పోస్ట్‌లు

మే 15, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

గోదావరి డెల్టా పితామహుడు

గోదావరి డెల్టా పితామహుడు. మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం వద్ద పుట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన గోదావరి నదిని జీవనది అంటారు. జీవనది అంటే ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది.  అవి భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించే రోజులు . ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ దొర వృత్తి రీత్యా ఇంజనీర్ ఇక్కడ పని చేస్తూ ఉండేవాడు. నిరంతరము ప్రవహిస్తూ ఒక పుణ్య నదిగా పేరు తెచ్చుకున్న గోదావరి నది జలాలు వృధాగా ఉండిపోవడం, అంతేకాకుండా ఆ ప్రాంతంలో తాగునీరు పంట నీరు సమస్యలు ఏర్పడడంతో ఇంజనీర్ దొరగారికి అద్భుతమైన ఆలోచన తట్టింది.  అలా గలగల పా రుతున్న గోదావరి తల్లికి అడ్డుకట్ట అంటే ఆనకట్ట కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆనకట్టవలన ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవ్వడమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీరుతుందని ఆలోచించి అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ధవలేశ్వరం వద్ద గోదావరి నది మీద ఆనకట్ట నిర్మాణం చేశాడు. ఎక్కడో పుట్టాడు పరాయి దేశంలో అద్భుతమైన కార్యానికి పునాది వేశాడు భారతదేశంలో.పరాయి దేశస్తుడు అయితే నేమి పది కాలాల పాటు నిలిచే పని. చేశాడు.ఆనకట్ట కార్యరూపంలో ,అనారోగ్యం పాలు అయినా లెక్క చేయకుండా ప్రజల...

తోడు

నాన్నకు ముద్దుల బిడ్డగా వరాల మూటగా గారాల పట్టిగా నా బాల్యమంతా బంగారుమయం. అమ్మవడి దాటి బడి బాట పట్టిన నాకు చదువుల తల్లిగా నామకరణo. పసిడి మొగ్గ నైన నేను పువ్వుగా మారి పరిమళాలు వెదజల్లే భాగస్వామిని. గడప దాటి గగనం కూడా చూడని నేను ఆ ఇంటి గృహ లక్ష్మి నై వెలిగాను. ఆడబిడ్డగా జన్మించిన నా జన్మ సార్ధకం బిడ్డలకు తల్లిగా మారి అమ్మా అని పిలిపించుకోవడం అప్పటినుంచి మొదలైంది నా జీవన పోరాటం బాధ్యతాయుత జీవన సమరం కన్న వాళ్ళని ఆదర్శమూర్తులుగా పెంచాలని ఆరాటం. ఉన్నత విద్యామూర్తులుగా తీర్చిదిద్దాలని ఉబలాటం. కాలం నా పట్ల కరుణ చూపింది కన్నవాళ్లు అందరూ ఉన్నవాళ్లు అయ్యారు రంగుల కలలు కంటూ మాతృభూమి మరచి రెక్కలు వచ్చి గూడు విడిచి పరదేశం ఎగిరిపోయారు. పాలపొంగు లాంటి వయసంతా కరిగిపోయింది వృద్ధాప్యం నా శరీరం మీద దాడి చేసింది. ముడతలపడ్డ శరీరం వణికే చేతులు భారంగా మారింది నా బ్రతుకు అరణ్యరోదన అయ్యింది నా పిలుపు. తోడు గూడు దాటి వెళ్ళిపోయి ఒంటరినైపోయా  కనిపించని దైవo పిలుపు కోసం ఎదురు చూస్తూ. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.          కాకినాడ 94 91792279