పోస్ట్‌లు

మే 13, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

స్నేహం

 స్నేహం చూడగానే ఒక చిరునవ్వు ఆ పైన ఒక ఆత్మీయమైన పలకరింపు ఇదే కదా స్నేహానికి మొదటి మెట్టు. స్నేహం సాధారణంగా జ్ఞానం తెలియని వయసులో అమ్మ ఒడి నుంచి బడికి వెళ్లిన తర్వాత బెంచ్ మీద మీద పక్కన కూర్చున్న వాడితో మొదలవుతుంది   సాయంకాలం పూట పార్కుల్లో ఎదురింటి కుర్రాళ్ళు   పక్కింటి కుర్రాళ్ళు తో ను బలపడుతుంది స్నేహం.  ఈ జీవనయానంలో ఎంతోమంది స్నేహితులు చేతులు   కలుపుతుంటారు విడిపోతుంటా రు. కొంతమంది   బ్రతుకుదారులు వేరైనా కడదాకా కలిసి ఉంటారు. పెరిగి   పెద్దయిన తర్వాత ఒక ఇంటివాడు అయిన తర్వాత పక్కింటి  వాళ్లతోటి ఎదురింటి వాళ్ళ తోటి స్నేహం మొదలవుతుంది.  అయితే నేను చెప్పబోయే వీళ్ళిద్దరు ఒక స్కూల్లో  చదువుకోలేదు. వయసులో చాలా తేడా వృత్తుల్లో తేడా అయినా ఒకే ఊరిలో కాపురం ఉంటూతెల్లవారి లేస్తే ఎవరు వృత్తిలో వాళ్ళు బిజీగా ఉంటూ రక్తసంబంధం లేకపోయినా బావగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటూ కాలక్షేపం చేసే  రామారావు విశ్వనాథ శాస్త్రి ల కథ. రామారావు ఆ ఊర్లో ఒక ఆయుర్వేద వైద్యుడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేస్తూ ఆనందంగా కా...

దేవుడు

 దేవుడు కాసులు ఉన్నవాడికి  లేనివాడికి ఆ దేవుడే దిక్కు  ముక్తి కోసం వచ్చే భక్తులకి  గుడి లోపల దేవుడు వరాలు ఇస్తాడు.  భుక్తి కోసం పడిగాపులు కాచే అన్నార్తులకి  భక్తుల చేత వరహాలిప్పిస్తాడు దేవుడు గుడి ముందు కూర్చున్న బిచ్చగాడు  గుడిలోకి అడుగుపెట్టడు  ఎందుకని  గుడిలో నుంచి తన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ  దేవుడికి ప్రతిరూపాలని నమ్ముతాడు కాబట్టి. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

గూర్ఖా

  గూర్ఖా  వీధి వీధి తిరిగి నిశి రాత్రంతా జాగరణ చేసి  చిమ్మ చీకటిలో మన సొమ్ముకి కాపు కాసి మనం సొమ్మసిల్లి నిద్రపోయేలా చేసి  నెలాఖరులో సలాము చేసే పరదేశి  ఊరు తెలియదు పేరు తెలియదు  జాతి పేరుతోనే చలామణి. తరతరాలుగా లేదు ఆదరణ అయినా చిమ్మ చీకటిని నమ్ముకుని  బ్రతుకు సాగిస్తున్నాడు ఈ బడుగు జీవి.  సలాము కొట్టి గుమ్మoల్లో నిలబడితే  సాకులు చెప్పకుండా సంతోషపెడదాం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.  కాకినాడ 9491792279

8+8+8 రూల్

 ప్రతి మనిషి జీవితంలో కాలం చాలా విలువైనది. ఒకసారి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ప్రతి ఒక్కరూ కాలం విలువ గమనించి సద్వినియోగం చేసుకునే దిశలో మనం ముందుకు సాగాలి. ఒక రోజంటే 24 గంటల సమయం. ఇది అందరికీ సమానమే. అయితే దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే మనిషికి మనిషికి తేడా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. ప్రతి వ్యక్తి బ్రతకడానికి ఏదో ఒక  వృత్తి చేయవలసి ఉంటుంది. దానికి ఎనిమిది గంటల సమయం కేటాయించుకోవాలి. ఇకపోతే ఒక రోజులో మిగిలినది 8 గంటల సమయం. ఈ ఎనిమిది గంటల సమయాన్ని తన కుటుంబం తోటి, స్నేహితుల తోటి, మత విశ్వాసాలతోటి, హాబీల తోటి, శారీరక ఆరోగ్యం కోసం నడక, పరిగెత్తడం, ఎక్సర్సైజులు చేయడం వంటి వాటి కి కేటాయించాలి. అప్పుడు కాలం సద్వినియోగం అవుతుంది. 

