పోస్ట్‌లు

మా పల్లె దీపావళి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మా పల్లె దీపావళి

అది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని మారుమూల పల్లెటూరు. ఊరు మారుమూలన ఉన్న ప్రజల మనసులు ఆత్రేయ గోదావరి అంత విశాలం. గోదావరి జలాలంత స్వచ్ఛమైన హృదయాలు. బంధాలకి బాంధవ్యాలకి ఉమ్మడి కుటుంబాలకి ఎక్కువ విలువను ఇచ్చే గ్రామం. మామూలుగానే ఎప్పుడు వచ్చే పోయే బంధువులతో పిల్లలతో కళకళలాడుతూ ఉండేది ఆ గ్రామంలోని అగ్రహారం. ఇంకా పండగలు వస్తే చెప్పాలా.               ఇంతకీ ఆ ఊరి పేరు ఏమిటో చెప్పలేదు కదూ. అదేనండి పల్లిపాలెం గ్రామం. ఏ పండగ వచ్చినా ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉండేది .అయితే దీపావళి పండక్కి దీపాలు తెచ్చే వెలుగుతో పాటు ప్రతి ఇంట్లోనూ తయారు చేసే బాణసంచా వెలుగులు చాలా ముచ్చటగా ఉండేవి. కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి. ఈ గ్రామంలో సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రతి అరుగు మీద బాణసంచా తయారు చేసేవారు. తారాజువ్వలు ,చక్ర కాయలు, నల్ల మందు తో తయారుచేసిన టపాకాయలు ,చిచ్చుబుడ్లు , పిచ్చుకలు ,మతాబులు సిసింద్రీలు . సుమారు నెలరోజులు దగ్గరుండి వీటి తయారీకి ప్రయత్నాలు ప్రారంభించేవారు.. ఇంటి పెద్దలు వీటి తయారీలో చాలా మంచి నైపుణ్యం సంపాదించి ఉండేవారు. కుర్ర కారు సిసింద్రీలు తయారు చేసేవార...