పోస్ట్‌లు

మన జాగ్రత్తలో మనం

ఉదయం ఎనిమిది గంటలు అయింది. హాలులో కూర్చుని రామాయణం చదువుకుంటున్న కాంతమ్మగారిని చూసి కోడలు సరోజ, “అత్తయ్య, మరో కప్పు కాఫీ ఇయ్యమంటారా?” అని అడిగింది. “లేదమ్మా, వద్దు. ఇదిగో ఇది అయిన తర్వాత టిఫిన్ తినేస్తాను.” “అది అప్పుడే ఎక్కడ అవుతుంది? ప్రతిరోజు పది గంటల వరకు చదువుకుంటున్నారు. అంతసేపు ఉంటే మీకు నీరసం వస్తుంది,” అని అంది సరోజ. “పరవాలేదు,” అని సమాధానం చెప్పి మళ్లీ రామాయణం చదువుకోవడంలో మునిగిపోయింది కాంతమ్మ. “నువ్వు టిఫిన్ తినేసేయ్. నా గురించి చూడకు,” అంది. ‘అదేమిటి! ఉదయం లేస్తూనే కాఫీ కోసం విలవిల్లాడే ఈ కాంతమ్మ ఈ మధ్య ఇలా తయారవుతోంది ఏమిటి? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? ఏమీ చెప్పదు…’ అని మనసులో అనుకుంది సరోజ. సరోజ పని అంతా పూర్తి చేసుకుని టిఫిన్ చేసి వచ్చేటప్పటికి కాంతమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. “మీకు ఇష్టమని పెసరట్లు వేశాను. అల్లం పచ్చడి కూడా చేశాను,” అని చెప్పినా, మొహంలో ఎలాంటి ఉత్సాహం చూపలేదు కాంతమ్మ. ప్లేట్లో పెట్టిన రెండు పెసరట్లు తిని, చేయి కడిగేసుకుంది. ఎప్పుడూ “నోరు బాగాలేదు… ఏదో ఒక పచ్చడి చెయ్యి” అంటూ చెప్పే కాంతమ్మ, మధ్యాహ్నం భోజనం కూడా ఏమి మాట్లాడకుండా తినేసింది. మొన...

మాటలు రాని స్నేహితుడు

అదొక అందమైన సుందర నగరం. ఒకప్పుడు పదవీ విరమణ చేసిన వాళ్లు, “శేష జీవితం ఇక్కడే గడపాలి రా!” అని అనుకునే వాళ్లు. అంత సౌకర్యవంతమైన నగరం అది. ఆ నగరంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో మా నివాసం. అప్పుడు అది అక్కడక్కడ ఇళ్లు ఉన్న ప్రదేశం. అయితే ఇల్లు దూరంగా ఉన్నా ఇరుగుపొరుగు వాళ్లు కలిసిమెలిసి ఉండేవారు. ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకునే మనస్తత్వం కలవారు. అలాంటి ప్రదేశంలో ఉండడం నాకు భయంగా ఉండేది కాదు. జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మే పెద్ద స్నేహితురాలు. బడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది స్నేహితులు కలుస్తారు. ఆ చిన్న చిన్న స్నేహాల్లోనే మన బాల్యం నవ్వుతుంది. కానీ బడి దాటిన తర్వాత కొన్ని స్నేహాలు కనుమరుగైపోతాయి. కాలం గడుస్తుంటే కొందరు దూరమవుతారు. కళాశాల దాకా కూడా కొనసాగే స్నేహాలు మరికొన్ని. అక్కడ కూడా కొత్త స్నేహాలు కలుస్తాయి. అలా జీవిత ప్రయాణంలో స్నేహాలు మారుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం మనసులో చెక్కుచెదరకుండా నిలిచిపోతాయి. అలాంటి ఊర్లో ఆ అపురూపమైన వీధి నుంచి మెయిన్ రోడ్డు వరకు రావాలంటే ఒక కిలోమీటర్ దూరం నడవాలి. ఆ దారిలో నాకు ఒక ముఖ్యమైన స్నేహ...

సంధ్యా రాగం

“ఒసేయ్ రమ్య, ఒసేయ్ సంధ్య … వచ్చే నెలలోనే నాన్న రిటైర్మెంట్,” అంది రమ్య, సంధ్యల తల్లి సరస్వతి. “అవునమ్మా! మొన్ననే కదా చెప్పావు. నాన్నకు అరవై ఏళ్లు నిండుతున్నాయని వెటకారం కూడా ఆడావు. అయినా ఇప్పటికి ఐదు సార్లు నుంచి ఇదే మాట చెబుతున్నావ్!” అంది రమ్య నవ్వుతూ. రమ్య తండ్రి భాస్కరరావు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ చేరదీసి పెంచి, చదువు చెప్పించి, పెళ్లి కూడా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, “బిడ్డ చదివితే భవిష్యత్తు వెలుగుతుంది” అనే నమ్మకంతో మేనమామ పడిన కష్టం భాస్కరరావు జీవితానికి బలమైన పునాది అయింది. అందుకే చిన్ననాట అతనికి ముద్దు ముచ్చట్లు, పుట్టినరోజు సరదాలు తెలియనే తెలియలేదు. పెళ్లైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. పిల్లల పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపేదో, అంతే ప్రేమతో భర్త పుట్టినరోజును కూడా పండుగలా మార్చేది సరస్వతి. పొదుపు అతని అలవాటు, సంతోషం ఆమె స్వభావం—ఆ రెండు కలిసి ఆ ఇంటిని సంతోషంగా నిలబెట్టాయి. తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని అక్షరాలకు అంకితం చేస్తూ, సంసారాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ, పిల్లలిద్...