పోస్ట్‌లు

కాకినాడ కాజా _ఒక ఊరి తీపి గర్వం

నోరు మెచ్చిన రుచులు ఒక ఊరికి ప్రత్యేకతను, సంస్కృతిని, వారసత్వాన్ని తీసుకొస్తాయనే మాట అతిశయోక్తి కాదు. అది అక్షరాలా నిజం. కళ్లముందు కనిపించే సత్యం. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల విస్తరణతో ప్రతి ప్రాంతం తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న వంటకాల ద్వారా ప్రపంచానికి మరింత చేరువైంది. ఒక ప్రాంతాన్ని గుర్తు చేసే ఆలయాలు, నదులు, పంటపొలాల మాదిరిగానే అక్కడి రుచులు కూడా ఆ ఊరి గుర్తింపుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. తిరుపతి అంటే లడ్డూ గుర్తుకు వస్తుంది. అన్నవరం ప్రసాదం రుచి చూసినవారు ఆ ఆకు కూడా వదలకుండా తినేస్తారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి రోజ్ మిల్క్, గంగరాజు పాలకోవా, కాకినాడ కాజా... ఇలా ఎన్నో రుచులు తరతరాలుగా మన నాలుకలపై మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కాలం మారినా, తరాలు మారినా వాటి ప్రత్యేకత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రుచి అనేది కేవలం ఆహారానికి సంబంధించినది కాదు. అది ఒక ప్రాంతం ఆత్మను ప్రతిబింబిస్తుంది. సంస్కృతిని మోస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ మన కళ్ల ముందు నిలబెడుతుంది. ఒక ఊరి పేరు వినగానే అక్కడి ప్రత్యేక రుచి కూడా మనసులో మెదలడం యాదృచ్ఛికం కాదు....

భారం కాదు ! ప్రాణం

“ఏవండీ... మీరు రాకపోతే బాగుండదేమో! దగ్గర వాళ్లు కదా!” అంది సుమతి చేతిలోని శుభలేఖను చూస్తూ. “ఎలా రమ్మంటావు సుమతి? మన విజయ్ ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా! నువ్వూ, రాజేష్ వెళ్లి రండి...” అన్నాడు రాజారావు. “క్రితం సారి పండక్కి వెళ్లినప్పుడు మన విజయ్ చేసిన అల్లరి చూసి గట్టిగా కసిరారు ” అని ఇంటికి వచ్చి బాధపడ్డావు. ఆ పిల్లాడికి ఏమీ తెలియక అల్లరి చేస్తున్నాడని, అలాంటి పనులు చేస్తున్నాడని మనకు తెలుసు. తల్లిదండ్రులుగా మనకు తప్పదు. పై వాళ్లకు మాత్రం అది చిరాకుగా ఉంటుంది. ఏం చేస్తాం? మన కర్మ ఇలా ఉంది. భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు...” అని బాధపడ్డాడు రాజారావు. సుమతికి ఒక్కసారిగా సంక్రాంతి పండక్కి అన్నగారింటికి వెళ్లినప్పుడు జరిగిన దృశ్యం గుర్తుకొచ్చింది. ఏదో సరదాగా ఉందామని వెళ్తే, విజయ్ చేసిన పనులతో బాధ, సిగ్గు ముంచుకొచ్చాయి.  ఏది పడితే అది, సమయం సందర్భం లేకుండా వంటింట్లోకి వెళ్లి తినడం, ప్రతి సామాను కింద పడేయడం, మలమూత్రాలన్నీ గదిలో, మంచం మీద చేసి పాడు చేయడం...ఒకటి కాదు... ఎవరి దగ్గర వస్తువు కనిపించినా వాళ్ల దగ్గరికి వెళ్లి లాక్కోవడం, పెద్దగా అరవడం, ఎవరు మందలించినా నవ్వుతూ మళ్లీ అదే పని చేయడం...

అలలు మధ్య ఆత్మీయ నగరం_ విశాఖ

  ఏముంది అక్కడ ప్రత్యేకత అన్ని ఊళ్లలాగానే అదీ ఒక ఊరే అని ఎవరైనా అంటే ముక్తకంఠంతో వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. “కాదు… ఆ ఊరి అందమే వేరు” అనే మాట గాలిలో మారుమ్రోగిపోతుంది. అన్ని ఊళ్లల్లో ,మా ఊరి లాగా సహజసిద్ధమైన అందాలు ఉంటాయా అని ఎదురుప్రశ్న వేస్తారు. కొండలు సముద్రాన్ని కౌగిలించుకున్న దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది? ఉదయించే సూర్యుడి కిరణాలు అలల మీద బంగారు చీర పరచినట్టు మెరిసే తీరం ఎక్కడ ఉంటుంది? వాన పడితే మబ్బులు కొండలపై దిగివచ్చి నగరంతో మాటలాడే అందం ఎక్కడ దొరుకుతుంది? అందుకే అందరూ పిల్లలతో సహా మా ఊరు చూడడానికి వస్తారు అంటారు విశాఖవాసులు.  ఉక్కు లాంటి పట్టుదల, సాగరం లాంటి మనసు ఉన్న ప్రజలు జాతీయ రహదారిలో తిష్ట వేసుకుని కూర్చున్న మా ఊరికి ఒకసారి వచ్చినవారు మళ్లీ రావాలనుకునే ఊరు అది. చూసిన కళ్లలో నీలి జ్ఞాపకాలు మిగిల్చే నగరం అది. మాది ఉక్కునగరం కాదు. ఉర్రూతలు ఊగించే నగరం.  బాధ వచ్చినా… కష్టం వచ్చినా… కన్నీళ్లు వచ్చినా… సంతోషం పంచుకోవాలన్నా… మేము ఆ సముద్రుడి దగ్గరికి చేరకుండా ఉండలేం. అలలు ఎప్పటిలాగే ముందుకు వస్తూనే ఉంటాయి. మాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా… మనసులో దాచుకున్న ...