పోస్ట్‌లు

కావమ్మ కథ

  రాత్రి 8:00 అయింది. ఆకాశంలో పూర్ణచంద్రబింబం ముద్దుగా మెరిసిపోతోంది. ఆ పున్నమి వెలుగులో పుడమి అంతా పులకించిపోతోంది. చెరువు నీరు నిశ్శబ్దంగా ఉండి, ఆ వెన్నెల వెలుగులో పున్నమి చంద్రుడి ప్రతిబింబాన్ని ముద్దాడుతోంది. చెట్ల నీడలు పొడవుగా పడుతూ ఒక రహస్య కథ చెబుతున్నట్టుగా ఉన్నాయి. . ఒక స్త్రీ—నలభై సంవత్సరాలు వయసుంటుందేమో—ఆ చంద్రుడిని చూస్తూ, ఆ వెన్నెల రాత్రి తనకు తోచని రీతిలో అడుగులు వేస్తూ, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ నృత్యం చేస్తోంది. బొట్టు లేని నుదురు, తల మీద వేసుకున్న ముసుగు, బోసిపోయిన చేతులు ఇష్టం వచ్చినట్లు గట్టి గట్టిగా మాట్లాడుతున్న మాటలు విని  వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇద్దరు తమ్ముళ్లు అది చూసి నిట్టూర్చారు. “మా అక్క ఏమైనా తిందా?” అని పెద్ద తమ్ముడు రామారావు తన భార్య సీతమ్మని అడిగాడు. “లేదండి, నోరు అసలు విప్పడం లేదు. దానికి తోడు ఇవాళ ఉదయం నుంచి అలా వాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఎంత ప్రయత్నం చేసినా లోపలికి రావడం లేదు,” అంటూ బాధపడుతూ చెప్పింది. మామూలు మనుషుల్లో ఉన్నప్పుడు అందరితో మంచిగా మాట్లాడుతుంది కావమ్మ. ఆ లోకంలోకి మారిపోయినప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ, గంటల తరబ...

వసంతం చెప్పే జీవన సత్యం

ఆంగ్ల సంవత్సరాది, తెలుగు సంవత్సరాది—రెండూ కాలానికి కొలమానాలే. కానీ వాటి స్వభావం మాత్రం వేరు. ఆంగ్ల సంవత్సరాది గడియారం లాంటిది—సూచీలు తిరుగుతాయి, తేదీలు మారతాయి, కానీ అది యాంత్రికం. మన జీవనంతో, మనసుతో, ప్రకృతితో పెద్దగా సంబంధం లేకుండా కాలాన్ని కొలుస్తుంది. తెలుగు సంవత్సరాది మాత్రం జీవంతో నిండినది. అది గడియారం కాదు… అది ఒక జీవన చక్రం. ప్రకృతి శ్వాసించే ప్రతి క్షణానికీ అది ప్రతిబింబం. శిశిరం తన చివరి ఊపిరి తీసుకుంటున్న వేళ, చెట్లు ఆకులు రాల్చి నిశ్శబ్దంగా నిలబడినప్పుడు, ఒక ముగింపు కనిపిస్తుంది. అయితే అదే ముగింపులో కొత్త ఆరంభం దాగి ఉంటుంది. వసంతం అడుగుపెట్టినప్పుడు, చిగుర్లు మొలుస్తాయి… పూలు వికసిస్తాయి… ప్రకృతి తన నవ్వును తిరిగి పొందుతుంది. ఆ ఆకురాల్చే దశ నుండి మొగ్గ తొడిగే దశకు మారడమే వసంతం. అదే నిజమైన “యుగాది”—యుగానికి ఆది. అందుకే తెలుగు సంవత్సరాది ఒక తేదీ మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమై, జీవితం కొత్తగా మొదలయ్యే క్షణం. అదే మనకు  ఉగాది పండుగ.  ఈ పండగ కేవలం ప్రకృతిలో మార్పు తో  నిశ్శబ్దంగా మన ఇంటిలోనికి వస్తుంది.  హోరెత్తించే మైకులు, అర్ధరాత్రి వరకు బిర్యానీ వాసనలు, బాణస...

మన జాగ్రత్తలో మనం

ఉదయం ఎనిమిది గంటలు అయింది. హాలులో కూర్చుని రామాయణం చదువుకుంటున్న కాంతమ్మగారిని చూసి కోడలు సరోజ, “అత్తయ్య, మరో కప్పు కాఫీ ఇయ్యమంటారా?” అని అడిగింది. “లేదమ్మా, వద్దు. ఇదిగో ఇది అయిన తర్వాత టిఫిన్ తినేస్తాను.” “అది అప్పుడే ఎక్కడ అవుతుంది? ప్రతిరోజు పది గంటల వరకు చదువుకుంటున్నారు. అంతసేపు ఉంటే మీకు నీరసం వస్తుంది,” అని అంది సరోజ. “పరవాలేదు,” అని సమాధానం చెప్పి మళ్లీ రామాయణం చదువుకోవడంలో మునిగిపోయింది కాంతమ్మ. “నువ్వు టిఫిన్ తినేసేయ్. నా గురించి చూడకు,” అంది. ‘అదేమిటి! ఉదయం లేస్తూనే కాఫీ కోసం విలవిల్లాడే ఈ కాంతమ్మ ఈ మధ్య ఇలా తయారవుతోంది ఏమిటి? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? ఏమీ చెప్పదు…’ అని మనసులో అనుకుంది సరోజ. సరోజ పని అంతా పూర్తి చేసుకుని టిఫిన్ చేసి వచ్చేటప్పటికి కాంతమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. “మీకు ఇష్టమని పెసరట్లు వేశాను. అల్లం పచ్చడి కూడా చేశాను,” అని చెప్పినా, మొహంలో ఎలాంటి ఉత్సాహం చూపలేదు కాంతమ్మ. ప్లేట్లో పెట్టిన రెండు పెసరట్లు తిని, చేయి కడిగేసుకుంది. ఎప్పుడూ “నోరు బాగాలేదు… ఏదో ఒక పచ్చడి చెయ్యి” అంటూ చెప్పే కాంతమ్మ, మధ్యాహ్నం భోజనం కూడా ఏమి మాట్లాడకుండా తినేసింది. మొన...