గంటలు అయింది . పదవి విరమణ సభ మొదలైంది. ఒక్కొక్కరే లేచి డాక్టర్ గారితో తన అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు.  ఇంతలో చివర వరుసలో కూర్చున్న ఒక జూనియర్ డాక్టర్ లేచి మైక్ తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. నా పేరు రవి ప్రకాష్. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ జూనియర్ డాక్టర్ గా జాయిన్ అయ్యి నెలరోజులు అయింది. అయితే డాక్టర్ గారితో పని చేసిన అనుభవం కంటే ఒక పేషెంట్ కొడుకుగా నా అనుభవం ఎక్కువ...

కాఫీ తాగారా

కాఫీ తాగారా!  " దిక్కుమాలిన అలవాటయింది! ఇలా మొహం కడుక్కుంటున్నారో లేదో అలా కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చిందులు తొక్కుతారు అంటూ ప్రతిరోజులాగే దండకం చదివి కాఫీ కప్పు అక్కడ పెట్టింది మా శ్రీమతి రాజ్యలక్ష్మి. కాఫీ రుచి ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ కాఫీ తాగదు. 'కప్పు కాదండి పెద్ద స్టీల్ గ్లాస్. ఆ గ్లాస్ తో కాఫీ తాగకపోతే కాఫీ తాగినట్టు ఉండదు. ఇంకా నయం మా తాతగారు ఒకాయన పెద్ద చెంబుతో కాఫీ తాగేవాడుట. అయితే మేము మటుకు తక్కువేముంది . ఒక్కసారి తాగే బదులు నాలుగు సార్లు తాగుతున్నాం.  ఇంట్లో ఉంటే ఏ బెంగ ఉండదు. ఎన్ని తిట్లు తిట్టినా వేళకు  కాఫీ వచ్చి పడిపోతుంది. మరి ఎక్కడికైనా వెళ్తే మనకా ఉదయం లేచి కాఫీ తాగడం అలవాటు. అవతల వాళ్ళు లేస్తారా! లేచిన వెంటనే కాఫీ ఇస్తారా! అనేది ఒక పెద్ద బెంగ. సరే పెళ్లిళ్లకి ఫంక్షన్లకి వెళితే ఆ కాఫీ తాగితే ఏడుపొస్తుంది . డోసు తక్కువ  రుచి నేను వర్ణిస్తే బాగుండదు. మా చిన్నతనంలో పొయ్యి మీద కాచిన కాఫీ ఎంత రుచికరంగా ఉండేది. ఇప్పుడు కాఫీ మేకర్లు వచ్చేసి పని సులువు అయింది గానీ సరుకు రుచి మరి ఏమో!  ఉదయం లేచిన దగ్గర్నుంచి మామూలుగ...

ఒంటరితనం 2.0

". ఒంటరితనం 2.0 " " అమ్మ నువ్వేమీ బెంగ పడకు. నేను ప్రతిరోజు వీడియో కాల్   చేస్తుంటాను గా. నువ్వు కావాలంటే అమెరికా రావచ్చు నేను  కూడా ఇండియా రావచ్చు ఇప్పుడు నేను ఉద్యోగస్తుడిని. ఏమి ఇబ్బంది లేదు అంటూ పార్వతమ్మ గారి కొడుకు రాకేష్ ధైర్యం చెబుతూ అమెరికాకి విమానం ఎక్కేసాడు.  రాకేష్ కి అమెరికాలో ఉద్యోగం రావడం తో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోయినప్పటికీ పార్వతమ్మ గారు ఒంటరిది అయిపోయింది . రాకేష్ తండ్రి పోయినప్పటి నుంచి ఎంతోమంది రెండో పెళ్లి చేసుకున్న సలహా ఇచ్చినప్పటికీ ఒప్పుకోకుండా అన్నీ తానై పెంచుకుంటూ వచ్చింది రాకేష్ ని . మూడో వ్యక్తి ఇంట్లో లేకపోవడం మూలంగా రాకేష్ బాగా అలవాటయ్యాడు పార్వతమ్మకి. ఇద్దరు కలిసి భోజనం చేయడం కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం అలవాటు. అస్తమాను అమ్మ అమ్మ అంటూ పార్వతమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు రాకేష్. ఇప్పుడు రాకేష్ అమెరికా వెళ్ళిపోవడంతో తీవ్రమైన వంటరితనంతో బాధపడుతోంది పార్వతమ్మ. అప్పుడే రాకేష్ అమెరికా వెళ్లి ఆరు నెలలు అయిపోయింది. మొదట్లో వారానికి ఒకసారి ఫోన్ చేసి రాకేష్ క్రమేపీ పని ఎక్కువగా ఉంటుందంటూ పదిహేనురోజులకు ఒకసారి ఫోన్ చేయడo మొదలుపెట్...

