పోస్ట్‌లు

ఏప్రిల్ 25, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మగువ

మగువేకద మగనకి అండ దండ ఆమెతో జీవితం మగనికి వెండికొండ. వెండికొండ అంతా శివుని పరం పార్వతి మనసంతా శివ మయం. అందుకే జగము మెచ్చే జంట పార్వతీ పరమేశ్వరo. పులి తోలు తప్ప పండుగలకు కూడా పంచ కట్టడు. భస్మం పుట్టిన చోటే భయం లేకుండా ఉంటాడు. నయా పైసా ఖర్చు లేకుండా నందీశ్వరుడే వాహనం. అయినా ఆ మగనిని మెచ్చిందిఈ మగువ. లోకానికే ఆదర్శం అయ్యిందిఈ జంట.  శివుడు విల్లునే క్షణంలో విరిచాడు   అందాల జానకిని చేపట్టాడు మా సుకుమారుడు అందాల రాముడు. అయినా ఏం లాభం కాపురం అంతా అడవిపాలు.     అశోకవనమే ఆమెకు గతి. పతి మాట జవదాటని సుదతి. పుడమి నుంచి పుట్టింది ఈ అయోనిజ. పుట్టింటి నుంచి తెచ్చుకుంది సహనం. సీతమ్మ అంటే మాకు ఆదర్శo. రామనామమే ఆమెకు రమ్యం. కురు వంశం అంతా ఉండే గౌరవ సభ. పతివ్రత కే జరిగింది పరాభవం. ఆమెకు దైవమే చేసింది సహాయం. పంచ భర్తృక అయినా పతివ్రత అయ్యింది. పరమాత్మ మెచ్చిన పడతి. ఇంకేం చెప్పాలి ఈ అమ్మ ఔనత్యం. తొలి సంగ్రామం లోనే ఆంగ్లేయులను తరిమికొట్టింది ఆమె ధీరత్వం. వీరత్వానికి మారుపేరు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆడ జన్మకు కరుణ జన్మహక్కు. నవమాసాలు మోయకపోయినా అనాధలందరికీ ఆశ్రయo. ప్రపంచ చరిత్ర లోన...

పెళ్లి

ఒకరి కోసం ఒకరు ఒకరి తలపుల్లో ఒకరు. ఒక మంత్రం పెనవేసిన బంధం. ధర్మబద్ధంగా చేసే కాపురం దాంపత్యం. దాంపత్యానికి పునాది పాణిగ్రహణం. కన్యను చేపట్టడం పాణిగ్రహణం. పరమాత్ముడే వరుడు పరమాత్మిక వధువు జరిగేది జగత్ kalyanyam. మామిడిఆకుల తోరణo పందిరికీ అందం వాయు శుద్ధి సైన్స్ చెప్పిన అంతరార్థం. ఫోటోగ్రాఫర్ ఫోకస్ లో గోరింటాకు ప్రథమం  సౌభాగ్య ప్రదమే గోరింటాకు అలంకరణం . నరదృష్టి కి నల్ల రాయి పగులు. పర దృష్టి మరల్చడం భాషికముతో అలంకారం. బుగ్గన చుక్కతో మా చుక్కకి మరింత అందం. అగరు చుక్కతో దిష్టి ఆమడ దూరం. అంకురార్పణ వివాహ ఘట్టం లో తొలిమెట్టు. కళ్యాణానికి ఇది శుభమస్తు శ్రీకారం. నవధాన్యాపు మొలకలా పచ్చగా ఉండాలని పరమార్థం. వర శుద్ది కోసం చేసేది స్నాతకం. ప్రాయశ్చిత్తమే పరమార్థం. గోత్ర ప్రవరలు వల్లించడమే అంతరార్థం. వరుడి కాశీ ప్రయాణం  బావమరిది వాగ్దానం ఆహ్వానితులకు కుఆనందం. తియ్యటి పానకం తో పరిచయాలు , పలకరింపులు ఎదురుసన్నాహం. ఆడబిడ్డ అంటే అర్ధ మొగుడు.  ఆడబిడ్డలకు ఆత్మీయ సత్కారం  పానకం బిందెలతో బిడ్డ పరమానందం. సంప్రదాయము ఇంత సుందరం.  మంగళములు కలుగజేయునది మాంగల్యం. మాంగల్య మునకు అధి...

