పోస్ట్‌లు

ఏప్రిల్ 23, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మంచి పుస్తకం

 మంచి పుస్తకం పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది. పుస్తకం నోరు తెరవని మహా వక్త అంటాడు సిసిరో అనే రోమన్ దేశపు మహా పండితుడు. మనిషికి పుస్తకానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. పాఠశాలలో చేరిన దగ్గర్నుంచి చివరి దశ వరకు అన్ని దశల్లోనూ పుస్తకం మన మనసుకి తోడుగా ఉంటుంది . పుస్తక పఠనం అంటే కేవలం కాలక్షేపం కోసమేనా నిజానికి కాదు అని చెప్పాలి. కొన్ని పుస్తకాలు విజ్ఞానం పెంచుకోవడం కోసం, కొన్ని గ్రంథాలు జ్ఞానం సంపాదించడం కోసం చదువుతాము. కాలక్షేపానికి చదివే పుస్తకాలు మనకు ఏమి ఉపయోగం మన సమయాన్ని పాడు చేయడం తప్పితే. రామాయణ మహాభారత భాగవత గ్రంథాలు చదివినప్పుడు జీవితంలో ఏది తప్పు ఏది ఒప్పు మన నడవడిక ఏ విధంగా ఉండాలి జీవితంలో ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి అనే విషయాలు తెలుస్తాయి.  కొంతమంది ఆత్మ కథలు చదివినప్పుడు వారి జీవితంలో వారు సాధించిన విజయాలు వెనక ఉన్న కష్టం తెలుసుకుంటే విజయం సాధించాలంటే దానికి ఒక ప్రణాళిక ఉంది అందులో కష్టం ఉంది అనే విషయం తెలుస్తుంది. విజయం ఈ పదం మన జీవితాన్ని ఆవరించేంత శక్తివంతమైనది. ఇది అందరికీ కావాలి, కానీ అందరూ దాన్ని పొందలేరు. ఎందుకంటే దానికి దారిచూపే మార్గం మనకు తెలియదు. ...

పెళ్ళి చూపులు

పెళ్లిచూపులు తెనాలి సంబంధం వాళ్లు ఫోన్ చేశారు  అమ్మాయిని చూసుకోవడానికి రేపు ఆదివారం బయలుదేరి వస్తున్నామని అంటూ రామారావు గారు ఆఫీస్ నుండి వచ్చి భార్య సంగీతకి విషయం చెప్పి వాలు కుర్చీలో కూలబడ్డాడు. ఆదివారం అంటే నాలుగు రోజులే ఉంది అంటూ చేతిలో కాఫీ గ్లాస్ భర్తకి  ఇచ్చి ఎదురుగా ఉన్న  కుర్చీలో కూర్చుంది. ముందుగా అమ్మాయికి ఫోన్ చేయాలి అని చేయవలసిన పనులు ఏర్పాట్లు  భర్తతో విపులంగా చెప్పింది. రామారావు గారు అన్ని విషయాలు వివరంగా విని బయటికి వెళ్లి వస్తానని చెప్పి అలా బజార్లోకి వెళ్ళిపోయాడు. రామారావు గారు  ఒక ప్రభుత్వ ఉద్యోగి.  చాలా చాందస భావాలు ఉన్న వ్యక్తి .రామారావుకి ఇద్దరు పిల్లలు. పిల్లలు ఇద్దరినీ చాలా క్రమశిక్షణతో పెంచాడు.అమ్మాయి లలిత హైదరాబాదులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. అబ్బాయి రఘు హైదరాబాదులో బిటెక్ చదువుతున్నాడు. లలితకి పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. లలిత మంచి అందమైన అణుకువ కలిగిన పిల్ల . వరుడు పవన్ కుమార్  బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మంచి కుటుంబం మంచి ఉద్యోగం అని మధ్యవర్తి ద్వారా ఫోటోలు జాతకాలు పంపించడం జరిగింది. పిల్ల ఫోటో నచ్చింది. జాతకా...

ఎవరుంటారు ఇలాగా!

ఎవరుంటారు ఇలాగా! సరోజ గారు ఎవరండీ మేడం గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటూ డాక్టర్ గారి గదిలోంచి బయటికి వచ్చిన  నర్సు గట్టిగా పిలిచింది. నేనేనండి ఒక సుమారు 30 సంవత్సరముల వయస్సు గల యువతి చేతిలో ఒక ఫైల్ తో డాక్టర్ గారు గదిలోకి అడుగు పెట్టింది. అది ఒక ప్రసూతి ఆసుపత్రి. డాక్టర్ శ్వేత గైనకాలజిస్ట్ గా చాలా మంచి పేరుంది. వచ్చిన పేషెంట్లను చాలా మంచి హృదయంతో గౌరవంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. పేషంట్ల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతుంది. పైగా నార్మల్ డెలివరీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే హాస్పటల్ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. పురుడు అంటే పునర్జన్మంటారు. ఆడపిల్ల నెలతప్పిన రోజు దగ్గరనుంచి ఈ రోజుల్లో ప్రతి నెల డాక్టర్ చెకప్ కి తిరగడం స్కానింగ్లు తిరగడం తప్పనిసరి. రోజులు అలా ఉన్నాయి నమస్తే మేడం అంటూ రెండు చేతులు జోడించి డాక్టర్ గారికి నమస్కారం చేసింది సరోజ. చెప్పండి అంటూ డాక్టర్ గారు తలపైకి ఎత్తి చూశారు. నా పేరు సరోజ మాది పక్క ఊరు మా ఆయన ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా రు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మళ్లీ ఇప్పుడు నేను అంటూ చేతుల్లోని ఫైలు డాక్టర్ గారు చేతిలో పెట్టింది. డాక్టర్ గ...

