పోస్ట్‌లు

ఏప్రిల్ 13, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పెళ్లి కాజా

పెళ్లి కాజా. "అయ్యా గోపాలకృష్ణ గారు పెళ్లి వారిని భోజనానికి పిలవవచ్చునా! వంట సంగతి ఏమిటి? అంటూ అడిగిన కన్యాదాత చలపతిరావుకి నిరభ్యంతరంగా పిలవచ్చు. మీరు చెప్పిన వంటలన్నీ రెడీగా ఉన్నాయి అన్నాడు గోపాలకృష్ణ. బంగాళదుంప కూర, వంకాయ జీడిపప్పు సాంబారు అప్పడాలు వడియాలు కంది పొడి ఆవకాయ వీటన్నిటితో పాటు కాజాలు, జిలేబి వడ్డించండి. పిండి వంటలన్నీ ఆ మూల గదిలో పెట్టించాను. వడ్డనకి ఊరి వారు సరిపోతారా! మా కుర్రాళ్లను కూడా పంపించినా అవసరమైతే నేను కూడా వస్తాను. మీరు బంతి వేసే లోపు నేను అన్నం వార్చుతాను అంటూ గాడి పొయ్యి దగ్గర స్టూల్ మీద కూర్చున్న వంట బ్రాహ్మణుడు గోపాలకృష్ణ చెప్పాడు చలపతిరావు తో. సదరు గోపాలకృష్ణ వంటలు వండడంలో పిండి వంటలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి. నల్లగా పెద్ద బొజ్జతో పొట్టిగా ఉండి ఎర్రటి అంగవస్త్రం కట్టుకుని నలుగురు కుర్రాళ్లను వెంటబెట్టుకుని ఎంతటి పెళ్లి వంట అయిన రుచికరంగా శుభ్రంగా తయారుచేసే ఆ గోపాలకృష్ణ కాకినాడ నివాసి.  ఆ ఊర్లో చిన్న తోరణం కడితే చాలు వంటకి గోపాలకృష్ణ నే పిలిచేవారు.అంత అలవాటు పడిపోయారుఆ ఊరి జనం గోపాలకృష్ణ వంటకి.  గోపాలకృష్ణ వంటలో ఉన్నాడంటే నిశ్చింతగా ఉంటాడు యజమా...

ఆయుర్వేదం

నాడి తడిమి చూసి నలత చెప్పు కళ్ళలో కళ్ళు పెట్టి రక్త బలిమి చూడు రసాగ్రము రంగు చూసి రోగము సంగతి చెప్పు. ఆయుష్షును వృద్ధిచేసి ఆరోగ్య మిచ్చేది ఆయుర్వేదం రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

మా ఊరి జ్ఞాపకం

మా ఊరి జ్ఞాపకం. చూడ్డానికి క్రికెట్ వీరుడులా పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే ఈయన నోట్లో పొగాకు చుట్ట ,చేతిలో ఎప్పుడు పదమూడు ముక్కలు పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ పంచ కట్టుకుని దానిమీద చొక్కా తొడుక్కుని నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం భారతం రామాయణం వినడానికి కాదు ఈయన పారాయణ వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణo. అందరూ సంక్రాంతి పండుగకి పెళ్లిళ్లకి వేసవికాలం సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మన వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి. వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడు పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు . ఏవండీ వెంకన్న గారు ఉన్నారా ఇంట్లో అంటూ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు ఎవరు అడిగినా లేదండి పేకాటలో ఉన్నారండి అని ఇంట్లోంచి అదే సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు.చివరికి ఏ వీధిలో ఉన్నాడు ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు.ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్రత్యేక...

కబ్జా

కబ్జా " చూడ్డానికి చాలా విశాలంగా ఉంది. మూడు బెడ్ రూములు హాలు, కిచెన్ ,డైనింగ్ హాలు ,రెండు బాల్కనీలు, రెండు బాత్రూములు మనకి శుభ్రంగా సరిపోతుంది. మనం ఆ బిల్డర్ తో మాట్లాడి ఏదో విధంగా తీసుకుందాం. మంచి గాలి వేస్తోంది. మంజీరా వాటర్ వస్తుందిట. మార్కెట్ కూడా చాలా దగ్గర. పైగా ఆ ఏరియా కు దగ్గర్లో మెట్రో స్టేషన్ కూడా వస్తుంది ట. బిల్డర్ కూడా చాలా మంచి వాడ నీ పైన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ఈరోజు మార్కెట్ రేట్లు ని బట్టి ఆ రేటు ఏమి ఎక్కువ కాదు. మొదటి అంతస్తు అయితే మనకి లిఫ్ట్ పని చేయకపోయినా ప్రాబ్లం లేదు అంటూ చెప్పిన భార్య శాంత మాటలుకి ఆలోచనలో పడ్డాడు రామారావు.  రామారావు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు.చాలా రోజుల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలతో సరిపోక ఇబ్బంది పడుతుంటాడు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తుంటే భయం. వాళ్లకు పడుకోవడానికి ఇల్లు సరిపోదు. దానికి తోడు ప్రతి ఏటా అద్దె పెంచడంతో ఎన్నో ఇళ్ళు మారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి ఆ నగరంలో. ఇప్పటివరకు రామారావు ఆ నగరంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాడు. కొన్ని ధర ఎక్కువగా ఉండి కొన లేకపోతే, మరికొన్ని ఆ ప్...

