పోస్ట్‌లు

మే 1, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కోరిక

కోరిక అది రద్దీ ఎక్కువగా ఉండే రాజధానినగరంలోని ఒక వీధి లో  ఉండే హోటల్ ప్రాంగణం. సుమారుగా 80 సంవత్సరాల నుండి ఆ హోటల్ అదే వీధిలో ఉంది. భోజనం హోటల్స్ చాలా  ఉంటాయి. కానీ కస్టమర్ల్ని ఆదరించి ఆప్యాయంగా కొసరి  కొసరి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టే ఆ హోటల్ ఒక్కటే. అందుకే దూరప్రాంతాల నుండి వచ్చినవారు తప్పనిసరిగా ఈ  హోటల్ లో భోజనం చేసి వె డతారు. చక్కగా అరిటాకు వేసి వడ్డించి తెలుగువారి భోజనం పెట్టె ఏకై క భోజనశాల. కమ్మగా వేయించిన కందిపప్పు పప్పులోకి ఒక చిన్న పాత్రలో వేడివేడి నెయ్యి పనసపొట్టు కూర గుత్తి వంకాయ మజ్జిగ పులుసు గోంగూర పచ్చడి గడ్డ పెరుగు  ఆవకాయ దప్పుళo ఆకులో మెరిసిపోతూ ఆకాశంలోని హరి విల్లులా ఉంటాయి. ఆకు చూడగానే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకోగానే చేతులెత్తి మొక్కాకనిపిస్తుంది. అందుకే ఎక్కడ లేని రద్దీ. ఎప్పటిలాగే ఆరోజు కూడా హోటల్ ప్రాంగణం చాలా రద్దీగా  ఉంది. లంచ్ సమయం కావడంతో సీట్లు ఖాళీ లేక కస్టమర్లు  వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. వెయిటర్లు అటు ఇటు  బిజీబిజీగా తిరుగుతూ వచ్చిన కస్టమర్లకు ఏం కావాలో   చూస్తున్నారు. ఆ హోటల్ యజమాని ప్రతి...

ఎవరికి రుణం

ఎవరికి ఋణo ఉదయం పది గంటలు అయింది. తెల్లటి కారు ఆ వృద్ధుల ఆలయం ముందు ఆగింది. కారులోంచి  బ్యాగ్ పట్టుకుని ఒక యువకుడు ఒక వృద్ధురాలు దిగి తిన్నంగా రిసెప్షనిస్ట్ గదిలోకి తొంగి చూసారు. అప్పటికే రిసెప్షనిస్ట్ చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నారు. అమ్మా ఇక్కడ కూర్చుoదాము ఖాళీ అయ్యాక వెళ్ళవచ్చు అంటూ గది బయట ఉన్నబల్ల మీద కూర్చున్నారు తల్లి కొడుకు. కొంతసేపటికి జనమంతా బయటకు వచ్చేసారు. అమ్మ నేను వెళ్లి మాట్లాడ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడుకొడుకు రఘు.ఆ తల్లి నుండి ఏమి స్పందన లేదు. ఎటో చూస్తూ ఉండిపోయింది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగపీలుస్తోంది.మొహం అంతా కందగడ్డలా ఉంది.  నాన్నగారి పోయిన తర్వాత అమ్మ బాగా బెంగపెట్టుకుంది ఆరోగ్యం కూడా సరిగా లేనట్టుగా ఉంది. నాన్న బతికున్న  ఉన్నన్నాళ్ళు ఆమెకు ఏ దిగులు లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఒంటరి అయిపోయింది. అమెరికా తీసుకెళ్దామంటే ఇద్దరు ఉద్యోగస్తులo. పిల్లలంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్లకు అక్కడ తోచదు. ఒంటరిగా ఇంట్లో ఉండవలసి వస్తుంది.  చాలామంది భార్యలు లాగే తన భార్య కూడా అమ్మ చేత పనులు చేయిస్తుంది. అమ్మ నాన...