కాలమహిమ

కాల మహిమ " అన్నింటికన్నా బలమైనది ఏది? అని అడిగారు తెలుగు ఉపాధ్యాయులు పదో తరగతిలోని పిల్లలకి తెలుగు పాఠం చెబుతూ.  " అందరికన్నా బలమైన వాడు భీముడు ఒక విద్యార్థి లేచి చెప్పాడు.  " కాదు మాస్టారు ఆంజనేయుడు ఇంకో విద్యార్థిని నువ్వు తప్పు చెప్పావు అని ఆ విద్యార్థి కేసి చూస్తూ.  ఇంకెవరైనా చెప్పగలరా ! అని తరగతి గది అంతా చూశారు తెలుగు ఉపాధ్యాయులు.  ఎప్పుడూ చివరి బెంచిలో కూర్చుని ఉండే కుర్రవాడు గబుక్కున లేచి అన్నిటికన్నా బలమైనది "కాలము" సార్ అన్నాడు. నీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అని అడిగారు మాస్టారు.  మా అమ్మ చెబుతూ ఉంటుందండి. ఒకప్పుడు మాకు తినడానికి తిండి ఉండేది కాదట. ఇప్పుడు మా పరిస్థితి బావుంది . అంతా ఆ ఈశ్వరుడు దయ అని రోజు చెబుతూ ఉంటుందండి. కాలస్వరూపమే ఈశ్వరుడని మీరే చెప్పారు అని అన్నాడు ఆ కుర్రాడు.  ఆ తెలుగు ఉపాధ్యాయుడు ఆ కుర్రవాడు తెలివితేటలకు ఆనందించి అభినందించి కూర్చోబెట్టాడు. కాలం కళ్ళకి కనపడదు. అది ఏదో అదృశ్య శక్తి. కానీ అత్యంత బలీయమైనది. ఈ లోకంలోకి మనం తీసుకొచ్చేది తీసుకువెళ్లిపోయేది కూడా కాలమే. సమయం అయిందంటే ఒక క్షణం కూడా ఉంచదు. కాలం గమనించలేని వేగంతో ...

పార్వతమ్మ కోరిక

పార్వతమ్మ కోరిక " అమ్మ అమ్మమ్మ అన్నం తిందా! రాత్రి ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన రఘు తల్లి అన్నపూర్ణని అడిగాడు. మజ్జిగ అన్నం తిని మందులు వేసుకుని పడుకుంది. నీ గురించి పది సార్లు అడిగింది రా. వాడు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు ఏమిటని. ఏరా ! రఘు అమ్మమ్మ ఎప్పటికైనా మంచం మీద నుంచి లేస్తుంది అంటావా! అని అడిగింది కొడుకుని. అమ్మమ్మకి ఏమి అనారోగ్యాలు లేవు. కేవలం వయస్సు తెచ్చిన నీరసం తోటి అలా పడుకొని ఉంటోంది. అయినా డబ్బై ఐదు ఏళ్ళు వయస్సు. తాతయ్య పోవడంతో మరి బెంగపెట్టుకుంది.  మనం ఆ పోయిన వ్యక్తిని తీసుకురాలేం కానీ అమ్మమ్మని సాధ్యమైనంత వరకు ఆనందంగానే ఉంచాలమ్మ. అమ్మమ్మకి ఇంక ఎవరున్నారు. ఉన్నవాళ్లందరూ ఆడపిల్లలు ఎవరికి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మకు నేనంటే చాలా ఇష్టం. ఒకటేమో పెద్ద మనవడు గాను రెండోది ఆవిడకి మగపిల్లలు లేకపోవడం తాతయ్య పోయిన తర్వాత మన దగ్గరి ఉండడంతో అమ్మమ్మ తోటి మనకు చాలా అనుబంధం పెరిగింది.ఆ రోజుల్లో చిన్న వయసులో పెళ్లిళ్లు చిన్న వయసులోనే కాన్పులు మూలంగా మనవళ్లు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు అని అన్నాడు రఘు. " ఏమోరా ఆవిడ బ్రతికి ఉన్నన్నాళ్ళు ఏ మాట అన...

