పోస్ట్‌లు

మే 29, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

తప్పు ఎవరిది?

అవును నది జాలిగా చూస్తోంది ఏరు దాటి తెప్ప తగలేసే వాడిని చూసి  గలగల పారుతూ పంట పొలాల్లో  పచ్చటి మొలకకు జీవమై  బంగారు పంటలు పండించి రైతన్నకు నేస్తమై  భూమాత దాహార్తి తీర్చే నది జాలిగా చూస్తోంది మనిషి ఇంత స్వార్థపరుడా అని  జాలరికి జీవన ఆధారమై  నదిలో నడిచే నావకు ఆధారమైన నదీమ తల్లి జాలిగా చూస్తోంది ఏరు దాటి తెప్ప తగలేసే వాడిని చూసి. గుప్పెడు బూడిదని తనలో కలుపుకుని  ఎన్ని కోట్ల మందిని పుణ్యలోకాలకు మోసుకు పోయిందో ఈ తల్లి  ఊపిరి ఉన్నన్నాళ్ళు నదిలో మూడుమునకలేస్తే ఎంతమందికి పుణ్యం పంచి ఇచ్చిందో  దూసుకుపోతున్న పొగ బండి లోంచి  పడేసిన సత్తు రూపాయలను దాచి  కన్నతల్లి లా పోరగాడి కడుపు నింపే నదీమ తల్లి జాలిగా చూస్తోంది. అయినా మనిషి గుండె కరగలేదు కూసంత భక్తి లేదు. రోజు నగరం మురికితో స్నానం చేయిస్తోంది నదిని. కాలుష్యంతో కౌగిలించుకుంటున్నాయి పరిశ్రమలు.  దారిన పోయే దానయ్య తను వ్యర్థం అంతా గంగపాలు చేసి బరువు దించేసుకుంటున్నాడు.  పున్నమి వెలుగులో ఉండే నదినీ కారు మబ్బులా మంది మార్చేస్తుంటే  నోరులేని మూగజీవిలా జాలిగా చూస్తోంది నది. ...

అభ్యుదయ కవిత్వం లో ఆణి ముత్యం

ఒక దశాబ్దం పాటు ఆంధ్ర సాహిత్య లోకాన్ని ఉత్తేజపరిచిన అభ్యుదయ కవిత్వానికి మూలవిరాట్ శ్రీశ్రీ. పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ రచనలలో వ్యక్తికి సంఘ చైతన్యానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఆనాడు సమాజంలో ఉండే సమస్యలకి తన కవిత్వం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి పరిష్కార దిశగా అడుగులు వేయించాడని అర్థమవుతుంది. శ్రీ శ్రీ అభ్యుదయ కవి. అసలు ఈ అభ్యుదయ కవిత్వానికి నిర్వచనం ఏమిటి సాధారణ మానవుడి సంక్షేమమే అభ్యుదయం.  శ్రామికుల్లో చైతన్యం కలిగిస్తూ వారి జీవిత సమస్యలను చిత్రించే సాహిత్యమే అభ్యుదయమంటాడు శ్రీ శ్రీ. కమ్యూనిస్టు భావాలు ఉన్నవాడు. మహాప్రస్థానం లాంటి ఎన్నో మహాకావ్యాలు రచించి జనంలో వేడి పుట్టించి సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్షరాల అక్షరాల్లో చూపించాడు. జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ప్రజల్లో ఉత్సాహం పెంచాడు.అంతవరకు భావ కవిత్వపు ధో రణిలో రచనలు సాగుతున్న కాలంలో ఒక్కసారిగా సమాజాన్ని జాగృతం చేసే రచనలు రావడంతో శ్రీశ్రీ ఒక అభ్యుదయ కవి విప్లవ కవి అని పేరుగాంచాడు.  అందుకే శ్రీశ్రీ కవిత్వంలోని పదాలన్నీ వాడిగా వేడిగా రక్తాన్ని మరిగించేటట్లుగా ఉంటాయి. అంతవరకు సాహిత్యంలో ప్ర...

