పోస్ట్‌లు

మే 25, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

చిత్తూరు జిల్లా విహారయాత్ర

చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక సాంస్కృతిక, ప్రకృతి సౌందర్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడి విహారయాత్రకు అనేక ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైనవి: 🛕 ఆధ్యాత్మిక ప్రదేశాలు కాణిపాకం వినాయక ఆలయం : శ్రీకాళహస్తి దేవాలయం : గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం : తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం 🌿 ప్రకృతి అందాలు కైగల్ జలపాతం : కైలాసకోన జలపాతం : తలకోన : 🏞️ అడవులు మరియు అభయారణ్యాలు శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం : కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం : 🏰 చారిత్రాత్మక ప్రదేశాలు గుర్రంకొండ కోట : చంద్రగిరి కోట : 🏕️ విహారయాత్రలు తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు: తిరుపతి గురించి ముఖ్య విషయాలు: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి గల హిందూ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం శ్రీ వేంకటేశ్వరుడికి (లార్డ్ వెంకటేశ్వర, అంటే వేంకటేశ్వర స్వామి) అంకితం. వేదక...

స్త్రీ

 స్త్రీ  పోరాటమే ఆమె ప్రాణవాయువు ప్రేమే ఆమె ఆభరణం ముళ్ల దారిలో నడిచినప్పటికీ స్వర్గపు సీమలో కలల పయనం ఆమెదే ఆమెను చూసి త్యాగం తలవంచుకుంది సహనం చేతులు జోడించి నమస్కరించింది స్వార్థం నిశ్శబ్దంగా నిలబడిపోయింది ఆ ఇంటి వెలుగు చూసి దీపం మురిసిపోయింది ఆమెను చూసి భూమాత "నా బిడ్డ" అని ముద్దు పెట్టుకుంది :  ప్రాణికోటి అంతటికి నేను, ఆ గూడుకి ఆమే ఊపిరి  అంటూ ఉప్పొంగిపోయాడు వాయువు నేను నిత్యం ప్రతి ఇంట్లో ఒక అతిధిని  అతిధి మర్యాదలో ఆమెకు  ఆమె సాటి అంటాడు అగ్ని  వేసవిలో పన్నీటి జల్లులా అనునిత్యం ప్రేమ జల్లు కురిపిస్తుంది  అంటాడు వర్షాలదేవుడు.  ఆకాశమంత విశాలమైన మనసు  ఆదరణలో ఆకాశమే హద్దు.  అంటుంది ఆకాశం. అందం లో నాతో పోటీ పడుతోంది  అంటాడు చందమామ. అవసరమైతే నాలాగే చమటలు పట్టిస్తుంది. అంటాడు వేసవి సూర్యుడు. ఆమెకు ఎవరూ లేరు సాటి  నా సృష్టి అంత గొప్పది అంటాడు  బ్రహ్మ. ఎవరు ఎన్ని చెప్పినా  కట్టుకున్న వాడు గుండె లోతుల్లోంచి  వచ్చిన మాటకు ఆమె ఉప్పొంగిపోతుంది. పరవశించిపోతుంది  అది ఆడజన్మంటే రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు...

ఆ ముగ్గురు

ఆ ముగ్గురు క్షణం తీరికలేని మనిషి జీవితానికి తలుపు తట్టి సహాయం అందించే అపర త్రిమూర్తులు. మూల్యం చెల్లించిన మరిచిపోలేని సహాయం. ఎండైనా వానైనా వరదైనా క్రమం తప్పకుండా ఆ సమయానికి గుమ్మం లో నుంచి పిలుపు పాల బుగ్గల పసివాడు మొదలు పండు ముదుసలి వరకు ఆ పిలుపు కోసమే ఎదురు చూపు. ఇంతకీ ఆ పిలుపు పిలిచేది ఎవరు ఇంకెవరు అపర గోపాలుడు మన పాలవాడు. లేచింది మొదలు కాఫీ చుక్క కోసం పడిగాపులు. ఆ చుక్కతోనే మొదలవుతాయి మన పరుగులు. ఆధునిక మహిళ ప్రతినిత్యం చేస్తోంది బ్రతుకుతో అష్టావధానం.పనిలో సహాయం లేనిదే నడవదు గృహిణి బ్రతుకు.ఆ మనిషిని చూడగానే గృహిణి కళ్ళల్లో కొండంత వెలుగు. విటమిన్లన్నీ గంపలో గుమ్మం దగ్గరికి తెచ్చి  అమ్మగారికి భారం తగ్గించేది కూరలమ్మి తాజా కూరలతో బలం పెంచే ఆరోగ్య ప్రదాయిని. సమయానికి తెచ్చి సమయం లేని ఆధునిక మహిళకి కొండంత సహాయం చేసేది ఆకుకూరల అమ్మాయి. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు          కాకినాడ 9491792279.

