పోస్ట్‌లు

సంధ్యా రాగం

“ఒసేయ్ రమ్య, ఒసేయ్ సంధ్య … వచ్చే నెలలోనే నాన్న రిటైర్మెంట్,” అంది రమ్య, సంధ్యల తల్లి సరస్వతి. “అవునమ్మా! మొన్ననే కదా చెప్పావు. నాన్నకు అరవై ఏళ్లు నిండుతున్నాయని వెటకారం కూడా ఆడావు. అయినా ఇప్పటికి ఐదు సార్లు నుంచి ఇదే మాట చెబుతున్నావ్!” అంది రమ్య నవ్వుతూ. రమ్య తండ్రి భాస్కరరావు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ చేరదీసి పెంచి, చదువు చెప్పించి, పెళ్లి కూడా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, “బిడ్డ చదివితే భవిష్యత్తు వెలుగుతుంది” అనే నమ్మకంతో మేనమామ పడిన కష్టం భాస్కరరావు జీవితానికి బలమైన పునాది అయింది. అందుకే చిన్ననాట అతనికి ముద్దు ముచ్చట్లు, పుట్టినరోజు సరదాలు తెలియనే తెలియలేదు. పెళ్లైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. పిల్లల పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపేదో, అంతే ప్రేమతో భర్త పుట్టినరోజును కూడా పండుగలా మార్చేది సరస్వతి. పొదుపు అతని అలవాటు, సంతోషం ఆమె స్వభావం—ఆ రెండు కలిసి ఆ ఇంటిని సంతోషంగా నిలబెట్టాయి. తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని అక్షరాలకు అంకితం చేస్తూ, సంసారాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ, పిల్లలిద్...

రుచిలో రారాజు _అతిధి మర్యాదలో మహారాజు

అల్లుడు గుమ్మంలోకి అడుగుపెట్టాడో లేదో, ఆ క్షణమే మర్యాదలు మొదలవుతాయి మా గోదారోళ్లింట్లో. అల్లుడైనా, ఆత్మీయ అతిథులైనా—ముందుగా వండి పెట్టేది కరకరలాడే మినప గారెలే. మినుము తింటే కండబలం పెరుగుతుందన్న నమ్మకం ఒకటి; పిండి వంటలలో అది మహారాజులాంటిదన్న విశ్వాసం మరొకటి. అందుకే పెద్దలు— “తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి” అని అలా నిశ్చితంగా చెప్పేవారు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న వాళ్లకే కాకుండా పరలోకంలో ఉన్న వాళ్లకి కూడా ఈ గారెలు అంటే మహా ప్రీతి. ఏ పితృకార్యమైనా గారెలు లేకుండా ఉండదు. ఎర్రగా నూనెలో వేగిన గారె ముక్క విరుచుకుని, అల్లపు చెట్నీతో నంజుకుని తింటే స్వర్గమే కనపడుతుంది. తినేవాళ్లకి స్వర్గం కనబడుతుంది గానీ, పాపం వండే వాళ్ల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. ఒకప్పుడు యంత్రాలు వంటింట్లోకి ప్రవేశించని కాలంలో, రుబ్బురోలుతో కుస్తీపట్టి, చెమటలు కక్కుతూ, పీకల లోతు నీళ్లలో నానబెట్టిన మినప గుండును కర్కశంగా తోలువలచి, కసి కొద్దీ రుబ్బురోలు పత్రాన్ని తిప్పుతూ, ఇనప గుండులాంటి మినప గుండును పాలనురుగు రంగులో ఉన్న మినప రుబ్బుగా మార్చేవారు. రుబ్బు తయారయ్యాక హమ్మయ్య అనుకునేవారు. పిండి రుబ్బుతూ అడుతూ పాడుతూ ...

ఆవకాయ ముద్ద_ఒక బంధం

అమ్మా, నీకు ఏం తినాలి ఉందో చెప్పు! ఈ మూడు నెలలలో నీకు కావాల్సింది వండి పెడతాను. మళ్లీ పురుడు వస్తే ఐదు నెలల వరకు తినడం కుదరదు కదా… అని అడిగింది సీతమ్మ, పురిటికి పుట్టింటికి తీసుకువచ్చిన తన కూతురు భారతిని. పెద్దాపురం చేంతాడు లాంటి కోరికల చిట్టా చెప్పింది భారతి. రోజుకో వెరైటీ—ఆ చిట్టాలో టిక్కు పెట్టుకుంటూ చేస్తూనే ఉంది సీతమ్మ. అయితే ఆ కోరికల చిట్టాలో ఒక కోరిక పేరు చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. “ఇదేమి కోరికే తల్లి! వాడిని ఇప్పుడు ఎక్కడ తీసుకురాను నేను? వాడు ఉండేదేమో గోదావరి జిల్లా. మనం ఉండేది తెలంగాణ రాష్ట్రం. బావుంది నీకోసం పనిగట్టుకుని ఇక్కడికి రావాలా వాడు?” అంటూ నవ్వుతూ అడిగింది. “ఏమో, నాకు తెలీదు. నాకు అది తినాలని ఉంది. అది రోజూ నేను తింటాను. కానీ ఆ చేతిముద్దలో ఏదో అమృతం ఉంది,” అంది భారతి. ఇంతకీ ఆ కోరిక ఏమిటని ఆత్రంగా చిట్టా చూశాడు భారతి తండ్రి సుబ్బారావు. ఆ కోరిక పేరు చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. “మావయ్య చేతితో పెట్టిన ఆవకాయ ముద్ద!” “నేను నీకు ఆవకాయ అన్నంలో కలిపి నోట్లో పెడతాను,” అన్నాడు సుబ్బారావు. “లేదు నాన్న. మావయ్య ఆవకాయ బాగా కలుపుతాడు. ఆ కలుపుతున్న విధానం చూస్తూనే నాకు నోరూరిపోతుంది...