ఆడపిల్ల

 ఆడపిల్ల జీవితంలో కొన్ని అదృష్టాలు కొంతమందికే కలుగుతాయి. అటువంటి వాటిలో ఇంటిలో ఆడపిల్ల పుట్టడం. ఆడపిల్ల పుట్టిందంటే అందరూ భయపడతారు.దాన్ని పెంచి పెద్ద చేయడం ఒక బాధ్యతని,సంఘంలో గౌరవంగా మసిలే బుద్ధులు చెప్పడం మరొక బాధ్యతని,పెళ్లిళ్లు చేయాలని పేరంటాలు చేయాలని,అందుకే అది మన గుండెల మీద కుంపటి అనిఇలా రకరకాలుగా ఆడపిల్ల గురించి భయపడతారు. నిజానికి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపం. కళ్ళకు కాటుక పెట్టుకుని ,కాళ్లకు గజ్జెలు కట్టుకుని ,నుదుట తిలకం దిద్దుకుని, చేతులకు గాజులు ,పట్టుపరికిణి పట్టుకుని ఇల్లంతా కలయ తిరుగుతుంటే లక్ష్మీ స్వరూపమే కనపడుతుంది. అసలు ఆడపిల్ల పుడితేనే తండ్రికి బాధ్యత అంటే ఏమిటో తెలుస్తుంది. కన్యాదాన ఫలితంగా ముందు తరాలు తరిస్తాయి. ఆడపెళ్లి వారు అయితేనే అతిధిని ఎలా గౌరవించాలి అనే విషయం , ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయం నేర్చుకుంటారు తల్లిదండ్రులు. అందుకనేమో పెళ్లి చూసి చూడు ఇల్లు కట్టు చూడు అనే సామెత వచ్చింది నిజానికి ఆడ మగ ఒక ప్రకృతి స్వరూపమైన తేడాయే కానీ ఈ రోజుల్లో ఇద్దరకి తేడా ఏమీ లేదు. ఇద్దరికీ విద్యాబుద్ధులు నేర్పించాలి. పెళ్లిళ్లు చేయాలి పేరంటాలు చేయాలి. ఇంకా పెద్ద ...

సతులార

సతులారా చూడరే   సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిl   సకలాయ నడిరేయ కలిగే శ్రీకృష్ణుడు  అంటూ అన్నమయ్య తన కీర్తనల్లో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి స్తుతించారు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజుగా  పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండుగను మనం కృష్ణాష్టమి గా జరుపుకుంటాం.  చెరసాలలో దేవకి వసుదేవుల కుమారుడుగా జన్మించి రేపల్లెలో నందుని ఇంటిలో యశోదమ్మ ఒడిలో పెరిగి నంద కుమారుడుగా చలామణి అయ్యాడు పోతన్న గారు ఆంధ్ర మహాభాగవతంలో శ్రీకృష్ణుని రూపం గురించి చెప్తూ నల్లని వాడు పద్మనయనములు కలవాడిగా వర్ణించారు. అన్నమయ్య ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అంటూ స్తుతించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి పసిప్రాయం నుండి తన లీలలు చూపించి రేపల్లెవాసుల్ని ఆశ్చర్యపరిచాడు. పాలు తాగే వయసులో కృష్ణుడిని చంపడానికి మేనమామ కంసుడు పంపించిన పూతన అనే రాక్షసిని రొమ్ము పీల్చి సంహరించాడు. ఇక్కడ భగవంతుడు మాయ మనం గమనించాలి. సాధారణంగా చంటి పిల్లలకి తల్లి దగ్గర తప్పితే ఇతర స్త్రీల దగ్గర ఎవరూ పాలు ఇప్పించడానికి ఇష్టపడరు. ఆ రాక్షస సంహారం జరగాలి కాబట్...

