పోస్ట్‌లు

ఆ ఊరు మాకు వరమే

విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ నెమ్మదిగా నడుస్తూ అన్నవరం స్టేషన్ లోకి వచ్చి ఆగింది. ప్రయాణికులంతా లగేజ్ చేత పట్టుకుని గబగబా దిగే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయాణికులను ఒకసారి చూస్తే కొత్తగా పెళ్లయిన జంట దగ్గర నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. అక్కడే సగం బండి ఖాళీ అయిపోయింది. స్టేషన్లో నిలబడి ఉన్న ప్రయాణికులను గమనిస్తే ఎక్కువ శాతం మంది నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని గుండు చేయించుకునీ తలకి గంధం పూత పూసుకున్న వాళ్ళు ఎక్కువగా కనబడ్డారు. అవును ఇది పుణ్యక్షేత్రం కదా ఇక్కడ ఎక్కువ స్వామివారి భక్తులే ఉంటారు. చెన్నై కలకత్తా రైలు మార్గంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు కనబడుతూ ఉంటాయి అలాంటి వాటిలో అన్నవరం ఒకటి  ఎప్పుడూ రెండు నిమిషాలకు మించి ఆగని రైలు బండి సిగ్నల్ ఇవ్వని కారణంగా స్టేషన్లో నిలిచిపోయింది. రైలు స్టేషన్ అంత ఒక్కసారి చూస్తే దూరంగా అనంత లక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఫోటో దూరంగా కనబడుతోంది. ప్రతి ప్రయాణికుడు ఆ స్వామికి దండం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.  ఆ రైలు మార్గంలో ప్రయాణం చేస్తుంటే దూరాన్నించి కొండమీద కనబడే స్వామికి నమస్కారము చేయని వాళ్ళ...

అక్క హృదయం

  నాన్న మంచం మీద ఉన్నప్పుడు చేతినిండా పని ఉండేది.ఎప్పుడు “ఒరేయ్ కృష్ణా” అని పిలుస్తూనే ఉండేవాడు. ఇప్పుడు ఏ పని లేకుండా ఉంది అని అనుకున్నాడు కృష్ణారావు, చనిపోయిన తన తండ్రి రామారావు గురించి. ఆఫీసుకు వెళ్లిన ఇంటి దగ్గర తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు కృష్ణారావు. ఇప్పుడు సమయం గడవడం లేదు. ఆఫీసు నుండి వచ్చిన వెంటనే రామారావు పని చూడడం ఒక పెద్ద బాధ్యతగా ఉండేది. రామారావు మంచం మీద ఉన్నా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. ఇంచుమించుగా భార్య పోయిన తర్వాత రామారావు మంచం పట్టేసాడు. తండ్రి గుమ్మం దాటిన తర్వాత ఇప్పుడు “ఒంటరి వాడిని” అనే ఫీలింగ్ వస్తోంది కృష్ణారావుకి. అప్పుడే పన్నెండు రోజులు గడిచిపోయాయి. బంధువులంతా కృష్ణారావుకు ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. బంధువులతో పాటు కృష్ణారావు అక్క కూడా బయలుదేరుతూ, “తమ్ముడు బాధపడకు, ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకో!” అని చెప్పి ఏడుస్తూ తమ్ముడిని దగ్గరకు తీసుకుంది కృష్ణారావు అక్క సుమతి. “ఇంకో ముఖ్య విషయం… డాక్యుమెంట్లు రెడీ చేయించు. మాసికానికి వచ్చినప్పుడు సంతకం పెడతాను. నాకు కూడా వయసు మీరిపోతోంది, ఇది చాలా ముఖ్యం,” అని చెప్పి వెళ్ళిపోయింది సుమతి. ఇంకా...

తీరని కోరిక

ఉదయం తొమ్మిది గంటలు అయింది. అందరి ఆర్థిక అవసరాలు, ఆశలు తీర్చే ఆ కార్యాలయం ముందు ఒక స్కూటర్ వచ్చి ఆగింది. స్కూటర్ దిగి జేబులోంచి తాళాలు తీసి తలుపులు తెరుస్తుంటే, జేబులోని సెల్ఫోన్ మోగితే కుడి చెవిలో పెట్టుకుని తలుపులు తెరుస్తూ మాట్లాడుతూ చెమటలు కారుతుంటే, హడావిడిగా కార్యాలయంలోకి అడుగుపెట్టి తనకు కేటాయించిన ప్రత్యేక గదిలోని సీట్లో కూర్చున్నాడు సదరు కార్యాలయం అధికారి రామారావు. ఇంతకీ ఆ కార్యాలయం పేరేమిటి అనే సందేహం అందరికీ వస్తుంది. అది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖ. ఆ శాఖ ఉండేది ఒక మండల కేంద్రంలో. ఆ ఊరిలో సౌకర్యంగా ఉండే ఇళ్లు దొరకవు. ఆ శాఖలో పనిచేసే వాళ్లు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం నుంచి రోజు వచ్చి వెళుతుంటారు. రోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమైన ఉద్యోగ యాత్ర రాత్రి ఎనిమిది గంటలకి ఇల్లు చేరడంతో పూర్తవుతుంది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యేయి. బ్యాంకు ప్రాంగణం అంతా కస్టమర్లతో నిండిపోయింది. అందులో తల పాగా చుట్టుకుని పంచ కట్టుకుని చేతిలో కర్ర పట్టుకునే రైతులు దగ్గర నుంచి, తెల్ల బట్టలు వేసుకుని కూలింగ్ గ్లాసులు పెట్టుకుని వచ్చే బడా బాబులు, నిన్న మొన్నటి వరకు ఆ సీట్లో కూర్చుని ఈవే...