చెవిలో చెబితే!
చెవిలో చెబితే! మనిషి జన్మంతా కోరిక మయం. బాధల మయం కోరిన కోరికలు తీర్చుకోవడానికి మనిషి దేవుడిని నమ్ముతాడు. దేవాలయాల కి వెళ్తాడు. మ్రొక్కులుచెల్లిస్తాడు . ఏడుకొండలు ఎక్కితే గాని వెంకటేశ్వర స్వామి కరుణించడు. పదునెనిమిది మెట్లు ఎక్కితే గాని అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి కాదు. శ్రీశైల శిఖర దర్శనం చేస్తే గాని శివయ్య కరుణాకటాక్షాలు భక్తులకు లభించవు. ఏ దేవాలయంలో నైనా గర్భగుడిలో భక్తులకు అనుమతి లేదు. కొన్ని దేవాలయాల్లో తప్పితే దేవుని భక్తులు తాకరాదు. కానీ ఒక అపురూపమైన స్వామి భక్తుల కోరికలను తన చెవిలో చెప్పించుకుని ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు . ఆ స్వామి ఎవరో కాదు కాకినాడ జిల్లా బిక్కవోలు గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి. ఇది పురాతనమైన దేవాలయం. ఈ స్వామికి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద శిలావిగ్రహం. భూమి లోపల ఎన్ని అడుగులు ఉందో ఎవరికీ తెలియదు . చాళుక్యుల కాలంలో కట్టిన గుడి అని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ స్వామి అనుగ్రహం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుని అన్న ప్రసాదం స్వీకరించి వెళ్తుంటారు. పూజాదికాల సమయాలు ఎక్కడా వివరాలు లభించలేదు. గుడ...