పోస్ట్‌లు

ఏప్రిల్ 8, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మగ మహా రాజు

మగమహారాజు  ఇది మహా నటుడు నటించిన సినీమా కాదు. పుణ్యలోకానికి దారి చూపించే మగమహారాజుల గాథ ఆ కుటుంబం అంతటికీ రాజే.  ఆ గుండెల్లోనే ఉంటుంది చెప్పుకోలేని వ్యధ. ఈ మహారాజుకు రాజ్యాలు ఉండవు తలపై కిరీటాలు ఉండవు వంశ గౌరవాల బరువులు తప్ప. కుటుంబ బాధ్యతలబరువులకి అనుబంధాల ఆప్యాయతలకి జవాబుదారి ఈ మహారాజే. ఉరుకుల పరుగుల జీవితం. విరామం లేని పని ఒత్తిడి అలసి సొలసి ఇంటికి చేరినా తీర్చుకోవాల్సిన బాధ్యతల భయాలు.   భగీరథ ప్రయత్నం చేయాలి ఒక బాధ్యత తీరాలంటే. బరువులు ఒక పక్కకు నెట్టాలంటే. మధ్యతరగతి జీవితాలు  బడ్జెట్ బండి మీద బతుకు నడపాల్సిందే బండికి బ్రేకులు వేయకపోతే బతుకంతా నవ్వుల పాలు దానికి కూడా మగ మహారాజే ఇవ్వాలి జవాబు కళ్లెం వదిలితే గుర్రం తప్పటడుగులు వేస్తుంది అందుకే రౌతు కొద్దీ గుర్రం. మౌనంగా ఉన్న పురుష పుంగవుని మదిలో ఎన్ని అగ్నిజ్వాలలో. కట్టుకున్న భార్యకు తెలియదు రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు తెలియదు. ఆ మర్మం అంతా బయటపడేది వైద్యుడు దగ్గరే. కలలా కరిగిపోతుంది వయస్సు ఏ క్షణంలో పిలుపు వస్తుందో ఎవరికి తెలుసు.  ఇదే తరతరాల మగ జాతి చరిత్ర.  మార్పులేని మహత్తర జాతి చరిత్ర.....

దుస్తులు

దుస్తులు "  పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.  పోయేటప్పుడు అది నీ వెంట రాదు." అన్నాడు ఒక సినీ కవి. అంటే ఈ మధ్యకాలంలో తన శరీర  భాగాలని బహిర్గతం చేయకుండా కాపాడుకోవడానికి దుస్తులు  ధరిస్తాడు మానవుడు. ధరించే దుస్తులు మానవుడికి సరికొత్త  అందాన్ని ఆనందాన్ని తీసుకొస్తాయి. మన సమాజంలో దుస్తులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మనం ధరించే దుస్తులు చలి నుండి ఎండ నుండి మన శరీరాన్ని కాపాడు తాయి. రోజు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఒక రకమైన ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. ఇది ఆఫీస్ వారి నియమ నిబంధనలో డ్రెస్ కోడ్ ఉంటుంది. దుస్తులు ధరించిన ఉద్యోగులు పలానా ఆఫీస్ వారని ప్రజలకు తెలుస్తుంది. ఈ డ్రెస్ కోడ్ గనక పెట్టకపోతే నైట్ డ్రెస్ లతో కూడా ఆఫీసులకు వచ్చే ప్రమాదం ఉంది. పదిమంది తిరిగే ఆఫీసులో అది సభ్యతగా ఉండదు. అది ఆ మనిషి గౌరవం తగ్గిస్తుంది. ఆ కార్యాలయానికి చెడ్డ పేరు వస్తుంది.  అలాగే స్కూల్లోనూ కాలేజీలోనూ చదివే పిల్లలకు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించాలని నియమ నిబంధనలు ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలందరూ ఒక్కటే ధనిక పేద తేడా ఏమీ లేదని చెప్పడమే. ఆదిమానవుడు కూడా ఆకుల తోటి లతలతోటి తన శరీరాన్ని కప్పుకు...

