పోస్ట్‌లు

మార్చి 27, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అంతరంగ రంగస్థలం

అంతరంగ రంగస్థలం. అది ఒక రంగస్థలం. కాదు కాదు పుణ్యస్థలం. పుణ్యక్షేత్రం సందర్శించాలంటే రాసిపెట్టి ఉండాలి. ఈ రంగస్థలం ఎక్కాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ కళమీద విపరీతమైన మక్కువ తో ఇన్నాళ్లు మన మధ్య ఉన్నవాళ్లే ఒక్కసారిగా ఆ రంగస్థలం మీద కాలు పెట్టిన వెంటనే నటులు అయిపోతారు. పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ నాటకం చూస్తున్నంత సేపు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లి పోతారు.  రంగస్థలం మీద ప్రేక్షకుడికి ఎదురుగుండా నిలబడి తన నటన ప్రదర్శించాలి. ఇది చాలా కష్టమైన పని. రకరకాల పాత్రలు రకరకాల వేషధారణలు ధరించాలి . గొంతెత్తి శ్రావ్యంగా రాగయుక్తంగా పద్యాలు చదివి వినిపించాలి. అవసరమైన చోట నృత్యాలు చేయాలి. భారీ సంభాషణలు తో పాత్రను రక్తి కట్టించాలి. నిజంగా నటుల నటన తెలియాలంటే నాటకాలోనే తెలుస్తుంది. అయితే తెరదించిన తర్వాత ఆ నటులు మామూలు మనుషులు అయిపోతారు. నాటకానికి జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది అంటారు. కానీ మన నూరేళ్ళ జీవితంలో జీవిత చరమాంకం వరకు నటిస్తూనే ఉంటాం. పాత్రలలో జీవిస్తూనే ఉంటాం. మనం కూడా నటులమే. మానవ జీవితంలో ఉన్న వివిధ దశలలో మనల్ని ఆడించే ఆ పైవాడు మన దర్శకుడు . ఈ దర్శకుడు మనకి కనపడడు. కా...

సహాయం

సహాయం జీవితం క్షణ  భంగురం  అంటారు. ఒక్క క్షణం కాలం నిడివి గల జీవిత సంఘటనలు కొన్ని మనకి కనువిప్పు కలిగిస్తాయి. మనిషి గా ఉండవలసిన బాధ్యత గుర్తు చేస్తాయి. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కానీ స్పందించే హృదయాలు కొన్నే ఉంటాయి. అవసరమైనప్పుడు ఆదుకోవడం అనేది అందరికీ  చేతకాదు. ఎంతసేపు డబ్బు చుట్టూ పరిగెత్తే మనిషి తన చుట్టుపక్కల చూడడం మానేశాడు.  చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అని   సిరివెన్నెల వారు అమృతమైన మాటలు చెప్పిన బాలు గారు గొంతులో ఆ పాట ఆనందంగా విని అర్థం మరుగున పడేసారు జనం ఆ పాట సంగతి అలా ఉంచి మనం కథలోకి వెళ్ళిపోదాం. అవి కరోనా దేశాన్ని కుదిపేస్తున్న రోజులు. రోడ్డుమీద ఎక్కడ జనసంచారం కనబడే వారు కాదు కానీ ఆసుపత్రిలోనూ  మందుల షాపుల దగ్గర బాగా రద్దీగా ఉండేది. అన్ని మందుల షాపుల్లాగా ఆ మందుల షాపు దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మందుల కోసం వచ్చినవాళ్లలో రకరకాల వయసులో వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 10 సంవత్సరాల పాప చేతిలో బ్యాగు, మందుల చీటీతో వచ్చి నిలబడి ఉంది ఇంతలో ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ ఒక మందుల చీటీ మందుల షాపు యజమాని చేతులో పెట్టాడు. ఆ ముసలాయనకి ...

