ఊర్మిళాదేవి
ఊర్మిళాదేవి
ఒక్క పక్షి మరణం ఒక ఆదర్శప్రాయమైన సీతారాముల కథను లోకానికి తెలియజేయడానికి అవకాశం కల్పించింది. ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాడు. సీతారాములే కాకుండా భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా లోకానికి ఆదర్శప్రాయులు ఎలా అయ్యారు అన్నది మనకి తెలియజేశాడు ఆ మహర్షి.
ఈ శ్రీరాముడు కథలో అన్ని పాత్రలు కూడా ఆదర్శ పాత్రలే. ఏకపత్నివృత్రుడుగా తండ్రి మాట జవదాటని వ్యక్తిగా శ్రీరామచంద్రుడు మనకి కనపడతాడు. భాతృ ప్రేమలో లక్ష్మణుడు భరతుడు లోకానికి ఆదర్శప్రాయలుగా కనిపిస్తారు. లోకంలో ఆదర్శవంతమైన భార్యగా సీతాదేవి నిలిచిపోయింది. రామ బంటుగా హనుమ, స్నేహితుడుగా సుగ్రీవుడు, సేవకుడుగా గుహూడు ఇలా ఎన్నో పాత్రలు జాతి గుండెలో చిరస్థాయిగా నిలబెట్టింది రామాయణం. అయితే మరొక్క పాత్ర లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి పాత్ర కూడా చెప్పుకోదగినది.
వాల్మీకి చేత రచించబడిన శ్రీమద్రామాయణంలో ఊర్మిళాదేవి గురించి చాలా తక్కువగా చెప్పినప్పటికీ ఆమె పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పడంలో సందేహం లేదు.
ఊర్మిళాదేవి జనకమహారాజు తమ్ముడైన కుశ ధ్వజడు కుమార్తె. కుశధ్వజుడు విద్యానగరమును పరిపాలిస్తూ ఉండేవాడు. శ్రీరామచంద్రమూర్తి భార్య అయిన సీతాదేవి మిథిలా నగరానికి రాజైన జనకుడు కుమార్తె. శ్రీరామచంద్రుడు సీతా స్వయంవరం లో పాల్గొని శివ ధనస్సును విరిచిన తర్వాత జనకుడు సీతాదేవిని శ్రీరామచంద్రుడికి , అదే వేదికపై కుసద్వజుడు కుమార్తెలు ఊర్మిళ ని లక్ష్మణునికి ఇచ్చి మాండవి శ్రుతకీర్తులని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు .
ఆ తర్వాత పినతల్లి కోరిక ప్రకారం వనవాసానికి బయలుదేరిన సీతారాముల తో పాటు లక్ష్మణుడు కూడా అడవికి బయలుదేరుతాడు. అప్పుడు ఊర్మిళాదేవి లక్ష్మణా ! నీ వనవాస ప్రయాణం నన్ను కలవర పెడుతున్న నీ ధర్మానికి నేను అడ్డుతగలను అని చెప్పి పంపిస్తుంది.
సీతారాములతో పాటు వనవాసానికి బయలుదేరిన లక్ష్మణుడు పదునాలుగు సంవత్సరముల పాటు రాత్రిపూట నిద్రపోకుండా తన అన్న గారికి వదిన గారికి కాపలా కాయడానికి నిశ్చయించుకుంటే లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళాదేవి ఇక్కడ అయోధ్యలో మళ్లీ తిరిగి లక్ష్మణుడు అయోధ్య చేరేవరకు నిద్ర లేకుండా గడిపి ఆదర్శవంతమైన భార్యగా చరిత్రలో నిలిచిపోయింది.
రావణాసురుడు అనే రాక్షసుడు సీతాదేవిని ఎత్తుకుపోయిన కారణంగా రాముడు భార్యావియోగంతో బాధపడితే , తనఇష్టప్రకారమే వనవాసానికి అన్నగారితో పాటు బయలుదేరినలక్ష్మణుడు కూడా ఆ పదు నాలుగు సంవత్సరాలు భార్యకు దూరంగానే ఉన్నాడు.
ఊర్మిళాదేవి అంతటి త్యాగమూర్తి. రామాయణంలో ఊర్మిళ పాత్ర తక్కువగా చూపించినప్పటికీ మనము ఒక త్యాగమూర్తిగా జాతి ఎప్పటికీ మరిచిపోలేని ఆదర్శ మహిళ ఊర్మిళాదేవి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి