పోస్ట్‌లు

భారం కాదు ! ప్రాణం

“ఏవండీ... మీరు రాకపోతే బాగుండదేమో! దగ్గర వాళ్లు కదా!” అంది సుమతి చేతిలోని శుభలేఖను చూస్తూ. “ఎలా రమ్మంటావు సుమతి? మన విజయ్ ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా! నువ్వూ, రాజేష్ వెళ్లి రండి...” అన్నాడు రాజారావు. “క్రితం సారి పండక్కి వెళ్లినప్పుడు మన విజయ్ చేసిన అల్లరి చూసి గట్టిగా కసిరారు ” అని ఇంటికి వచ్చి బాధపడ్డావు. ఆ పిల్లాడికి ఏమీ తెలియక అల్లరి చేస్తున్నాడని, అలాంటి పనులు చేస్తున్నాడని మనకు తెలుసు. తల్లిదండ్రులుగా మనకు తప్పదు. పై వాళ్లకు మాత్రం అది చిరాకుగా ఉంటుంది. ఏం చేస్తాం? మన కర్మ ఇలా ఉంది. భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు...” అని బాధపడ్డాడు రాజారావు. సుమతికి ఒక్కసారిగా సంక్రాంతి పండక్కి అన్నగారింటికి వెళ్లినప్పుడు జరిగిన దృశ్యం గుర్తుకొచ్చింది. ఏదో సరదాగా ఉందామని వెళ్తే, విజయ్ చేసిన పనులతో బాధ, సిగ్గు ముంచుకొచ్చాయి.  ఏది పడితే అది, సమయం సందర్భం లేకుండా వంటింట్లోకి వెళ్లి తినడం, ప్రతి సామాను కింద పడేయడం, మలమూత్రాలన్నీ గదిలో, మంచం మీద చేసి పాడు చేయడం...ఒకటి కాదు... ఎవరి దగ్గర వస్తువు కనిపించినా వాళ్ల దగ్గరికి వెళ్లి లాక్కోవడం, పెద్దగా అరవడం, ఎవరు మందలించినా నవ్వుతూ మళ్లీ అదే పని చేయడం...

అలలు మధ్య ఆత్మీయ నగరం_ విశాఖ

  ఏముంది అక్కడ ప్రత్యేకత అన్ని ఊళ్లలాగానే అదీ ఒక ఊరే అని ఎవరైనా అంటే ముక్తకంఠంతో వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. “కాదు… ఆ ఊరి అందమే వేరు” అనే మాట గాలిలో మారుమ్రోగిపోతుంది. అన్ని ఊళ్లల్లో ,మా ఊరి లాగా సహజసిద్ధమైన అందాలు ఉంటాయా అని ఎదురుప్రశ్న వేస్తారు. కొండలు సముద్రాన్ని కౌగిలించుకున్న దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది? ఉదయించే సూర్యుడి కిరణాలు అలల మీద బంగారు చీర పరచినట్టు మెరిసే తీరం ఎక్కడ ఉంటుంది? వాన పడితే మబ్బులు కొండలపై దిగివచ్చి నగరంతో మాటలాడే అందం ఎక్కడ దొరుకుతుంది? అందుకే అందరూ పిల్లలతో సహా మా ఊరు చూడడానికి వస్తారు అంటారు విశాఖవాసులు.  ఉక్కు లాంటి పట్టుదల, సాగరం లాంటి మనసు ఉన్న ప్రజలు జాతీయ రహదారిలో తిష్ట వేసుకుని కూర్చున్న మా ఊరికి ఒకసారి వచ్చినవారు మళ్లీ రావాలనుకునే ఊరు అది. చూసిన కళ్లలో నీలి జ్ఞాపకాలు మిగిల్చే నగరం అది. మాది ఉక్కునగరం కాదు. ఉర్రూతలు ఊగించే నగరం.  బాధ వచ్చినా… కష్టం వచ్చినా… కన్నీళ్లు వచ్చినా… సంతోషం పంచుకోవాలన్నా… మేము ఆ సముద్రుడి దగ్గరికి చేరకుండా ఉండలేం. అలలు ఎప్పటిలాగే ముందుకు వస్తూనే ఉంటాయి. మాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా… మనసులో దాచుకున్న ...

మరో తిరుపతి

తిరుపతి అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని పెద్ద తిరుపతి. అది కాదంటే ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల గుర్తుకొస్తుంది. ఒకటి పెద్ద తిరుపతి, రెండోది చిన్న తిరుపతి. పెద్ద తిరుపతిలో వెలిసిన స్వామిని దర్శించాలంటే ఏడుకొండలు ఎక్కవలసిందే. ద్వారకుడు అనే భక్తుడి కోరిక మేరకు స్వామి చిన్న తిరుపతిలో కొలువై ఉన్నాడు. ఏడుకొండలు ఎక్కలేని వారు చిన్న తిరుపతిలో స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.  సప్తగిరులు ఎక్కినా, ద్వారకా తిరుమల స్వామిని దర్శించినా, "గోవిందా!" అని పిలిస్తే స్వామి భక్తుల మొర ఆలకిస్తూ ఉంటాడు. అంత మహిమ గలవి ఈ రెండు పుణ్యక్షేత్రాలు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం చదలవాడ గ్రామంలో మరో తిరుపతి కూడా ఉంది. ఇక్కడ శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు అక్కడి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకేనేమో ఈ ప్రాంతాన్ని "తొలి తిరుపతి" అని అందరూ పిలుస్తారు. ప్రతి పుణ్యక్షేత్రం వెనుక ఒక చారిత్రక కథ ఉంటుంది. అది కథగా మనం...