సీత జీవితం

సీత జీవితం  ఇల్లంతా పెళ్లి సందడితో హడావిడిగా ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు ఆకాశమంత పందిరి హాలంతా డెకరేషన్ చాలా అందంగా ఉంది. అక్కడ హల్దీ కార్యక్రమానికి డ్యాన్సులతో బంధువులంతా బిజీగా ఉన్నారు. పెళ్లికూతురు సీతాదేవి గారిని రెండు చేతులుండా గోరింటాకు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు గోరింటాకు పెట్టించుకునే హడావుడిలో కొందరు డాన్స్ లు హడావిడిలో హాలు అంతా ఆనందంగా ఉంది.  పెళ్లి పెద్దలు ఇద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వథూవరుల వయసు ఎంత ఉంటుందో ఊహించగలరా . ఇద్దరు వృద్ధ దంపతులు . ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు. ఇద్దరు బిడ్డల తల్లి . కడుపున పుట్టిన పిల్లలు తల్లికి పెళ్లి చేయడం మరీ వింతగా ఉంది కదా. వింత కాదండి. ఇంతకీ పెళ్లి వెనుక అసలు కథ ఏమిటి. సీతా దేవి గారు తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. తండ్రి నారాయణ మూర్తి గారు వేద పండితుడు. ఆచార సాంప్రదాయాలకు విలువనిచ్చేవాడు. లేక లేక పుట్టిన ఆడపిల్లని చాలా కట్టుబాట్లుతో పద్ధతిగా పెంచాడు. ఆ ఊర్లో ఉండే ప్రాథమిక విద్య తోటి చదువు ఆపించేసి ఇంటి వద్దనే సంస్కృత పాఠాలు పురాణాలు సంగీతం నేర్పించాడు. సీతా దేవి గారు కూడా చాలా...

తలరాత

తలరాత ఉదయం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. జనజీవనం అంతా  అస్తవ్యస్తo అయిపోయింది. రోడ్డుమీద ఒకరు కూడా  తిరగటం లేదు. ఉన్నట్టుండి వీధి గుమ్మo లోనుంచి అమ్మా  ఇంత అన్నం ఉంటే పెట్టండి చలిగా ఉంది ఒక పాత బట్ట   ఇవ్వండి అంటూ దీనంగా ఒక వృద్ధురాలి అరుపువినిపించింది.  ఇంత వర్షంలో ఎవరు అబ్బా అనుకుంటూ సీతమ్మ గారు వీధి  గుమ్మంలోకి తొంగి చూసారు. ఒక చేతిలో కర్ర మరొక  చేతిలోగిన్నె పట్టుకుని చిరిగిపోయిన బట్టలతో ఒక వృద్ధురాలు వణికిపోతూ గుమ్మంలో నిలబడి ఉంది. ఈవిడ ఎవరో  ఎరుగున్న మనిషి లాగే ఉంది. ఎక్కడో చూసినట్టుగా ఉంది అని  మనసులో అనుకుంటూసీతమ్మ గారు అమ్మ మీరు వెనక వేపుకు పాకలోకి రండి. బట్టలు మార్చుకుని అన్నం తిందురు గాని వర్షం లో ఎలా తింటారు. పైగా బాగా తడిసిపోయి ఉన్నారు అంటూ పెట్టలోంచి పాత చీర జాకెట్లు తీసి ఆ  వృద్ధురాలికి ఇచ్చింది. ఆ వృద్ధురాలు బట్టలు మార్చుకునేలాగా గిన్నెలో వేడి వేడి అన్నం పప్పు కూర మజ్జిగ తో భోజనం  అరిటాకు వేసి వడ్డించింది. పాపం ఎన్ని రోజులైందో ఆ ముసలిది  అన్నం తిని ఆకులో అన్నం అంతా ఖాళీ చేసేసి అమ్మా ప్రాణం  ...

