పోస్ట్‌లు

అక్టోబర్ 27, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

పట్టుదల

పట్టుదల " అమ్మాా నేను వచ్చే వారమే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి! అంటూ చేతిలో కాగితం పట్టుకుని చక్రాల కుర్చీ తోసుకుంటూ వచ్చి ఆ చల్లటి వార్త చెప్పిన సుధాకర్ ని తల్లి పార్వతమ్మ చేతిలో ఉన్న పని వదిలేసి వచ్చి గట్టిగా కౌగిలించుకునికన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్ళకి నీ కష్టం తీరుతో oది రా చాలా సంతోషo అంటూ ఎక్కడ జాయిన్ అవ్వాలి రా అని అడిగింది. హైదరాబాదులో పోస్టింగ్ ఇచ్చారు అంటూ సమాధానం చెప్పాడు సుధాకర్. దేవుడు ఒకదాంట్లో చిన్న చూపు చూసిన నీకు ఒక దారి చూపించాడు అంటూ సంతోషంతో దేవుడికి దండం పెట్టుకుంది.  సుధాకర్ పార్వతమ్మ గారికి ఆరో సంతానం. పార్వతమ్మ గారి పిల్లలందరూ తెల్లగా బలంగా ఎత్తుగా ఉండేవారు . అంతా తండ్రి పోలిక. అందరిలాగే పుట్టిన సుధాకర్ ఐదేళ్ళు వచ్చేవరకు బాగానే ఉన్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం వచ్చి కాళ్లు చేతులు కదపలేకపోయాడు. సుధాకర్ తండ్రి రామారావు గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. పిల్లవాడి నాడి పరీక్షించి చూసి వాతం కమ్మిందని అనుకుని వైద్యం మొదలుపెట్టారు. అప్పటినుంచి సుధాకర్ కి అన్నీ మంచం మీదే. బిడ్డనీ అలా మంచం మీద చూసి వీడి భవిష్యత్తు ఎలాగని రోజు దిగులు పడుతుండేది ...

కోరిక

కోరిక సాయంకాలం నాలుగు గంటలు అయింది.  కాకినాడలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. పిల్లలు అరుపులు కేకలు గోలలు ఈలలతో సందడిగా ఉంది. ఇంతలో ఒక యువ జంట అలా పార్కులో నడుచుకుంటూ వెళుతున్నారు. తెల్లగా బొద్దుగా ఉన్న కుర్రాడు మూడేళ్ల వయసు ఉంటుందేమో ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఆ అబ్బాయిని చూడగానే ముచ్చటేసింది అమ్మాయికి. వెంటనే ఎత్తుకుని పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ఆ చూపులో ఉన్న అర్థం భర్త రాకేష్ కి అర్థమైంది. ఆ చూపు రాకేష్ కి ఏమీ కొత్త కాదు.  పార్కుకి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు పిల్లవాడు కనపడడం ఆ పిల్లవాడి వేపు భార్య రమ ఆశగా చూడడం లేదంటే ఎత్తుకొని ముద్దాడడం రమ రాకేష్ వేపు ఆశగా చూడడంప్రతిసారి జరుగుతున్నదే. రమ అలా చూసినప్పుడల్లా రాకేష్ గుండెల్లో గునపం గుచ్చినట్లు అవుతుంది. మనసు బాధపడుతుంది. ఇంతలో ఆ చంటి పిల్లాడు తల్లి వచ్చి పిల్లవాడిని తీసుకు వెళ్లిపోయింది. అవును మన పిల్లవాడు అయితే మన దగ్గరే ఉంటాడు అనుకుని రమ నిట్టూర్చి ఇంటికి వెళదామా అంటూ భర్తను ఉద్దేశించి చెప్పింది. అంటే రమ బాధపడుతోందన్నమాట. చేసేదేమీ లేక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు.  రాకేష్ ఇంటికి ...

