పల్లెకవి గోరేటి
పల్లె కవి _ గోరేటి భారతదేశం కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. ఆదికావ్యాల నుంచి ఆధునిక కవిత్వం వరకు, అనేక మంది కవులు సమాజాన్ని ప్రతిబింబిస్తూ, మన సంస్కృతిని అభివ్యక్తం చేశారు. వీరిలో కొందరు ప్రేమను, కొందరు విరహాన్ని, మరికొందరు సమాజాన్ని కవిత్వంగా మలిచారు. అయితే, ఒక కవి మాత్రం తన జన్మభూమి పల్లెను, అక్కడి జీవనాన్ని తన కవిత్వంగా అక్షరాల్లో చూపించాడు. అతను ప్రజా కవి గోరేటి వెంకన్న. గోరేటి వెంకన్న పాటలు పల్లె జన జీవనంలోని ప్రతిబింబాలు. అతని కవిత్వంలో మట్టివాసన ఉంది.పేదల కష్టసుఖాలున్నాయి, ప్రకృతితో మమేకమైన జీవన సౌందర్యం ఉంది. వేదిక మీద నిలబడి, తన స్వరంతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లే శక్తి ఆయన గీతాలలో ఉంది. ఆయన పాటలు కల్పితాలు కాదు, పచ్చి నిజాలు. పల్లె కష్టాలను, ప్రకృతిలోని మాధుర్యాన్ని ప్రతిబింబించే మహాకవి వెంకన్న. పల్లె కన్నీటి గాథ "పల్లె కన్నీరు పెడుతోంది" అంటూ చేతివృత్తులపై ఆధారపడిన ప్రజల బాధను తన గీతాల ద్వారా వ్యక్తీకరించారు. వృత్తి కోల్పోయిన పల్లె ప్రజలు పట్టణాల్లో ఎలా అల్లాడుతున్నారో, వారికి ఎదురవుతున్న అనుభవాల్ని పదాల రూపంలో చెబుతారు. "కులవృత్తికి సాటి లేదు గువ్వ...