పోస్ట్‌లు

జూన్ 8, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పెద్దల కథ

" ఏవండి రామయ్య గారు! ఎందుకొచ్చిన అవస్థ . రోజు క్యారేజీ తెప్పించుకుని తినడం ఆరోగ్యం బాగోలేక పోతే వాళ్లని వీళ్ళని బతిమాలి ఆసుపత్రికి తీసుకు వెళ్ళమనడం ఇవన్నీ ఎందుకండీ హాయిగా నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులు దగ్గరికి వెళ్లి పొండి సీతమ్మ గారు మీరేనా చెప్పండి ! అంటూ క్యారేజీ తీసుకొచ్చిన రామశాస్త్రి మాటలకి ఆ దంపతులు ఇద్దరు పేలవంగా ఒక నవ్వు నవ్వేరు. ఆ నవ్వు అర్థం ఏమిటో తెలియలేదు రామ శాస్త్రి కి. ఎప్పుడు ఏమీ మాట్లాడరు. నేను ఎప్పుడు ఏం అడిగినా ఇలాగే నవ్వుతారు అంటూ ఖాళీ క్యారేజీ తీసుకుని వెళ్లిపోయాడు రామశాస్త్రి. రామ శాస్త్రి కాదు ఊర్లో వాళ్ళందరూ కనపడినప్పుడల్లా ఆ మాటలు మాట్లాడినా ఆ దంపతులకు గుండె తీయని బాధతో మూలుగుతూ ఉంటుంది రామయ్య ఆ ఊర్లో ఒక ప్రభుత్వ స్కూల్లో టీచర్ గా పని చేస్తూ ఉండేవాడు. నలుగురు మగ పిల్లలకి ఉన్నత చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసి వ్యక్తిగతమైన బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, కూడా పూర్తిచేసుకుని హాయిగా సొంత ఊర్లోనే కాలక్షేపం చేస్తుండేవారు రామయ్య, సీతమ్మ దంపతులు.  అయితే కొద్ది కాలానికి రామయ్య పాపం అనారోగ్యం వచ్చి మంచం మీద పడ్డాడు. నిజానికి రామయ్య మంచం మీద పడడంతో బాధ్యతలన్నీ...

కుటుంబ దినోత్సవం

"పిల్లలు ఇంకా లేవలేదా?" అని అడిగాడు రాఘవయ్య, తన భార్య సరితను, తాను స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తూ. "లేదండీ, ఇవాళ ఆదివారం కదా! అప్పుడే లేస్తారా!.మరి మీరు రెడీ అవుతున్నారు?" అని ప్రశ్నించింది సరిత. "అవును, ఆడిట్ పనులు ఉన్నాయి. అందుకే వెళ్తున్నా," అన్నాడు రాఘవయ్య. "మరి భోజనం?" "అది అంతా బ్యాంకులోనే," అని చెప్పి, స్నానం చేసి వచ్చి, బట్టలు మార్చుకుని, బ్యాగ్ తీసుకుని స్కూటర్‌ ఎక్కి వెళ్ళిపోయాడు. పెళ్లైనప్పటి నుంచీ సరితకు ఇది మామూలే. ఏ పండగ వచ్చినా, సెలవు వచ్చినా, ఆదివారం అయినా రాఘవయ్య ఇంట్లో ఉండే సమయం తక్కువే. మొదట్లో ఇది ఆమెకు బాధగా అనిపించేది. క్రమంగా అలవాటయ్యింది. రాఘవయ్య తరచూ పిల్లలకు కొన్ని ప్రామిసులు చేసేవాడు. కానీ ఆదివారం వచ్చేసరికి ఏవో పనుల కారణంగా వాయిదా వేసేవాడు. పిల్లలకు చెప్పేందుకు సరితకి తలప్రాణం తోకకి వచ్చేది. అంతేకాదు – పక్క ఊర్లో ఉంటున్న ముసలి తల్లిదండ్రులు, తమ్ముళ్లు, చెల్లెల్ల ఫోన్లు వచ్చినా మాట్లాడే సమయం ఉండేది కాదు. మాట్లాడకుండా ఉంటే – "ఇప్పుడు గొప్పవాడు అయిపోయాడు", "గర్వంగా మారిపోయాడు", "తల్...