శారదా పీఠాలు

 ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలు (శారదా పీఠాలు) భారతదేశంలోని నాలుగు దిశలలో ఉన్నాయి. ఇవి శంకరాచార్యుల ఆధ్వర్యంలో సనాతన ధర్మాన్ని ప్రచురించే కేంద్రాలుగా స్థాపించబడ్డాయి. ఈ పీఠాలు "అమ్నాయ పీఠాలు" అని కూడా పిలవబడతాయి. నాలుగు శారద పీఠాలు: 1. శృంగేరీ శారదా పీఠం (Sringeri Sharada Peetham) – కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరీలో ఉంది. ఇది దక్షిణ భారతదేశపు పీఠం. వేదం: యజుర్వేదం (శుక్ల యజుర్వేదం) దేవత: శారదా దేవి ఆచార్యులు: శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వాములు (ప్రస్తుతం) 2. పూరీ గోవర్ధన పీఠం (Govardhana Pitha) – ఒడిశాలోని పూరీలో ఉంది. వేదం: ఋగ్వేదం దేవత: జగన్నాథ స్వామి ఆచార్యులు: శ్రీ శ్రీ నిశ్చలానంద సరస్వతి (ప్రస్తుతం) 3. ద్వారకా శారదా పీఠం (Dwarka Sharada Peetham) – గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాలో ఉంది. వేదం: సామవేదం దేవత: ఆది శక్తి / శారదా మాత ఆచార్యులు: స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి వరదాప్తుని తర్వాత వివాదాస్పదంగా కొనసాగుతున్నది. 4. జ్యోతిర్ పీఠం (Jyotir Math or Jyotirmath) – ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బదరీనాథ్ సమీపంలో ఉంది. వేదం: అథర్వవేదం దేవత: నారాయణ ఆచార్యులు: స్వామి అవిమ...

పక్షులు నేర్పే పాఠాలు

పక్షులు నేర్పే పాఠాలు ఈ విశాల ప్రపంచంలో మన చుట్టూ మనతో పాటే సహజీవనం చేసేవి పక్షులు. దేవుడిచ్చిన రెండు కాళ్ళతో జీవిత గమనం సాగించేవాడు మాట తెలిసిన మనిషి. రెండు కాళ్లతో పాటు రెక్కలు కూడా ఉండి మూగజీవులుగా పిలవబడుతూ గగన మార్గంలో స్వేచ్ఛగా ఎగురుతూ తన జీవనయానo సాగించేవి పక్షులు.  తెల్లవారి లేస్తే ఆకాశంలోనూ చెట్టు కొమ్మల మీద మన ఇంటి చూ రులోనూ పక్షులు కనబడి విచిత్రమైన ధ్వనులు చేస్తూ మన మనసుకి ఆనందం కలగజేస్తాయి.  పక్షుల నుండి మనం నేర్చుకోవాల్సింది అనేకం ఉన్నాయి. అవి చిన్న జీవులు కావచ్చు, కానీ వాటి జీవనశైలి, సహజ నైపుణ్యాలు, సమయపట్టిక, త్యాగం, సహనం వంటి అంశాలు మన జీవితానికి గొప్ప పాఠాలు. 1. స్వేచ్ఛా జీవనం – స్వతంత్రతకు విలువ పక్షులు ఎవరినీ అడగకుండా ఆకాశంలో విహరిస్తాయి. మనకూ మన అభిప్రాయాలకు స్వేచ్ఛ అవసరం. స్వతంత్రంగా జీవించడం ఒక గొప్ప గుణం. 2. సమయపాలన (Discipline) పక్షులు సాయంత్రం సంధ్యాకాలానికి ముందే గూళ్లలోకి చేరుతాయి. ఉదయాన్నే కుక్కులు, కోయిలలు మొదలు పాడటం ప్రారంభిస్తాయి. ఇది మనకు సమయపాలన పాఠాన్ని నేర్పుతుంది. 3. కృషి మరియు ధైర్యం ఒక చిన్న పక్షి ఎన్నో సార్లు కిందపడినా ఎగరడం నేర్చుకుం...

ప్రధాన మంత్రి బీమా యోజన

ప్రధానమంత్రి బీమా యోజన – ప్రశ్నలు & సమాధానాలు 1. ప్రధానమంత్రి బీమా యోజన అంటే ఏమిటి? సమాధానం: ప్రధానమంత్రి బీమా యోజన అంటే, సామాన్య ప్రజలకు తక్కువ ప్రీమియంతో జీవిత బీమా మరియు ప్రమాద బీమా అందించే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు. వీటిలో రెండు ముఖ్యమైనవి ఉన్నాయి: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) 2. PMJJBY అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటి? సమాధానం: PMJJBY (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana): ఇది జీవిత బీమా పథకం. వయసు: 18 నుంచి 50 ఏళ్ళ మధ్యవారికి అందుబాటులో ఉంటుంది. బీమా మొత్తము: మరణించాక కుటుంబానికి రూ. 2 లక్షలు లభిస్తాయి. ప్రీమియం: సంవత్సరానికి రూ. 436/- మాత్రమే. బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయాలి. 3. PMSBY అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటి? సమాధానం: PMSBY (Pradhan Mantri Suraksha Bima Yojana): ఇది ప్రమాద బీమా పథకం. వయసు: 18 నుంచి 70 ఏళ్ల మధ్యవారికి అందుబాటులో ఉంటుంది. ప్రీమియం: సంవత్సరానికి రూ. 20/- మాత్రమే. ప్రమాదంలో మృతి లేదా పూర్తిగా వికలాంగులైతే రూ. 2 లక్షలు లేదంటే రూ. 1 లక్ష అందుతుంది. --- 4. ఈ పథకాలకు ఎలా నమోదు చేసుకోవా...