స్వాతంత్ర సమరం
వ్యాపారం కోసం వచ్చి వ్యవహారం నడిపి దేశఅనైక్యత చూసి కోటలో పాగా వేసి భారతావని ఆక్రమించింది తెల్లదొరతనం. స్టీమరు ఎక్కి వచ్చి సిసింద్రీ గా మారి రాజుల మధ్య అగ్ని రగిలించింది ఆంగ్లేయం. భారతావని అంతా బానిసత్వ భయం. పచ్చటి భారతావని పరాధీన పరం. పరాధీన ఇక్కట్లు పరమాత్మునికే తెలుసు. రోజుకో దొర భారతావని ఏలుబడి . మన సంపద అంతా స్టీమర్ తో ఎగుమతి. తట్టుకోలేకపోయింది భారతావని యువతరం. ఎలుగెత్తి పాడింది వందేమాతరం. గళమెత్తి అరిచింది విప్లవ గీతం. అజాదు హిందు ఫౌజు సుభాష్చంద్రబోస్ ఆయుధం. రక్తం తోటే దాస్య విముక్తి అదే వారి నినాదం. క్విట్ ఇండియా ఉద్యమంలో రహస్య రేడియో ఏర్పాటు. సావిత్రిబాయి పూలే సమాచార ప్రసార సహాయం. ఎన్నటికీ మరువలేము ఆమె భారతావనికి చేసిన సాయం. ప్రతిఫలంగా చెయ్యాలి నిత్యం ఒక నమస్కారం. ఉక్కుమనిషి పటేల్ సహాయ నిరాకరణ ఉద్యమం. ఆయన ధీరత్వం మే మన యువతకు కు ఆదర్శం. యువత మనసు ఉక్కులా ఉండాలని ఆశీర్వదిద్దాం. ధీరవనిత లక్ష్మీబాయి తొలి భారత సంగ్రామం. పరదేశీయులపై చేసింది మన వనిత యుద్ధం. మన వనితలకు ఆమె ఆదర్శం. మంగళ పాండే సిపాయిల తిరుగుబాటుకే అంకితం యోధానుయోధులు సాధించింది ఈ స్వతంత్రం. వారి గాధలే...