ఏలూరు జిల్లా యాత్ర
ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండే ఏలూరు 2022 సంవత్సరం నుంచి జిల్లాగా మార్పు చెందింది . కొల్లేరు సరస్సు: ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాల్లో కొల్లేరు సరస్సు ఒకటి. ఇది కొంత భాగం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వ్యాపించి ఉంది. ఇక్కడ రకరకాల చేపలు లభ్యమవుతాయి. అంతేకాకుండా అనేక పక్షులు విదేశాల నుండి సైతం ఇక్కడికి వలస వస్తాయి. ద్వారకాతిరుమల: దీనినే చిన్న తిరుపతి అంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ద్వారకా కొండపై కొలువై ఉన్నారు. దీనిని చిన్న తిరుపతి అంటారు. ఇక్కడ స్వామి అత్యంత మహిమాన్వితుడు. పట్టిసీమ: గోదావరి నది మధ్యభాగంలో ఉండే వీరభద్ర స్వామి దేవాలయం అత్యంత మనోహరంగా ఉంటుంది . మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.