పోస్ట్‌లు

అక్టోబర్ 12, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

శాస్త్రి గారి పాట

శాస్త్రి గారి పాట తెలుగు పదాల మూట. అనకాపల్లి ఒకప్పటి విశాఖ జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం  ఆ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది తీయటి బెల్లం. బంగారపు రంగులో మెరిసిపోయే బెల్లపు అచ్చులు కానీ . బెల్లపు వ్యాపారానికి ప్రసిద్ధ స్థలం. బెల్లపు పానకం లాంటి తెలుగు పదాలతో సినీ కళామతల్లిని  ఆరాధించే పాటల బ్రహ్మ అక్కడ పుడతాడని ఎవరికి తెలుసు.  అంతా విధాత తలపు. మెడలో శ తస్కోప్ వేసుకుని మన రోగాలను నయం చేస్తాడు అనుకుంటే పాటలతో ధైర్యాన్ని ఇచ్చి పదాలతో మెదడుకు పదును పెట్టి మన ఆరోగ్యాలను బాగుచేసే పాటలకు జన్మనిచ్చాడు మన సీతారామశాస్త్రి. ఏది మన చేతుల్లో ఉండదు కాలం చేసే మార్పులకి మనం తలవగ్గి నడవ వలసిందే. కాలానికి నాయకుడు ఈశ్వరుడు. కళలకు అధిపతి కూడా ఆ నటరాజే. ఆయన అందుకునే మార్గం మళ్లించి తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డగా విశ్వనాథుడి దరి చేర్చాడు . ఈయన సీతారాముడు. ఆయన విశ్వనాధుడు. ఇంకేముంది సీతారాముడి కలo నుంచి పుట్టిన పాట తెలుగుజాతి కీర్తి కిరీటాలను ఎక్కడకో తీసుకుని పోయేలా చేసింది. ఒకపక్క పాట మరొక పక్క విశ్వనాథుడు దర్శకత్వం ఇంకేముంది సినిమాలన్నీ శతదినోత్సవ చిత్రాలే. ఇంటి పేరు అసలు ఎవరికీ తెల...

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

ఆరోగ్యం వెర్సెస్ ఆహారపు అలవాట్లు. ప్రతి జీవికి నిత్యవసరాలలో ముఖ్యమైనది ఆహారం. బ్రతుకు బండి సాగాలంటే శక్తి కావాలి. మనిషికి శక్తి తినే ఆహారo నుంచి  పుడుతుంది. మనిషి శరీరము ఒక నడిచే కారు లాంటిది. కారు నడవాలంటే పెట్రోల్ పోయాలి. అలాగే మనిషి శరీరానికి కూడా సమతుల ఆహారం అందించాలి. విటమిన్లు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు శరీరానికి కావలసిన రక్షణను శక్తిని ఇస్తాయి. శాఖాహారులందరూ బియ్యం ఆకులు పండ్లు కాయలు గింజలు ఆహారంగా స్వీకరిస్తారు. మాంసాహారులు వీటితో పాటు జంతువుల మాంసం ఆహారంగా తీసుకుంటారు. అయితే తీసుకునే ఆహారాన్ని పరిమితంగా తినడం, పరిశుభ్ర వాతావరణంలో వండిన పదార్థం తినడo,వేళకు తినడం లాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిలో ఏ నియమం తప్పిన ఆహారం విషతుల్యమవుతుంది. అది మన శరీరానికి మంచి బదులు చెడు చేస్తుంది.  పూర్వకాలంలో తొలి రోజున వండిన ఆహార పదార్థాలను ముట్టుకునేవారు కాదు . అది మడి కాదు ఆచారంకాదు. ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్త.ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లులలో వండిన ఆహార పదార్థాలు దాచుకుని రెండు మూడు రోజుల వరకు ఉంచుకుని తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతవరక...

