పోస్ట్‌లు

జూన్ 5, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

సేవగా మారిన విషాదం

ఇది ఇప్పటి మాట కాదు. ఒకప్పటి చరిత్ర. ఒక పక్షి మరణం ఒక అద్భుత కావ్య రచనకి అవకాశం కల్పించింది. అన్నదమ్ముల పిల్లల మధ్య జరిగిన యుద్ధం భగవద్గీతకు ప్రేరణగా నిలిచింది.  ఒక చారిత్రక కట్టడం నిర్మించడానికి వెనుక అనేక బలీయమైన కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది.. భార్య మీద ఉన్న ప్రేమతో ఒక నవాబు గారు తాజ్ మహల్ నిర్మించారు. అలాగే భాగ్యనగరంలో ఉన్న నాలుగు స్తంభాల కట్టడం వెనుక అనేక చారిత్రక కథలు ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ మండలం పెనుమర్తి గ్రామంలో నిర్మించిన ఈ ఆసుపత్రి వెనుక ఒక విషాదకరమైన కథ ఉంది. మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కళ్ళు. కళ్ళు లేని జీవితం ఊహించలేం. ఆ చీకటి ప్రపంచంలో వారు పడే బాధలు వర్ణనాతీతం. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా ఉచితంగా కంటి చూపును ప్రసాదించాలనే ఆశయంతో కాకినాడ జిల్లా పెనుమర్తి గ్రామంలో కిరణ్ కంటే ఆసుపత్రి 1993 సంవత్సరంలో ప్రారంభించబడి రోగులకు సేవలు చేస్తూ దిన దిన ప్రవర్ధమానం అవుతూ వచ్చింది.  ఈ ఆసుపత్రి అంధుల పాలిట ఒక వరం. ఈ ఆసుపత్రి ప్రారంభించడానికి వెనుక ఉన్న ఆశయం పరిశీలిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. జీవితంలో ఎవరికి ఇటువంటి సమస్య రా...

కలలు కన్న రాజ్యం

ఉదయo ఎనిమిది గంటలు అయింది. ఆకాశమంత దట్టంగా మబ్బులు పట్టి ఉంది. ఉదయం నుంచి ఒకటే ఈదురుగాలులు . గత రెండు రోజుల నుంచి బంగాళాఖాతంలో తుఫాను హెచ్చరికలు రేడియోలో టీవీలు గంట గంటకి వినిపిస్తున్నాయి.ఈ సమయంలో తుఫాన్లు ఏమిటి విపరీతకాలం కాకపోతేను .ఇదివరకు వర్షాకాలంలోనే వచ్చేవి. ఇప్పుడు కాలంతో పనిలేదు. ఏమిటో పంటలన్నీ కోతకు రెడీగా ఉన్నాయి.  ఇప్పుడు కనక తుఫాను వస్తే రైతులు మట్టి కొట్టుకుపోతారు. పైగా ఇది గోదావరి నది ఒడ్డు పక్కన ఉన్న పల్లెటూరు. వర్షం వస్తే గోదావరి కూడా వరదలు వస్తాయి. గత ఏడాది వచ్చిన వరదలకే ఇంకా ప్రజలు తేరుకోలేదు. ఎంత ప్రాణ నష్టం జరిగింది . పంటలన్నీ పాడైపోయా యి. పశువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేయి. ప్రభుత్వ సహాయం అందేటప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది అనుకొని భయపడుతూ ఆ వీధి అరుగు మీద కూర్చుని విద్యార్థులకి వేద పాఠాలు చెబుతున్నారు చలపతి శాస్త్రి గారు. పరోపకారార్ధం ఇదం శరీరం అనే సూక్తిని గట్టిగా నమ్మిన వ్యక్తి చలపతి శాస్త్రి గారు. పైగా అగ్రహారంలో ఉండే వేద పండితుల్లో ఒకరు.  వారసత్వంగా వచ్చిన ఆస్తి, పెద్ద ఇల్లు పదిమందితో కలిసి పోయే మంచితనం, స్నేహ తత్వం, కులమతాలు అంటే పెద్...

