పోస్ట్‌లు

మార్చి 1, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

త్యాగమూర్తులు

త్యాగమూర్తులు వీరికి గుడులు గోపురాలు ఉండవు ఎగిరే మువ్వన్నెల జెండాలో అందరికీ మూడు రంగులే కనిపిస్తాయి. మనసుపెట్టి చూస్తే అమరవీరుల ఆశయాలు కనిపిస్తాయి. అసువులు బాసిన అమరవీరులందరి ఆశయాలకు గుర్తులుగా  ఎర్రకోట పై రెపరెపలాడుతోంది మూడు రంగుల జెండా . ఆ మహనీయుల అందరి ఆశయం ఒక్కటే. దేశాన్ని విదేశీ సంకెళ్ల నుండి విడిపించడమే. ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకొని పరాయి పాలన ఎదిరించి స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రలో మిగిలిపోయారు.  ఈనాడు ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు ఎందరో వీరుల ఊపిరి ఆగిపోయిమట్టిలో కలిసిపోయి మహనీయులుగా మిగిలిపోయారు. వారు స్వాతంత్ర ఫలముఅనుభవించలేదు. పదవుల కోసం ఆశపడలేదు. బ్రతికున్న రోజుల్లో కారాగార శిక్ష అనుభవించి ఉరికంబo ఎక్కి అసువులు బాసిన మహాత్ములు.  అహింసావాదంతో గాంధీజీ బ్రిటిష్ వారిని గడగడలాడిస్తే బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతం రచించి జాతిని ఉత్తేజపరిచారు. దేశభక్తి ఉప్పొంగించారు. మరికొందరు ఆనాడు సమాజంలో ఉన్న సతీసహమగమనాన్ని బహు భార్యత్వాన్ని ఎదిరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి రాజా రామ్మోహన్ రాయ్ గా ప్రజల గుండెల్లో...