ఇత్తడి సామాను

ఉదయం 6:00 గంటలు అయింది.  రాజమ్మ గారు స్నానం చేసి పూజ పూర్తి చేసుకుని హాల్లో టీవీలో వార్తలు చూస్తున్న పెద్ద కొడుకు రఘు దగ్గరకొచ్చి "ఒరేయ్ రఘు ఒక పెద్ద వ్యాన్ తీసుకురా అలాగే ఇద్దరు మనుషుల్ని కూడా పురమాయించు. పైన ఉన్న ఇత్తడి సామాను అంతా మనం రాజమండ్రి పట్టుకెళ్ళి అమ్మేద్దాం అంటూ తల్లి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయాడు రఘు. "అమ్మలో ఇంత మార్పు వచ్చింది ఏమిటా అని ఆలోచించసాగాడు. ఒరేయ్ నా మాటలు వింటున్నావా లేదా అంటూ రెండోసారి రెట్టించేసరికి అలాగే అమ్మ అంటూ స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్ళిపోయాడు. రఘు రాజమ్మ గారి పెద్ద కొడుకు. రాజమ్మ గారికి నలుగురు కూతుళ్లు నలుగురు కొడుకులు పెళ్లిళ్లు అయిపోయి అంతా హైదరాబాదులోనే సెటిలైపోయారు. రాజమ్మ గారు మాత్రం ఆ ఊరు వదలలేదు. లంకంత కొంప. చేతినిండా పనివాళ్ళు. నెలకొకసారి రఘు హైదరాబాద్ నుంచి వచ్చి రాజమ్మ గారి బాగోగులు చూసుకుని వెళ్తాడు. మిగిలిన పిల్లలు పండక్కి పబ్బాలకి వచ్చి వెళుతుంటారు. రాజమ్మ గారికి ఆ ఇత్తడి సామానికి అవినాభావ సంబంధం ఉంది. ఆమె వాటిని కన్నతల్లిలా చూసుకుంటుంది. ఎవరి చేతిలో నుంచి అయినా చెంబు జారిపోతే అయ్యో సొట్టపడిపోతుంది రా ఎప్పుడో మీ త...

గుడి

ఉదయం 5:00 అయింది.  ప్రతిరోజు లాగే రాఘవచార్యులు గోపాల కృష్ణుడి గుడి తలుపులు తీసి దేవుడి మీదనున్న నిర్మాల్యం తీసి బయట పడేసి శుభ్రంగా తుడుచుకుని ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలు మైకులో వింటూ స్వామి వారికి ఉదయం జరిపే పూజలు యధావిధిగా చేసి తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు పళ్ళు నైవేద్యం పెట్టి ఒక్కసారిగా వీధిలోకి తొంగి చూసాడు.  ఎవరైనా భక్తులు వస్తున్నారా అని!. అదేo విచిత్రమో! కార్తీకమాసo పుణ్యదినాలైనప్పటికిపెద్దగా ఎవరూ కనపడలేదు. రోజుకి మహా అయితే పదిమంది వస్తే గొప్ప. అదేమిటి ఇది అతి పురాతన దేవాలయం. ఇంత పుణ్య దినాల్లో కూడా ఎక్కువగా ఎవరు గుడికి రావట్లేదు ఏమిటి ? అనుకుంటూ ప్రతిరోజు మనసులో మధన పడసాగాడు రాఘవాచార్యులు.  రాఘవచార్యులు తెలుగు మాస్టారుగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యి అనువంశికంగా వచ్చిన అర్చకత్వం తీసుకుని తన స్వగ్రామంలో ఉంటూ ప్రభుత్వo ఇచ్చే పెన్షన్తో కాలక్షేపం చేస్తున్నాడు.  దేవుడు మాన్యాలన్ని కాకులు ఎత్తుకుపోయిన రాఘవాచార్యులు గారి వంశస్థులందరూ తమ ఇంటి నుంచి దేవుడికి నైవేద్యం తీసుకువచ్చి పెడుతూ కాలక్షేపం చేసేవారు ఇంతకు ముందు ఉండే అర్చకులు....