పోస్ట్‌లు

ఏప్రిల్ 24, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మందు పొట్లం

 మందు పొట్లం మా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఈనాటికి మమ్మల్ని నవ్విస్తూ ఉంటుంది. మాది కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని పల్లిపాలెం గ్రామం . మా చింతాతయ్య గారు మా నాన్నగారు కూడా ఆయుర్వేద వైద్యం చేసేవారు. మా ఊర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు మిగతా సామాజిక వర్గాలు కూడా ఉండేవి. ప్రధానమైన కులం రెడ్డి కులం .  అయితే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ఆ రోజుల్లో ఒక ముప్పై ఐదు సంవత్సరంలో వయసు ఉండే ఒక  వ్యక్తి ఏదో అనారోగ్యం కోసం ఆయుర్వేదం మందు కోసం మా తాతయ్య గారి దగ్గరికి వచ్చాడు. రోగి లక్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత   ఆయుర్వేద మందుని కాగితంతో పొట్లాలు కింద కట్టి రోజుకు ఒక పొట్లం  తేనెతో వేసుకో వారం రోజుల తర్వాత మళ్లీ కనబడని చెప్పాడు తాతయ్య. నాలుగు రోజుల తర్వాత ఆ వ్యక్తి పరుగు పరుగున తాత గారి దగ్గరకు వచ్చి ఆ ఆ పొట్లం వేసుకున్నప్పటి నుంచి నాకు కడుపు నొప్పి మొదలైంది అండి అంటూ చెప్పుకొచ్చాడు. తాతయ్య  "ఆ మందుకి కడుపునొప్పి రాద య్య!  మరి నువ్వు ఆ మందు ఎలా వేసుకున్నావు? అని అడిగాడు.   ఆ పొట్లం తేనె తోటి వేసుకున్నానండి అన్నాడు. అప్పుడు అసలు పరిస్థితి ...

ఏలూరు జిల్లా యాత్ర

ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండే ఏలూరు 2022 సంవత్సరం నుంచి జిల్లాగా మార్పు  చెందింది .  కొల్లేరు సరస్సు:   ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాల్లో కొల్లేరు  సరస్సు ఒకటి. ఇది కొంత భాగం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వ్యాపించి ఉంది. ఇక్కడ రకరకాల చేపలు లభ్యమవుతాయి. అంతేకాకుండా అనేక పక్షులు విదేశాల నుండి సైతం ఇక్కడికి వలస వస్తాయి.  ద్వారకాతిరుమల: దీనినే చిన్న తిరుపతి అంటారు.  కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ద్వారకా కొండపై కొలువై ఉన్నారు. దీనిని చిన్న తిరుపతి అంటారు. ఇక్కడ స్వామి అత్యంత మహిమాన్వితుడు.  పట్టిసీమ: గోదావరి నది మధ్యభాగంలో ఉండే వీరభద్ర స్వామి దేవాలయం అత్యంత మనోహరంగా ఉంటుంది . మహాశివరాత్రి  ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

చిలిపి పనులు

 చిలిపి పనులు అర్ధరాత్రి 12 గంటలు అయింది.  వీధి తలుపు ఎవరో కొడుతుండడంతో గాఢ నిద్రలో ఉన్న గోవిందరావుకి మెలకువ వచ్చింది. ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ అనుకుంటూ తలుపు సందులో నుంచి బయటకు తొంగి చూసాడు. వీధిలో ఒక పదిమంది యువకులు  నిలబడి ఉన్నారు. "ఎవరండీ ఏం కావాలి అంటూ ప్రశ్నించాడు గోవిందరావు . 'చలపతి రావు గారు పంపించారండి ఎవరికో పురుడు వచ్చిందిట. ఇంగువ తీసుకురమ్మని పంపించారంటూ చెప్పారా యువకులు. వస్తున్నాను ఉండండి. కొట్టు తీస్తాను అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు గదిలోకి వచ్చి లైట్ వేసి డబ్బా గురించి వెతకడం మొదలెట్టాడు గోవిందరావు.  గోవిందరావు అంటే ఆ ఊర్లో ఉన్న ఏకైక కోమటి .కిరాణా కొట్టు వ్యాపారం అక్కడ లేని సరుకుంటూ ఉండదు. కానీ అన్ని హై రేట్లు. ఏ వేళ లేపిన సరుకు అప్పిస్తాడు. లేదు లేదంటూనే కిరాణా కొట్టు మీద ఆ ఊర్లో పది ఎకరాలు భూమి సంపాదించాడు. దానికి తోడు తాకట్టువాకట్టు వ్యాపారం కూడా ఉంది. అంతా వ్యవసాయదారులు. ఇంకేముంది వ్యవసాయం పనులు కోసం అప్పు తీసుకుని పంటలు రాగానే తీర్చేస్తుంటారు. పైగా ధాన్యo కొనుగోలు కూడా ఆయనే. మా ఊరుకి బ్యాంక్ లాంటివాడని చెప్పొచ్చు.  ఆయుర్వేదిక్ డా...

