సాయం
సాయం మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఎప్పుడు సాయంత్రం ఐదు గంటలకు కానీ రాని పనిమనిషి రత్తమ్మ రావడం చూసి "ఏమిటి రత్తాలు తొందరగా వచ్చేసావు ఇవాళ అని అడిగింది .సుభద్రమ్మ. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కదా అందుకే తొందరగా వచ్చి ఉంటుంది అనుకుంది సుభద్రమ్మ. గోదావరి మంచి పోటు మీద ఉంది. సాయంకాలానికి మన ఊళ్లో కి రావచ్చని కొంపలన్ని ఖాళీ చేయమని ప్రెసిడెంట్ గారు టముకు వేయించారు కదమ్మా. అందుకనే చీకటి పడకుండా సామాన్లు పిల్లల్ని తీసుకుని పక్కనున్న మా అత్తవారు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ము. మరి ఎలా వెళ్తారు? అని అడిగింది సుభద్రమ్మ. మన ఊర్లోకి పడవలు వచ్చాయి.వాడు అడిగినంత ఇచ్చి బయటపడదాము అనుకుంటున్నా ము అంటూ చెబుతున్న రత్తమ్మ మాటలకి ఒక్కసారి ఆలోచనలో పడింది సుభద్రమ్మ. అది గోదావరి పక్కనున్న శుద్ధ పల్లెటూరు. ఊళ్లో అందరూ మోతుబరి రైతులే . పిల్లలంతా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో సెటిల్ అయిపోయారు.తాతల నాటి ఆస్తులు ఇల్లు వదల్లేక ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నారు ఆ తరం వాళ్లు. కోనసీమ గురించి అందంగా చెప్పుకుంటాం గాని పాపం వర్షాకాలం వచ్చిందంటే వాళ్లకి ఎంతో కష్టం. గోదావరి రోజుకు ఒకసారి భ...