సత్య
ఉదయం పది గంటలు అయ్యింది. వృద్ధాశ్రమంలో తన గదిలో మంచం మీద పడుకున్న సత్యకి, పక్క మంచం మీద పడుకున్న రాఘవమ్మ దగ్గరకి ఇద్దరు రావడం గమనించింది. ఇద్దరూ కవల పిల్లలు అనుకుంటా — ఒకే పోలిక, ఒడ్డు పొడుగు సమానంగా ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అనిపించింది. అంతవరకు మంచం మీద మూలుగుతూ పడుకున్న రాఘవమ్మ, ఆ పిల్లలు రాగానే లేచి కూర్చుని నవ్వుతూ మాట్లాడడం సత్య గమనించింది. రాఘవమ్మ ఆ పిల్లల్ని పరిచయం చేస్తూ — “ఇంతవరకు అమెరికాలో ఉండేవారు, ఇప్పుడు ఇండియా వచ్చేసారు. అందుకే నన్ను తీసుకువెళ్లడానికి వచ్చారు” — అని చెప్పింది. అది విన్న సత్య మనసులో — “నా అదృష్టం ఎప్పుడు వస్తుందో?” — అనిపిస్తూ గతజీవితం గుర్తుకొచ్చింది. --- “కంగ్రాట్యులేషన్స్ పార్వతమ్మ గారు! మీ అమ్మాయి సత్యకి కవల పిల్లలు పుట్టారు. తల్లి పిల్లలు అంతా క్షేమం. కాసేపట్లో రూముకు పంపిస్తాను” అంటూ లేడీ డాక్టర్ సరోజ చెప్పిన మాటలు లీలగా వినబడ్డాయి సత్యకి. ఒక్కసారి ఆనందం ముంచుకొచ్చింది. పిల్లలను చూసి ఎత్తుకుని ముద్దాడాలనిపించింది. కానీ ఒళ్లంతా మత్తుగా ఉంది, కళ్ళు తెరవబుద్ధి కావడం లేదు. చంటి పిల్లల ఏడుపులు లీలగా వినిపిస్తున్నా, ఏమీ చేయలేక పడుకుని ఉండిపోయింద...