పోస్ట్‌లు

ఆఖరి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆఖరి కప్పు

ఆఖరి కప్పు.  ఇవాళ నిన్న కాదు సుమారు యాభై సంవత్సరాల నుంచి పరిచయం. ఉదయం లేస్తూనే దంత దావనం చేసుకున్న వెంటనే ముందుగా నన్ను పలకరించేది, నేను పలవరించేది , వంటిల్లువైపు ఆశగా చూసేది, పది నిమిషాలు ఆలస్యం అయితే బుర్ర పనిచేయన ట్లుగా తయారుచేసింది , దానికి మేము బానిస అయ్యింది ఆ కాఫీ మహాతల్లికి.  పదేళ్లు వయసు వచ్చేవరకు అమ్మ పాలు, గుమ్మ పాలు తాగి పెరిగిన ఈ శరీరం ఇంట్లో నాకంటే అందరూ పెద్దవాళ్ళు పెద్దపెద్ద గ్లాసులతో అదేదో కొత్త రంగులో ఉండి ఆప్యాయంగా ఉదయం రెండు మూడు సార్లు తాగే ఆ ద్రవాన్ని చూసి అంతవరకు పాల రుచి తప్ప మరొక రుచి ఎరగని నేను కొత్త రుచి కోసం పేచీ పెట్టి రుచి చూసిన రోజు నుంచి సుమారు నెలరోజుల క్రితం వరకు అది నాకు ఆప్తురాలు అయిపోయింది.  నిజానికి ఈ అలవాటును పెద్దవాళ్ళు ఎవరు చెయ్యి పట్టుకుని అలవాటు చేయలేదు. ఇంట్లో అందరూ తాగుతుంటే నేను కూడా తాగాలని కోరిక పుట్టి అలవాటుగా మార్చుకున్నది.  మాది ఉమ్మడి కుటుంబం. పిల్లలు పెద్దలు కలిసి ఇరవై మందిపైగా. అందులో ఒకరిద్దరు తప్పితే అందరూ కాఫీ తాగేవాళ్లే. ఇది కాకుండా పరిచారిక జనం.  తెల్లవారుజామున నాలుగు గంటలకు కట్టెల పొయ్యి వెలిగి...

ఆఖరి ఉత్తరం

ఆఖరి ఉత్తరం "ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది.  ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది. పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇ ళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఇక మిగిలింది లంక అంత కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాధుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.  కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు! . అమ్మ వెళ్లి వస్తాo! అంటూ పిల్లలు వెళ్లిపోయారు . అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు.  ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి. ఇంతలో" పో...