సత్య

సత్య ఉదయం పది గంటలు అయ్యింది. వృద్ధాశ్రమంలో తన గదిలో మంచం మీద పడుకున్న సత్యకి పక్క మంచం మీద పడుకున్న రాఘవమ్మ దగ్గరికి ఇద్దరు రావడం గమనించింది. ఇద్దరూ కవల పిల్లలు అనుకుంటా. ఒకే పోలిక ఒడ్డు పొడుగు సమానంగా ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అనుకుంటా. అంతవరకు మంచం మీద మూలుగుతూ పడుతున్న రాఘవ మ్మ ఆ పిల్లలు రాగానే లేచి కూర్చుని నవ్వుతూ మాట్లాడడం గమనించింది. రాఘవ మ్మ ఆ పిల్లల్ని ఇద్దరినీ పరిచయం చేస్తూ ఇంతవరకు అమెరికాలో ఉండేవారని ఇప్పుడు ఇండియా వచ్చేసారని అందుకని తనని తీసుకువెళ్లడానికి వచ్చారని చెబుతూ తనకి అలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో అని మనసులో బాధపడుతూ ఒక్కసారి తన గత జీవితం గుర్తుకొచ్చింది సత్యకి " కంగ్రాట్యులేషన్స్ పార్వతమ్మ గారు మీ అమ్మాయి సత్యకి  కవల పిల్లలు పుట్టారు. తల్లి పిల్లలు అంతా క్షేమం. కాసేపట్లో రూముకు పంపిస్తాను అంటూ లేడీ డాక్టర్ సరోజ చెప్తున్న మాటలు లీలగా వినబడ్డాయి సత్యకి. ఒక్కసారి ఆనందం ముంచుకొచ్చింది పిల్లలను చూద్దామని ఎత్తుకుని ముద్దాడాలనిపించింది కానీ ఒళ్లంతా మత్తుగా ఉంది. కళ్ళు తెరవబుద్ధి కావడం లేదు. చంటి పిల్లలు ఏడుపులు లీలగా వినిపిస్తున్నా ఏమీ చేయలేక పడు...

దీపావళి

దీపావళి సాయంకాలం ఆరు గంటలు అయింది. ఎక్కడి నుంచో బాణసంచా చప్పుడు వినబడు తోంది. అప్పుడే దీపావళి ప్రారంభమైపోయింది అనుకుంటూ ఇత్తడి పళ్లెంలో వెలిగించిన ప్రమిదలని ఒక్కొక్కటి ఆరుగు మీద పెడుతోంది రమ్య. దీపావళి నాడు అరుగులకు ప్రత్యేక అతిధులు ఈ దీపాలు.  ఈ దీపాలతోటే ఎంత కళ వచ్చింది ఇంటికి అనుకుంటూ గాలికి రెపరెపలాడుతున్న దీపాలను చూసి మనసు ఎక్కడకో పోయింది రమ్యకి. పక్క ఇంటి నుంచి పిల్లల దివిటీలు కొడుతున్న హడావుడి వినపడుతోంది. పిల్లలు చేతులు కాల్చుకుంటారని ఆ తల్లి నానా హైరానా పడిపోతో oది. ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి రమ్య మనసు చిన్నతనంలోకి పరుగులెట్టింది. " అమ్మా రమ్య పరికిణి కుచ్చిళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకో. దూరంగా ఉండి ప్రమిదల్లో నూనె పొయ్యి. నువ్వు మతాబులు కాల్చుకో. అన్నయ్య తారాజువ్వలు కాల్చుకుంటాడు. నీకు గె డ కర్రకి మతాబులు కట్టిస్తాను. కాకరపువ్వొత్తులు కూడా నువ్వే కాల్చుకో. ఇలా ఎన్నో జాగ్రత్తలు ప్రతి దీపావళికి అమ్మ చెబుతూనే ఉండే ది. ప్రతి దీపావళికి కొత్త బట్టలు కాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూచక్రాలు పాము బిళ్ళలు మతాబులు ఇవన్నీ నా వాటా.  అన్నయ్య కి తారాజు...