పోస్ట్‌లు

పావురం కోసం ప్రాణత్యాగం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పావురం కోసం ప్రాణ త్యాగం

ప్రతిరోజు మనం దానధర్మాలు అనే పదజాలాన్నిచాలా సార్లు వింటూ ఉంటాం. ఈ రెండు వేరువేరు పదాలైనప్పటికీ మన జీవితాలతో అవి పరస్పరంగా కలిసిపోయాయి. దానం అంటే మన దగ్గరున్న దానిని అవసరమైన వారికి ఇవ్వడం. ఈ దానం అనేది ధన రూపంలో గానీ వస్తు రూపంలో కానీ వస్త్ర రూపంలో గాని చెయ్యవచ్చు . ధర్మం అంటే మంచి పనులు చేయడం. మన ధర్మాన్ని పాటించడం. ధర్మం అంటే మన పాత్రను నిస్వార్ధంగా, న్యాయంగా పోషించడం అని అర్థం భారతదేశంలో అనేకమంది దానగుణం కలిగిన వాళ్లు అన్నారు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ మనం చెప్పుకునే వాళ్ళు ఒకరు కుంతీదేవి కుమారుడైన కర్ణుడు, రెండవది శిబి చక్రవర్తి.  అయితే శిబి చక్రవర్తి గొప్ప దాత. దయాగుణం గల చక్రవర్తి. అతను ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞానికి అనేకమంది చక్రవర్తులు మహారాజులు మహర్షులు అతిథులుగా వస్తారు. శిబి చక్రవర్తి వారందరినీ భారీ ఎత్తున సత్కరిస్తాడు. పెద్ద ఎత్తున దానాలు చేస్తాడు. అతని త్యాగనిరతిని ఎంతోమంది కొనియాడుతారు. ఈ విషయం ఇంద్రుడు వద్దకు వెళుతుంది.  యజ్ఞశాలలో కూర్చున్న శిబి చక్రవర్తి తొడ మీద ఒక పావురం వచ్చి వాలి "మహారాజా నన్ను ఒక డేగ తరుముకుంటూ వస్తున్నది. కాబట్టి దాని నుండి నన్ను కాపా...