పోస్ట్‌లు

దీపావళి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దీపావళి అతిధి

అతిథి  వెలుగులు చిమ్ముతూ రివ్వున ఆకాశానికి ఎగిరి ఆనందం మనకు మిగిల్చి   గాల్లోనేతనువు చాలిస్తుంది ఓ తారాజువ్వ. ఆనంద యాత్రకి ఆఖరి యాత్రకి తప్పకుండా హాజరయ్యే అతిధి. పనికిరాని పేక ముక్కతో ప్రాణం పోసుకున్న   నీనామ మే మానవాళికి పెద్ద అలంకారము.   ఆకాశంలో ఉండే తారలన్నీ పండగకి అతిథిగా వచ్చి మంచి ముత్యాలన్నీ మనకిచ్చి మసి భూమికి అంటించి. వెలుగులు చిమ్మి క్షణం లో చేరిపోతాయి దివికి. ఎవరు కనిపెట్టారో ఈ మతాబు కితాబు ఇవ్వకుండా ఎలా ఉండగలం. గుండెల్లో దాచుకున్న వెలుగులన్నీ దీపాల పండక్కి అందరికి పంచి ఇచ్చి తన గుండెకు చిచ్చు రగిలించుకుని గుండె బద్దలై ప్రజల గుండెల్లో  చిచ్చుబుడ్డిగా మిగిలిపోయింది. చిటపటలాడుతూ వెలుగు విరజిమ్మే పువ్వొత్తులు  వెలిగించాయి బుడ్డి దాని కళ్ళల్లో ఒత్తులు లేని దీపాలు. అరుగుల మీద పండుగకి వరుసగా కూర్చుని  అమావాస్యపు చీకట్లను పారదోలి అజ్ఞానం తొలగించి పండగకి తన పేరు పెట్టుకుని వెలుగు పంచే ధన్యజీవి దీపం. దీపం లక్ష్మికి ప్రతిరూపం ఈ పండగ దీపాల పండగ. సతి తో పాటు పతి కూడా పండక్కి అతిథిగా వచ్చి విష్ణు చక్రం మై వెలుగులు పంచి సద్దుమణిగిన తర్వాత...

దీపావళి

దీపావళి సాయంకాలం ఆరు గంటలు అయింది. ఎక్కడి నుంచో బాణసంచా చప్పుడు వినబడు తోంది. అప్పుడే దీపావళి ప్రారంభమైపోయింది అనుకుంటూ ఇత్తడి పళ్లెంలో వెలిగించిన ప్రమిదలని ఒక్కొక్కటి ఆరుగు మీద పెడుతోంది రమ్య. దీపావళి నాడు అరుగులకు ప్రత్యేక అతిధులు ఈ దీపాలు.  ఈ దీపాలతోటే ఎంత కళ వచ్చింది ఇంటికి అనుకుంటూ గాలికి రెపరెపలాడుతున్న దీపాలను చూసి మనసు ఎక్కడకో పోయింది రమ్యకి. పక్క ఇంటి నుంచి పిల్లల దివిటీలు కొడుతున్న హడావుడి వినపడుతోంది. పిల్లలు చేతులు కాల్చుకుంటారని ఆ తల్లి నానా హైరానా పడిపోతో oది. ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి రమ్య మనసు చిన్నతనంలోకి పరుగులెట్టింది. " అమ్మా రమ్య పరికిణి కుచ్చిళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకో. దూరంగా ఉండి ప్రమిదల్లో నూనె పొయ్యి. నువ్వు మతాబులు కాల్చుకో. అన్నయ్య తారాజువ్వలు కాల్చుకుంటాడు. నీకు గె డ కర్రకి మతాబులు కట్టిస్తాను. కాకరపువ్వొత్తులు కూడా నువ్వే కాల్చుకో. ఇలా ఎన్నో జాగ్రత్తలు ప్రతి దీపావళికి అమ్మ చెబుతూనే ఉండే ది. ప్రతి దీపావళికి కొత్త బట్టలు కాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూచక్రాలు పాము బిళ్ళలు మతాబులు ఇవన్నీ నా వాటా.  అన్నయ్య కి తారాజు...