పిన్ కోడ్ కి గుడ్ బై

పిన్ కోడ్‌కు గుడ్‌బై! భారత తపాలా శాఖ నూతన డిజిటల్ చిరునామా 'DigiPIN' ప్రారంభం – మీ డిజిపిన్ ఎలా తెలుసుకోవాలి? ప్రముఖమైన తపాలా చిరునామా విధానం అయిన పిన్ కోడ్ యుగం ముగిసిపోయింది. దీని స్థానంలో భారత తపాలా శాఖ సరికొత్త డిజిటల్ చిరునామా విధానమైన డిజిపిన్ (DigiPIN) ను ప్రవేశపెట్టింది. ఇకపై దేశవ్యాప్తంగా చిరునామా పద్ధతిలో డిజిపిన్ అనేది కొత్త ప్రమాణంగా మారనుంది. సాంప్రదాయ పిన్ కోడ్ ఒక విశాల ప్రాంతాన్ని సూచిస్తే, డిజిపిన్ మాత్రం మీ ఇంటి లేదా వ్యాపార స్థలపు ఖచ్చితమైన భౌగోళిక స్థానం (4 మీటర్ల పరిధిలో) ను సూచిస్తుంది. 📌 పిన్ కోడ్ Vs డిజిపిన్ – వ్యత్యాసాలు లక్షణం పిన్ కోడ్ డిజిపిన్ అంకెల సంఖ్య 6 అంకెలు 10 అంకెలు పరిధి విశాల ప్రాంతం (పల్లె, పట్టణం) ఖచ్చితమైన స్థానం సాంకేతికత జోన్ ఆధారిత పద్ధతి జియోకోడెడ్ డిజిటల్ సిస్టం  సుమారు 4 మీటర్ల లోపు .ఆఫ్లైన్ ఉపయోగం సాధ్యమే  అభివృద్ధి చేసిన వారు తపాలా శాఖ తపాలా శాఖ + IIT హైదరాబాద్ + ISRO + NRSC 🌍 డిజిపిన్ ఎలా తెలుసుకోవాలి? మీ ఇంటి లేదా కార్యాలయానికి సంబంధించిన డిజిపిన్ తెలుసుకోవాలంటే ఈ దశలను అనుసరించండి: 1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: 👉 h...

ఇద్దరు ఇద్దరే

 ఇద్దరు ఇద్దరే  "అమ్మ వచ్చే నెలలోనే నీ పుట్టినరోజు కనీసం ఈ పుట్టినరోజుకి అయినా ఒక చీర కొనుక్కో అంటూ కూతురు రమ్య చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోయింది వసంత. వసంత మౌనానికి అర్థం రమ్యకు తెలుసు అందుకే మళ్లీ ఆ విషయం రెట్టించకుండా ఉండిపోయింది .అయినా అమ్మ కష్టం ఇంకెన్నాళ్లు అన్నయ్య చదువు అయిపోతో oది. క్యాంపస్ లో ఎక్కడో అక్కడ ఉద్యోగం వస్తుంది. అన్నయ్య అంది వచ్చాడంటే అమ్మ సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబం ఒక దారిలో పడుతుంది . పాపం నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో అమ్మ మీద ఈ కుటుంబ బాధ్యత పడి కుటుంబాన్ని ఇలా గుట్టుగా నెట్టుకొస్తోంది అనుకుంటూ చదువులో మునిగిపోయింది రమ్య. వసంత భర్త రాజారావు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగి. అనుకూలవతి అయిన భార్య తో ఇద్దరు పిల్లలతో మంచి ఇంట్లో ఆనందంగా కాలక్షేపం చేసేవారు. రాజారావు పెద్ద జీతగాడు కాకపోయినా ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించేవారు. అలాంటి కుటుంబానికి దిష్టి తగిలింది ఏమో హఠాత్తుగా రాజారావు గుండెపోటుతో చనిపోయాడు. రాజారావు భార్య వసంత పెద్దగా చదువుకోలేదు. అయినా గవర్నమెంట్ వారు దయ తలచి రికార్డ్ కీపర్ గా ఉద్యోగం ఇచ్చారు. రాజారావు బతికున్న రోజుల్లో బాగా బతికినా అంత ప...

శ్రీకృష్ణ లీలలు

నల్లటి శరీరం, కమలo వంటి కళ్ళు, ఆ కళ్ళల్లో కృపారసం చేతిలో వేణువు, తల మీద పరిసర్పిత పింఛo ,ఎప్పుడూ నవ్వుతూ విరాజిల్లే మొహం. ఇది పోతన గారి శ్రీకృష్ణుడి వర్ణన. ఆ వర్ణన చదువుతుంటేనే మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ని మనం చూడలేకపోయినా వెన్నదొంగగా ఒక రాధాకృష్ణుడిగా అల్లరి కృష్ణుడిగా చిత్రపటంలో చూసినప్పుడు మనసుకు పదేపదే ఆ ముగ్ద మోహన రూపాన్ని చూడాలని అనిపిస్తుంది . సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలీకులుగా పెరిగిన ఆ యాదవులు ఎంతటి అదృష్టవంతులో అనిపిస్తుంది.  నిజమే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తో స్నేహితులుగా మెలిగిన యాదవులు చాలా ధన్యాత్ములు. అంటే భగవంతుని పక్కనే ఉండి తమ స్నేహితుడే భగవంతుడు అని తెలియని వాళ్లు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తుతూ వచ్చాడు. ఇలా ఒకసారి అధర్మం పెరిగినప్పుడు భూదేవి ఆ రాక్షస కృత్యాలను తట్టుకోలేక బ్రహ్మ దేవుడికి మొరపెట్టుకుంటుంది.. అప్పుడు బ్రహ్మదేవుడు భూమాతను వెంటబెట్టుకుని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు.  రాక్షస సoహారం చేయడానికి విష్ణుమూర్తి తాను శ్రీకృష్ణుడిగా దేవకీదేవ...