పోస్ట్‌లు

ఆ రుచి _ఆ వీధి_ ఆ జ్ఞాపకం

ప్రతి గృహిణికి ప్రతి ఉదయం అల్పాహారం ఒక సమస్యే. “ఈరోజు ఏమి చేయాలి?” అన్న ప్రశ్న నిద్ర లేవగానే మనసులో మెదులుతుంది. కుటుంబ సభ్యులను అడిగితే రకరకాల సమాధానాలు వస్తాయి. ఒకరికి ఇడ్లీ కావాలి, మరొకరికి దోసె కావాలి, ఇంకొకరికి ఉప్మా వద్దు, పూరీ కావాలి. కోరికలకు అంతుండదు. అయితే బాధ్యత గల గృహిణిగా అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఒక కుటుంబం అంటే రకరకాల వ్యక్తుల కలయిక. అందులో పాలు తాగే పసిపిల్లల నుంచి కాలు కదపలేని ముదుసలి వరకు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాలి. ఈ అల్పాహారాల్లో కొన్ని అప్రయత్నంగా చేసేవి. మరికొన్ని అయితే తొలి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. రకరకాల పేర్లు చెప్పి లిస్టు చదివే పిల్లలు, “ఎప్పుడూ అవేనా!” అని మొహం పెట్టి బజార్లో ఉన్న హోటళ్ల పేర్లు చెబుతూ నోరు చప్పరించే పిల్లలను చూసి, “మీ ఇష్టం రా!” అని విసుగొచ్చి చెప్పే అమ్మలు, వచ్చిన బంధువులకు మన ఊరి వంటకం రుచి చూపిద్దామని అనుకునేవాళ్లు, బుద్ధి పుట్టినప్పుడల్లా అక్కడికి చేరేవాళ్లు—ఇలా చాలామంది కనబడతారు మా ఊర్లో ఒక చోట. “మీ ఊరు అంటే ఏమిటండి?” అని అడిగితే, “మాది కాకినాడ” అని గర్వంగా చెబుతాను.ఆ ప్రదేశం పేరు దేవాల...

కాకినాడ కాజా _ఒక ఊరి తీపి గర్వం

నోరు మెచ్చిన రుచులు ఒక ఊరికి ప్రత్యేకతను, సంస్కృతిని, వారసత్వాన్ని తీసుకొస్తాయనే మాట అతిశయోక్తి కాదు. అది అక్షరాలా నిజం. కళ్లముందు కనిపించే సత్యం. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల విస్తరణతో ప్రతి ప్రాంతం తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న వంటకాల ద్వారా ప్రపంచానికి మరింత చేరువైంది. ఒక ప్రాంతాన్ని గుర్తు చేసే ఆలయాలు, నదులు, పంటపొలాల మాదిరిగానే అక్కడి రుచులు కూడా ఆ ఊరి గుర్తింపుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. తిరుపతి అంటే లడ్డూ గుర్తుకు వస్తుంది. అన్నవరం ప్రసాదం రుచి చూసినవారు ఆ ఆకు కూడా వదలకుండా తినేస్తారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి రోజ్ మిల్క్, గంగరాజు పాలకోవా, కాకినాడ కాజా... ఇలా ఎన్నో రుచులు తరతరాలుగా మన నాలుకలపై మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కాలం మారినా, తరాలు మారినా వాటి ప్రత్యేకత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రుచి అనేది కేవలం ఆహారానికి సంబంధించినది కాదు. అది ఒక ప్రాంతం ఆత్మను ప్రతిబింబిస్తుంది. సంస్కృతిని మోస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ మన కళ్ల ముందు నిలబెడుతుంది. ఒక ఊరి పేరు వినగానే అక్కడి ప్రత్యేక రుచి కూడా మనసులో మెదలడం యాదృచ్ఛికం కాదు....

భారం కాదు ! ప్రాణం

“ఏవండీ... మీరు రాకపోతే బాగుండదేమో! దగ్గర వాళ్లు కదా!” అంది సుమతి చేతిలోని శుభలేఖను చూస్తూ. “ఎలా రమ్మంటావు సుమతి? మన విజయ్ ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా! నువ్వూ, రాజేష్ వెళ్లి రండి...” అన్నాడు రాజారావు. “క్రితం సారి పండక్కి వెళ్లినప్పుడు మన విజయ్ చేసిన అల్లరి చూసి గట్టిగా కసిరారు ” అని ఇంటికి వచ్చి బాధపడ్డావు. ఆ పిల్లాడికి ఏమీ తెలియక అల్లరి చేస్తున్నాడని, అలాంటి పనులు చేస్తున్నాడని మనకు తెలుసు. తల్లిదండ్రులుగా మనకు తప్పదు. పై వాళ్లకు మాత్రం అది చిరాకుగా ఉంటుంది. ఏం చేస్తాం? మన కర్మ ఇలా ఉంది. భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు...” అని బాధపడ్డాడు రాజారావు. సుమతికి ఒక్కసారిగా సంక్రాంతి పండక్కి అన్నగారింటికి వెళ్లినప్పుడు జరిగిన దృశ్యం గుర్తుకొచ్చింది. ఏదో సరదాగా ఉందామని వెళ్తే, విజయ్ చేసిన పనులతో బాధ, సిగ్గు ముంచుకొచ్చాయి.  ఏది పడితే అది, సమయం సందర్భం లేకుండా వంటింట్లోకి వెళ్లి తినడం, ప్రతి సామాను కింద పడేయడం, మలమూత్రాలన్నీ గదిలో, మంచం మీద చేసి పాడు చేయడం...ఒకటి కాదు... ఎవరి దగ్గర వస్తువు కనిపించినా వాళ్ల దగ్గరికి వెళ్లి లాక్కోవడం, పెద్దగా అరవడం, ఎవరు మందలించినా నవ్వుతూ మళ్లీ అదే పని చేయడం...