ఆ ఊరు

ఆ ఊరు. "  ఊరు ఎంత మారిపోయింది. శుభ్రమైన తారు రోడ్లు వేశారు. ఒకప్పుడుపూరి పాకలు బంగాళా పెంకుల ఇల్లులు ఉండే వీధులన్నీ అందాలభవంతులతో మెరిసిపోతున్నాయి. ఒకప్పుడు ఆ ఊరికిరావాలంటే గుర్రo బండి లేదంటే ఎడ్ల బండి తప్ప రిక్షా కూడా వచ్చేది కాదు. ప్రతి వేసవి కాలంలో అమ్మ నేను తమ్ముళ్లుఎంతో కష్టపడి ఆ ఊరు వచ్చేవాళ్ళం. వేసవి కాలంలో ఎందుకు వచ్చేవాళ్ళం? అది మా సొంత ఊరు కాదు. మా అమ్మ పుట్టింటి వారి ఊరు. నేను పుట్టిన ఊరు. నా జన్మభూమి అన్నమాట. సెలవులు ఇవ్వగానే తాతయ్య నుండి ఆహ్వానం అందేది. నేను అమ్మ నా నలుగురు తమ్ముళ్లు అందరం కలిసి హైదరాబాదు నుండి వచ్చేవాళ్ళo. పాపం తాతయ్య ఊర్లో కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ సొంత ఇల్లు , ఆవులు గేదెలతో పాల వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. అంత పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు. కానిపాపం ఎనిమిది మంది సంతానం. అందరినీ డిగ్రీ వరకు చదివించి పెళ్లిళ్లు పేరంటాలు చేశాడు. ఇక వేసవికాలం వచ్చిందంటే కూతుళ్లు కొడుకులుమనవల తోటి ఆ ఇల్లు కళకళలాడిపోయేది.  ఆ ఊర్లో ఇంచుమించుగా పెద్ద ఇల్లు మా తాత గారిది అని చెప్పొచ్చు. ఇంటి ముందు పెద్ద పందిరి సంవత్సరం పొడుగునా ఉండేది.గుమ్మ0ల్లోకి అడుగు పెడ...

అరిటాకు భోజనం

అరిటాకు భోజనం . విందు భోజనానికి ముఖ్య అతిథి అరిటాకు.ఆకుపచ్చటి అరిటాకు ఆంధ్రుల భోజనానికి అది ట్రేడ్ మార్క్. ఆకాశంలోని హరివిల్లు వలె మెరిసిపోతుంది  అరిటాకులోని ఆతిథ్యం. ఆకులోని పదార్థాలు చూడగానే ఆత్మా రాముడికి రెక్కలు వస్తాయి. ఆకుపచ్చటి అరిటాకులో కుడివైపు చివర పసుపు పచ్చటి ముద్దపప్పు మెరిసిపోతూ ఉంటుంది. దాని పక్కనే చెరువులోని కలువ పువ్వుల మెరిసిపోతూ నూనెలో తేలియాడుతున్న ఆవకాయ. ఇంకా కోనసీమ భోజనం అంటే పనసపొట్టు లేకుండా ఎలా ఉంటుంది. మంచి సువాసనలు వెదజల్లుతూ ఆకులో అందంగా కుదురుగా ఉంటుంది . మాకు విందు భోజనంలో కంద బచ్చలి తప్పనిసరి అది లేకపోతే విందు ఏమిటి నా బొంద అంటుంది ఓ ఇల్లాలు.  కూరలు దాటికి ముందుకు చెయ్యి చాపితే  మచ్చు కోసం వేసిన దప్పలం ,దాని పక్కనే తెల్లగా మెరిసిపోతూ అప్పడం, బాగా వేగిపోయిన గుమ్మిడి వడియం అలా ఎడం పక్కకి ప్రయాణం సాగిస్తే పండు వెన్నెల లాంటి అన్నం, అన్నం దాటుకుని చేయి చాపితే పులిహార పక్కనే పూర్ణం బూర్లు ఇవన్నీ ఆకుని ఆక్రమించుకుని మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయి .  అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆంధ్రుల అభిమాని గోంగూర పచ్చడి అడవులో  దున్నపోతులా మెరిసి...

