పోస్ట్‌లు

మార్చి 24, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అడవిలో మెరిసిన పద్మం

అడవిలో మెరిసిన పద్మం. " ఈ  అడవిలో ఈ* తార*ని ఎక్కడని వెతికి పట్టుకోవాలి? తారలo టే నక్షత్రాలు అవి ఆ ఆకాశంలో ఉంటాయి. మరి ఈ  తార నక్షత్రము కాదు సినిమా తార కాదు. మరి అడవుల్లో నివసించే ఒక సాధారణ గిరిజన స్త్రీ ఈ ఫోటో ఒక్కటే ఆధారం. ఏదో నర్సరీలో పని చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఆడవికి దగ్గరగా ఉండే గ్రామ సచివాలయంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందమో చూద్దాం అనుకుంటూ సచివాలయంలోకి అడుగు పెట్టాడు ఆ మండల ఎమ్మార్వో . సాధారణంగా ఏదైనా  శవ పంచాయితీ కోసం వచ్చే ఎమ్మార్వో గారు ఏమిటి ఇలా కబురు కాకరకాయ లేకుండా వచ్చేసారని కంగారు పడుతూ ఆ విలేజ్ సెక్రటరీ అసలు విషయం విన్న తర్వాత నవ్వుకుని ఆ పక్కన ఉన్న అడవి దగ్గర ఉన్న  నర్సరీ దగ్గరికి ఎమ్మార్వో గారిని తీసుకుని బయలుదేరాడు.  ఎమ్మార్వో ని వచ్చారని తెలిసి ఆ నర్సరీ అధికారి పరుగున వచ్చాడు. విలేజ్ సెక్రటరీ చేతిలో ఉన్న ఫోటోలు చూసి దూరంగా పనిచేస్తున్న తారని పిలిపించాడు . తీరా ఆ తారను చూసేటప్పటికి ఎమ్మార్వో కి, విలేజ్ సెక్రటరీ కి మతిపోయింది. ఎక్కడో అడవుల్లో సాధారణంగా బతికే ఒక గిరిజన స్త్రీ. ఒంటినిండా బట్టలు కానీ ,కాళ్లకు చెప్పులు కానీ లేవు. ఆ భాష పూర్తిగ...

అమ్మమ్మ గారి ఇల్లు

అమ్మమ్మ గారి ఇల్లు " రేపటి నుంచి నా నా కాలేజీకి సెలవులు అoటు ఉత్సాహంగా "రేపు నేను అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతున్న అoటు కొడుకు కిరణ్ చెబుతున్న మాటలకి నవ్వుతూ ఉండిపోయింది తల్లి సంధ్య.  కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు. అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతాను అంటావు. అక్కడ ఏముందిరా ? నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువా !అని అడిగింది కొడుకుని సంధ్య.   అవును అమ్మమ్మ కావల్సినవన్నీ చేసిపెడుతుంది ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది అంటూ అమ్మమ్మ గురించి తాతయ్య గురించి కబుర్లన్నీ చెబుతూ ఆ రాత్రి నిద్రలోకి జారిపోయాడు కిరణ్.  మర్నాడు ఉదయమే ఫస్ట్ బస్సుకి కిరణ్ ని రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలో ఉన్న అత్తగారింటికి పంపించాడు కిరణ్ తండ్రి రామారావు. సంధ్య తండ్రి పరంధామయ్య ఇంత వయసు వచ్చినా ఆ ఊర్లోనే ఉంటూ వ్యవసాయం కౌలుకి ఇచ్చేసి కాలక్షేపం చేస్తూ ఉంటాడు.  పరంధామయ్యకి నలుగురు ఆడపిల్లలే. అందరికీ పెళ్లిళ్లు అయిపోయి ముగ్గురు ఆడపిల్లలు హైదరాబాదులోనూ ఉంటే ఆఖరి కూతురు సంధ్య మటుకు తునిలో ఉంటుంది. సంధ్య భర్త రామార...

గురు దక్షిణ

గురుదక్షిణ సాయంకాలం నాలుగు గంటలు అయింది. వీధి అరుగు మీద కూర్చుని విద్యార్థులకి వేదం బోధిస్తున్న రామకృష్ణ శాస్త్రి గారికి ఒక వయసు మళ్ళిన వ్యక్తి ఒక చేత్తో సంచి ,మరొక చేత్తో పది సంవత్సరములు ఉన్న కుర్రాడు చెయ్యి పట్టుకుని తన ఇంటి ముందు ఆగడం గమనించాడు. " నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం అమలాపురం దగ్గర ఉన్న రంగాపురం. వీడు మా అబ్బాయి నారాయణ శాస్త్రి. వీడు ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఇకముందు స్మార్త విద్య నేర్పిద్దామని మా సంకల్పం.. మీ గురించి మా గ్రామంలో ఎవరో చెబితే విని ఎంతో ఆశతో వచ్చాను అంటూ చెప్పు కుంటూ వచ్చాడా పెద్దమనిషి. మీరు నిలబడే ఉన్నారు! . ముందు మీరు ఇలా కూర్చోండి అంటూ శాస్త్రి గారు ఆ వచ్చిన ఆయనకి అరుగు మీదనున్న చాప చూపించి ఆ తర్వాత అతిధి మర్యాదలు చేసి నాకు విద్య నేర్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పటికే నా దగ్గర ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లంతా రాత్రి అరుగుల మీద పడుకుని మా ఊర్లోను ,పక్క ఊర్లోనే ఉండే బ్రాహ్మణ కుటుంబాల ఇళ్లల్లో వారం చేసుకుని విద్య నేర్చుకుంటున్నారు. మీకు అందుకు సమ్మతమైతే మీ అబ్బాయికి కూడా అలాగే ఏర్పాటు చేస్తాను.  రేపు మంచి రోజు రేపటి నుంచి విద్...