జంతువు అయితేనేమి

జంతువు అయితేనేమి ప్రతి మానవుడు గుడిలో విగ్రహాన్ని ఇంటిలో దేవుడి పటములను పూజించడం , గణపతి నవరాత్రులలో గణపతిని పూజించడం దేవీ నవరాత్రులలో దేవిని పూజించడం సర్వ సాధారణమైన విషయం. అయితే మానవుడు దేవుళ్ళతో పాటు ఆవు వంటి సాధు జంతువులను పాములను కప్పలను కూడా పూజించడం మనం ఎరుగున్న విషయమే. అయితే మనం హిందువులు జరుపుకునే పండుగలు అన్ని దేవతామూర్తులకు సంబంధించినవే కాకుండా జంతువులు కూడా ఆ పండుగలలో ప్రధానంగా పూజించబడతాయి. ఉదాహరణకి కనుమ పండుగ రోజున ఎద్దులను అలాగే నాగుల చవితి రోజున పుట్టలో ఉన్న పాములను పూజించడం జరుగుతుంది. ఏ కాలంలో చూసిన పశుపక్ష్యాదులు జంతువులు కూడా మానవునికి సహాయ సహకారాలు అందిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నాయి. ప్రతిఫలంగా మానవుడు వాటికి పూజలు చేసి ప్రసాదాలు పెట్టి రుణం తీర్చుకుంటున్నాడు. హిందువులందరికీ ఆవు పవిత్రమైన జంతువు. శుభ అశుభ కార్యక్రమాలకు కూడా ఆవును పూజించడం మన సాంప్రదాయం. గృహప్రవేశం వంటి శుభకార్యాలకు ముందుగా ఆవును దూడను  కొత్త ఇంటిలోకి ప్రవేశపెడతారు. మనం ఆవుని గోమాత అంటాం ఇక చనిపోయిన వారు ఆవు తోక ద్వారానే పుణ్య లోకం చేరుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే గోదానం ఇవ్వడం జరు...

దసరాకు వస్తిమని విసవిసలు పోక

"దసరాకు వస్తిమని విసవిసలు పోక"         మానవ జీవితానికి పండుగలు అంటే ఒక వరం. స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే రోజు పండుగ రోజు.ఒత్తిడితో నలిగిపోతున్న మానవ జీవితం ఆ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతుంది. అన్ని మతాల వారు ఈ పండుగలు జరుపుకుంటారు. ఎవరి మతానుసారం వారికి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ముస్లిం మతస్తులకి రంజాన్ ప్రత్యేకమైన పండగ. అలాగే క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదినం అయిన క్రిస్మస్ ఒక పండుగ. హిందూమతస్తులకి ఉగాది మొదలు ప్రతినెలా ఏదో ఒక పండగ జరుపుకుంటారు. ఇది కాకుండా అమ్మవారి జాతరలు కూడా ఒక పండగలా చేసుకుంటారు.  మొన్నటి వరకు గణేష్ నిమజ్జోత్సవాలు ఆనందంగా జరుపుకున్నాము. ఇక దసరా ఉత్సవాల సందడి మొదలైంది. మార్కెట్లో దసరా తగ్గింపు ధరల హోరు ప్రారంభమైంది. ప్రయాణాల సందడి మొదలైంది.   ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. దీన్నే దసరా పండుగ అంటారు. శరన్నవరాత్రులు అని కూడా అంటారు . శరదృతువులో వచ్చే పండుగ దసరా. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తేవాడు. మహిషాసురుడనే ...

గురువు

గురువు  ప్రతి మనిషి అమ్మ ఒడిదాటి ఒక వయసు వచ్చిన తర్వాత అడుగుపెట్టేది బతుకు పాఠాలు నేర్పే గుడిలో. అదే మన బడి. చిన్నతనo లో బడికి వెళ్లాలంటే ఒక రకమైన భయం. మనం బడికి వెళ్లకపోతే అమ్మకి భయం. అందుకే బలవంతంగా ఏడుస్తున్నా సరే బరబరా లాక్కుని వెళ్లి బడిలో కూర్చోబెడుతుంది. ఇది ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు బాల్యంలో జరిగే అనుభవమే. విద్య విలువ అమ్మకు తెలుస్తుంది. అజ్ఞానంలో ఉన్న బిడ్డలకు తెలియదు. బడి అంటే బ్రతుకు పాఠాలు నేర్పే బొమ్మ. ఓం ప్రధమంగా పలక మీద బలపం తో అక్షరమాల నేర్పించి ఒక్కొక్క తరగతి గది దాటించి బ్రతుకుకి పునాది వేసేవాడు గురువు. గురువు అంటే బాధ్యత గల వ్యక్తి. గురు శిష్యులు అనుబంధం ఎవరు నిర్వచించలేం. ఒక తరగతి లో 30 మంది విద్యార్థులు ఉన్న అందరికి సమాన దృష్టితో విద్య బోధించేవాడు గురువు.   ఆ బడిలో చేరిన పిల్లలందరూ తరగతి గదిలో బెంచీల మీద ఒకరి పక్కన ఒకరిని కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తారు. ఆ రకంగా పిల్లల మధ్య స్నేహ తత్వం పెంచుతారు గురువుగారు. పిల్లల మధ్య అలా మొదలైన స్నేహం కడవరకు సాగుతూ ఉంటుంది. పాఠశాలంటే అన్ని విద్యలు నేర్పే సరస్వతీ మాత గుడి. పద్యాలను రాగయుక్తంగా చదివే తెలుగు మాస్టారు తె...

అమ్మ కాదు డాక్టరు బొమ్మ

అమ్మ కాదు డాక్టర్ బొమ్మ  ప్రతి స్త్రీకి మాతృత్వం ఒక తీయని వరం. దేవుడు ఒక స్త్రీకి మాత్రమే ఆ వరం ఇచ్చాడు. పశుపక్షాదులలో కూడా జంతువులలో కూడా బిడ్డను కనే అధికారం ఒక్క ఆడజన్మకు మాత్రమే ఉంది. కారణం ప్రకృతి ధర్మం మరియు స్త్రీ సహనమూర్తి. బిడ్డ కడుపులో పడింది దగ్గర్నుంచి అష్ట కష్టాలు పడి నవ మాసాలు మోసి ప్రసవ వేదన అనుభవించి చావుకు దగ్గరగా వెళ్లి ఒక పసి బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ భూమి మీద పడిన దగ్గర్నుంచి అష్ట కష్టాలు పడి తన రక్తాన్నే చనుబాలుగా మార్చి బాలారిష్టాలు దాటించి విద్యాబుద్ధులు చెప్పించి ఒక భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. ఈ విషయంలో తల్లి పాత్ర అమోఘం. ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వలన పుట్టే బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.బిడ్డ మానసిక ఆరోగ్యం ,శారీరక ఆరోగ్యం తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర కీలకం.   పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ప్రతి ఇంటిలో అనుభవజ్ఞులైన తాతమ్మలు నానమ్మలు ఉండేవారు. ఒక స్త్రీ గర్భవతి అయిన దగ్గర నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెట్టవలసిన ఆహారము గురించి పదేపదే ఆ పెద్దవాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అయితే కాలం ...

మా ఊరి గణపతి

మా ఊరి గణపతి వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకారేషు సర్వదా" ఏ శుభకార్యం ప్రారంభించాలన్న గణపతి పూజ తోటే ప్రారంభం. గణపతికి చేసే ప్రత్యేక పూజ కూడా గణపతి ప్రార్ధన తోటే ప్రారంభం. విఘ్నేశ్వరుడు అన్ని గణాలకు అధిపతి. విఘ్నాలను తొలగించేవాడు. అందుకనే ఆది పూజలు అందుకుంటున్నాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుడు జన్మదినం. ఆ రోజున వినాయక చవితి పండగ చేసుకుంటాం. ఈ పూజ ప్రతి ఇంటిలో కార్యాలయంలో దుకాణాల సముదాయాల్లో గుడిలో ప్రతి వీధిలో ప్రతి వాడలో కూడా చేసుకునే పండుగ. పండగ వారం రోజులు ముందు నుంచే ఆ వీధిలో ఉండే వినాయక ఉత్సవ కమిటీ వారు వీధి వీధినా తిరిగి చందాలు వసూలు చేసి పందిళ్లు వేసి మైకులు పెట్టి ఉత్సవాలు అందంగా జరుపుతారు.  మా స్వగ్రామమైన కాజులూరు మండలంలోని పల్లిపాలెం లో కూడా ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరుపుతారు. రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న మా గ్రామంలో ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో నాకు తెలియదు. ఈనాటి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా వినికిడి. ఆ రోజుల్లో వారం రోజులు ముందు నుంచి చవితి హడావుడి ప్రారంభం అయ్యేది. మా చిన్నతనంలో తొలిరోజు మధ్యాహ్నం స్కూల్ కి సె...