వీలునామా

వీలునామా  " నాన్న ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి ఇది మీ తాత ముద్ద అంటూ కంచంలోని పెరుగన్నం ముద్ద ని రాఘవయ్య గారి  నోటికి అందించాడు రాజేష్. అన్నం ఇంక తిననని తల అటు ఇటు తిప్పేస్తూ పక్కకు తిరిగి పడుకున్నాడు రాఘవయ్య గారు. ఇదిగో ఇది మీ నాన్న ముద్ద ఇది తినకపోతే మీ నాన్నకు కోపం వస్తుంది ఇది కూడా తినంటూ బలవంతంగా రాఘవయ్య గారినోట్లో పెట్టాడు. రాఘవయ్య గారు కోపంగా కొడుకు రాజేష్వై  పు చూశాడు . నువ్వు రాత్రి ఏమి తినడం లేదు నీకు ఆకలేస్తుందో లేదో నాకు తెలియదు నీరసం వస్తుందని నాకు భయం.   మరి అమ్మంటే నీకు ఇష్టం కదా ఇది అమ్మ ముద్ద  చూడు మిఠాయి నంచి పెడతాను తిను అంటూ పక్కనే  డబ్బాలో ఉన్న మిఠాయి అన్నoముద్దతో కలిపి పెట్టాడు. రాఘవయ్య గారు గబగబా నోరు తెరిచి ఆ ముద్ద తినేసారు.  రాఘవయ్య గారికి స్వీట్ అంటే ఇష్టం. భార్య అంటే  అమితమైన ప్రేమ. మావయ్య గారికి స్వీట్ పెట్టకండి షుగర్ పెరిగిపోతుంది అంటూ వంటింట్లోంచి భార్య శాంత గట్టిగా కేకేసింది. షుగర్ తగ్గించడమే కదా రోజు నా పని దాని సంగతి  నేను చూసుకుంటాలే అంటూ డాక్టర్ రాజేషు భార్యకు సమాధానం చెప్పి రాఘవయ్య గారి మూతి తుడ...

రిటైర్మెంట్ జీవితం

రిటైర్మెంట్ జీవితం. ఇటువంటివి బయటికి తెలిసిస్తే నలుగురిలోను తలెత్తుకొని తిరగలేము ఆడపిల్లలు కలవాళ్ళం. ఈ వయసులో ఆ బుద్ధులు ఏంటి ?అంటూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చిన అత్తగారు వైపు తిరిగి పెద్ద కోడలు శాంత గట్టిగా అరుస్తోంది. నానమ్మ నువ్వేనా చెప్పు ఇది తప్ప కాదా !పెద్దవాళ్ళు పుస్తకం చదువుకో వాలి లేదంటే టీవీ చూడాలి. ఆస్తమాను ఆ మొబైల్ లో చాటింగ్ ఏమిటి నేను చూసాను కాబట్టి సరిపోయింది. నాన్న చూస్తే ఇంకా ఏమైనా ఉందా ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అంటూ పెద్ద మనవడు రఘు అచ్యుత రామయ్య గారి భార్య కామేశ్వరమ్మ గారితో చెపుతున్నాడు. నన్ను స్కూల్లో ఏడిపిస్తారు నానమ్మ అందరూ వేలెత్తి చూపిస్తారు తాతయ్య చేస్తున్న పనికి ఇప్పుడు మనవరాలు రమ్య ఒకటే గోల ఏమైందిరా అందరూ ఒకటే అలా గొడవ పెడుతున్నారు విషయం తెలియకుండా నా మీద అరిస్తే ఏమిటి ఉపయోగం. విషయం చెప్పండి నేను పరిష్కారం ఆలోచిస్తాను అంటూ చెప్తున్న కామేశ్వరమ్మ గారి మాటలు విని మనవడు రఘు అచ్యుతరామయ్యగారి రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ పట్టుకుని వచ్చి వాట్సప్ ఓపెన్ చేసి వాట్సప్ సందేశాలు చదవడం ప్రారంభించాడు. గుడ్ మార్నింగ్ తో ప్రారంభ మయ్యాయి సందేశాలు. ఇలాగా ఉదయం ప్రారంభమైన సందే...

