పోస్ట్‌లు

అక్టోబర్ 23, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

తస్మాత్! ఆరోగ్యం జాగ్రత్త

ప్రతి జీవికి నిత్యవసరాలలో ముఖ్యమైనది ఆహారం. బ్రతుకు బండి సాగాలంటే శక్తి కావాలి. మనిషికి ఆ శక్తి తినే ఆహారం నుంచి పుడుతుంది. మనిషి శరీరము ఒక నడిచే కారు లాంటిది. కారు నడవాలంటే పెట్రోల్ పోయాలి. అలాగే మనిషి శరీరానికి కూడా సమతుల ఆహారం అందించాలి. విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు — ఇవన్నీ శరీరానికి కావలసిన రక్షణను, శక్తిని ఇస్తాయి. శాఖాహారులు బియ్యం, ఆకులు, పండ్లు, కాయలు, గింజలు ఆహారంగా స్వీకరిస్తారు. మాంసాహారులు వీటితో పాటు జంతువుల మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకుంటారు. అయితే తీసుకునే ఆహారాన్ని పరిమితంగా తినడం, పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థం తినడం, వేళకు తినడం వంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిలో ఏ నియమం తప్పినా ఆహారం విషతుల్యమవుతుంది. అది మన శరీరానికి మంచి బదులు చెడు చేస్తుంది. పూర్వకాలంలో తొలి రోజున వండిన ఆహార పదార్థాలను ముట్టుకునేవారు కాదు. అది మడి కాదు, ఆచారం కాదు — ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్త. ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లలో వండిన ఆహార పదార్థాలు దాచుకుని రెండు మూడు రోజుల వరకు ఉంచి తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదో వారికే వదిలేయాలి....

జీవితం

 నీటి బుడగ జీవితం. ఎప్పుడు చితికి పోతుందో ఎవరికి తెలుసు. చావు బతుకుల మధ్య కాలమే జీవితం. పగలు రాత్రి ప్రతిమనిషికీ సమానం. సగ భాగం అంతా తిండి నిద్రకి సరిపోతుంది. బాల్యమంతా నీ జీవితం గురించి నీకు అవగాహన ఉండదు. యవ్వనం నుండి నీ అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఇంకో జీవి కూడా నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ జీవి కూడా జీవితం అంటే అంత వరకు తెలియదు. అమ్మా,నాన్న ,పుస్తకాలు ,కాలేజీ, హాస్టల్ జీవితం బాధ్యతలు లేని బతుకు ఇంతవరకు అనుభవించిన తీపి గుర్తులు. ఇంకొకరి తో జీవితం ఒక ఫ్రేమ్ లో ఉంటుంది.  ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోవడం. ఒకరి కోసం ఒకరు బతకడం. తన ఇష్టాలను త్యాగం చేయడం కూడా తప్పదు. సర్దుబాటే జీవితం. సరే జీవితంలోకి అడుగు పెట్టాం. జీవిత సాఫల్యo ఏమిటి. డబ్బు పిల్లలు వృద్ధాప్యం ఈ మూడింటి తోటి మనకు చిక్కులు వస్తాయి. మన ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలి.  డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. చేసిన పనికి ప్రతిఫలమే జీతం. జీతం తో జీవితం ఆనందంగా గడపడమే . అప్పనంగా వచ్చేది లంచం. లంచం పంచ రంగుల జీవితం చూపిస్తుంది. కానీ దైవం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. పరుల సొమ్ము ఆశించక పోవడమే పరమార్ధం. గౌతమ్ ...

ఆడపిల్ల

అమ్మను మించిన అమ్మ యుగానికో రాక్షసుడిని చంపడానికి అవతారం ఎత్తినా , ఇంకా నరరూప రాక్షసులు కళ్లు నిన్ను వెతుకుతూనే ఉన్నాయి. ఎంతమంది సజ్జనారులు వలయాలు గీసినా, అవి నీకు రక్షిత వలయాలు మాత్రం కాలేకపోయాయి. అమ్మ రక్షరేకులు కట్టించిన నీ మీద రాక్షస దృష్టి పడుతూనే ఉంది.నువ్వు జంతువు కాదు, జూలో ఉంచలేను. నువ్వు లక్ష్మణరేఖలు దాటకపోయినా, రాక్షసులే నీ తలుపు తడుతూనే ఉంటే — కాపాడవలసిన కాళిక కళ్లు తెరవకపోతే — నీకు ఎవరు రక్ష? ప్రభుత్వ చట్టాలు అందరికీ చుట్టాలే. సమాజమే నీకు శత్రువు. నీ మానాన నిన్ను బ్రతకనివ్వడం లేదు. సైన్స్, టెక్నాలజీ రెండూ నీకు శత్రువులే. గర్భస్థ పిండంలోనే నీ పీక పిసికితున్నారు. సృష్టి ఆపే శక్తి ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవరికీ లేదు. అమ్మ నాన్న నిత్యం జాగ్రత్తల దండకం చదువుతూ, డ్రెస్సింగ్ రిహార్సల్ వందసార్లు చేస్తూ, బడికి పంపుతూ — నువ్వు తిరిగి వచ్చేవరకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ — నిత్యం దేవుడిని ప్రార్థిస్తూ భయంగా బ్రతుకుతున్నారు. చదువు కంప్లీట్ చేయించి, క్యాంపస్ నుండి ఆఫీస్ మెట్లెక్కించి, ఒక అయ్య చేతిలో పెట్టి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. పెళ్లి లాటరీ లాంటిది. ఏ నంబరు లక్కీ నంబరో ముందే తెలి...

