పోస్ట్‌లు

జూన్ 16, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

బరువు భాధ్యత

చిత్రం
కడుపు కోసమే కదా కడలంతా బరువు లాగేది బరువులు తోనే సమతుల్యంగా బతుకుబండి మోసేది  ఏ బరువు గతి తప్పిన యజమానికి చెల్లించాలి మూల్యo.  గమ్యం చేరే వరకు బరువులతోనే సాగుతోంది జీవి  ప్రయాణం.  ఆ బరువుల మోతల వెనుక గూడులో ఉన్నదో  బలమైన బాధ్యత. బాధ్యత అంటేనే బరువు బరువు అంటేనే బాధ్యత. ఇన్ని బరువులు మోసిన బక్కచిక్కి ఉంటోంది ఆ ప్రాణం. కారే చెమట ఎదురు గాలులతో మటుమాయం. మాడుతున్న డొక్క ,చుర్రుమనిపించే సూరీడు తల నుండి పాదాల వరకు రక్షణ లేని శరీరo. అయినా అలుపెరగకుండా సాగుతోందా పయనం తలపులన్నీ తలుపులు లేని గూడులో ఉన్న గువ్వల గమనం.  ఆ గువ్వల బువ్వ కోసమే ఆ బడుగు జీవి మథనం. ఎప్పుడు మారుతుందో బక్క జీవి దైనందిన జీవితం. ధనిక పేద అనే తేడా లేని సమ సమాజ నిర్మాణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279

పావురం కోసం ప్రాణ త్యాగం

ప్రతిరోజు మనం దానధర్మాలు అనే పదజాలాన్నిచాలా సార్లు వింటూ ఉంటాం. ఈ రెండు వేరువేరు పదాలైనప్పటికీ మన జీవితాలతో అవి పరస్పరంగా కలిసిపోయాయి. దానం అంటే మన దగ్గరున్న దానిని అవసరమైన వారికి ఇవ్వడం. ఈ దానం అనేది ధన రూపంలో గానీ వస్తు రూపంలో కానీ వస్త్ర రూపంలో గాని చెయ్యవచ్చు . ధర్మం అంటే మంచి పనులు చేయడం. మన ధర్మాన్ని పాటించడం. ధర్మం అంటే మన పాత్రను నిస్వార్ధంగా, న్యాయంగా పోషించడం అని అర్థం భారతదేశంలో అనేకమంది దానగుణం కలిగిన వాళ్లు అన్నారు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ మనం చెప్పుకునే వాళ్ళు ఒకరు కుంతీదేవి కుమారుడైన కర్ణుడు, రెండవది శిబి చక్రవర్తి.  అయితే శిబి చక్రవర్తి గొప్ప దాత. దయాగుణం గల చక్రవర్తి. అతను ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞానికి అనేకమంది చక్రవర్తులు మహారాజులు మహర్షులు అతిథులుగా వస్తారు. శిబి చక్రవర్తి వారందరినీ భారీ ఎత్తున సత్కరిస్తాడు. పెద్ద ఎత్తున దానాలు చేస్తాడు. అతని త్యాగనిరతిని ఎంతోమంది కొనియాడుతారు. ఈ విషయం ఇంద్రుడు వద్దకు వెళుతుంది.  యజ్ఞశాలలో కూర్చున్న శిబి చక్రవర్తి తొడ మీద ఒక పావురం వచ్చి వాలి "మహారాజా నన్ను ఒక డేగ తరుముకుంటూ వస్తున్నది. కాబట్టి దాని నుండి నన్ను కాపా...