ఆఖరి ఉత్తరం

ఆఖరి ఉత్తరం "ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది.  ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది. పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇ ళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఇక మిగిలింది లంక అంత కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాధుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.  కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు! . అమ్మ వెళ్లి వస్తాo! అంటూ పిల్లలు వెళ్లిపోయారు . అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు.  ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి. ఇంతలో" పో...

పశ్చిమగోదావరి జిల్లా విహారయాత్ర

పశ్చిమగోదావరి జిల్లా విహారయాత్ర  ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాని కేంద్రం భీమవరం. ఈ జిల్లాకు తూర్పున కోనసీమ, పడమరన ఏలూరు జిల్లా, కృష్ణాజిల్లా దక్షిణ దిక్కులో బంగాళాఖాతం, ఉత్తరాన ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి.  కొల్లేరు సరస్సు. : ఈ జిల్లాలో ప్రధానంగా చూడవలసిన వాటిలో కొల్లేరు సరస్సు ఒకటి. ఎన్నో రకాల చేపలు ఇక్కడ లభ్యమవుతాయి . రకరకాల పక్షులు విదేశాల నుండి సైతం విచిత్రంగా ఇక్కడికి వలసకు వస్తాయి. చూడడానికి ఆనందకరంగా ఉంటుంది.  పాలకొల్లు: క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి. పంచారామ క్షేత్రంలో ఒకటి.  భీమవరం: మావుళ్ళమ్మ దేవస్థానం. అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు. ఈ ఊర్లో సంక్రాంతికి పండుగకు జరిగే కోడిపందాలు చూడ్డానికి చాలామంది వస్తుంటారు. అలాగే సోమేశ్వర జనార్ధన స్వామి గుడి కూడా పంచారామ క్షేత్రంలో ఒకటి  పెనుగొండ: వాసవి కన్యక  పరమేశ్వరి గుడి చూడదగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఉండే గాలిగోపురo ఏడంతస్తులు ఉంటుంది.  పేరుపాలెం బీచ్: పశ్చిమగోదావరి జిల్లాలో ఉండే నరసాపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరుపాలెం  సముద్ర తీర ప్రాంతం విహారయాత్రకు అన...

ఎందుకు ఈ శాపం

ఎందుకు ఈ శాపం మనం పుట్టినప్పుడే మనతో పాటు మన మరణం కూడా పుడుతుందిట. మరణం మన పక్కనే ఉంటుంది ఎప్పుడు. అది ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందనే విషయం ఎవరికీ తెలియదు.  శత్రువులా పొంచి ఉంటుంది. సమయం చూసి కాటేస్తుంది. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు. దానికి వయసుతో సంబంధం లేదు ఊరు వాడతో అసలు సంబంధం లేదు. సమయం వచ్చిందంటే క్షణం కూడా ఆలస్యం చేయదు అది మరణ రహస్యం.  ఏదో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఒక తీయని అనుభూతిని పొందడానికి విహారయాత్రలకు వెళ్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు.  మంచు కొండలకు వెళ్తారు. లోయను చూసి ఆనంద పడుతుంటారు. అయితే ఆ విహారయాత్రే ఆఖరి యాత్ర అవుతుంది అని ఎవరికి తెలుస్తుంది.  ఏదో ఒక బస్సు ప్రమాదమో, లోయలో కాలుజారి పడటం జరిగితే  లేదంటే ఏదో ఒక  అనారోగ్యం వలన మరణించారంటే అర్థం ఉంది.  ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న మంచుకొండల్లో  అందమైన ప్రకృతి శబ్దాలు కాకుండా తుపాకీ గుళ్ళ మో తలు వినిపిస్తాయని ఎవరనుకుంటారు.  అనుకుంటే ఆగిపోతారు కానీ ముందుకు వెళ్లారు కదా.!   అమాయకులైన విహారయాత్రికులు అన్యాయంగా బలైపోయారు.అసలు వ్యక్తిగతంగా శత్రువులు ఈ రకమైన పనిచేశారు అనుకుం...