జీవితం ఒక ఆట

జీవితం అనేది ఒక గొప్ప ఆట. ఈ ఆటను కొందరు శత్రువులతో, కొందరు స్నేహితులతో, కొందరు గెలుపు ఆశతో, కొందరు ఓటమి భయంతో ఆడతారు. అయితే జీవితం ఓ క్రికెట్ ఆట వంటిదే అని చెప్పుకోవచ్చు. క్రికెట్ ఆటలోని ప్రతి అంశం మన జీవితంతో ఏదోలా అనుసంధానం కలిగి ఉంటుంది. ఒకసారి ఆలోచిద్దాం: 1. పిచ్ అంటే జీవన ప్రస్థానం క్రికెట్ పిచ్ ఎంత సాఫీగా ఉంటే ఆట అంత మెరుగ్గా సాగుతుందో, అలాగే మన జీవిత ప్రస్థానంలో ఎదురయ్యే పరిస్థితులు మన విజయాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు పిచ్ (లైఫ్) అనుకూలంగా ఉంటుంది, మరికొన్నిసార్లు చేదుగా ఉంటుంది. కానీ ఆట ఆగదు. 2. బ్యాట్స్‌మెన్ = మనమే బ్యాట్స్‌మెన్‌గా మనం ప్రతి బంతిని గమనించాలి. కొన్నిసార్లు ఆఫ్‌స్టంప్‌కి వస్తుంది, కొన్నిసార్లు బౌన్సర్‌గా. ఏ బంతిని ఆడాలో, దేనిని వదలాలో నిర్ణయించుకోవాల్సిందే. ఇదే జీవితంలో అవకాశాలు, ఇబ్బందులు – వాటిని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయం మనదే. 3. బౌలర్లు = సమస్యలు బౌలర్లు జీవితానికి వస్తే – అవే మనకు ఎదురయ్యే సమస్యలు. కొన్నిసార్లు అవి స్లో బంతులు – అర్థం కాకుండా ఉండే సమస్యలు. మరికొన్ని ఫాస్ట్ బంతులు – ఊహించని ఘటనలు. వాటిని ఎదుర్కోవడం, తగిన సమయాన్నే ఎదురుదాడి చేయడం మన ...

ఆషాడ గోరింట

ఎరువు లేకుండా పండే పంట ఎరువు తెచ్చుకున్నైనా అలంకరించుకునే పంట.  అదే అతివల చేతిపంట  ఆషాడపు గోరింట  నిద్ర చేయని గోరింట పండు మిరపలా పండునంట అతి వల అరచేతిలో చుక్కల చంద్రుడిలా కనపడునంట. మెరిసే చుక్కలు గోరింట ముద్దలై అరచేతిని అలంకరించు నoట ఎర్రగా పండే గోరింట మగని ప్రేమకు చిహ్నం. చుర్రుమనిపించే ఎర్ర మిరపలా పండితే జవరాలి మదిని దోచే మొగుడువస్తాడని నమ్మకం. అరచేతి అలంకరణతో ఊరుకోదు అతివ సాయమడిగి మరీ అలంకరించుకుంటుంది గోరింటతో అరికాళ్ళని. పండిన గోరింట తో మెరిసే జుట్టుకు అలంకారం. వంటివేడిని తగ్గిస్తుంది అని చెప్పింది ఆయుర్వేదం. ఆషాడం రాగానే గోరింట వైపు చూపుతుంది ప్రతి మగువ మొగ్గు. గోరుముద్దలు తినిపించమని మొగుడిని అడగడానికి ఆమెకు లేదు సిగ్గు. అతివలకు అలంకారం అంటే అంత మమకారం. అరచేతులుకు గోరింట అలంకరణ మరింత అందం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.         కాకినాడ 9491792279

పుత్తడి మీద పెట్టుబడి

పురాణాల కాలం నుంచి ఆభరణాలు ధరించడం అనేది మన సాంప్రదాయంలో ఉంది. అయితే ఆ కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అలంకరణలో బంగారు వస్తువులతో పాటు వజ్ర వైడూర్యాలు మణులు మాణిక్యాలు ధరించే వారిని పురాణాల ద్వారా తెలుస్తోంది. కాలక్రమేణా వెండి బంగారు వస్తువులను ఎక్కువగా ధరించడం అనే సాంప్రదాయం వచ్చింది. కారణం వజ్రవైఢూర్యాలు మణులు మాణిక్యాలు చాలా ఖరీదైనవి కావడంతో మానవులంతా వెండి బంగారు వస్తువులు మీదే ఆధారపడి ఉన్నారు.  మొదట్లో వెండి ,బంగారం వస్తువులను మనం అందంగా అలంకరించుకోవడానికి మాత్రమే ఉపయోగించే వాళ్ళం. అయితే దేశ విదేశీ మార్కెట్లలో బంగారం వెండి లోహాలు ఒక వ్యాపార వస్తువుగా మారినప్పటి నుంచి మన దృక్పథంలో మార్పు వచ్చింది. అంటే బంగారాన్ని ఒక ఆభరణంగా కాకుండా భవిష్యత్తు అవసరాలకు ఒక పెట్టుబడిగా ఒక పొదుపు కారకంగా దీనిని మనం ఇప్పుడు చూస్తున్నాం. బంగారాన్ని ఆభరణ రూపంలో కాకుండా ప్రభుత్వం వారు జారీ చేసే బాండ్ల రూపంలో మనం కొని దాచుకోవడం అనేది ఈ మధ్య కాలంలో మంచి అలవాటుగా మారింది.  పెట్టుబడి కోసం బంగారం మీద చేసే పొదుపుని గోల్డ్ బాండ్ Sovereign Gold Bond (SGB) అంటారు. ఇది భారత ప్రభుత్వం జారీ చేసే స...