బహుమతి

బహుమతి " నాన్న అమ్మ బర్తడే దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మకి ఇది స్పెషల్ బర్తడే. అరవై సంవత్సరాలు వస్తున్నాయి. ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వు నాన్న అంటూ విదేశాల్లో ఉంటున్న రామారావు పిల్లలు ఒకరి తరువాత ఒకరు ఫోన్ చేస్తూ హడావుడి చేస్తున్నారు రెండు రోజుల నుంచి. ఏం గిఫ్ట్ ఇవ్వాలి ?ఎంత ఆలోచించినా రామారావుకి ఏమి ఆలోచన తట్టలేదు. వెండి బంగారాల మీద మమకారం లేదు రామారావు భార్య సీతాదేవి కి. ఖరీదైన పట్టు చీరలు అంటే అసలు ఇష్టం లేదు. ఈ వయసులో గిఫ్ట్లు ఏం చేసుకుంటుంది. పుణ్యక్షేత్రాలు టూర్లు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు సీతాదేవికి. భర్త తెచ్చిన సంపాదనని పొదుపుగా వాడుకుని పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి కుటుంబానికి గౌరవ మర్యాదలను తీసుకొచ్చిన సగటు భారతీయ మహిళ సీతాదేవి. రామారావు గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిరుద్యోగి. వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేవు. మూడు గదుల కొంపలో ముగ్గురు ఆడపిల్లలతో పొదుపుగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి రామారావు.  రామారావుకి సీతాదేవికి కూడా బంధువులు ఎక్కువ. ఎవరో ఒకరు బంధువులు రామారావు ఇంట్లో విస్తరి వేయని రోజు ఉండదు. అయినప్పటికీ సీతాదేవి ...

అవ్వ మళ్లీ పుట్టింది

అవ్వ మళ్ళీ పుట్టింది. కాలకూట విష o. ఈ పేరు తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు  పుట్టుకొస్తుంది. ఒళ్ళు జలదరిస్తుంది. పాలసముద్రంలో నుంచి పుట్టింది గాని ఏ ప్రాణి జీవితాన్ని అయినా క్షణంలో బుగ్గిపాలు  చేస్తుంది ఈ కాలకూట విషం .అటువంటి హాలాహలాన్ని గొంతులోనే బంధించాడు ఆ త్రినేత్రుడు. విచిత్రం చూడండి భగవంతుడు గొంతులో ఉన్న విష o బయటకు వదిలితే లోకానికి ప్రమాదం. సామాన్య మానవుడు విషం మింగితే ఆఖరి చుక్క వరకు బయటకు వచ్చేవరకు విశ్వ ప్రయత్నం చేస్తారు వైద్యులు. లేకపోతే ఆ మనిషి మనుగడకు ప్రమాదం.  మానవ శరీర నిర్మాణంలో గొంతు అనే భాగానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. తీసుకున్న ఆహారాన్ని కడుపులోకి పంపించి మనిషి మనుగడకు చాలా సహాయం చేస్తుంది ఈ గొంతు. ఒక్కొక్కసారి తీసుకున్న ఆహారం పడక గొంతు బొంగురు పోతుంది. గొంతులో ఏదో అడ్డు పడినట్లు ఉంటుంది. అయితే ఆ బాధ నుండి విముక్తి పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం.  ఇంతకీ ఈ సమస్య గొంతుకు సంబంధించినదా. కాదు గొంతులో దాగున్న సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న శరీర భాగం. మామూలుగా పైకి కనపడదు కానీ మానవ శరీరానికి అది అతి ముఖ్యమైన శరీర భాగం. అటువంటి శరీర భాగం...

పాండవుల మెట్ట

పాండవుల మెట్ట కాకినాడ జిల్లా పెద్దాపురం చారిత్రాత్మకంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న పట్టణం. ఒకప్పుడు ఇక్కడ పట్టు బట్టలు నేసే చేనేత పని వారు ఉండేవారు. అది పెద్దాపురం సిల్క్ గా ప్రసిద్ధి చెందింది. అయితే సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనేక యంత్రాలతో తయారైన వస్త్రాలతో ఇవి పోటీ పడలేక మరుగున పడిపోయేయి. అయితే ఈ గ్రామంలో ఉన్న మరొక విశేషం మరిడమ్మ అమ్మవారి గుడి. ఆషాడ మాసంలో ఒక నెలరోజుల పాటు జరిగే తీర్థానికి అమ్మవారి జాతర్లకి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి తమ మ్రొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడ ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం కూడా ఉంది.  ఆధ్యాత్మికంగా పెద్దాపురం ఈరకంగా ప్రాముఖ్యత సంతరించుకుంటే చారిత్రాత్మకంగా కూడా పెద్దాపురం చరిత్రలో నిలిచిపోయింది. అదే పాండవుల మెట్ట అనే స్థలం. ఇది మహాభారత కాలంలో అజ్ఞాతవాసo సమయంలో పాండవులు నివసించిన ప్రదేశంగా ప్రజలు విశ్వసిస్తారు. దానికి తగినట్లుగా కొన్ని ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. వాటిని పాండవుల గుహలు అంటారు. పూర్వకాలంలో పెద్దాపురం నుంచి రాజమండ్రి వరకు సొరంగ మార్గం ఉండేదని అది ప్రస్తుతం మూసి వేయబడిందని చెప్తుంటారు. అలాగే ఈ కొం...