పోస్ట్‌లు

అక్టోబర్ 26, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆడజన్మ

ఆడజన్మ  సరోజ గారు ఎవరండీ మేడం గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటూ డాక్టర్ గారి గదిలోంచి బయటికి వచ్చిన  నర్సు గట్టిగా పిలిచింది. నేనేనండి ఒక సుమారు 30 సంవత్సరముల వయస్సు గల యువతి చేతిలో ఒక ఫైల్ తో డాక్టర్ గారు గదిలోకి అడుగు పెట్టింది. అది ఒక ప్రసూతి ఆసుపత్రి. డాక్టర్ శ్వేత గైనకాలజిస్ట్ గా చాలా మంచి పేరుంది. వచ్చిన పేషెంట్లను చాలా మంచి హృదయంతో గౌరవంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. పేషంట్ల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతుంది. పైగా నార్మల్ డెలివరీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే హాస్పటల్ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. పురుడు అంటే పునర్జన్మంటారు. ఆడపిల్ల నెలతప్పిన రోజు దగ్గరనుంచి ఈ రోజుల్లో ప్రతి నెల డాక్టర్ చెకప్ కి తిరగడం స్కానింగ్లు తిరగడం తప్పనిసరి. రోజులు అలా ఉన్నాయి నమస్తే మేడం అంటూ రెండు చేతులు జోడించి డాక్టర్ గారికి నమస్కారం చేసింది సరోజ. చెప్పండి అంటూ డాక్టర్ గారు తలపైకి ఎత్తి చూశారు. నా పేరు సరోజ మాది పక్క ఊరు మా ఆయన ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా రు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మళ్లీ ఇప్పుడు నేను అంటూ చేతుల్లోని ఫైలు డాక్టర్ గారు చేతిలో పెట్టింది. డాక్టర్ గారు ...

అమ్మ @వినాయక చవితి

అమ్మ @ వినాయక చవితి  అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ప్రపంచంలో ఏ శుభకార్యం జరిగిన ముందుగా గణపతి ఆరాధన తోటే మొదలవుతుంది . ఇది శాస్త్రం చెప్పిన విషయం.సృష్టికర్త అయిన బ్రహ్మకు కానీ సృష్టిని పరిపాలించే ప్రభువు విష్ణుమూర్తికి కానీ సృష్టి స్థితి లయకారుడు ఈశ్వరుడుకి కానీ తొలి పూజ అందుకునే అధికారం లేదు. ముందుగా గణపతి ఆరాధన చేయనిదే ఏ పూజ ప్రారంభించలేము. గణపతి పార్వతీ పరమేశ్వరుల ప్రథమ పుత్రుడు. గణాలకు అధిపతి. విఘ్నాలను పారద్రోలేవాడు. ఇలా గణపతి గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. భాద్ర పద శుద్ధ చవితి నాడు ప్రతి ఇంట్లో గణపతి పూజ చేసుకుంటాం. వినాయక చవితి ముఖ్యంగా పిల్లలు పెద్దలు ముదుసలి వారు అనే తారతమ్యం లేకుండా అందరూ చేసుకునే పండగ. మన హిందూ సాంప్రదాయంలో అన్ని వ్రతాలు కుటుంబమంతా కలిసి చేసుకోరు. కొన్ని వ్రతాలు ముఖ్యంగా స్త్రీలకే ఉద్దేశించబడినవి. వినాయక వ్రతానికి అటువంటి తారతమ్యం లేదు. మన ఇంటిలో జరిగే ఏ శుభకార్యామైనా పండుగ అయినా వ్రతమైనా సక్రమంగా నడిపించవలసిన బాధ్యత ముఖ్యంగా ఆ ఇంటి యజమానురాలుదే. ఇంటి యజమానురాలంటే ఇంకెవరు మన అమ్మ లేదా మన భార్య.    పం...

ప్రాణదాత

ఏడాదికో మారు హుస్సేన్ సాగర్ లో వినాయకుడు మూడు మునకలు వేసి భాగ్యనగర వాసులకి ముక్తిని ఇస్తాడు. కాపురం బాలేని ఒక చెల్లి ఉద్యోగం రాలేదని ఒక తమ్ముడు బ్రతుకు బాలేదని ఒక సంసారి దిక్కు తోచక ఒకడు దిక్కు లేక మరొకడు పచ్చటి బ్రతుకుని ఆ సాగరంలో కలిపేసినప్పుడు ఊపిరాడకు మరో లోకం చూసినప్పుడు నేనున్నానంటూ తన బ్రతుకు చూసుకోకుండా సాగరంలో మూడుమునకలేసి ఊపిరి ఉన్న వాళ్ళని  ఊపిరి లేని వాళ్ళని కన్నవాళ్ళకి  కట్టుకున్న వాళ్ళకి కడసారి చూపు అందించే మరో అపర వినాయకుడు ఈ భాగ్యనగర జీవి. నామధేయం శివ ఆ సాగరతీరమే అతని అడ్డా జనాలకు ప్రాణహితుడు. రక్షక భటులకు కుడి భుజం. భాగ్యనగరంలోని ఓ బడుగు జీవి బ్రతకడానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన త్యాగజీవి. కొన ఊపిరి ఉన్న వాళ్లు సంతోషంగాను ఈ లోకంలో లేని వాళ్ళ బంధుజనం కన్నీళ్ళతోను ఇచ్చే పదో పరకో అదే జీవనాధారం. ఉపకారం అంటేనే పారిపోయే జనం ఉన్న రోజులు పరుల ప్రాణం కోసం ప్రాణం త్యాగం చేసే పరమాత్ముడు సార్ధక నామధేయుడు. భర్త అడుగుజాడల్లోనే భార్య ఆడ ప్రాణం ఆమె వంతు ప్రాణ రక్షణ పంచుకున్నారు చెరి సగం. సమయానుకూలంగా స్పందించడమే వారి వృత్తి ధర్మం. భూమ్మీద నూకలు ఉండి  బతికి వచ్చిన ...

ఊపిరి లేని బొమ్మ

ఊపిరి లేని బొమ్మ ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరు వదిలి రానంది అమ్మ ఊపిరాగి బొమ్మై కూర్చుంది నా బీరువాలో. బొమ్మ చూసినప్పుడల్లా అమ్మ నాతోనే ఉంది  అన్న తృప్తి . అమ్మకైనా బొమ్మకైనా బిడ్డ ఆనందమే సంతృప్తి.  బాల్యంలో అమ్మే నాకు సర్వస్వం  బొమ్మైన అమ్మ నాకు దైవంతో సమానం. బ్రతికున్నన్నాళ్లుఅమ్మకి లేదు క్షణం విరామం. నిత్యం బిడ్డల కోసమే పడేది తాపత్రయం. బొమ్మైన తర్వాత ఆమెకు లేదు అనుభవించే యోగం. ఊపిరి ఉన్న బొమ్మను తయారు చేసేది ఆ పరబ్రహ్మ పది తరాలకు చూపించడానికి బొమ్మను  తయారు చేసే యంత్రం సృష్టించాడు ఈ అపరబ్రహ్మ. మట్టిలో మట్టి గాలిలో గాలి కలిసిపోయిన  తాత గారి బొమ్మ లేకపోయినప్పుడు తెలిసింది  నాకు ఆ బొమ్మ విలువ. సెకనుకో బొమ్మ సృష్టించే యువతరాన్ని అభినందిద్దాం మనమందరం. రచన. మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు            కాకినాడ 9491792279