పోస్ట్‌లు

నిజం విలువ

"ఒసేయ్ రమ్య… పెళ్లివారు వంట వచ్చునా? అని అడిగితే వెర్రిదానిలాగా రాదు అని చెప్పకు. వచ్చునని తల ఊపు. అలాగే పాటలు కూడా. నిజం చెప్పి ఇంతకుముందు వచ్చిన సంబంధాలన్నీ అలాగే పోగొట్టుకున్నాం. మేము వెనకాల నుంచి ఎంత సైగ చేసినా నీ మట్టి బుర్రకు అర్థం కాలేదు," అని డెబ్బై ఏళ్ల బామ్మ చెప్పిన మాటలకు రమ్యకు నిజంగా నవ్వొచ్చింది. చిన్నప్పుడు అబద్ధాలు చెబితే కొట్టేవారు. ఇప్పుడు పెద్దయ్యాక తెలియనివి కూడా తెలిసినట్టు చెప్పమంటున్నారు. "ఏమిటో ఈ పెద్దవాళ్లు!" అని మనసులో అనుకుంది రమ్య. నిజానికి రమ్యకు వంట రాదు. చదువు పూర్తవగానే క్యాంపస్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతలు, పనుల ఒత్తిడిలో కాలం గడిచిపోయింది. "అమ్మా, నేర్చుకోవడానికి నాకు అవకాశం ఎక్కడ వచ్చింది?" అని అడిగితే, రమ్య తల్లి సీతమ్మ వెంటనే— "అవకాశం లేదా? స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక టీ పెట్టమంటే చచ్చినట్టు కూర్చునేదానివి. వంటింట్లోకి తొంగి చూసేదానివి కాదు. ఇప్పుడు అవకాశం లేదని సాకులు చెబుతున్నావు," అంటూ మందలించేది. "ఒసేయ్, ఆ చెవులకు జూకాలు పెట్టుకో. బీరువాలో ఉన్న పట్టు చీర కట్టుకో. మెడలో ఆ రాళ్ల నెక...

ఆ రుచి _ఆ వీధి_ ఆ జ్ఞాపకం

ప్రతి గృహిణికి ప్రతి ఉదయం అల్పాహారం ఒక సమస్యే. “ఈరోజు ఏమి చేయాలి?” అన్న ప్రశ్న నిద్ర లేవగానే మనసులో మెదులుతుంది. కుటుంబ సభ్యులను అడిగితే రకరకాల సమాధానాలు వస్తాయి. ఒకరికి ఇడ్లీ కావాలి, మరొకరికి దోసె కావాలి, ఇంకొకరికి ఉప్మా వద్దు, పూరీ కావాలి. కోరికలకు అంతుండదు. అయితే బాధ్యత గల గృహిణిగా అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఒక కుటుంబం అంటే రకరకాల వ్యక్తుల కలయిక. అందులో పాలు తాగే పసిపిల్లల నుంచి కాలు కదపలేని ముదుసలి వరకు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాలి. ఈ అల్పాహారాల్లో కొన్ని అప్రయత్నంగా చేసేవి. మరికొన్ని అయితే తొలి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. రకరకాల పేర్లు చెప్పి లిస్టు చదివే పిల్లలు, “ఎప్పుడూ అవేనా!” అని మొహం పెట్టి బజార్లో ఉన్న హోటళ్ల పేర్లు చెబుతూ నోరు చప్పరించే పిల్లలను చూసి, “మీ ఇష్టం రా!” అని విసుగొచ్చి చెప్పే అమ్మలు, వచ్చిన బంధువులకు మన ఊరి వంటకం రుచి చూపిద్దామని అనుకునేవాళ్లు, బుద్ధి పుట్టినప్పుడల్లా అక్కడికి చేరేవాళ్లు—ఇలా చాలామంది కనబడతారు మా ఊర్లో ఒక చోట. “మీ ఊరు అంటే ఏమిటండి?” అని అడిగితే, “మాది కాకినాడ” అని గర్వంగా చెబుతాను.ఆ ప్రదేశం పేరు దేవాల...

కాకినాడ కాజా _ఒక ఊరి తీపి గర్వం

నోరు మెచ్చిన రుచులు ఒక ఊరికి ప్రత్యేకతను, సంస్కృతిని, వారసత్వాన్ని తీసుకొస్తాయనే మాట అతిశయోక్తి కాదు. అది అక్షరాలా నిజం. కళ్లముందు కనిపించే సత్యం. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల విస్తరణతో ప్రతి ప్రాంతం తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న వంటకాల ద్వారా ప్రపంచానికి మరింత చేరువైంది. ఒక ప్రాంతాన్ని గుర్తు చేసే ఆలయాలు, నదులు, పంటపొలాల మాదిరిగానే అక్కడి రుచులు కూడా ఆ ఊరి గుర్తింపుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. తిరుపతి అంటే లడ్డూ గుర్తుకు వస్తుంది. అన్నవరం ప్రసాదం రుచి చూసినవారు ఆ ఆకు కూడా వదలకుండా తినేస్తారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి రోజ్ మిల్క్, గంగరాజు పాలకోవా, కాకినాడ కాజా... ఇలా ఎన్నో రుచులు తరతరాలుగా మన నాలుకలపై మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కాలం మారినా, తరాలు మారినా వాటి ప్రత్యేకత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రుచి అనేది కేవలం ఆహారానికి సంబంధించినది కాదు. అది ఒక ప్రాంతం ఆత్మను ప్రతిబింబిస్తుంది. సంస్కృతిని మోస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ మన కళ్ల ముందు నిలబెడుతుంది. ఒక ఊరి పేరు వినగానే అక్కడి ప్రత్యేక రుచి కూడా మనసులో మెదలడం యాదృచ్ఛికం కాదు....