భాష

భాష  మనసులోని భావం వ్యక్తీకరించడానికి భాష ఆధారం. భాష మనుషుల్ని దగ్గర చేస్తుంది. మనస్సులను కలుపుతుంది. భాషాభివృద్ధి ఎలా జరిగిందనే విషయం ఆలోచిస్తే పూర్వం కాలంలో గురువులు ఋషులు మునులు తమ శిష్యులకి పంచ కావ్యాలు చెప్పేవారు. రాజుల కాలంలో కవులను పోషించి మంచి మంచి కావ్యాలను వ్రాయించేవారు.తదుపరి కాలంలో పాఠశాలలో తెలుగు భాషకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.  అయితే ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించిన కాలంలో వారు కూడా మన భాష అభివృద్ధికి కొంతవరకు దోహదం చేశారని చెప్పాలి.ఏవిధంగాఅంటేభారతదేశానికివ్యాపారంకోసం వచ్చిన   తెల్ల దొరలు మన ప్రజల్ని పీడించి బాధ పెట్టినా వారు      కొన్ని రంగాలలో తీసుకొచ్చిన మార్పులు మనకు  తదుపరి కాలంలో మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. ఉదాహరణకి బ్రిటిష్ వారు తీసుకొచ్చిన రైలు మార్గం తదుపరి  కాలంలో ఒక మహా సంస్థగా ఎదిగి భారతదేశానికి కోట్ల  రూపాయల్లో ఈనాడు ఆదాయం తెచ్చి పెడుతోంది. అలాగే విద్యా విధానంలో ప్రజల్లో మార్పు తీసుకురావడానికి పెద్ద బాలశిక్ష అనే గ్రంధాన్ని తెలుగులో ఆంగ్లేయులు వ్రాయించడం జరిగింది. ఇదంతా వారి స్వలాభం కోసం చేసిన మనకు ...

కోనసీమ జిల్లా విహారయాత్ర

ఆంధ్రప్రదేశ్ 2022 సంవత్సరంలో జిల్లా పునర్విభజన చట్టం ప్రకారం కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలుగా ఉండే ప్రాంతమంతా మూడు జిల్లాలు అయింది. ఈ జిల్లాలో పచ్చటి పంట పొలాలతో, పిల్ల కాలువలతో, అందమైన గోదావరి నది తీరాలతో, కొబ్బరి తోటలతో అరటి తోటలతో పూల తోటలతో చాలా ఆహ్లాదకరంగా చూడడానికి ఆనందంగా ఉంటుంది.  కడియం : తూర్పుగోదావరి జిల్లాలో కడియం గ్రామంలో పూల తోటలు చూడదగినవి. ఇక్కడనుండి ప్రతిరోజు పూలని దేశంలోని వివిధ ప్రాంతాలకి విమానాల ద్వారా  ఎగుమతి చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ అనేక నర్సరీలు దేశంలోని వివిధ ప్రాంతాలకి మొక్కలను సప్లై చేస్తూ ఉంటాయి. అంతర్వేది: ఇక్కడ అతి ప్రాచీనమైన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది.  సముద్ర ప్రాంతంలో అన్నా చెల్లెళ్ల గట్టు అనే ప్రదేశం చూడదగింది.  అప్పనపల్లి : బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం.  అయినవిల్లి:  అమలాపురానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో లక్ష్మీ గణపతి కొలువై ఉన్నాడు  ఇక్కడికి దగ్గరలో ఉన్న ముక్తేశ్వరం అనే గ్రామంలో క్షణముక్తేశ్వరుడు ఆలయం చూడదగినది...

కాలుష్యం

కాలుష్యం కార్తీక పౌర్ణమి శుభవేళ లోకాలన్నీ వెన్నెల వెలుగులో మెరిసిపోతుంటే కైలాస పర్వతం తెల్లని వెన్నెల పరచినట్లు గా ఉంది . ఆ సమయంలో నదుల శబ్దాలు సంగీతంలా వినిపిస్తున్నాయి. వృక్షాలు సువాసన పంచుతున్నాయి. దిక్కులన్నీ మంచుతోటి మెరిసిపోతూ ఉన్నాయి. పక్కన పార్వతీదేవి , తలపైన గంగ, ఆకాశం మీద కార్తీక పున్నమి చంద్రుడు ఇంతటి అద్భుత వాతావరణంలో శివుడు పరవశుడై నాట్యం చేస్తున్నాడు.  ఇంతలో ఏదో ఆర్తనాదం వినబడింది. నాట్యం ఆపేసి అటువైపు చూసిన శివుడుకి దూరం నుంచి వస్తున్న తన బిడ్డలు పంచభూతాలు, కొన్ని మూగజీవాలు కనబడ్డాయి. ఇదేమిటి ఆనందం అనుభవించవలసిన సమయంలో ఆర్తనాదం చేస్తూ పరిగెత్తుకొస్తున్నాయి అనుకుని పక్కనున్న పార్వతీ దేవితో ఇలా అన్నాడు . శివుడు: చూడు పార్వతి నా బిడ్డ లేదో ఆపదలో ఉన్నట్టున్నారు ఎప్పుడూ లేనిది ఇలా నా దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నారు. పాపం ఏ ఆపద వచ్చిందో ఏమో! నేను పలకరించి వస్తాను  అంటూ ముందుకు కదిలాడు.  పార్వతి: నాకు వాళ్ళు బిడ్డలే కదా! అండి నేను కూడా వస్తాను మీ తోటి అoటు శివుడు తోటి బయలుదేరి ఆ పంచభూతాలు ఎదురు వెళ్లారు.  శివపార్వతులను చూసి ఆ పంచభూతాలు ఒక్కసార...