పోస్ట్‌లు

అలలు మధ్య ఆత్మీయ నగరం_ విశాఖ

  ఏముంది అక్కడ ప్రత్యేకత అన్ని ఊళ్లలాగానే అదీ ఒక ఊరే అని ఎవరైనా అంటే ముక్తకంఠంతో వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. “కాదు… ఆ ఊరి అందమే వేరు” అనే మాట గాలిలో మారుమ్రోగిపోతుంది. అన్ని ఊళ్లల్లో ,మా ఊరి లాగా సహజసిద్ధమైన అందాలు ఉంటాయా అని ఎదురుప్రశ్న వేస్తారు. కొండలు సముద్రాన్ని కౌగిలించుకున్న దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది? ఉదయించే సూర్యుడి కిరణాలు అలల మీద బంగారు చీర పరచినట్టు మెరిసే తీరం ఎక్కడ ఉంటుంది? వాన పడితే మబ్బులు కొండలపై దిగివచ్చి నగరంతో మాటలాడే అందం ఎక్కడ దొరుకుతుంది? అందుకే అందరూ పిల్లలతో సహా మా ఊరు చూడడానికి వస్తారు అంటారు విశాఖవాసులు.  ఉక్కు లాంటి పట్టుదల, సాగరం లాంటి మనసు ఉన్న ప్రజలు జాతీయ రహదారిలో తిష్ట వేసుకుని కూర్చున్న మా ఊరికి ఒకసారి వచ్చినవారు మళ్లీ రావాలనుకునే ఊరు అది. చూసిన కళ్లలో నీలి జ్ఞాపకాలు మిగిల్చే నగరం అది. మాది ఉక్కునగరం కాదు. ఉర్రూతలు ఊగించే నగరం.  బాధ వచ్చినా… కష్టం వచ్చినా… కన్నీళ్లు వచ్చినా… సంతోషం పంచుకోవాలన్నా… మేము ఆ సముద్రుడి దగ్గరికి చేరకుండా ఉండలేం. అలలు ఎప్పటిలాగే ముందుకు వస్తూనే ఉంటాయి. మాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా… మనసులో దాచుకున్న ...

మరో తిరుపతి

తిరుపతి అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని పెద్ద తిరుపతి. అది కాదంటే ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల గుర్తుకొస్తుంది. ఒకటి పెద్ద తిరుపతి, రెండోది చిన్న తిరుపతి. పెద్ద తిరుపతిలో వెలిసిన స్వామిని దర్శించాలంటే ఏడుకొండలు ఎక్కవలసిందే. ద్వారకుడు అనే భక్తుడి కోరిక మేరకు స్వామి చిన్న తిరుపతిలో కొలువై ఉన్నాడు. ఏడుకొండలు ఎక్కలేని వారు చిన్న తిరుపతిలో స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.  సప్తగిరులు ఎక్కినా, ద్వారకా తిరుమల స్వామిని దర్శించినా, "గోవిందా!" అని పిలిస్తే స్వామి భక్తుల మొర ఆలకిస్తూ ఉంటాడు. అంత మహిమ గలవి ఈ రెండు పుణ్యక్షేత్రాలు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం చదలవాడ గ్రామంలో మరో తిరుపతి కూడా ఉంది. ఇక్కడ శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు అక్కడి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకేనేమో ఈ ప్రాంతాన్ని "తొలి తిరుపతి" అని అందరూ పిలుస్తారు. ప్రతి పుణ్యక్షేత్రం వెనుక ఒక చారిత్రక కథ ఉంటుంది. అది కథగా మనం...

రామ నామంలో నిలిచిన మహావీరుడు

ఆంజనేయస్వామి సర్వమానవ ఆరాధ్య దైవం. రామ బంటుగా రామ భక్తుడిగా, అసాధ్యకార్యసాధకుడుగా, రాక్షస సంహారిగా మన మనసులో నిలిచిపోయిన దైవం.  భారతదేశంలో ఏ గ్రామం చూసిన ఏ రహదారి చూసిన స్వామి విగ్రహం లేని చోటు ఉండదు. దేవాలయంలో ఆంజనేయ స్వామిని చూసిన రహదారి పక్కనున్న విగ్రహాలు చూసిన ఒక రకమైన ఉత్తేజం ధైర్యం కలుగుతుంది. బహుశా ఆయన రూపం చూసి భయం తొలుగుతుంది. విశాలమైన వక్షస్థలం పొడవైన కాళ్లు చేతులు చేతిలో గధ వానర ముఖం వానరులకుండే ప్రత్యేకమైన అవయవం తోక కలిగి ఉంటారు స్వామి.  మానవ రూపంలో ఉండే ఈ దేవుడుకి వానర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అందరికీ కలుగు తుంది. ఆంజనేయ స్వామి తల్లి అంజనీ దేవి. ఆమె వానర వనిత. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస శాపం కారణంగా వానర కన్యగా పుడుతుంది. ఆమెకు కేసరితో వివాహం జరుగుతుంది. చాలా కాలo వరకు సంతానం కలగపోవడంతో శివుడుని పూజించి శివుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది.   శివుడి యొక్క తేజమును వాయుదేవుడు పండు రూపంలో అంజనీ దేవికి ఇవ్వగా ఆ పండు తిన్న అంజనీ దేవికి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. అంజనీ దేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. శివ...