పోస్ట్‌లు

జీవితం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జీవితం

సాయంకాలం ఐదు గంటలు అయింది. రోడ్డంతా చాలా రష్‌గా ఉంది. రిక్షా చెట్టు కింద పెట్టి సవారి కోసం ఎదురుచూస్తున్న లక్ష్మికి ఒక జంట నడుచుకుంటూ వస్తూ కనిపించారు.  " అయ్యా రిక్షా కావాలా !అని అడిగింది లక్ష్మి. స్వప్న థియేటర్ కి ఎంత తీసుకుంటావు! అని అడిగాడు ఆయన. "ఇరవై రూపాయలు ఇవ్వండి అంది లక్ష్మి. ఆ దంపతులిద్దరూ సరేనని తల ఊపి రిక్షా ఎక్కి కూర్చున్నారు. "కొంచెం తొందరగా పోనీయమ్మ! సినిమాకు టైం అయిపోతోంది," అన్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. "అలాగే అయ్యా! ట్రాఫిక్కు ఎక్కువగా ఉంది కదా!" అంటూ బలవంతంగా బండిని స్పీడ్‌గా లాగడానికి ప్రయత్నించింది లక్ష్మి. బరువు లాగడం లక్ష్మికి కొత్త ఏం కాదు. బతుకు బండి నడపడానికి ఈ రిక్షాని, తాగుబోతు తండ్రి వదిలేసిన సంసారాన్ని లాగుతూనే ఉంది రోజు పాపం లక్ష్మి. రిక్షా ఎక్కిన దగ్గర్నుంచి ఊరికే కంగారు పడిపోతున్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. ఎంత తొందరపడితే ఏం లాభం? మార్గం ఉండాలిగా బండి నడవాలంటే. స్కూలు, కాలేజీలు, సినిమా హాలు వదిలిన సమయం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్లతో రోడ్ అంతా బిజీగా ఉంది. "బండిలో కూర్చున్నాయన తొందర చూసి ఎందుకండి తొందరపడ...

జీవితం

నీటి బుడగ జీవితం. ఎప్పుడు చితికి పోతుందో ఎవరికి తెలుసు. చావు బతుకుల మధ్య కాలంమే జీవితం. పగలు రాత్రి ప్రతిమనిషికీ సమానం. సగ భాగం అంతా తిండి నిద్రకి సరిపోతుంది. బాల్యమంతా నీ జీవితం గురించి నీకు అవగాహన ఉండదు. యవ్వనం నుండి నీ అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఇంకో జీవి కూడా నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ జీవి కూడా జీవితం అంటే అంత వరకు తెలియదు. అమ్మా,నాన్న ,పుస్తకాలు ,కాలేజీ, హాస్టల్ జీవితం బాధ్యతలు లేని బతుకు ఇంతవరకు అనుభవించిన తీపి గుర్తులు. ఇంకొకరి తో జీవితం ఒక ఫ్రేమ్ లో ఉంటుంది.  ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోవడం. ఒకరి కోసం ఒకరు బతకడం. తన ఇష్టాలను త్యాగం చేయడం కూడా తప్పదు. సర్దుబాటే జీవితం. సరే జీవితంలోకి అడుగు పెట్టాం. జీవిత సాఫల్యo ఏమిటి. డబ్బు పిల్లలు వృద్ధాప్యం ఈ మూడింటి తోటి మనకు చిక్కులు వస్తాయి. మన ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలి.  డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. చేసిన పనికి ప్రతిఫలమే జీతం. జీతం తో జీవితం ఆనందంగా గడపడమే . అప్పనంగా వచ్చేది లంచం. లంచం పంచ రంగుల జీవితం చూపిస్తుంది. కానీ దైవం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. పరుల సొమ్ము ఆశించక పోవడమే పరమార్ధం. గౌతమ్ బుద్ధ...

జీవితం

జీవితం  సాయంకాలం ఐదు గంటలు అయింది. ఆ పల్లెటూర్లో ఉండే సోమయాజులు గారి ఇల్లంతా హడావిడిగా ఉంది. నడవలో వేసిన కుర్చీల్లో సోమయాజులు గారు కుటుంబం ఒకవైపు పెళ్ళికొడుకు రమేష్ కుటుంబం ఒకవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నా రు. అమ్మాయికి అబ్బాయికి  అబ్బాయికి అమ్మాయి నచ్చారు. కట్న కానుకలు వద్దని ముందుగానే చెప్పారు మగ పెళ్లి వారు.ఇంక పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడమే తరువాయి. సోమయాజులు గారు తూర్పుగోదావరి జిల్లాలో కాజులూరు మండలంలో ని పల్లిపాలెం స్కూలు హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఒకర్తే అమ్మాయి. అమ్మాయి పేరు వైదేహి . అచ్చు తెలుగు వారి పిల్లలా ఉంటుంది. డిగ్రీ చేసిన తర్వాత బీఈడీ కంప్లీట్ చేసి టీచర్ గా అక్కడ దగ్గరగా ఉన్న స్కూల్లోనే పనిచేస్తోంది. సోమయాజులు గారికి ఇంకా 5 సంవత్సరాలు సర్వీసు ఉంది. ఈలోగా పిల్లకు పెళ్లి చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత బాధ్యతలు ఉండవని ఆయన ఆలోచన. అయితే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈడు జోడు చూడాలంటారు. అందుకే టీచర్ ఉద్యోగం చేసే వరుడు కోసం వెతుకుతూ చివరికి కాకినాడలో టీచరుగా పనిచేస్తున్న రమేష్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. చివరికి పిల్లలిద్దరికీ ఒకరిక...