సాగరం

సముద్రపు నీళ్లన్నీ ఉప్పుమయం గొంతు దింపాలి అంటే భయం. భూభాగంలో మూడొంతులు జలభాగం. అయినా మనిషికి తీరటం లేదు దాహం. ఉప్పు నీళ్ళు అయినా అది జలమే పంచ భూతం లో అది లెక్క లోనే పంచభూత పరమార్ధం పరోపకారార్ధం ఇదం శరీరం చేపల పులుసు అంటే లొట్టలేసుకుని తింటాం. జలధి నుంచి పుట్టిందే కదా ఆ ఆణిముత్యం. నీళ్ల మీదే కదా బెస్త వారి బతుకు పోరాటం. జలరాసులే కదా వారి కాసుల పంట. కెరటాలే కదా సాగరానికి అందం వచ్చే కెరటం పోయే కెరటం మన జీవితంలో కష్టం సుఖం తో సరి సమానం అయినాతరతరాలుగా సాగుతూనే ఉంది సాగరం. మనిషి నేర్చుకోవాలి మరింతగా ముందుకు సాగడం.  సాగరఘోష బూడిదలో పోసిన పన్నీరు. ఆర్చే వారు ఉండరు తీర్చే వారు ఉండరు. అయినా సాగరం ప్రయత్నం ఆపదు.  అదే కదా మనిషికి స్ఫూర్తి. సాగరానికి ఏమి తెలుసు తన ఘోష   ఒక స్వరకారుడి స్వరమై నంది పతకాలు అలంకరించుకుందని. ఒక కవికి మహాకావ్యమై పద్మశ్రీలను అందుకుoదని. అవార్డులు తెచ్చిపెట్టిన ఒక సినిమాకు పేరు సముద్రం. బండి నడవాలంటే ఇంధనం కావాలి. ఇంధనంతోటే మరింత ధనం దేశానికి. అగాధం నుంచి ఇంధనం మనకందరికీ వరం. మన చమురు వాయువుల సంస్థ దేశానికే గర్వకారణం. నిత్యంమన సముద్రుడికి చెయ్యాలి ...

కన్నీరు

గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం జల జలమంటూ కళ్ళు వెంట కన్నీరు మనిషి కళ్ళవెంట చెప్పే తన భావం కన్నీళ్లు. ఆనందంతో వచ్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలు. ప్రతి జీవికి కన్నీళ్లు దేవుడిచ్చిన వరం కన్నీళ్లే రాకపోతే కఠినాత్ముడు అని నామకరణం. మనసులో భావం చెప్పే గొప్ప సంకేతం. బిడ్డ కంట కన్నీరు అమ్మకే తెలుసు. పసివాడి భావం కన్నీటితోనే తెలుపు. మాట వచ్చేవరకూ అమ్మకి కన్నీటి తోనే సంకేతం ఇచ్చు. మనసులోని భావo చెప్పడానికే భాష పసివాడి భాషే కంట వెంట కారే నీరు బిడ్డకు అమ్మకి మధ్య వారధి కన్నీళ్లు. బట్ట తడిసింది ఏమో అని అమ్మ గుడ్డలకోసం వెతుకు. డొక్క చూసి బిడ్డను గుండెలకు హత్తుకొను. చుక్క గొంతు దిగగానే అమ్మను చూసి బిడ్డ నవ్వు. ఆ బొమ్మకి తెలుసున్న భాష కన్నీళ్లే కదా. మూగ జీవి కన్నీళ్లు ఆదరించే రైతుకే తెలుసు లేగదూడ అంబా అనే అరుపుతో పాలికాపు దాని కట్లు విప్పు. దూడ పొదుగు వెతుకు అమ్మ ఆత్రంగా నాలికతో నాకు. మూగజీవుల బాధ బ్లూక్రాస్ వారికే తెలుసు. ప్రియుడి వెతలు ప్రియురాలికే తెలుసు. ఎదురుచూపులన్ని కళ్ళ వెంట కన్నీరుగా కారు. ప్రతి జీవికి కన్నీళ్ల రుచి తెలుసు. ఉప్పు నీళ్లు అయితేనేం గుండె బరువు దించు. మబ్బు పట్టిన మేఘం వర్షమై కురి...