ఊరి ముచ్చట్లు

ఊరి ముచ్చట్లు  సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత పిల్లలందరూ రాబోయే వేసవికాలం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కైతే పది రోజులు సెలవులు కానీ వేసవికాలం వచ్చిందంటే ఇంకేముంది రెండు మూడు నెలల పాటు పిల్లలకి ఆటవిడుపే. పెద్ద పరీక్షలు అయిపోతే అమ్మమ్మ గారి ఊరికి పరుగులు తీస్తుంటారు.  అసలు రుతువు మారుతోందని మనకి ఎలా తెలుస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులే మనకి రుతువు మారిపోతోందని తెలుస్తుంది.  మహాకవి పోతన గారు భాగవత గ్రంథంలో గ్రీష్మ రుతువు గురించి చెబుతూ పగటి సమయాలు అంతకంతకు పెరుగుతున్నాయని సూర్యుడు ఉత్తర దిక్కు వైపుకు సంచరిస్తున్నాడని ఎండ తీక్షణ రోజురోజుకీ పెరుగుతుందని భూమి నుండి లేచిన దుమ్ము రేణువులు ఆకాశమంతటా వ్యాపించి ఉన్నాయని సెలయేళ్లు కొలనులు ఎండిపోయాయి బాటసారులు చలివేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారని పాములు ఎండలు భరించలేక పొదల్లో చేరిపోతున్నాయని చెట్లు పూలు వాడిపోయాయని అగ్నిదేవుడు అడవులతో ఆడుకుంటున్నాడని అద్భుతమైన వర్ణన చేశారు. అలాంటి వాతావరణంలోని మార్పులతో ఆ ఊరికి అంటే మా స్వగ్రామం కాకినాడ తాలూకా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామoలో కూడా వేసవికాలం అడుగుపెట్టేసింది....

ఇది సత్యం

ఇది సత్యం. " ఈసారి పండక్కి పిల్లలు ఎవరికీ ఫోన్ చేయకండి. నేను చాకిరి చేయలేకపోతున్నాను. మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. ఖర్చులు తట్టుకోవడం కష్టం కదా! అయినా పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యి పది ఏళ్లు పైన అయింది. ఏమీ అనుకోరు లెండి అంది జానకమ్మ తన భర్త సుందర రామయ్య తో. సుందర రామయ్య ఎటు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం చేస్తాడు ఇంటి యజమాని కదా! ఏ నిర్ణయం తీసుకున్న మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా! సుందర రామయ్యకి కూడా అదే అనిపించింది. రమారమీఅరవై ఐదు ఏళ్లు వయస్సు దాటింది జానకమ్మకి. ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు.  సుందరామయ్యకి నలుగురు ఆడపిల్లలే. అందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ లోటు లేదు. సుందరామయ్య మటుకు ఉన్న ఊరిలో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు. అయినా ఏ పండుగకి పిల్లల్ని పిలవకుండా ఉండరు.  ఈసారి జానకమ్మ ఎందుకు అలా చెప్పింది? అలా ఎప్పుడూ చెప్పలేదు. సుమారు యాభై సంవత్సరాల నుంచి చాకిరీ చేసి చేసి అలిసిపోయింది జానకమ్మ. ఏమిటో రేపు ఒకసారి జానకమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్...