పాట

పాట సప్తస్వరాల మూట. మదిని దోచే పూల తోట మాటల సమాహారం పాట. రాగం తాళం పాటకి పట్టు. పల్లవే పాటకి తొలిమెట్టు చరణం కాకూడదు పాట జారుడు మెట్టు. జాతీయ గీతం తో తెల్లదొరలు తరలింపు. విప్లవ గీతంతో మన్యం దొర అదిలింపు.  దేశభక్తి గేయం తో భరతమాత దాస్య శ్రుoఖం వదిలింపు.        గేయ మైనా గీతమైనా పాటే కదా.            పరమార్థం ఒక్కటే. పరమాత్ముని ప్రార్థించేది కీర్తన త్యాగయ్య అన్నమయ్య రామదాసు పురందరదాసులదే ఈ బాట. పాటలకు వారేగా ఆదిగురువు. వారి అనుభవాల సారం మనకు భగవన్నామ సంకీర్తన సంకీర్తన తోటే భగవంతుడు వారికి ప్రత్యక్షం. ఆది నుండి ఉన్నది అప్పగింతల పాట. సుద్దులు బుద్ధులు సుదతికి నేర్పేదీ పాట. ఆడపిల్ల అత్తవారింటికి అందం పాటతో నడక నేర్పింది పేగుబంధం. అంతరార్థం తో హత్తుకుపోయింది ఆమె బంధం. ప్రేయసిని పరవశంగా పలకరించేది ఎంకి పాట నండూరి వారే దానికి శ్రీకారం.  ఎంకిపాటగా అందలం. వెల్లువగా వచ్చిన విమర్శలు దీనికి అలంకారం.    శ్రమను మరిపించే దే పాట.   శ్రమజీవుల నోటి నుండి అలవోకగా వచ్చింది కలుపు పాట. పంట కోతలలో వచ్చే ఆనందం కోతల పాట. ఏమి చెప్ప...

స్వాతంత్ర సమరం

వ్యాపారం కోసం వచ్చి వ్యవహారం నడిపి దేశఅనైక్యత చూసి కోటలో పాగా వేసి భారతావని ఆక్రమించింది తెల్లదొరతనం. స్టీమరు ఎక్కి వచ్చి సిసింద్రీ గా మారి రాజుల మధ్య అగ్ని రగిలించింది ఆంగ్లేయం. భారతావని అంతా బానిసత్వ భయం. పచ్చటి భారతావని పరాధీన పరం. పరాధీన ఇక్కట్లు పరమాత్మునికే తెలుసు. రోజుకో దొర భారతావని ఏలుబడి . మన సంపద అంతా స్టీమర్ తో ఎగుమతి. తట్టుకోలేకపోయింది భారతావని యువతరం. ఎలుగెత్తి పాడింది వందేమాతరం. గళమెత్తి అరిచింది విప్లవ గీతం. అజాదు హిందు ఫౌజు సుభాష్చంద్రబోస్ ఆయుధం. రక్తం తోటే దాస్య విముక్తి అదే వారి నినాదం. క్విట్ ఇండియా ఉద్యమంలో రహస్య రేడియో ఏర్పాటు. సావిత్రిబాయి పూలే సమాచార ప్రసార సహాయం. ఎన్నటికీ మరువలేము ఆమె భారతావనికి చేసిన సాయం. ప్రతిఫలంగా చెయ్యాలి నిత్యం ఒక నమస్కారం. ఉక్కుమనిషి పటేల్ సహాయ నిరాకరణ ఉద్యమం. ఆయన ధీరత్వం మే మన యువతకు కు ఆదర్శం. యువత మనసు ఉక్కులా ఉండాలని ఆశీర్వదిద్దాం. ధీరవనిత లక్ష్మీబాయి తొలి భారత సంగ్రామం. పరదేశీయులపై చేసింది మన వనిత యుద్ధం.    మన వనితలకు ఆమె ఆదర్శం. మంగళ పాండే సిపాయిల తిరుగుబాటుకే అంకితం యోధానుయోధులు సాధించింది ఈ స్వతంత్రం. వారి గాధలే...

