పోస్ట్‌లు

రుచిలో రారాజు _అతిధి మర్యాదలో మహారాజు

అల్లుడు గుమ్మంలోకి అడుగుపెట్టాడో లేదో, ఆ క్షణమే మర్యాదలు మొదలవుతాయి మా గోదారోళ్లింట్లో. అల్లుడైనా, ఆత్మీయ అతిథులైనా—ముందుగా వండి పెట్టేది కరకరలాడే మినప గారెలే. మినుము తింటే కండబలం పెరుగుతుందన్న నమ్మకం ఒకటి; పిండి వంటలలో అది మహారాజులాంటిదన్న విశ్వాసం మరొకటి. అందుకే పెద్దలు— “తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి” అని అలా నిశ్చితంగా చెప్పేవారు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న వాళ్లకే కాకుండా పరలోకంలో ఉన్న వాళ్లకి కూడా ఈ గారెలు అంటే మహా ప్రీతి. ఏ పితృకార్యమైనా గారెలు లేకుండా ఉండదు. ఎర్రగా నూనెలో వేగిన గారె ముక్క విరుచుకుని, అల్లపు చెట్నీతో నంజుకుని తింటే స్వర్గమే కనపడుతుంది. తినేవాళ్లకి స్వర్గం కనబడుతుంది గానీ, పాపం వండే వాళ్ల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. ఒకప్పుడు యంత్రాలు వంటింట్లోకి ప్రవేశించని కాలంలో, రుబ్బురోలుతో కుస్తీపట్టి, చెమటలు కక్కుతూ, పీకల లోతు నీళ్లలో నానబెట్టిన మినప గుండును కర్కశంగా తోలువలచి, కసి కొద్దీ రుబ్బురోలు పత్రాన్ని తిప్పుతూ, ఇనప గుండులాంటి మినప గుండును పాలనురుగు రంగులో ఉన్న మినప రుబ్బుగా మార్చేవారు. రుబ్బు తయారయ్యాక హమ్మయ్య అనుకునేవారు. పిండి రుబ్బుతూ అడుతూ పాడుతూ ...

ఆవకాయ ముద్ద_ఒక బంధం

అమ్మా, నీకు ఏం తినాలి ఉందో చెప్పు! ఈ మూడు నెలలలో నీకు కావాల్సింది వండి పెడతాను. మళ్లీ పురుడు వస్తే ఐదు నెలల వరకు తినడం కుదరదు కదా… అని అడిగింది సీతమ్మ, పురిటికి పుట్టింటికి తీసుకువచ్చిన తన కూతురు భారతిని. పెద్దాపురం చేంతాడు లాంటి కోరికల చిట్టా చెప్పింది భారతి. రోజుకో వెరైటీ—ఆ చిట్టాలో టిక్కు పెట్టుకుంటూ చేస్తూనే ఉంది సీతమ్మ. అయితే ఆ కోరికల చిట్టాలో ఒక కోరిక పేరు చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. “ఇదేమి కోరికే తల్లి! వాడిని ఇప్పుడు ఎక్కడ తీసుకురాను నేను? వాడు ఉండేదేమో గోదావరి జిల్లా. మనం ఉండేది తెలంగాణ రాష్ట్రం. బావుంది నీకోసం పనిగట్టుకుని ఇక్కడికి రావాలా వాడు?” అంటూ నవ్వుతూ అడిగింది. “ఏమో, నాకు తెలీదు. నాకు అది తినాలని ఉంది. అది రోజూ నేను తింటాను. కానీ ఆ చేతిముద్దలో ఏదో అమృతం ఉంది,” అంది భారతి. ఇంతకీ ఆ కోరిక ఏమిటని ఆత్రంగా చిట్టా చూశాడు భారతి తండ్రి సుబ్బారావు. ఆ కోరిక పేరు చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. “మావయ్య చేతితో పెట్టిన ఆవకాయ ముద్ద!” “నేను నీకు ఆవకాయ అన్నంలో కలిపి నోట్లో పెడతాను,” అన్నాడు సుబ్బారావు. “లేదు నాన్న. మావయ్య ఆవకాయ బాగా కలుపుతాడు. ఆ కలుపుతున్న విధానం చూస్తూనే నాకు నోరూరిపోతుంది...

నా కోసం రెండు అడుగులు

ఒరేయ్ ప్రసాదు… అమలాపురానికి బస్సు రిజర్వేషన్ చేయించు. ఇప్పటినుంచి చేయించుకోపోతే టికెట్లు దొరకవు. ఆఖరి సమయంలో వేలకు వేలు పోసి కొనుక్కోవాలి… అన్నాడు రామారావు ఉదయం లేస్తూనే. “ఇంకా నెలరోజులు టైం ఉంది కదా నాన్న! అయినా అందరం ఇక్కడే ఉన్నాం. పండగ ఇక్కడే చేసుకుందాం,” అన్నాడు ప్రసాద్. “లేదురా… పండగ అంటే మన ఊర్లోనే. ఆ సందడే వేరు,” అంటూ, “నేను అలా బజారుకు వెళ్లి వస్తాను,” అని చెప్పి బయలుదేరాడు రామారావు. “ఇంత పొద్దున్నే షాపులు తీయరు నాన్న,” అంటూ, “అయినా ఇప్పుడు బజారుకెందుకు?” అని అడిగాడు ప్రసాదు. “నేను పండగ బట్టలు కొనుక్కోవాలి రా. లేదంటే నా బట్టలు కుట్టి ఇవ్వరు,” అన్నాడు రామారావు. “అదేమిటండీ! ఇంట్లో పిల్లలకి ఎవరికి ముందుగానే బట్టలు కొనలేదు. మీరు మాత్రం ఇలా కంగారు పడిపోతున్నారు,” అన్న భార్య సుమతి మాటలకు నవ్వుతూ, రామారావు బజారుకి వెళ్లి తిరిగి వచ్చి కొనుక్కున్న గుడ్డ ముక్కలని అందరికీ ఆనందంగా చూపించాడు. “ఇదేమిటండీ ఈ బట్టలు! అరవై ఏళ్లు దాటిన తర్వాత ఈ పువ్వుల చొక్కాలు ఏం బాగుంటాయి మీకు? ఊరంతా నవ్వుతారు, ఇవి వేసుకుంటే,” అంది సుమతి.ఆ మాటలకు సమాధానం చెప్పకుండా రామారావు టైలర్ దగ్గరికి వెళ్లిపోయాడు. రామారావు...