ఆఖరి మాట

ఆఖరి మాట  ప్రపంచంలో ఏ ప్రాణికోటికి లేని అత్యంత అమూల్యమైన వరం మానవ జన్మకి దేవుడిచ్చాడు. తన మనసులోని భావాన్ని ఇతరులకు తెలియజేయడానికి అవకాశం కల్పించాడు. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి మాట అనే ఆయుధాన్ని ఇచ్చాడు.  మానవ శరీరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నోరు అనే అవయవం ద్వారా వచ్చే మాటకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మాట ఇద్దరు మనుషుల మనసులను కలుపుతుంది. అలాగే బంధాలను విడదీస్తుంది. రోజు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అన్నిటికీ వెనుక బలమైన ఆధారం ఉంటే అది నిజం అంటారు. కాకపోతే అబద్ధమే కదా మరి. మనిషి శాశ్వతం కాదు కానీ మాట మటుకు ఎప్పటికీ గుర్తుంటుంది. రోజు అనేక మందితో అనేక మాటలు మాట్లాడుతుంటాము. అది ఆ వ్యక్తితో అదే ఆఖరి మాటని మనకు తెలీదు. ఆఖరి మాట అనేది ఎప్పుడవుతుంది. ఆ వ్యక్తి ఈ లోకo నుండి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు వారితో ఆఖరిసారిగా మాట్లాడినదే ఆఖరి మాటవుతుంది. కానీ మనకు అది తెలియదు. చుట్టూ ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. కానీ ఒక వ్యక్తి తోటే తన మనసులోని భావాన్ని పంచుకోవడం ఆ సమయంలో ఆ వ్యక్తి మీద ప్రత్యేక అభిమానమే అని చెప్పొచ్చు. అప్పుడే ఏడు సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ వ్యక్తి ఆఖరి ...

అలసిన అరుగులు

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి కానీ మా తరం వారికి అవి మాత్రం హంస తూలికా తల్పాలు.   తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం లో గల మా నాన్న గారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్ర గచ్చు తో చేసిన వసారా ఉంది. సుమారు 70సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతి రావు గారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నాను అంటే ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి తమ తమ రంగాల్లో చేరుకోవడం జరిగి . తొలి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో దాన్ని కొట్టు గది అంటాం పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పిన తాతగారు శ్రీ మధునాపంతుల కామ రాజు గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు పంచాయతీ బోర్డు ఆఫీస్ కి వచ్చి అరుగు మీద కూర్చునే వారు . ఎప్పుడు రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారు కి సంఘ సేవ మీద ఎక్కువ మక్కువ ఉండడం మూలంగా ప్రజల సమస్యల్ని అ...

ఊరి ముచ్చట్లు

ఊరి ముచ్చట్లు  సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత పిల్లలందరూ రాబోయే వేసవికాలం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కైతే పది రోజులు సెలవులు కానీ వేసవికాలం వచ్చిందంటే ఇంకేముంది రెండు మూడు నెలల పాటు పిల్లలకి ఆటవిడుపే. పెద్ద పరీక్షలు అయిపోతే అమ్మమ్మ గారి ఊరికి పరుగులు తీస్తుంటారు.  అసలు రుతువు మారుతోందని మనకి ఎలా తెలుస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులే మనకి రుతువు మారిపోతోందని తెలుస్తుంది.  మహాకవి పోతన గారు భాగవత గ్రంథంలో గ్రీష్మ రుతువు గురించి చెబుతూ పగటి సమయాలు అంతకంతకు పెరుగుతున్నాయని సూర్యుడు ఉత్తర దిక్కు వైపుకు సంచరిస్తున్నాడని ఎండ తీక్షణ రోజురోజుకీ పెరుగుతుందని భూమి నుండి లేచిన దుమ్ము రేణువులు ఆకాశమంతటా వ్యాపించి ఉన్నాయని సెలయేళ్లు కొలనులు ఎండిపోయాయి బాటసారులు చలివేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారని పాములు ఎండలు భరించలేక పొదల్లో చేరిపోతున్నాయని చెట్లు పూలు వాడిపోయాయని అగ్నిదేవుడు అడవులతో ఆడుకుంటున్నాడని అద్భుతమైన వర్ణన చేశారు. అలాంటి వాతావరణంలోని మార్పులతో ఆ ఊరికి అంటే మా స్వగ్రామం కాకినాడ తాలూకా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామoలో కూడా వేసవికాలం అడుగుపెట్టేసింది....

