పోస్ట్‌లు

నా రచన

 నా రచన – నా హక్కు ప్రియమైన పాఠకులకు, నేను M.C.V. SUBBARAO. తెలుగు సాహిత్యంపై ప్రేమతో కథలు, వ్యాసాలు రాస్తూ వస్తున్నాను. నేను రచించిన "కుటుంబం" కథను 21-06-2025న నా బ్లాగ్ chitti1963.blogspot.com లో ప్రచురించాను. ఇటీవల ఈ కథను కొందరు శీర్షిక మార్చి లేదా రచయిత పేరు తొలగించి ప్రచురిస్తున్నారని గమనించాను. ఒక రచన వెనుక రచయిత శ్రమ, ఆలోచన, సమయం ఉంటాయి. అనుమతి లేకుండా కాపీ చేసి, పేరు మార్చి ప్రచురించడం బాధాకరం. నా రచనలను పంచుకోవచ్చు, కానీ రచయితగా M.C.V. SUBBARAO పేరును తప్పనిసరిగా పేర్కొనండి. రచయిత పేరు తొలగించడం లేదా శీర్షిక మార్చడం సాహిత్య విలువలకు విరుద్ధం. "కుటుంబం" కథకు సంబంధించిన అసలు ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఈ కథ యొక్క అసలు రచయిత నేనే అని స్పష్టం చేస్తున్నాను. వినమ్ర విజ్ఞప్తి: • రచయితగా M.C.V. SUBBARAO పేరును పేర్కొనండి. • శీర్షికలు మార్చి లేదా రచయిత పేరు తొలగించి ప్రచురించవద్దు. • రచయిత హక్కులను గౌరవించండి. మీ ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలతో, M.C.V. SUBBARAO రచయిత chitti1963.blogspot.com

ఆ రుచి _ఆ వీధి_ ఆ జ్ఞాపకం

ప్రతి గృహిణికి ప్రతి ఉదయం అల్పాహారం ఒక సమస్యే. “ఈరోజు ఏమి చేయాలి?” అన్న ప్రశ్న నిద్ర లేవగానే మనసులో మెదులుతుంది. కుటుంబ సభ్యులను అడిగితే రకరకాల సమాధానాలు వస్తాయి. ఒకరికి ఇడ్లీ కావాలి, మరొకరికి దోసె కావాలి, ఇంకొకరికి ఉప్మా వద్దు, పూరీ కావాలి. కోరికలకు అంతుండదు. అయితే బాధ్యత గల గృహిణిగా అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఒక కుటుంబం అంటే రకరకాల వ్యక్తుల కలయిక. అందులో పాలు తాగే పసిపిల్లల నుంచి కాలు కదపలేని ముదుసలి వరకు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాలి. ఈ అల్పాహారాల్లో కొన్ని అప్రయత్నంగా చేసేవి. మరికొన్ని అయితే తొలి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. రకరకాల పేర్లు చెప్పి లిస్టు చదివే పిల్లలు, “ఎప్పుడూ అవేనా!” అని మొహం పెట్టి బజార్లో ఉన్న హోటళ్ల పేర్లు చెబుతూ నోరు చప్పరించే పిల్లలను చూసి, “మీ ఇష్టం రా!” అని విసుగొచ్చి చెప్పే అమ్మలు, వచ్చిన బంధువులకు మన ఊరి వంటకం రుచి చూపిద్దామని అనుకునేవాళ్లు, బుద్ధి పుట్టినప్పుడల్లా అక్కడికి చేరేవాళ్లు—ఇలా చాలామంది కనబడతారు మా ఊర్లో ఒక చోట. “మీ ఊరు అంటే ఏమిటండి?” అని అడిగితే, “మాది కాకినాడ” అని గర్వంగా చెబుతాను.ఆ ప్రదేశం పేరు దేవాల...

కాకినాడ కాజా _ఒక ఊరి తీపి గర్వం

నోరు మెచ్చిన రుచులు ఒక ఊరికి ప్రత్యేకతను, సంస్కృతిని, వారసత్వాన్ని తీసుకొస్తాయనే మాట అతిశయోక్తి కాదు. అది అక్షరాలా నిజం. కళ్లముందు కనిపించే సత్యం. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల విస్తరణతో ప్రతి ప్రాంతం తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న వంటకాల ద్వారా ప్రపంచానికి మరింత చేరువైంది. ఒక ప్రాంతాన్ని గుర్తు చేసే ఆలయాలు, నదులు, పంటపొలాల మాదిరిగానే అక్కడి రుచులు కూడా ఆ ఊరి గుర్తింపుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. తిరుపతి అంటే లడ్డూ గుర్తుకు వస్తుంది. అన్నవరం ప్రసాదం రుచి చూసినవారు ఆ ఆకు కూడా వదలకుండా తినేస్తారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి రోజ్ మిల్క్, గంగరాజు పాలకోవా, కాకినాడ కాజా... ఇలా ఎన్నో రుచులు తరతరాలుగా మన నాలుకలపై మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కాలం మారినా, తరాలు మారినా వాటి ప్రత్యేకత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రుచి అనేది కేవలం ఆహారానికి సంబంధించినది కాదు. అది ఒక ప్రాంతం ఆత్మను ప్రతిబింబిస్తుంది. సంస్కృతిని మోస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ మన కళ్ల ముందు నిలబెడుతుంది. ఒక ఊరి పేరు వినగానే అక్కడి ప్రత్యేక రుచి కూడా మనసులో మెదలడం యాదృచ్ఛికం కాదు....