పోస్ట్‌లు

మే 17, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మామిడి తాండ్ర

కాకినాడ జిల్లా సర్పవరం గ్రామం మామిడి తాండ్ర (మామిడి జెల్లీ) తయారీలో ప్రసిద్ధి పొందింది. ఇది తీపి, పులుపు రుచులతో కూడిన చిరుతిండి, మామిడి పండ్ల రసాన్ని పొరలుగా ఎండబెట్టి తయారు చేస్తారు.  తయారీ విధానం: మామిడి తాండ్ర తయారీలో  అన్ని రకాల మామిడి పండ్లను ఉపయోగిస్తారు. మామిడి రసాన్ని సేకరించి, పెద్ద తాటాకు చాపలపై పొరలుగా పోసి, ప్రతి పొరను ఎండబెట్టి, తదుపరి పొరను వేసి, ఈ ప్రక్రియను 2–4 వారాల పాటు కొనసాగిస్తారు. తయారైన తాండ్రను ముక్కలుగా కోసి, ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు.   పరిశ్రమ స్థితి: సర్పవరం, పండూరు, తమ్మవరం వంటి గ్రామాల్లో మామిడి తాండ్ర తయారీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ పరిశ్రమలో సుమారు 5,000 మంది ఉపాధి పొందుతున్నారు. అయితే, ముడి సరుకు ధరలు పెరగడం, తోటాపురి మామిడి దిగుబడి తగ్గడం వంటి సమస్యలతో పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఉదాహరణకు, టన్ను మామిడి ధర ₹16,500 నుండి ₹22,500కి పెరిగింది.   కొనుగోలు: సర్పవరం మామిడి తాండ్రను ఆన్‌లైన్‌లో JioSweet.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. 500 గ్రాముల ప్యాక్ ధర ₹299, మరియు ఉచిత డెలివరీ అందుబాటులో ఉంది.

పొట్టి పెసరట్టు

కాకినాడ పనిమీద వచ్చిన వాళ్ళు తెల్లవార గానే ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎవరూ ఉండరు.  ఇంతకీ ఆ ప్రాంతం ఏమిటి? ఆ ప్రదేశం పేరు దేవాలయం వీధి. దేవాలయాలన్నీ ఒకే చోట ఉండడం వలన ఆ పేరు వచ్చింది.  అయితే ఈ ప్రదేశంలో మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కాకినాడ పొట్టి పెసరట్టు. తెల్లవారింది అంటే చాలు అక్కడ జనం పొట్టి పెసరట్టు నిలబడి తింటూ ఉంటారు. ఇది ఇంచుమించుగా అరవై సంవత్సరములు పైగా ఇదే వ్యాపారం ఇక్కడ జరుగుతోంది. ఇదేమీ ఫైవ్ స్టార్  హోటల్ కాదు. ఒక చిన్న రోడ్డుపక్క షాపులో జరిగే వ్యాపారం. రుచి అమోఘం. కాకినాడకు వన్నెతెచ్చిన వంటకాలలో ఈ పొట్టి పెసరట్టు ఒకటి.  ఉదయం పూట పొట్టి పెసరట్టు, మధ్యాహ్నం సుబ్బయ్య గారి  భోజనం , మధ్యలో కోటయ్య గారి కాజా రుచి చూడకుండా ఎవరు వెళ్లరు. మీరు రుచి చూడండి పొట్టి పెసరట్టు. ఆకారం చిన్నది. రుచి పెద్దది. తినడం మొదలుపెడితే మారు అడగకుండా ఉండేది. మళ్లీ మళ్లీ తినాలనిపించేది. కాకినాడ పొట్టి పెసరట్టు.

కర్ణుడు

కర్ణుడు  మన భారతీయ ఇతిహాసాల్లో గొప్ప వ్యక్తిత్వాలెన్నో ఉన్నాయి. కానీ ఆ మహాకావ్యాల క్షితిజంలో ఒక తారగా ప్రకాశించిన వాడెవడంటే, అది కర్ణుడు. అతనిలోని తేజస్సు, దానం, పరాక్రమం, తండ్రికి తెలియకపోయిన కుమారుడిగా మిగిలిపోవడం, మాతృమూలంగా సమానత్వం లేని అన్యాయం… ఇవన్నీ కలిసి కర్ణుని జీవితాన్ని విషాదగాథగా  మలిచాయి. జన్మగాథ – సూర్యపుత్రుని కర్మగతి కర్ణుడు కుంతి గర్భంలో జన్మించాడు. ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల సూర్యదేవుని పుత్రుడిగా కర్ణుడు పుట్టాడు. కాని ఆమె భయపడి కుమారుడిని తండ్రి కోసమే కాదు, సమాజపు భయంతోనూ ఓ చిన్న తొట్టిలో పెట్టి నదిలో వదిలేసింది. సూతపుత్రునిగా జీవితం అతడు సూతపతి అదిరథ, రాధ దంపతుల చేత పెంచబడాడు. వాళ్ల పట్ల ఆయనకు అపారమైన ప్రేమ ఉండేది. అయినా సమాజం అతన్ని ‘సూతపుత్రుడు’ అనే ముద్రతో అణచివేసింది. కానీ అతని లోపల నిండిన పరాక్రమం, విద్యాప్రతిభలు అతన్ని అర్జునుని సమానుడిగా నిలబెట్టాయి. పరశురాముని శిష్యత్వం బ్రాహ్మణుడిగా విద్యల కోసం కర్ణుడు పరశురాముని దగ్గర శిక్షణ తీసుకున్నాడు. కానీ చివరికి తన అసలైన వర్ణాన్ని దాచినందుకు గురువుకి తెలియగానే శాపం పొందాడు – అత్యంత అవసర సమయంలో ఆ...

