పోస్ట్‌లు

ఏప్రిల్ 19, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఊర్మిళాదేవి

ఊర్మిళాదేవి ఒక్క పక్షి మరణం ఒక ఆదర్శప్రాయమైన సీతారాముల కథను లోకానికి తెలియజేయడానికి అవకాశం కల్పించింది. ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాడు. సీతారాములే కాకుండా భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా లోకానికి ఆదర్శప్రాయులు ఎలా అయ్యారు అన్నది మనకి తెలియజేశాడు ఆ మహర్షి.  ఈ శ్రీరాముడు కథలో అన్ని పాత్రలు కూడా ఆదర్శ పాత్రలే. ఏకపత్నివృత్రుడుగా తండ్రి మాట జవదాటని వ్యక్తిగా శ్రీరామచంద్రుడు మనకి కనపడతాడు. భాతృ ప్రేమలో లక్ష్మణుడు భరతుడు లోకానికి ఆదర్శప్రాయలుగా కనిపిస్తారు. లోకంలో ఆదర్శవంతమైన భార్యగా సీతాదేవి నిలిచిపోయింది. రామ బంటుగా హనుమ, స్నేహితుడుగా సుగ్రీవుడు, సేవకుడుగా గుహూడు ఇలా ఎన్నో పాత్రలు జాతి గుండెలో చిరస్థాయిగా నిలబెట్టింది రామాయణం. అయితే మరొక్క పాత్ర లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి పాత్ర కూడా చెప్పుకోదగినది.  వాల్మీకి చేత రచించబడిన శ్రీమద్రామాయణంలో ఊర్మిళాదేవి గురించి చాలా తక్కువగా చెప్పినప్పటికీ ఆమె పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పడంలో సందేహం లేదు.  ఊర్మిళాదేవి జనకమహారాజు తమ్ముడైన కుశ ధ్వజడు కుమార్తె. కుశధ్వజుడు విద్యానగరమును పరిపాలిస్తూ ఉ...

జై వీర హనుమాన్

జై వీర హనుమాన్. ఆంజనేయస్వామి సర్వమానవ ఆరాధ్య దైవం. రామ బంటుగా రామ భక్తుడిగా, అసాధ్యకార్యసాధకుడుగా, రాక్షస సంహారిగా మన మనసులో నిలిచిపోయిన దైవం.  భారతదేశంలో ఏ గ్రామం చూసిన ఏ రహదారి చూసిన స్వామి విగ్రహం లేని చోటు ఉండదు. దేవాలయంలో ఆంజనేయ స్వామిని చూసిన రహదారి పక్కనున్న విగ్రహాలు చూసిన ఒక రకమైన ఉత్తేజం ధైర్యం కలుగుతుంది. బహుశా ఆయన రూపం చూసి భయం తొలుగుతుంది. విశాలమైన వక్షస్థలం పొడవైన కాళ్లు చేతులు చేతిలో గధ వానర ముఖం వానరులకుండే ప్రత్యేకమైన అవయవం తోక కలిగి ఉంటారు స్వామి.  మానవ రూపంలో ఉండే ఈ దేవుడుకి వానర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అందరికీ కలుగు తుంది. ఆంజనేయ స్వామి తల్లి అంజనీ దేవి. ఆమె వానర వనిత. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస శాపం కారణంగా వానర కన్యగా పుడుతుంది. ఆమెకు కేసరితో వివాహం జరుగుతుంది. చాలా కాలo వరకు సంతానం కలగపోవడంతో శివుడుని పూజించి శివుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది.   శివుడి యొక్క తేజమును వాయుదేవుడు పండు రూపంలో అంజనీ దేవికి ఇవ్వగా ఆ పండు తిన్న అంజనీ దేవికి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. అంజనీ దేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయ...

అనకాపల్లి జిల్లా విహార యాత్ర

అనకాపల్లి జిల్లా విహారయాత్ర – ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికతకు చేరువ విశాఖపట్నం జిల్లాలోనుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా, విహారయాత్రకారులకు దూరమైన స్వర్గధామంలా ఉంటుంది. ప్రకృతి అందాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలతో ఈ జిల్లా అనేక రుచులు, అనుభూతులు పంచుతుంది. 1. కొండకర్ల ఆవ సరస్సు –  అచ్యుతాపురం మండలంలోని ఈ సరస్సు, పక్షుల సంరక్షణ కేంద్రంగా పేరొందింది. సుదీర్ఘంగా విస్తరించిన నీటిమెట్టు, ఆకర్షణీయమైన హరిత పరిసరాలు, శాంతమైన వాతావరణం ఇది. వలస పక్షులు, బోటింగ్, ఫోటోగ్రఫీ కోసం సరైన ప్రదేశం. 2. బొజ్జన్నకొండ – బౌద్ధ చరిత్రను పలికించే శిల్పకళ శంకరం గ్రామంలో ఉన్న ఈ స్థలం బౌద్ధ సంస్కృతి కేంద్రమై ఉంది. రాతి గుహలు, చిన్న చిన్న స్తూపాలు, ప్రాచీన శిల్పాలు చరిత్రకూ, కళకూ మిళితమైన ఉదాహరణ. 3. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం – భక్తి పరవశానికి చిరునామా గవరపాలెంలో ఉన్న ఈ ఆలయం, కొత్త అమావాస్యనాడు జరిగే ఉత్సవాల వల్ల ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఉగాది వేళ లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరతారు. 4. ముత్యాలమ్మపాలెం, తంతాడి, పుడిమడక తీర ప్రాంతాలు కార్తీక పౌర్ణమి వేళ పుడిమడకలో జరిగే విశేష స్నానాలకి భక...