ఇటుక

ఇటుక కాళ్ల కింద నలిగిన మట్టి  అచ్చులోదూరి  అమ్మలా మారి  కొలిమి చేరి  ఒళ్ళు కాల్చుకుని  చల్లబడి మాలు అద్దుకుని  గోడకు ఆధారమై  మేడను నిలబెట్టి కలకాలం కష్టసుఖాలన్నీ   చూస్తూ  గోడు వినే నాథుడు లేక  వంద ఏళ్ళు అయిన  నడ్డి విరగకుండా  ఇటుక మంచిది  అని ప్రైజులు కొట్టేస్తుంది. మట్టి పిసికి  అచ్చు పోసిన మహారాజుని  పూరి గుడిసె వెక్కిరిస్తుంది  అరచేతిలో స్వర్గం చూపించే  షావుకారిని రెండంతస్తుల మేడ   గర్వంగా తల  పైకెత్తుకుని తిరిగేలా చేస్తుంది.  నాది డూప్లెక్స్  మెయిన్ రోడ్ లో ఇంకొక కాంప్లెక్స్  అన్నింటికీ ఆ ఊరి ఇటుకే  పైసా ఖర్చు లేని పబ్లిసిటీ ఇటుక ముక్కకి మట్టి పిసికిన మహారాజు  ఎప్పటికీ తెర వెనుక బొమ్మే ఎవరో చెప్పినట్టు ఆడుతున్న  తోలుబొమ్మ. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ  9491792279

హరి కథ

సంప్రదాయ హరికథ – భక్తి, వినోదం, విద్య మేళవించిన కళారూపం. భారతీయ సాంస్కృతిక సంపదలో హరికథ ప్రత్యేక స్థానం కలిగిన కళారూపం. ఇది కేవలం ఓ కథ కాదు – ఇది భక్తి, సంగీతం, సంభాషణ, తత్త్వచింతనల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న కళ. శ్రోతల మనస్సులను భక్తి మార్గంలో నడిపించడంతో పాటు, సామాజిక సందేశాలునూ అందించగల ప్రత్యేకత ఈ కళకు ఉంది. హరికథ యొక్క ఉద్భవం  "హరి" అంటే భగవంతుడు (విష్ణువు), "కథ" అంటే కథనం. హరికథా సంప్రదాయం పురాణ కాలం నుండీ కొనసాగుతూ వచ్చింది. ఇది ప్రధానంగా భాగవతం, రామాయణం, మహాభారతం వంటి గ్రంధాలనుఆధారంగా కథనం చేస్తుంది. ఈ హరికథ వినడం వలన ఆ కాలంలో చిన్నపిల్లలకు సైతం పురాణ కథలు తెలిసేవి  పెద్దలు ఆ కథను తెలిసినవాళ్లయినప్పటికీ ఆ కథలు వినడం వలన పుణ్యం వస్తుందని కచ్చితంగా శ్రోతలుగా మారిపోయేవారు  మహానుభావులు తమ జ్ఞానం, భక్తి బోధనలకు ఇది సాధనగా వాడారు. తెలుగులో హరికథ పరంపర తెలుగు భాషలో హరికథను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన ప్రముఖులు చాలామంది ఉన్నారు వారిలో ఆదిభట్ల నారాయణదాసు గారు ప్రముఖులు వారు హరికథను వినోదాత్మకంగా, భక్తి శ్రద్ధతో, విజ్ఞానంతో మిళితం చేసి ప్రజల హృదయాల్లో నిలిపారు హరికథ న...