పరమాత్మ

పరమాత్ముడు  పప్పు రుబ్బే రుబ్బురోలు పరమాత్ముడిని తలచి షోడశోపచార ములు చేసి పూజలు చేసే ఒక పడతి. ఆ పడతి కి వెఱ్ఱి యని ప్రజలు తలచే పరమాత్ముడు ఎందైన కలడని పోతన చెప్పె. భవన స్తoభము నుండి నరసింహుడు అవతరించి ప్రహ్లాదుని రక్షించే. దశావతారములు ఎత్తి విష్ణువు భక్తులను రక్షించే. రహదారి పక్కన తాడిచెట్టుని అమ్మగా తలచి పసుపు కుంకుమలు పూసే మానవుడు. పుణ్యమని దలచి వే ప కి రావికి కల్యాణం జరిపించే. మూగ జీవిని వెంకటేశ్వరుడని తలచి అచ్చు వేసి రహదారిలోకి విడిచే . వానరం కనపడగానే వంగి వందనము చేసి హనుమగా తలిచే. దీనులలోనే కనబడింది దైవం మదర్ తెరిసా కి మానవసేవే మాధవసేవ అని నమ్మింది రామకృష్ణ పరమహంస. మనసుపెట్టి చూస్తే ప్రతి ప్రాణిలోనూ ఉంది దైవం. ఆ మనసు పేరే మానవత్వం. మనసు మెచ్చే పని చేయడమే మనిషి లక్షణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

చెవిలో చెబితే!

చిత్రం
చెవిలో చెబితే!  మనిషి జన్మంతా కోరిక మయం. బాధల మయం కోరిన కోరికలు తీర్చుకోవడానికి మనిషి దేవుడిని నమ్ముతాడు. దేవాలయాల కి వెళ్తాడు. మ్రొక్కులుచెల్లిస్తాడు . ఏడుకొండలు ఎక్కితే గాని వెంకటేశ్వర స్వామి కరుణించడు. పదునెనిమిది మెట్లు ఎక్కితే గాని అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి కాదు. శ్రీశైల శిఖర దర్శనం చేస్తే గాని శివయ్య కరుణాకటాక్షాలు భక్తులకు లభించవు. ఏ దేవాలయంలో నైనా గర్భగుడిలో భక్తులకు అనుమతి లేదు. కొన్ని దేవాలయాల్లో తప్పితే దేవుని భక్తులు తాకరాదు. కానీ ఒక అపురూపమైన స్వామి భక్తుల కోరికలను తన చెవిలో చెప్పించుకుని ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు . ఆ స్వామి ఎవరో కాదు కాకినాడ జిల్లా బిక్కవోలు గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి. ఇది పురాతనమైన దేవాలయం. ఈ స్వామికి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద శిలావిగ్రహం. భూమి లోపల ఎన్ని అడుగులు ఉందో ఎవరికీ తెలియదు . చాళుక్యుల కాలంలో కట్టిన గుడి అని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ స్వామి అనుగ్రహం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుని అన్న ప్రసాదం స్వీకరించి వెళ్తుంటారు. పూజాదికాల సమయాలు ఎక్కడా వివరాలు లభించలేదు. గుడ...

మామిడి పండు

అందాన్ని పండు తో పోలుస్తారు మనిషి పండు లాఉన్నాడు అంటారు. పండు చూడ్డానికి కాదు తినడానికి పండు తింటే పండులా అవుతారు. ప్రతి సీజన్ కి ఓ పండు వేసవి వచ్చిందంటే చెప్పాలా మామిడి పండే మహారాజు. ఉగాది పండగ తోటే ప్రారంభం. మామిడికాయ రుచి చూడడం. వేసవిలో పిందెలతో పచ్చడి బద్దలు అదేనండి మెంతిబద్దలు లేకుండా ముద్ద  దిగదు మన తెలుగు ప్రజలకు. పప్పులో ఓ పుల్ల మామిడి ముక్క  వెల్లుల్లి తో తాలింపు చేస్తే అడ్డ విస్తరి అర నిమిషo లో ఖాళీ ఊరంతా వెతికి తెస్తారు ఊరగాయ కాయ. నాణ్యం చూడ్డానికి స్నేహితులతో మంతనాలు పెళ్ళి అంత పని ఊరగాయ పెట్టుకోవడం. ఆ సందడే వేరు. అమ్మలకి చేతినిండా పని. ఈనాటి బొమ్మలకి నగిషీలు దిద్దుకోవడమే పని కంచం ముందు కూర్చుంటే కాని ఊరగాయ గుర్తుకు రాదు. అప్పుడు గుర్తుకు వస్తుంది అంగట్లోని పికిల్. ఎర్రగా నూనెలో తేలుతూ చెరువులోని కలువ పువ్వులా ఉంటుంది కుండలోని ఊరగాయ. వేసవి వెళ్ళేసరికి సగం కుండ ఖాళీ. రోజుకో రకం ఆవకాయ తోటి అడ్డవిస్తరి అద్భుతం అమ్మ చేతిలో ఏముందో మిస్టరీ. బ్రహ్మ కూడా చెప్పలేడు పామిస్ట్రీ. బెల్లం ఆవకాయ కలిపిన అన్నం ముద్ద.  మరునాటికి కూడా నోరు పట్టుకుని వదలదు తీపిదనం. గుప్పన...