పోస్ట్‌లు

ఆ అరుగు ఆత్మీయ నిలయం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆ అరుగు _ ఆత్మీయ నిలయం

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి. ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి. కానీ మా తరం వారికి అవి మాత్రం హంసతూలికా తల్పాలు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెంలో గల మా నాన్నగారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు ఉండేవి. దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్రగచ్చుతో చేసిన వసార ఉంది. సుమారు 70 సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతిరావుగారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం అది. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నానంటే—ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. మొదటి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో (దాన్ని కొట్టు గది అంటాం) పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పినతాతగారు శ్రీ మధునాపంతుల కామరాజుగారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు ఆ ఆఫీస్‌కి వచ్చి అరుగు మీద కూర్చునేవారు. ఎప్పుడూ రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారికి సంఘసేవ మీద ఎక్కువ మక్కువ ఉండేది. ప్రజల సమస్యలను అలవోకగా తీర్చేవారు. అందుచేత ఆయన హయాంలో ...