పోస్ట్‌లు

ఏప్రిల్ 18, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ పిచ్చిది

అమ్మ పిచ్చిది అవును అమ్మ పిచ్చిది  మరణం అంచుల వరకు వెళ్లి ఒడిలో పడిన బొమ్మను చూసి మురిసిపోయి.  ఒంట్లోని రంగు చుక్కని పాలు చుక్కగా మార్చి  బుడిబుడి నడకలు చూసి మురిసిపోయి  కంటి నుండి జలజల రాలే ముత్యాలు చూసి  తల్లడిల్లిపోయి.  బిడ్డ కంటికి రెప్ప తానై తను కొవ్వొత్తులా కరుగుతూ  తాను వేసిన విత్తు వటవృక్షమై ఎదగాలని  కలలు కంటూ ప్రణాళికలు వేస్తూ  త్యాగాలు చేస్తూ కాలం గడిపే అమ్మ పిచ్చిది పాపం ఏ వయసుకి ఆ ముచ్చట చేసి  ఆ బొమ్మకో ముద్దుల గుమ్మని జత చేసి  బాధ్యత తీరిందని మురిసిపోయి న అమ్మ  నిజంగా పిచ్చిది పాపం. తన దగ్గర మాటలను నేర్చుకున్న బొమ్మ  ఏరు దాటాక తెప్ప తగలేసి  శరణాలయం దారి చూపిస్తాడని  తెలుసుకోలేక పోయింది అమ్మ  పాపo పిచ్చిది. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

ఒక్క క్షణం ఆలోచించండి

కథ పేరు: ఒక్క క్షణం ఆలోచించండి. రచన: మధు నా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.  కాకినాడ 9491792279 " ఏరా ఎలాగైనా సరే అమెరికాలో ఎమ్మెస్ చదవాలి. మా చుట్టాలు పిల్లలు అందరూ అక్కడ చదువుకుంటున్నారు. మా అన్నయ్య గారి అబ్బాయి కూడా అక్కడే. ఒకసారి నువ్వు సెటిల్ అయిపోతే మాకు బెంగలేదు అంటూ తల్లి , తండ్రి చెప్పిన మాటలకి కొడుకు శరత్ బుర్ర తిరిగిపోయింది.   "లేదు అమ్మా ఇప్పటికే నాన్న ఆఫీసులో పిఎఫ్ అంతా వాడేసారు. బ్యాంకులో నాలుగు లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని బీటెక్ చదివించారు. నాకు క్యాంపస్ లో జాబ్ వస్తుంది అనుకుంటే అది కూడా రాకుండా పోయింది. ఏదో ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నాయి కానీ అంత పెద్ద చదువు చదవలే ను అంటూ చెప్పాడు శరత్ "లేదు చదువుతావు.. ఇప్పుడు నువ్వు కనక అమెరికా వెళ్లి చదువుకోకపోతే ఆ పిల్లలందరి ముందు చిన్నతనంగా ఉంటుంది.  వాళ్లందరూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉంటే నీకు ఇండియాలో యాభై వేలు సంపాదిస్తే మన అప్పులు ఏమి తీరుతాయి. నా పేరు మీద ఉన్న ఈ బిల్డింగ్ ఉంది కదా తాకట్టుపెట్టి చదివిద్దాం .రేపే బ్యాంకు కి వెళ్దాం అంటూ ఖచ్చితంగా చెప్పేసింది శాంత.  "వద్దు మమ్మీ...

బామ్మ ఉంటే

బామ్మ ఉంటే  " అవును అమ్మ ఉంటే ఎంత బాగుండేది. ఇంట్లో ముఖ్యంగా పిల్లలకి మంచి చెడ్డ చెప్పేది. రామాయణం ,భారతం, భాగవతం కథలు రాత్రి కూర్చోబెట్టుకుని చెప్పేది. ఏది మంచి ఏది చెడు ప్రతిరోజు ప్రతి పనిలోనూ గుర్తు చేసేది. నా బాల్యంలో మా బామ్మ ఉండేది అలాగే బామ్మ క్రమశిక్షణలో గడిచిపోయింది మా బాల్యం. ఈ పిల్లల బాల్యం చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేరు. వీళ్ళ జీవితం ఎలా నడుస్తుందో ఏమిటో అంటూ తన బాల్యం గుర్తు చేసుకో సాగాడు ముప్పైఏళ్ల రాజారావు.  రాజారావు కామేశ్వరరావు గారికి ఆరో సంతానం. కామేశ్వరరావు గారి పిల్లలు అందరి బాల్యం కామేశ్వరావు గారి తల్లి సుందరమ్మ గారి పెంపకoల్లో గడిచిపోయింది. మరి అంత క్రమశిక్షణ కాదు గాని సుందరమ్మని చూస్తే పిల్లలకు హడలు. ఉదయం లేస్తూనే అందరూ స్నానాలు చేయాలి. దేవుడికి దండం పెట్టుకోవాలి. అప్పుడు గాని పాలు తాగడానికి వీల్లేదు. కాఫీ టీల ప్రసక్తే లేదు. చిన్నపిల్లలు పాలు తాగాలి రా. ఎముకలు బలంగా ఉంటాయి అoటు సైంటిఫిక్ రీజన్ చెప్పేది. అప్పట్లో ఉదయం పూట టిఫిన్ కూడా లేదు. చక్కగా చద్దన్నం పెరుగు వేసి పెట్టేది.  మళ్లీ మధ్యాహ్నం పూట స్కూల్ నుంచి వచ్చి బట్ట...

విజయనగరం. జిల్లా విహారం

విజయనగరం జిల్లా  విజయనగరం జిల్లా – చారిత్రక రాజధాని, పర్యాటక రమణీయతకు నిలయం.విజయనగరం జిల్లా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇది కళ, సాహిత్యం, సంగీతం, మరియు రాజవంశాల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. విశ్రాంతి, ఆధ్యాత్మికత, చరిత్ర – అన్నింటినీ అనుభవించాలనుకునే వారికి విజయనగరం ఉత్తమ గమ్యం. పర్యాటక ప్రదేశాలు 1. విజయనగరం కోట విజయనగరం రాజవంశానికి చెందిన ఈ కోట శిల్పకళకు మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి. 2. రామతీర్థం మూడు పర్వతశ్రేణుల్లో వున్న శ్రీరాముని ఆలయం. అతి పురాతనమైన ఈ పుణ్యక్షేత్రం అందమైన ప్రకృతి మధ్య నిలిచి భక్తులను ఆకర్షిస్తుంది. 3. బొబ్బిలి కోట బొబ్బిలి రాజుల గాధలను చాటి చెప్పే ఈ కోట గొప్ప వీరచరిత్రను గుర్తుచేస్తుంది. 4. మన్నెం తపోవనం అరణ్యవాసం చేసిన ఋషుల తపోభూమిగా చెప్పబడే ఇది, ప్రకృతి ప్రేమికులకు శాంతి స్థలంగా నిలుస్తుంది. 5. తాటి వలస జలపాతం పర్వత ప్రాంతాల్లో నుంచి పడ్డ నీటివేళ్ల అందం – వర్షాకాలంలో చూడదగిన ప్రదేశం. పుణ్యక్షేత్రాలు (తీర్థయాత్ర ప్రదేశాలు) 1. పుణ్యగిరి  ప్రముఖ శైవ క్షేత్రం. ప్రతి శివరాత్రికి జరిగే ఉత్సవాలు చూడదగినవి. 2...