చీకటి

చీకటి చీకటి అంటే ఎవరికైనా భయమే. బ్రతుకులో వెలుగును కోరుకుంటారు అందరూ మరి కొందరు చీకటినే కోరుకుంటారు. చీకటి చిమ్మే రాత్రి వారికే ఎందుకు ప్రత్యేకo. వారి బ్రతుకుకు వెలుగు దొరికేది రాత్రిపూటే. జీవన గమనం సాగాలంటే చీకటి పడాల్సిందే. అందరూ దేవుడు సృష్టించిన బొమ్మలే. కొందరి తలరాత బ్రహ్మకే అర్థం కాదు. నిశి రాత్రి లో నల్లటి రహదారి పక్కన గాజుల సవ్వడి ,మల్లెల వాసన ఆ సంకేతం కావాల్సిన వారికి అర్థమైంది. బ్రతుకులో ఎన్ని చీకట్లు ఉన్నాయో మదిని దోచే ఎన్ని బాధలు ఉన్నాయో గుండెలో ఎన్ని మంటలు ఉన్నాయో. చీకటే బ్రతుకుకి చూపించింది ఆధారం బాధ్యత బలవంతంగా ముందుకు తోసింది. ఒళ్ళు అమ్ముకునేలా చేసింది ఒకరిని. ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం పరిగెత్తించి కన్ను పడిన దాన్ని కనపడకుండా చేసి చీకట్లో బ్రతుకు యానం సాగించేది మరొకరు. పగటిపూట దొరబాబుల వెలిగిపోతుంటాడు. కారు చీకట్లో కావాల్సిన దాన్ని చేజిక్కించుకుంటాడు. చీకటే వారి బ్రతుకుకి ఊపిరి. వీధి వీధి తిరిగి నిశి రాత్రంతా జాగరణ చేసి చిమ్మ చీకటిలో మన సొమ్ముకి కాపు కాసి మనo సొమ్మసిల్లి నిద్రపోయేలా చేసి నెలాఖరులో సలాము చేసే పరదేశి . పేరు తెలియదు ఊరు పేరు తెలియదు ముద్దుగా జాతి పే...

శల్య సారథ్యం

శల్య సారథ్యం – ధర్మం మరియు వ్యూహానికి నడుమ ఒక రాజుని అంతర్మధనం మహాభారతం అనేది కేవలం పాండవులు-కౌరవుల మధ్య యుద్ధ కథ మాత్రమే కాదు. అది మనుషుల నడుమ ఉన్న సంబంధాలు, విధి, కర్తవ్యం, ధర్మం మధ్య కలిగే సంఘర్షణల నిఘంటువు. అందులో ఒక అసాధారణమైన పాత్ర శల్యుడు. అతని కథ మనల్ని చింతనలో పడేస్తుంది. శత్రుపక్షంలో ఉండి స్నేహితులకు సహాయం చేసిన ఈ రాజు పాత్ర ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతుంది. మద్ర దేశపు మహారాజు శల్యుడు మద్ర దేశానికి  రాజు. అతని సోదరి మాద్రీ, పాండు మహారాజుతో వివాహమై నకులుడు, సహదేవుల తల్లి అయింది. ఈ కారణంగా శల్యుడు పాండవులకు మామగారు. మంచి రాజనీతి, ధైర్యం, దానశీలత కలిగిన శల్యుడు ధర్మానికి కట్టుబడినవాడు. యుద్ధానికి ముందు తన మేనల్లళ్లు నకులుడు, సహదేవుడు ఉన్న పాండవుల పక్షాన ఉండాలని నిర్ణయించుకున్నాడు. దుర్యోధనుని వ్యూహం – మాట ఇస్తే మారలేను శల్యుడు పాండవుల శిబిరానికి ప్రయాణించేటప్పుడు దుర్యోధనుడు ఒక వ్యూహాన్ని అమలు చేశాడు. ముందే శల్యుడి దారిలో రాజసం, ఆతిథ్యంతో ఉన్న శిబిరం ఏర్పాటు చేశాడు. అపురూప ఆతిథ్యం చూసిన శల్యుడు ఆశ్చర్యపోయాడు. ఆతిథ్యానికి పాత్రుడు ఎవరో అడిగినప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి, నే...