త్యాగమూర్తులు

త్యాగమూర్తులు వీరికి గుడులు గోపురాలు ఉండవు ఎగిరే మువ్వన్నెల జెండాలో అందరికీ మూడు రంగులే కనిపిస్తాయి. మనసుపెట్టి చూస్తే అమరవీరుల ఆశయాలు కనిపిస్తాయి. అసువులు బాసిన అమరవీరులందరి ఆశయాలకు గుర్తులుగా  ఎర్రకోట పై రెపరెపలాడుతోంది మూడు రంగుల జెండా . ఆ మహనీయుల అందరి ఆశయం ఒక్కటే. దేశాన్ని విదేశీ సంకెళ్ల నుండి విడిపించడమే. ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకొని పరాయి పాలన ఎదిరించి స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రలో మిగిలిపోయారు.  ఈనాడు ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు ఎందరో వీరుల ఊపిరి ఆగిపోయిమట్టిలో కలిసిపోయి మహనీయులుగా మిగిలిపోయారు. వారు స్వాతంత్ర ఫలముఅనుభవించలేదు. పదవుల కోసం ఆశపడలేదు. బ్రతికున్న రోజుల్లో కారాగార శిక్ష అనుభవించి ఉరికంబo ఎక్కి అసువులు బాసిన మహాత్ములు.  అహింసావాదంతో గాంధీజీ బ్రిటిష్ వారిని గడగడలాడిస్తే బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతం రచించి జాతిని ఉత్తేజపరిచారు. దేశభక్తి ఉప్పొంగించారు. మరికొందరు ఆనాడు సమాజంలో ఉన్న సతీసహమగమనాన్ని బహు భార్యత్వాన్ని ఎదిరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి రాజా రామ్మోహన్ రాయ్ గా ప్రజల గుండెల్లో...

ఆఖరి ఉత్తరం

ఆఖరి ఉత్తరం ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది.  ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇ ళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఇక మిగిలింది లంక అంత కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాధుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.  కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు. అమ్మ వెళ్లి వస్తాo అంటూ పిల్లలు వెళ్లిపోయారు . అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు. ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని కేక...

మన విశాఖ

మన విశాఖ ఉక్కు నగరo కాదు ఉర్రూతలు ఊగించే నగరం విశాలమైన నగరం మనోవికాసానికి సరియగు స్థలం. మన విశాఖ నగరం. విహారయాత్రలకు అనువైన స్థలం ఉక్కు లాంటి పట్టుదల సాగరం లాంటి మనసు నిత్యం అప్పన్న ఆశీర్వాదం  కలిమికి కనకమహాలక్ష్మి అండ సంపదలు ఇచ్చే సంపత్ వినాయకుడు విశాఖ వాసులకు అదే అదృష్టం సుందర నగరం మీదుగా జాతీయ రహదారి నడిరేయిలో కూడా నగరం చేర్చే సౌకర్యమే హాయి నాలుగు చక్రాల బండి ఉంటే సరే సరి షికారుకి సాగర తీరాలన్నీ రెఢీ సంపత్ వినాయకుడికి అభిషేకం చేసుకుని కనకమహాలక్ష్మి పూజ ముగించుకుని విహారయాత్ర విజయంగా జరగాలని యారాడ వైపు దారి తీద్దాo. ముచ్చటగా మూడు దిక్కుల కొండలు నాలుగోదిక్కు నీలి రoగు సముద్రం యారాడ సాగర తీర విహారం ప్రతి మనిషికి ఉత్సాహo ఆ సాగరానికి కొండలకి మధ్య అనుబంధం ఆటుపోటులు ఎన్ని వచ్చినా కొండకి కరగని ధైర్యం జలకాలాడే చేప పేరు ధరించి ఆ కొండ తీర్చుకుంది రుణం. కొండ ఎక్కించి నగరవాసులకు చూపుతోంది సాగరమంతా అదే డాల్ఫిన్ నోస్. ఆ సాగర తీరం ఋషులుగా మారుస్తుంది అలలన్నీ పాదాలకు తాకి మనసును అందలం ఎక్కిస్తుంది అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అది రుషులు లేని ఋషికొండ  వయస్సుతో నిమిత్తం లేదు పడి లేచే ...

పట్టాభిషేకం

శ్రీరామ పట్టాభిషేకం. అసుర సంహారం చేయడానికి దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు దశరధ మహారాజుకు కొడుకుగా పుట్టి సకల శాస్త్రాలు విద్యలు నేర్చుకుని విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ చేసి జనక మహారాజు కొలువులో శివధనుర్భంగం చేసి సీతాదేవిని భార్యగా చేపట్టి అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడయ్యే సమయంలో పినతల్లి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు నార చీరలు ధరించి అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. అరణ్యంలో ఉండగా మాయావి రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు. వానర వీరుడు సుగ్రీవుడు సైన్యం సహాయంతో సముద్రాన్ని దాటి లంక నగరాన్ని చేరుకుని రావణ సేనతోయుద్ధం చేస్తూ అనేకమంది రాక్షసులను సంహరిస్తాడు. చివరిగా రావణాసురుడు తోటి తలపడతాడు. ఇలా భీకరంగా జరిగిన రామ రావణ యుద్ధంలో దశకంఠుడు శ్రీరామచంద్రమూర్తి చేతులో ప్రాణాలు కోల్పోతాడు. సమస్త దేవతలు ఆనంద ఉత్సాహాలతో పుష్ప వర్షం కురిపించారు. రామచంద్ర మూర్తికి అభినందనలు ఆశీస్సులు అందజేశారు విభీషణుడిని లంకా రాజ్యానికి అధిపతిగా చేసి రామచంద్రుడు అయోధ్య నగరానికి బయలుదేరుతానని తగిన ఏర్పాట్లు చేయమని కోరుతాడు .   కాలినడకన అయోధ్యకు బయలుదేరడం చాలా శ్రమతో కూడుకున్న పని ...

