పోస్ట్‌లు

అక్టోబర్ 28, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రసాదం

"అయ్యా, నేను రేపటి నుంచి ఐదు రోజులపాటు మన రాములోరి గుడి దగ్గరే ఉంటాను" అంటూ తండ్రితో చెప్పాడు పది సంవత్సరముల వయసున్న రాముడు. "ఏరా! ఎందుకు? నువ్వు గుడి దగ్గర కూర్చుంటే మనకు బువ్వ ఎవరు పెడతారు?" అంటూ ప్రశ్నించాడు తండ్రి పిచ్చయ్య. "మర్చిపోయావా ఏమిటి నాన్నా? మన రాములు వారి గుడిలో ఎల్లుండి శ్రీరామనవమి కదా! సీతారాముల కళ్యాణం చేస్తారుగా. ఆ రోజు నుంచి ఐదు రోజులు పాటు ఊరందరికీ సంతర్పణ చేస్తారు కదా. ప్రతి ఏటా చేస్తారుగా. మర్చిపోయావా ఏమిటి?" అంటూ చెప్పుకొచ్చాడు రాము. "మరి ఆ సందర్భంగా మనకి ఆకు వేసి భోజనం పెడతారా ఏమిటి?" అంటూ సందేహం వెలిబుచ్చాడు పిచ్చయ్య. "అవును నాన్న! ఇక్కడ కులమతభేదం లేకుండా వచ్చిన వాడిని తిరిగి పొమ్మనకుండా అందరికీ చక్కగా భోజనాలు పెడతారు. ప్రతి ఏట జరుగుతోంది కదా. అయినా నువ్వు ఎప్పుడూ చూడలేదా? నేనే నీకు భోజనం అడిగి తెచ్చి పెడతాను ప్రతి ఏడాదిలాగే," అంటూ తుర్రుమని వీధిలోకి పారిపోయాడు రాము. --- రాము పిచ్చయ్యకి ఒక్కగానొక్క కొడుకు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం రిక్షా లాగి, పక్షవాతం వచ్చి ఈ మధ్యనే మంచం మీద పడ్డాడు పిచ్చయ్య. రాముని చదివించే స్తో...