అమ్మ మనస్సు

అమ్మ మనసు అక్షరాభ్యాసం అయిపోయింది కదా! ఎల్లుండి సప్తమి శుక్రవారం ఆరోజు బాగుంది చంటి దాన్ని ఆ రోజు నుంచి స్కూలుకి పంపించు అంటూ తండ్రి చెప్పిన మాటలకు సరేనని చెప్పి ఫోన్ పెట్టేసింది శ్వేత. శుక్రవారం అంటే ఇంక మూడు రోజులే ఉంది. పుస్తకాలు బ్యాగు బూట్లు స్కూల్ యూనిఫారం కొనాలి అంటూ హడావుడి పడిపోతుంది శ్వేత తన కూతురు రమ్యని మొదటిసారిగా స్కూల్లో జాయిన్ చేయడానికి. సాయంత్రం భర్త రాగానే బజారుకెళ్లి ఇవన్నీ కొనుక్కుని రావాలని అనుకుంది.  రమ్య పుట్టి అప్పుడే మూడేళ్లు అయిపోయింది. అప్పుడే స్కూల్ కి వెళ్లే పెద్ద పిల్ల అయిపోయింది. ఇన్నాళ్లు చంకెక్కి కూర్చుని శ్వేత నీ ఏ పని చేసుకోనివ్వకుండా మారం చేసే రమ్య స్కూల్ కి వెళ్ళిపోతుంది అనుకుంటే శ్వేతకి ఒక్కసారి ఎందుకో బెంగగా అనిపించింది. పుట్టిన దగ్గరనుంచి ఒక్కరోజు కూడా అమ్మ చంక వదలని రమ్య ఇప్పుడు స్కూల్ కి వెళ్ళిపోతుందంటే ఏదోలా ఉంది. శ్వేత ఎప్పుడు నిద్రలేస్తే వెంటనే లేచిపోయి అప్పటినుంచి అమ్మ కూడా తిరుగుతూ అది కావాలని ఇది కావాలని అడుగుతూ అల్లరి చేస్తూ ముద్దు ముద్దు మాటలు చెబుతూ దొరికినవన్నీ పాడుచేస్తూ దెబ్బలు తగిలించుకుంటూ క్షణం కూడా తల్లికి ఖాళీ లేకుండా ప...

తెల్ల జుట్టు

తెల్ల జుట్టు " ఏవండీ మీకు తెల్ల జుట్టు వచ్చేస్తోంది. అప్పుడే మీరు ముసలోళ్ళు అయిపోతున్నారు. నలభై ఐదు ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు రావడం ఏమిటి నాకు ఏదోలా ఉంది అంటూ చెప్పిన భార్య సుమతి మాటలకు వెనుక తిరిగి చూసాడు శంకర్ అద్దం ముందు తల దువ్వుకుంటూ. వయస్సు పెరుగు తోంది కదా తెల్ల జుట్టు రాక నల్ల జుట్టు వస్తుంది ఏమిటి? అయినా ఈ వయసుకి ఈ జుట్టు అందం అంటూ శంకర్ సమాధానం ఇచ్చాడు.  "లేదండి దీనికి ఏదో మార్గం యూట్యూబ్లో చూస్తా. ఈమధ్య తెల్ల జుట్టుకి చాలామంది చిట్కాలు పెడుతున్నారు. ఎన్నో ఆయిల్స్ కూడా వచ్చే యి. ఒక ప్రముఖ డాక్టర్ గారు కూడా ఒక చిట్కా చెప్పారు. "లేదు అవి ఏమీ నాకు ఇష్టం లేదు అవన్నీ సరిగా పని చేయవు. పైగా ఎలర్జీలు కూడా లేనిపోని పైగా బోల్డు ఖర్చు కూడా. ఒకసారి రంగు వేసే వదిలేస్తే కుదరదు. ప్రతి 15 రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒకసారి వేసుకుంటూ ఉండాలి. నాకు ఇలాగే బాగుంటుంది అన్న భర్త శంకర్ మాటలు వినిపించుకోకుండా "లేదండి దీనికి ఏదో ఉపాయం ఆలోచిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది సుమతి. మన నిత్యజీవితంలో ఉన్న సమస్యలు చాలక చాలామందికి తెల్ల జుట్టు సమస్య పట్టుకుంది. పాపం కొం...