బొమ్మ చెప్పిన కథ

చిత్రం
గతం తలుచుకుంటే నాకెంతో గర్వం.భవిష్యత్తు నాకు ఆశాజనకం.వర్తమానం మీకు కళ్ళ ముందు కనిపించే చిత్రం. ఇది నా బ్రతుకు బతుకు అంతా నిత్యం సమరాలే పంచకల్యాణిలా పరుగులే. రాజు బంటు తేడాయే తెలియదు. దేవుడు దేవత దెయ్యం అందరూ నా యజమానులే కొండలెక్కాను గుట్టల మీద నడిచాను .నదులు దాటాను నడక తక్కువే. పరుగు కోరుకునే వారు ఎక్కువ.నా కళ్ళెం పట్టిన రాజుగారి రాచరికం చరిత్రలో కలిసిపోయింది.రాజు లేకపోతే బంటు కూడా మాయం. కళ్లకు గంతలు కట్టుకుని బండికి సేవకుడి ని అయిపోయా.మారిన కాలం నాలుగు చక్రాల బండి తో నా పొట్ట కొట్టేస్తే నేను సముద్రం ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడిపోయా.ఇసుకలో నేను నడక నేర్చుకుంటున్నా. ఇప్పుడు నా కళ్లెం పట్టుకున్న వారికి అది గుర్రపు స్వారీ.సెల్ఫీలు చూసుకుని మురిసిపోతున్నారు.సరదాలు తీర్చుకుంటున్నారు.  ఆ ఉప్పు గాలిలో ఆ ఇసుకలో ఆ కెరటాల హోరులో నన్ను పెంచి పోషిస్తున్నారు. ఒకప్పుడు నేను పంచ కళ్యాణిని ,రాజు గారితో పాటు రాజభోగాలు అనుభవించిన దాన్ని ఇప్పుడు నేను బక్క చిక్కిన గుర్రం @ సముద్రం. గుడ్డ ముక్కల గుర్రాన్ని కేరాఫ్ నచ్చిన వారి ఇంట్లో గూట్లో బొమ్మని. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో కనబడే తారని మెరి...

చిలక జోస్యం

మన భారతీయ సాంప్రదాయంలో జ్యోతిష్యం, శకునాలు, జంతువుల ప్రవర్తన వంటి అంశాలకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో “చిలక జోస్యం” అనేది ఒక విశిష్టమైన, మనసుకు ఆసక్తిని కలిగించే సంప్రదాయం.చిలక నోట జోస్యం వినడం అనేది ఒక విశ్వాసం మాత్రమే కాదు — అది మన మనోవ్యవహారాలకు అద్దం పట్టే ఒక సాంస్కృతిక ఆచారం  చిలక జోస్యం ఆచారం దక్షిణ భారతదేశంలో — ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో విస్తరించింది. చిలకను "శకునపక్షి"గా పరిగణిస్తారు. పురాణాల్లో శుక మహర్షి అనే ఋషి “భాగవతం”ను పరమాత్ముడి ప్రసాదంగా స్వీకరించినట్లు చెప్పబడుతుంది. అందుకే చిలకను "శుక పక్షి" అని గౌరవిస్తారు. కాలక్రమంలో, చిలక మనిషి భవిష్యత్తును చెప్పగలదనే విశ్వాసం ఏర్పడి, జోస్యకారులు చిలకలతో జోస్య పద్ధతిని రూపొందించారు. చిలక చేత ఎంచబడే కార్డు లేదా పత్రం మన భవిష్యత్తును సూచిస్తుందని నమ్మకం ఏర్పడింది  చిలక జోస్యం సాధారణంగా ఇలా జరుగుతుంది — ఒక చిన్న గేజ్‌లో చిలకను పెట్టి, జోస్యకారుడు తన దగ్గర రామాయణం, మహాభారతం, భాగవతం లేదా దేవతల చిత్రాలతో కూడిన కార్డులు ఉంచుతాడు. జోస్యకారుడు కస్టమర్ పేరు, గోత్రం, రాశి వంటి వివరాలు అడిగి, ఆ చ...