రామనవమి
రామ నవమి
ఆది కవి వాల్మీకి మహర్షి చేత రచించబడినది రామాయణo. దశరథ నందనుడైన శ్రీరామచంద్రమూర్తి కథ శ్రీ రామాయణం. సీతారాముల కమనీయ గాధ రామాయణo. రాముడు అనుసరించిన మార్గం.రాముడు నడచిన మార్గం. ఇందులో 24000 శ్లోకాలు ఉంటాయి. రామాయణo అతి ప్రాచీనమైనది .అందుకే ఆదికావ్యం అంటారు. రామాయణం 6 కాండలు గా విభజించబడింది.
బాలకాండలో శ్రీ రాముని జననం నుండి సీతాకల్యాణం వరకు వివరించబడ్డాయి. అయోధ్యకాండలో దశరథుని భార్య అయిన కైకేయి కోరిక నుండి సీతా రామ లక్ష్మణ లక్ష్మణ వనవాస వ్రతం ప్రారంభం అయ్యే దాకా వివరించబడింది.సీతారాములు వనవాస కాలం నుండి శూర్పణఖ భంగము మరియు సీతాపహరణం దాకా అరణ్యకాండలో పొందుపరచబడింది. ఇక కిష్కింధకాండ లో వానర రాజు సుగ్రీవుడితో శ్రీరాముడు స్నేహం వాలి వధ సీతాన్వేషణ ప్రారంభము చెప్పబడింది. తర్వాత సుందరమైనది సుందరకాండ. హనుమంతుడు సముద్రము దాటుట సీత జాడ కనిపెట్టడం లంకా దహనం వివరించబడ్డాయి. సాగరమునకు వారధి నిర్మించుట, రావణ రావణ యుద్ధము రావణ సంహారము ,శ్రీరామ పట్టాభిషేకం యుద్ధకాండలో విపులంగా వివరించబడ్డాయి.
అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు. అన్ని సంపదలు ఉన్న రాజుగారికి సంతానభాగ్యం కలుగలేదు.పుత్ర కామేష్టి యాగం ఫలితంగా చైత్ర శుద్ధ నవమి నాడు నలుగురు కుమారులు జన్మించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు గా నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. శ్రీరాముడు విష్ణువు యొక్క సప్తమ అవతారం. ధర్మ సంస్థాపన కొరకు మానవ రూపంలో జన్మించిన సకలగుణాభిరాముడు.
లంకాధిపతియైన రావణాసురుడు బ్రహ్మ దగ్గర వరాలు పొంది మునులను వేధిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసరాజుకి ఒక్క మానవ నుండి తప్పితే దేవ గంధర్వ దానవుల నుండి చావు లేదు. అందుకే దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు నరుడు రూపంలో జన్మించి ఆ రాక్షసుడిని చంపపదలిచి శ్రీరాముడిగా అవతరించాడు. ఆదిశేషుడు లక్ష్మణునిగా శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు.
మహర్షి విశ్వామిత్రుడు కోరిక ప్రకారం యాగ రక్షణ కోసం
రామలక్ష్మణులు ముని వెంట వెళతారు. విశ్వామిత్ర ముని తలపెట్టిన యాగాన్ని రాక్షసుల నుండి కాపాడుతారు రాకుమారులు.మిధిలాపురానికి రాజైన జనకమహారాజు తలపెట్టిన సీతా స్వయంవరానికి విశ్వామిత్ర మహాముని
రామలక్ష్మణులని తీసుకువెళ్తారు. సీతా స్వయంవరంలో శివధనుర్భంగం చేసి రాముడు సీతా దేవిని వివాహం చేసుకుంటారు. శ్రీరాములు వారిని అయోధ్యా నగరానికి పట్టాభిషిక్తుని చేయడానికి ముహూర్తం నిర్ణయిస్తారు. అయోధ్యను అంగరంగ వైభవంగా అలంకరిస్తారు. కాని కైకేయ భరతుడిని పట్టాభిషిక్తుడిని చేయాలని సంకల్పించి
దశరథుడు తనకు ఇచ్చిన వరములు తీర్చమని అడుగుతుంది . దశరథుడు ఆడిన మాట తప్పకుండా కైకేయి కోరిక తీరుస్తాడు.
