అభ్యుదయ కవిత్వం లో ఆణి ముత్యం
ఒక దశాబ్దం పాటు ఆంధ్ర సాహిత్య లోకాన్ని ఉత్తేజపరిచిన అభ్యుదయ కవిత్వానికి మూలవిరాట్ శ్రీశ్రీ. పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ రచనలలో వ్యక్తికి సంఘ చైతన్యానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఆనాడు సమాజంలో ఉండే సమస్యలకి తన కవిత్వం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి పరిష్కార దిశగా అడుగులు వేయించాడని అర్థమవుతుంది. శ్రీ శ్రీ అభ్యుదయ కవి. అసలు ఈ అభ్యుదయ కవిత్వానికి నిర్వచనం ఏమిటి సాధారణ మానవుడి సంక్షేమమే అభ్యుదయం. శ్రామికుల్లో చైతన్యం కలిగిస్తూ వారి జీవిత సమస్యలను చిత్రించే సాహిత్యమే అభ్యుదయమంటాడు శ్రీ శ్రీ. కమ్యూనిస్టు భావాలు ఉన్నవాడు. మహాప్రస్థానం లాంటి ఎన్నో మహాకావ్యాలు రచించి జనంలో వేడి పుట్టించి సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్షరాల అక్షరాల్లో చూపించాడు. జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ప్రజల్లో ఉత్సాహం పెంచాడు.అంతవరకు భావ కవిత్వపు ధో రణిలో రచనలు సాగుతున్న కాలంలో ఒక్కసారిగా సమాజాన్ని జాగృతం చేసే రచనలు రావడంతో శ్రీశ్రీ ఒక అభ్యుదయ కవి విప్లవ కవి అని పేరుగాంచాడు. అందుకే శ్రీశ్రీ కవిత్వంలోని పదాలన్నీ వాడిగా వేడిగా రక్తాన్ని మరిగించేటట్లుగా ఉంటాయి. అంతవరకు సాహిత్యంలో ప్ర...