నోము

నోము సాయంకాలం నాలుగు గంటలు అయింది. చీకటి పడిపోతుందని ఒకటే భయం. ప్రతిరోజు చీకటి పడుతుంది. చీకటి అంటే భయం కాదు. ఇంకా గిన్నెలో సగం పైగా ప్రసాదం ఉండిపోయింది వచ్చే వాళ్ళు ఎవరూ కనబడటం లేదు.  ఎలాగా ఇది దేవుడు పెట్టిన పరీక్ష కాబోలు అనుకుంటూ దేవుడికి అనేక దండాలు పెట్టుకుంటూ ఆ అగ్రహారంలో ప్రతి ఇంటికి ఇద్దరు మనుషులను పంపించి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో అని లేదంటే ఇంట్లో ఉన్నవాళ్లు ప్రసాదం తినడానికి రాకుండా ఉండిపోయారేమో అని ఎంక్వయిరీ చేస్తూ ఎదురుచూస్తోంది సీతమ్మ. ఆ ఊరికి వచ్చే ఆఖరి బస్సు ఐదు గంటలకు వస్తుంది. ఆ బస్సులో ఎవరింటికైనా చుట్టాలు రాకపోతారా అని ఆశగా చూస్తోంది. సాధారణంగా స్త్రీలు ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంటారు. ప్రతి నోము కి ఒక రకమైన నియమం ఉంటుంది. మరి సీతమ్మ గారు పట్టి న నోము పేరు చెప్పలేదు కదా. అదేనండి నంది కేశుడి నోము అన్నీ అయిపోయాయి కానీ ఒక్క సెనగలు మాత్రం మిగిలిపోయాయి సీతమ్మ గారికి. సూర్యాస్తమయం అయ్యే లోగా ఆ ప్రసాదం చెల్లిపోవాలి. ఇదివరకు ముందుగా వినాయకుడు పెట్టిన ఉండ్రాళ్ళు మధ్యాహ్నానికే చెల్లిపోయా యి.  కాలభైరవుడికి పెట్టిన గారెలు కూడా ఉదయం టిఫిన్ సమయానికి పిలిచి పెట్ట...

చిలిపి పనులు

చిలిపి పనులు అర్ధరాత్రి 12 గంటలు అయింది.  వీధి తలుపు ఎవరో కొడుతుండడంతో గాఢ నిద్రలో ఉన్న గోవిందరావుకి మెలకువ వచ్చింది. ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ అనుకుంటూ తలుపు సందులో నుంచి బయటకు తొంగి చూసాడు. వీధిలో ఒక పదిమంది యువకులు  నిలబడి ఉన్నారు. "ఎవరండీ ఏం కావాలి అంటూ ప్రశ్నించాడు గోవిందరావు . 'చలపతి రావు గారు పంపించారండి ఎవరికో పురుడు వచ్చిందిట. ఇంగువ తీసుకురమ్మని పంపించారంటూ చెప్పారా యువకులు. వస్తున్నాను ఉండండి. కొట్టు తీస్తాను అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు గదిలోకి వచ్చి లైట్ వేసి డబ్బా గురించి వెతకడం మొదలెట్టాడు గోవిందరావు.  గోవిందరావు అంటే మా ఊర్లో ఉన్న ఏకైక కోమటి .కిరాణా కొట్టు వ్యాపారం అక్కడ లేని సరుకుంటూ ఉండదు. కానీ అన్ని హై రేట్లు. ఏ వేళ లేపిన సరుకు అప్పిస్తాడు. లేదు లేదంటూనే కిరాణా కొట్టు మీద ఆ ఊర్లో పది ఎకరాలు భూమి సంపాదించాడు. దానికి తోడు తాకట్టువాకట్టు వ్యాపారం కూడా ఉంది. అంతా వ్యవసాయదారులు. ఇంకేముంది వ్యవసాయం పనులు కోసం అప్పు తీసుకుని పంటలు రాగానే తీర్చేస్తుంటారు. పైగా ధాన్యo కొనుగోలు కూడా ఆయనే. మా ఊరుకి బ్యాంక్ లాంటివాడని చెప్పొచ్చు.  ఆయుర్వేదిక్ డాక్టర్...