కైకేయి కోరిక మేరకు దశరథుడు ఆజ్ఞ మేరకు శ్రీ రాములవారు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్తారు. మాయావి మారీచుడు బంగారు లేడి రూపంలో అరణ్యంలో లో తిరుగుతూ ఉంటాడు. సీతాదేవి కోరికమేరకు రామ లక్ష్మణులు బంగారు లేడిని పట్టి తీసుకురావడానికి వెళ్తారు. ఈలోగా లంకాధిపతి రావణాసురుడు మాయ సన్యాసి వేషంలో వచ్చి సీతాదేవిని లంక తీసుకెళ్ళి పోతాడు.
శ్రీ రాముల వారు భార్యా వియోగుడై సీతా దేవుని వెతుకుతూ కిష్కింధకు చేరి సుగ్రీవుడితో స్నేహం కుదుర్చుకుని వాలిని చంపేస్తాడు. సుగ్రీవుడు మంత్రి అయిన ఆంజనేయ స్వామి సీతాన్వేషణకు నియమిస్తారు .
ఆంజనేయ స్వామి వారు సముద్రలంఘన చేసి లంకలో వున్న సీత జాడ కనిపెట్టి ఆనవాలుగా సీతాదేవికి ఆభరణాలు చూపిస్తాడు. లంక అంతా సర్వనాశనం చేసి
తిరిగి రాములవారి దగ్గరికి వెడతాడు హనుమంతుడు.
కపివీరుల సహాయంతో వారధి నిర్మించి శ్రీరాముడు రావణ రావణ యుద్ధంలో రావణ సంహారం చేస్తాడు.
తిరిగి పుష్పక విమానంలో రాముడు సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడవుతాడు.
భారతదేశమంతా చైత్రశుద్ధ నవమి నాడు సీతారాముల కళ్యాణం, సీతా రామ పట్టాభిషేకం జరిపి శ్రీరామనవమి గా పండగ చేసుకుంటారు. చరిత్రలో ఏ మహా పురుషుడికి కూడా ఒకే రోజు జన్మదినం వివాహమైన రోజు, పట్టాభిషిక్తుడైన రోజు జరగడం చాలా అరుదు. ఒక్క శ్రీరాముడికి ఆ ఘనత దక్కింది. రాముడు సకలగుణాభి రాముడు. అందుకే అన్నమయ్య షోడసకళానిధికి షోడశోపచారములు అంటూ కీర్తించారు. నిలువెత్తు ధర్మానికి శ్రీ రాములవారే సాక్ష్యం. శ్రీరాముడు దయకు మంచితనానికి నమ్మకానికి చిహ్నం లాంటివాడు. శ్రీ రాముడు జీవితం మానవులందరికీ ఆదర్శప్రాయం. తోడబుట్టిన వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. స్నేహితుడితో మెలగవలసిన విధానం గురించి తెలుపుతుంది. సేవకులు ఏవిధంగా చూడాలో తెలియజేస్తుంది . తల్లిదండ్రుల మాట ని ఏవిధంగా గౌరవించారో తెలియజేస్తుంది. అందుకే రామ రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. సిరిసంపదలకు పాడి పంటలకు లోటు ఉండేది కాదు.
ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వసంత ఋతువులో వస్తుంది. ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాడవాడలా సీతారామ కళ్యాణం జరుపుకుంటారు. చలువ పందిళ్ళు పచ్చటి మామిడాకుల తోరణాలతో వీధులన్నీ మెరిసిపోతూ ఉంటాయి. మండే ఎండలకి ఈ పందిరిలు చల్లదనం ఇస్తాయి. కళ్యాణ తలంబ్రాలు తల మీద వేసుకుని ప్రజలందరూ పునీతులవుతారు.మిరియాలతో బెల్లం పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆరోగ్యరీత్యా ఈ ప్రసాదo చాలా మంచిది. పుణ్యం తో పాటు పురుషార్థం కూడా. శ్రీరామ సంకీర్తనలతో ఊరు వాడ మార్మోగుతాయి. ఉత్సవ మూర్తులను ఊరువాడ ఊరేగిస్తారు. ఆ ఊరేగింపు లో పాల్గొని ప్రజలందరూ రామనామ జపంతో ముక్తి పొందుతారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి