రాజుల కోటలు
మన ఆంధ్ర ప్రాంతాన్ని అనేక రాజవంశాలు, విదేశీయులు క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పరిపాలించారు. అందులో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినిలు,వేంగీ చాళుక్యులు, చోళులు ,కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, గజపతులు ,బహుమనీ సుల్తాన్లు, మొగలులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వం వారు ముఖ్యులు. అయితే వీరిలో చాలామంది రాజ్యాలను స్థాపించి కోటలను నిర్మించి పరిపాలించేవారు. ఒకప్పుడు అత్యంత వైభవంతో వెలిగిపోయిన ఈ కోటలు మనకిప్పుడు పర్యాటక ప్రదేశాలుగా మిగిలిపోయేయి. అసలు కోట అంటే ఏమిటనే సందేహం మనలో చాలామందికి కలుగుతుంది. కోట అంటే రాజులు నివాస ఉండే కట్టడం. అక్కడి నుంచే రాజు రాజ్యాన్ని పరిపాలించేవాడు. శత్రువుల నుండి దేశాన్ని రక్షించడం కోసం సురక్షితమైన కట్టడం ఇది. ఇందులో రాజు తన పరివారంతో కొలువుతీరి ఉండేవాడు. అలా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన అనేకమంది రాజవంశాలు సిమెంటు ఇటుక కూడా తెలియని రోజుల్లో అంత భారీ ప్రాంగణాలు ఎలా నిర్మించారనేది ముఖ్య విషయం. నిజంగా వారి దూర దృష్టికి తార్కిక దృష్టికి నిర్మాణ కౌశల్యానికి జోహార్లు చెప్పకుండా ఉండలేం. అయిత...