పుట్టిన రోజు

పుట్టినరోజు " హ్యాపీ బర్త్ డే రా సుధాకర్ అంటూ ఆఫీస్ కి రాగానే కొలీగ్స్ అందరూ సుధాకర్ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ తిరగడం ప్రారంభించారు. అందరికీ థాంక్స్ చెప్పి సుధాకర్ తన సీట్లో కూర్చున్నాడు. అదొక ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యాలయం అక్కడ పనిచేసే పదిమంది ఉద్యోగు లు మేనేజర్ దగ్గర నుంచి సబ్ స్టాప్ వరకు ఏ నెలలో ఎవరు పుట్టినరోజులు వచ్చాయో క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకుంటారు. ఆరోజు ఎవరిదైతే పుట్టినరోజు వస్తుందో వాళ్లు హోటల్ లో లంచ్ ఇవ్వాలి. లంచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కేక్ కట్ చేసి తర్వాత ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు. అలా ప్రతినెల ఎవరిదో ఒకరికి పుట్టినరోజు వస్తూనే ఉంటుంది. రేపు పుట్టినరోజు అనగా ముందు రోజు అందరికీ లంచ్ కి రమ్మని ఎవరిదైతే పుట్టినరోజు అవుతుందో వాళ్ళు ఆహ్వానిస్తారు. ఇది ఆఫీస్ సాంప్రదాయం కానీ సుధాకర్ పుట్టినరోజు ముందు రోజు అటువంటి ఆహ్వానం అందలేదు. అదేంటి రేపు సుధాకర్ పుట్టినరోజు కదా మర్చిపోయాడా ఏమిటి ఎవరికీ చెప్పలేదు కనీసం మేనేజర్ గారికి అయినా చెప్పాడా అని ఎదురుచూసిన సహ ఉద్యోగులు ఆశ నిరాశ అయింది. ఆఫీస్ కి వచ్చిన తర్వాత కూడా సుధాకర్ ఆ లంచ్ మాట ఎత్తలేదు. కానీ అం...

విశాఖ జిల్లా విహారయాత్ర

విశాఖ జిల్లా విహారయాత్ర విశాఖపట్నం జిల్లా... ఏకకాలంలో సముద్రపు మధుర గాలి తాకే బీచ్‌లు, చల్లని కొండ ప్రాంతాలు, చారిత్రక క్షేత్రాలు, గిరిజన సంస్కృతి, ప్రకృతి దృశ్యాల సంపదతో మనసుని కట్టిపడేసే ప్రదేశాల సమాహారం. ఈ వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి తిరగవలసిన మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇదే అనే చెప్పాలి. 1. అరకు & లంబసింగి –  అరకులోయ: పచ్చని లోయలు, కాఫీ తోటలు, గిరిజన నృత్యాలు – ఒక ప్రకృతి నాటకం. లంబసింగి: "ఆంధ్రప్రదేశ్ కశ్మీర్"గా ప్రసిద్ధి. చలికాలంలో మంచు తాకెడాలు, చల్లని గాలులతో విశేషమైన అనుభవం. 2. బీచ్‌లు – సముద్రపు అందాలు ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ – పిల్లలతో సరదాగా గడిపేందుకు బెస్ట్. బీమునిపట్నం బీచ్ – చరిత్ర, సముద్రం కలిసిన ప్రశాంతత. యోగ బీచ్, సాగర్ నగర్ బీచ్, గంగవరం బీచ్ – ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఉపమానాలు లేని అందాలు. 3. జలపాతాలు – ప్రకృతి సంగీతం కటికి జలపాతం – బొర్రా గుహల వెనుక నుండి జీప్ ట్రిప్‌ ద్వారా. ధరగి జలపాతం – కొత్తగా అభివృద్ధి చెందుతున్న మరో ప్రకృతి రహస్యగది. 4. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు సింహాచలం దేవస్థానం – లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం. విశాఖపట్నంలోని కనకమహాలక్ష...

ఇడ్లీ

ఇడ్లీ ఆకాశంలోని చందమామ వంటి మేను. పరిపూర్ణబింబము వంటి మోము. అల్పాహారములో మణిహారము   పరభాషలో ఇడ్లీ అచ్చ తెలుగులో వాసిన పోలు. రసముతో చెలిమిచేసి రసాగ్రమునకు రుచితెచ్చు. అల్లపు చట్నీతో ఆరగించినచో అరుగుదలకు సహకరించు  చక్కెరతో కలిపి చంటి బిడ్డకు రుచి చూపించినచో మాటిమాటికి మారు అడుగు బక్క చిక్కిన జనులకు వాసిన పోలుగా మేలు చేయు. కారప్పొడి నంజుకుంటే నాలుక నాట్యము చేయు. ఆహా ఇది తెలుగువారి ఫలహారము. తెలుగు భాష అంత కమ్మదనం. ఆలికి చమట పట్టకుండా చేయు పలహారం. ఎంత మధురం తెలుగువారి అల్పాహారమునకు మణిహారం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు            కాకినాడ 9491792279

తాడి చెట్టు

చిత్రం
తాడి చెట్టు గట్టుమీద పుట్టి గగన తలం వరకు ఎదిగి చుక్కనీరు అడగక పొడగరికి పోలికగా నిలిచి బడుగు జీవుల గూడునకు తనువును బలి ఇచ్చి పరోపకారికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచే తాడిచెట్టు. అమృత ఫలమును అందించి పోషకములో మేటి అనిపించుకొని ముక్కంటి నీటితో తాపమును చల్లబరిచి కల్లు ముంత అందించి స్వర్గమునకు దారి చూపించి అనాధలా పెరిగి అన్నదాత వలె ఆశ్రయమిచ్చే తాడిచెట్టు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279