అమ్మ -ఆవకాయ

ఎండాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం నాకు గుర్తుకు వచ్చేది మా అమ్మ పెట్టే ఆవకాయి. నా చిన్నతనంలో మా తోటలో ఆవకాయ కోసం ప్రత్యేకంగా ఒక చెట్టు ఉండేది. అలాగే మాగాయ కోసం కూడా ప్రత్యేకంగా చెట్లు ఉండేవి. ఏనాడో మా తాతగారు వేసి పెంచిన చెట్లవి. ఆ కాలం వారికి ముందుచూపు ఎక్కువ. బతికున్న రోజుల్లో వారు పండ్లు తిన్నారా లేదో తెలీదుగానీ మా తరం వారు మాత్రం అన్ని రకాల పండ్ల రసాలను రుచి చూడడం జరిగింది. చెరుకు రసం కాయలతో బెల్లపు ఆవకాయి, చిన్న రసం కాయలతో మాగాయి ,ఇంకా పచ్చ ఆవకాయ్ మామూలు ఆవకాయి కోసం ప్రత్యేకమైన కాయలు ఉండేవి. ఆవకాయ పెట్టుకోడానికి మామిడి కాయ తోపాటు ఆవాలు ఉప్పు కారం మరియు నూనె ప్రధానంగా కావాల్సిన సరుకులు. ఆవకాయ కోసం ప్రత్యేకం గా కొన్న మిరపకాయలు రోకళ్లు తో దoపించేవారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్త్రీల చేత ఈ పని చేయించేవారు. అందులో ఒక నాయకురాలు పేరు శేషమ్మ. దంపుళ్ళ శేషమ్మ అనేవారు. కళ్ళలో నీళ్ళు కారుతున్నా అవిశ్రాంతంగా వారు కారం ఉప్పు ఆవాలు విడివిడిగా దంచి జల్లెడ పట్టి డబ్బాలో పోసి ఉంచేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో పాటు మా అమ్మ గారు, పిన తల్లి గారు అలుపు సొలుపు లేకుండా ఒకపక్క వండ...

రామనవమి

రామ నవమి ఆది కవి వాల్మీకి మహర్షి చేత రచించబడినది రామాయణo. దశరథ నందనుడైన శ్రీరామచంద్రమూర్తి కథ శ్రీ రామాయణం. సీతారాముల కమనీయ గాధ రామాయణo. రాముడు అనుసరించిన మార్గం.రాముడు నడచిన మార్గం. ఇందులో 24000 శ్లోకాలు ఉంటాయి. రామాయణo అతి ప్రాచీనమైనది .అందుకే ఆదికావ్యం అంటారు. రామాయణం 6 కాండలు గా విభజించబడింది. బాలకాండలో శ్రీ రాముని జననం నుండి సీతాకల్యాణం వరకు వివరించబడ్డాయి. అయోధ్యకాండలో దశరథుని భార్య అయిన కైకేయి కోరిక నుండి సీతా రామ లక్ష్మణ లక్ష్మణ వనవాస వ్రతం ప్రారంభం అయ్యే దాకా వివరించబడింది.సీతారాములు వనవాస కాలం నుండి శూర్పణఖ భంగము మరియు సీతాపహరణం దాకా అరణ్యకాండలో పొందుపరచబడింది. ఇక కిష్కింధకాండ లో వానర రాజు సుగ్రీవుడితో శ్రీరాముడు స్నేహం వాలి వధ సీతాన్వేషణ ప్రారంభము చెప్పబడింది. తర్వాత సుందరమైనది సుందరకాండ. హనుమంతుడు సముద్రము దాటుట సీత జాడ కనిపెట్టడం లంకా దహనం వివరించబడ్డాయి. సాగరమునకు వారధి నిర్మించుట, రావణ రావణ యుద్ధము రావణ సంహారము ,శ్రీరామ పట్టాభిషేకం యుద్ధకాండలో విపులంగా వివరించబడ్డాయి. అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు. అన్ని సంపదలు ఉన్న రాజుగారికి సంతానభాగ్యం కలుగలేదు.పుత్ర కామేష...

శివరాత్రి

మానవ జీవితం క్షణిక మైనది. ఆ క్షణికమైన జీవితం కోసం నిత్యజీవితంలోఎన్నో పాపాలు చేస్తుంటాడు. పాపము అంటే మనిషిని కత్తితోచంపడం ఒక్కటే కాదు. మానసికంగా భాధించినా అది కూడా పాపమే అవుతుంది. రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. కంటికి కనబడని ఎన్నో లక్షల జీవరాశుల కాళ్ళ కింద పడి నలిగి పోతూ ఉంటాయి. అది కూడా పాపమే. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. తప్పులు చేయడం మానవ సహజం. తప్పులు సరిదిద్దుకోవడం మనిషి లక్షణం. మానవుడు చేసిన తప్పులు అన్నిటికీ భగవంతుడే మార్గం చూపించాడు. భగవంతుని ఆరాధన ఒక్కటే శరణ్యం. ఆ ఆరాధన చేయడానికి కి మంచి రోజులు కూడా దేవుడే చూపించాడు. భారతీయ పండుగలు అన్నీ అలా పుట్టినవే. చాంద్రమానం ప్రకారం చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ప్రతి నెలలో ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. మాఘ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ శివరాత్రి. ఆరుద్ర నక్షత్రం తో కలిపి వచ్చే మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి అంటారు. ఈ రోజున శివుడు లింగాకారంలో ఉద్భవించాడని శివపార్వతుల కల్యాణం జరిగిందని శివపురాణం చెబుతోంది . శివుడు త్రిమూర్తులలో ఒకరు. ఆది అంతం లేని వాడు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ కాలం నుంచి ఏ కాలానికైనా అవలీలగా పయనించేవాడు . కల్...

పశువులు

మన నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తోడు వాహనాల సంఖ్య రోడ్లమీద వాహనాల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. దానికి అనుగుణంగా మన రోడ్ల పరిస్థితి రోజు రోజుకి దిగజారి పోతుంది. పెరిగే జనసంచారం కనుగుణంగా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు వెడల్పు చేయడం ప్రభుత్వం వారికి తలనొప్పిగా తయారైంది దానికి తోడు బడ్జెట్లు కూడా అంతంత మాత్రం. అయితే పూర్వ కాలంలో ఏడాదికో రెండేళ్ళకో సారి రోడ్ల పరిస్థితి పై ప్రభుత్వం వారు సమీక్ష చేసేవారు. ఇప్పుడు ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య పై, రోడ్ల పరిస్థితి పై సమీక్ష చేయవలసిన అవసరం ఏర్పడు తోంది. దానికితోడు రోడ్లపై పశువుల సంచారం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవి రోడ్డు మీద యధేచ్చగా తిరుగుతూ వాహనాలకి అడ్డుగా వచ్చి అనేక యాక్సిడెంట్ లకి కారణం అవుతున్నాయి. పశువు అనగా పాశం చేత కట్టబడింది అనగా త్రాడు చేత  కట్టబడింది. మనదేశంలో పశుపోషణ కూడా అతి ముఖ్యమైన వృత్తి. గ్రామాల్లో ఈ పశువులకి ఒక కాపలాదారు ఉంటారు. యథేచ్ఛగా రోడ్లమీదకు వదలరు.  అయితే ఇటీవల కాలంలో నగరాలలో కూడా వృత్తిరీత్యా అయితే నేమి సరదా కోసం అయితే నేమి పశుపోషణ జరుగుతోంది. గోవు యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెల...

నాన్న

నాన్న ఓ అభయ హస్తం. నాన్న అంటే ఒక నిస్వార్ధం నాన్న ఒక మార్గదర్శి. ఆఫీసులో బండెడు చాకిరీ చేసి ఇంటికి వచ్చి నవ్వుతూ పిల్లలు పలకరించేవాడు నాన్న తన జేబు ఖాళీగా ఉన్నా పిల్లల గొంతెమ్మ కోరికలు నిరంతరం తీర్చే వాడే నాన్న. తను సైకిల్ మీద ఉసూరుమంటూ ఆఫీస్ కి వెళ్తున్నా తన పిల్లల కోసం స్కూటీలు కొనిచ్చి వాడే నాన్న. తాహతుకు మించిన ఫీజులు పెట్టి గురుకుల విద్య నేర్పి తల తాకట్టు పెట్టి పరదేశంలో విద్య నేర్పించి ఉపాధి కల్పించి గ్రీన్కార్డు వచ్చిందంటూ పిల్లలు చెప్పే టాటాలు తో మురిసిపోతూ తన బ్రతుకు పల్లెటూరి కొంప లోనే వెళ్లదీస్తూ చాలీచాలని పెన్షన్ రాళ్లతో పచ్చడి మెతుకులు పరమానందంగా తింటూ అన్ని కూరలు ఆరోగ్యానికి సరిపడవు అంటూతన లేనితనాన్ని కప్పి పుచ్చుకుంటూ గుంభనంగా జీవితాన్ని సాగించే వాడే నాన్న.  రెండు లేదా మూడు సంవత్సరాల కోసారి పరదేశం నుండి వచ్చే మనవలు కోసం ఏసీ కొనమనిచెప్పే భారీ మాటలని, భార్య మాటలని సున్నితంగా తోసిపుచ్చి ఎందుకు మన అరుగు మీద మడత మంచం వేసుకుని పడుకుంటే చల్లని గాలి వేస్తుంది అంటూ చెప్పిన మాటలు నాకు నాన్నలో ఓ పొదుపరి కనిపిస్తాడు. చరిత్ర నాన్న పాత్రకి ద్వితీయ స్థానం కల్పించినా భార్యక...

బుల్లెట్ బండి

మనిషి నిత్య జీవితంలో అలసిన సొలసిన మనసుకి విశ్రాంతి ఇవ్వడానికి మళ్లీ కొత్త ఉత్తేజం రావడానికి కి ఏదో వ్యాపకం అంటూ ఉండాలి. కొంతమంది పూజలు చేయడం మరికొంతమంది టీవీ చూడడం మరికొంతమంది పాటలు వినడం మరికొంతమంది కవిత్వం రాయడం వినడం తన వ్యాపకంగా ఎంచుకుంటారు. అయితే సంగీతం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. రాగ పరిజ్ఞానం లేకపోయినా మన మనసుకి సంగీతం హాయినిస్తుంది. రాగాలు తో రోగాలు కూడా నయం చేయవచ్చని ఎం తో మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు . అలాగే ఈ రోజుల్లో మంచి సినిమా పాటలు ప్రైవేట్ సాంగ్స్ కూడా జనాభిమానం చూరగొన్నాయి.దేనికైనా మనసే కదా ప్రధానం. మనసు సరిగా లేకపోతే ఆలోచనలు పెరుగుతాయి.ఆలోచనలు పెరిగితే రక్తప్రసరణ పెరుగుతుంది రక్త ప్రసరణ పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. మన మానసిక ఆనందానికిఈ రోజుల్లో బయట షికార్లకి సినిమాల తిరగ లేకపోయినా యూట్యూబ్ వారి పుణ్యమా అని ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ని మనకి ఒక క్లిక్కుతో చూపిస్తున్నారు.       మాటల్ని అందంగా లయబద్ధంగా తాళ బద్ధంగా అమర్చడాన్ని పాట అంటారు. పాటలో పల్లవి చరణం రెండు భాగాలు. జానపద పాటలు సినిమా పాటలు రాముల వారి పాటలు చెక్కభజన పాటలు విషాద గీతాలు ప్...

అలసిన అరుగులు

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి కానీ మా తరం వారికి అవి మాత్రం హంస తూలికా తల్పాలు.   తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం లో గల మా నాన్న గారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్ర గచ్చు తో చేసిన వసారా ఉంది. సుమారు 70సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతి రావు గారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నాను అంటే ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి తమ తమ రంగాల్లో చేరుకోవడం జరిగింది . తొలి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో దాన్ని కొట్టు గది అంటాం పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పిన తాతగారు శ్రీ మధునాపంతుల కామ రాజు గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు పంచాయతీ బోర్డు ఆఫీస్ కి వచ్చి అరుగు మీద కూర్చునే వారు . ఎప్పుడు రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారు కి సంఘ సేవ మీద ఎక్కువ మక్కువ ఉండడం మూలంగా ప్రజల సమస్యల్న...