ఆసుపత్రి

ఆసుపత్రి  ఆపదలో ఆతిథ్యం ఇచ్చి ఆరోగ్యం పెంచి ఆనందం పంచి ఆదుకునే ఆరోగ్య ఆలయం. అపర ధన్వంతరి నిలయం గుడిలో ఉండేది దేవుడు అమ్మ ఒడిలోని దేవుడు పసిపాప  బడిలోని దేవుడు గురువు నడిచే దేవుడు ఉండేది ఈ ఆలయం. ఆ గుడిలోని మూల విరాట్ కు గుండె నిండా భక్తి నింపుకొని పూజా పునస్కారం. ఈ గుడిలోని దేవుళ్ళు కలకాలం కాపురం ఉండేది రోగి గుండెలో. గుండెలో చోటు ఇచ్చేది కొంతమందికే. ప్రాణానికి ప్రాణమైతే తప్ప గుండె చోటు ఇవ్వదు. నొప్పి వచ్చి నోరు తెరిచి అడిగితే సూ ది మందు ఇచ్చి సేద తీర్చి అందమైన పానుపు ఇచ్చి ఆశ్రయం ఇచ్చే ఆలయం పాన్పు మీదకి కొత్తగా చేరి అందమైన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా ఒక సంకేతం. పాన్పు వీడి పరలోకానికి ఎరిగినట్లుగా మరొక వైపు నుండి కన్నీళ్ళ ప్రవాహం. నిత్యం జనన మరణాల రణరంగం. ఇవేవీ పట్టనట్లు కర్మయోగిలా నిలబడు తుంది ఆ చికిత్సలాయం. నిత్యం ఇక్కడ కత్తులతో యుద్ధమే జయాపజయాలు ఆయుర్దాయమనే  ముసుగులో నిత్యం దోబూచులాడతాయి. అయినా ఆఖరికి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అపర ధన్వంతరీ నిలయం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

NTR జిల్లా విహార యాత్ర

ప్రముఖ చలనచిత్ర నటుడు , దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామరావు పేరు మీదుగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. విజయవాడ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ జిల్లాలో ప్రధానంగా చూడవలసినవి  కొండపల్లి: ఇది ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది. ఈ ఊరు బొమ్మలకు ప్రసిద్ధి. అంతేకాకుండా ఇక్కడ కొండపల్లి కోట కూడా చూడదగినది. కనకదుర్గ గుడి: ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం మహా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం.  బాపు మ్యూజియం: ప్రముఖ చిత్రకారుడు బాపు జ్ఞాపకంగా ఈ మ్యూజియానికి ఈ పేరు పెట్టడం జరిగింది. విజయవాడలోని మహాత్మా గాంధీ రోడ్ లో ఉంది. ఇక్కడ హిందూ బౌద్ధ మతాలకు చెందిన అనేక కళాఖండాలు ఈ ప్రదర్శనశాలలో ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్: విజయవాడలోని కృష్ణా నది నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ వలన ఎన్నో లక్షల ఎకరాలకి సాగు నీరు లభిస్తోంది.  ఇంకా విజయవాడలో అనేక ప్రాంతాలు గాంధీ కొండ, భవాని ద్వీపం  ఇవన్నీ కూడా చూడదగిన ప్రదేశాలు.  అమరావతి: విజయవాడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాతవాహనుల కాలంలో నిర్మించిన  అమరావతి స్తూపం అమరేశ్వర స్వామి ఆలయం చూడదగింది. ...

సామర్లకోట

కోట లేకపోయినా మాది సామర్లకోటే. ఆదిలో అది శ్యామలాదేవి కోట. శ్యామలాoబ గుడి లేని మా కోట సామర్ల కోట.      ఊరే పంచారామం,చాళుక్య భీమేశ్వర ఆలయం.            భక్తకోటికి అదే యాత్రావిహారం.              కార్తీకమాసం జనసందోహం.              కరోనా కాలమంతా నిశ్శబ్దం. పవిత్రతకు ప్రశాంతతకు మాండవ్య  నారాయణ ఆలయం.        ఆదిలోనే శంకరుల కొలువు     మధ్యలోని అమ్మ నూకాలమ్మ.        పక్కనే సాయి మకాం    అంత్యం అంతా ప్రసన్నాంజనేయం.         అదే మా గ్రామం భీమారామo     ఆది, అంతం అంతా భగవదత్తం. తరాలతో పాటు ఆధునికంగా మారిన రైల్వే జంక్షన్.    హౌరా చెన్నై మార్గం లో ప్రధాన జంక్షన్.        రైలు ఎదురుగా బస్సుల స్టాపు. ప్రధాన నగరాలు అన్నిటికీ బస్సు సౌకర్యం. మా కోట వాసులందరికి గమ్యం గగనం కాదు. తరతరాలుగా యువతకు ఉపాధి ఇస్తున్న   ఆయిల్ పరిశ్రమలు . అంబటి సుబ్బన్న అండ్ కో పప్ప...