మాయ

చిత్రం
భువనమంతా నోటిలో చూపించే బాలకృష్ణుడు బిడ్డగా ఒడిలో చేరితే ముద్దు మురిపం చేయకుండా తరిమి తరిమి కొట్టే తల్లికి తెలియలేదు విష్ణుమాయ. తల్లి రూపంలో వచ్చిన రక్కసి పూతన రక్తం పీల్చి హతమార్చిన బాలకృష్ణుడి మాయ . అల్లరి ఆగడాలు భరించలేక రోలుకి బందీ చేయబడిన లోకేశ్వరుడు గంధర్వులను బంధ విముక్తులను చేసిన  అల్లరి కృష్ణుడు మాయ. కాళింది మడుగులో కాళీయుడు పై నృత్యం చేసిన తాండవ కృష్ణుడు మాయ. వేణు గానముతో మంత్రముగ్ధులను చేసిన వేణుగోపాలుడి మాయ. చిటికెన వేలితో గిరిని ఎత్తి ప్రళయకాలంలో  రేపల్లె వాసులను కాపాడిన గిరిధరుడి మాయ. గురుపుత్రుని బతికించి గురుదక్షిణగా సమర్పించిన శిష్యుడు మాయ. వస్త్రాపహరణ సమయంలో ఎలుగెత్తి పిలిచిన ద్రౌపదిని అవసరమైనది ఇచ్చి కాపాడిన కృష్ణ మాయ. ఉపనిషత్తుల సారాంశం గీతగా బోధించి అర్జునుడిని యుద్ధోన్ముఖుని చేసిన గీతా కృష్ణుడి మాయ. దేవాది దేవుడి తల్లి కే సాధ్యం కాలేదు విష్ణు మాయ ని తెలుసుకోవడం. అజ్ఞానాంధకారంలో ఉన్న మానవులకు ఎలా తెలుస్తుంది భగవంతుడి మాయ. జరిగిన ప్రతి సంఘటన కనపడని భగవంతుడు మాయ. మౌనంగా కర్మసిద్ధాంతాన్ని నమ్మడమే మానవుల కర్తవ్యం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు....

పల్లె

ఎటు పోతుంది పల్లె గమనం. మానవ శక్తి మీద లేదు నమ్మకం యంత్ర శక్తి మీదే సదా ఆధారం. మనిషినే నమ్మలేని సమాజం. పల్లె అంతా పట్టణంలో కాపురం. పట్టెడు అన్నం పెట్టే పంటపొలాలే పరదాలు కట్టిన రెండు అంతస్తుల భవంతులు. ఎక్కడుంటాయి పంట గింజలు. ఎలా బతుకుతాయి పక్షి జాతులు. గదులన్ని కంపెనీ సంచులతో బియ్యం. గాదులన్నీ మాసిన బట్టల కంపు. గుమ్మ పాలు తాగే రైతుకు బొమ్మ పాలే గతి. పశువులు కొట్టాలన్ని పాత సామాన్లుకి ఆతిథ్యం. మురికిపట్టిన లేగ దూడల మువ్వల గంటలు. మాయమైన మైసూర్ ఎడ్లు పరుగులు.  తుమ్మ నాగళ్ళు చూరు కింద చేరే నాగలి చెక్కే వీరన్న బతుకు గుడిమెట్ల పాలు. వరి దుబ్బు పీకలన్ని యంత్రమే నరికే కొడవలి కోత మరిచి పాత ఇనప ముక్కగా మారే. చెవులు కుట్టే చలమయ్య చెన్నై పట్నం జేరే. కుట్లు లేక చంటి దాని చెవులు బోసి పోయే. గుడ్డ తడిపి కుట్టే దర్జీ గూడూరు పోయే రెడీగా దొరికే madelu వుతుకులో వెలవెలపోయే వృద్ధ దంపతుల గూడు వెల్లలేక మాసిపోయే. ఎల్లలు దాటి వెళ్లలేక గూడులోనే గువ్వలు మగ్గిపోయే. ఆదరణ ఆప్యాయతలకు పెట్టింది పేరు పల్లెటూరు. పల్లె జనం నోరు మరచి చరవాణిలో పలకరించే. గుడిగంటలు దూరమయ్యే సెల్లు గంటలుతో పల్లె అంత  మ్రోగే. విస్...