పోస్ట్‌లు

ఫిబ్రవరి 16, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పండుగలో పల్లె_టూరు

పండగలో పల్లె _టూరు "ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు "అంటూ మనవాళ్లు ఈ మధ్యన నా గురించి అందమైన పాట ఒక చలనచిత్రంలో చాలా గొప్పగా వ్రాశారు. అప్పటినుంచి పల్లె టూరు మొదలైంది. పల్లెటూరు అంటే చుట్టూ అందమైన చెట్లు గలగల పారే సెలయేళ్లు పిల్ల కాలువలు చెరువులు పంట చేలు పాడి పశువులు అందమైన పెంకుటిల్లు విశాలమైన మనసులు ఆత్మీయమైన పలకరింపులు ఇవి నా గుర్తులు  మామూలుగానే నేను చాలా అందంగా ఉంటాను. అందులో సంక్రాంతి పండుగ. పండగ అందం పల్లెటూర్లోనే కనబడుతుంది. నా వీధుల్లో ఉండే ఇళ్ళు తోరణాలతోటి, రంగుల తోటి ,వాకిళ్లు ముగ్గుల తోటి అందంగా మెరిసిపోతూ వంటగదిలన్నీ పిండి వంటల వాసనలతో నిండిపోతూ వచ్చే అతిధుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి ఏదో వాహనం ఆగిన శబ్దం వినబడింది . డోర్ తీసి కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని నలుగురు కుర్రాళ్ళు అందంగా బ్యాగులు భుజాన్ని తగిలించుకుని కారు దిగుతూ కనబడ్డారు. వీళ్ళు ఎవరబ్బా ఆనమాలు తెలియడం లేదు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు నాకు తెలియని వాళ్ళు ఎవరుంటారు. ఇంట్లో తరాలు మారిన నేను మాత్రం మారలేదు కదా.  ఎవరి పిల్లలు వీళ్ళు అని నాలో నేను అనుకుంటూ ఉంటే మన "ఊరంతా మారిపోయింది అమ్మ ...

భజన

భజన " శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనo   అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం "  ఇవి వ్యాస మహర్షి చెప్పిన నవవిధ భక్తి మార్గాలు. భగవంతుని చరిత్ర వినడం, భగవంతుని లీలలను కీర్తించడం ఇవన్నీ భగవంతుని చేరుకునే మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుని ఆరాధించి ముక్తి పొందిన అనేకమంది చరిత్రలు మనకి పురాణ గాథలు చెబుతున్నాయి.  అలాంటి నవవిధభక్తి మార్గాలలో భగవంతుని లీలలు కీర్తించడం ఒకటి. అనేకమంది భక్తులు రామదాసు అన్నమయ్య త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు వంటి వారు తమ కీర్తనల ద్వారానే భగవంతుని ఆరాధించి ముక్తి పొందారని మనకి చరిత్ర చెబుతోంది. ఈనాటికీ మనం అనేక గ్రామాల్లోనూ పట్టణాలలోనూ దేవాలయాల్లో భజనలు చేయడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పర్వదినాల్లోనూ పండుగలలోనూ ఈ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉండడం అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మా చిన్నతనాల్లో మా గ్రామంలో మా ఇంటిలో కూడా ప్రతి శనివారం భజనలు చేసేవారు.  అసలు భజన అంటే ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుంది. పదిమంది ఒకచోట కూర్చుని చేసే భగవన్నామస్మరణ "భజన. భగవంతుని లీలలు తలుచుకుంటూ ప్రార్థించడం భజన. ఇది కూడా భగవంతుని చేరుకునే ...

ఆశయం

ఆశయం. అందాల రంగురంగుల బల్బుల వెలుగులో ఆ బహుళ అంతస్తుల భవనం మీద అందంగా మెరిసిపోతున్న" పరంధామయ్య నిలయం "అనే పేరు చూసి ఆనందపడిపోయాడు రఘురామయ్య.  ఎన్నో ఏళ్ల కలల ఫలితం. ఎన్నో సంవత్సరాలు వంటరితనంతో బాధపడిన రఘురామయ్య తొమ్మిది కుటుంబాలతో కాపురం ఉంటున్నాడు. వాళ్లు రక్త సంబంధీకులు కాదు. దూరపు బంధువులు మరియు స్నేహితులు. అయినా కావాలని అందర్నీ ఒక చోటుకు చేర్చాడు. పదిమందితో కలిసి ఉండాలని జీవితాశయం. తనకంటూ ఎవరూ తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా కట్టుకున్న భార్య లేకపోయినా ఇవాళ నా వెనుక తొమ్మిదికుటుంబాలు వాళ్ళు ఉన్నారని ఆనందం రఘురామయ్య కళ్ళల్లో కనబడుతోంది ఆ అపార్ట్మెంట్ చూసి. పిల్లలు సందడితో అపార్ట్మెంట్ అంతా కళకళలాడి పోతోంది.   ఒంటరితనం నిజంగా అంత భయంకరమైనది. డబ్బు ఒంటరితన్నాన్ని దూరం చేయలేదు. వ్యసనాలు ఒంటరితనాన్ని దూరం చేస్తాయని చాలామంది దానికి అలవాటు పడతారు. కానీ ఆ కొద్ది సేపే అది తోడు ఇస్తుంది కానీ ఆ తర్వాత మామూలే. ఎవరు ఒంటరితనాన్ని కోరుకోరు.  జీవితంలో ఎవరికి ఏది వ్రాసిపెట్టి ఉంటే అదెలా జరిగిపోతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉంటుంది. ఏది మన ప్రయోజకత్వం కాదు. ఏదో తెలియని శక్తి మనల్ని...

స్వర్గం

స్వర్గం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అందులో ఉండే వాళ్లు కష్టాలు అనుభవించినప్పటికీ అది వాళ్ళకి స్వర్గసీమే. స్వర్గంలో ఏముంటుందో మనకు తెలియదు. కానీ ఆ ఇల్లు ఆప్యాయత అనురాగం అనుబంధం ప్రేమ కొంచెం కోపం అన్ని రుచి చూపించిన ప్రదేశం. రుచి చూపించడం ఏమిటి సంపూర్ణంగా అనుభవించిన ప్రదేశం. అందుకే ఆ ఊరు వదిలేసి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మా ఇంటి మీద మమకారం తలుచుకున్నప్పుడల్లా ఉత్సాహం ఈనాటికి ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నాయి.. అది ఆ ఇంటి మహత్యం. ఆ ఇల్లు కట్టిన వాళ్ళ మనసు అటువంటిది. అది ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు. ప్రేమ ఆప్యాయత అనుబంధం అనురాగం వీటితో కట్టిన ఇల్లు. ఆకాశ వీధిలో ఆహారం వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళ్లే పక్షి సాయంకాలానికి ఆ చెట్టు కొమ్మకు చేరినట్లే ప్రతివాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తమ గూటికి చేరవలసిందే. ఎక్కడా పట్టుమని పది రోజులు ఇల్లు విడిచి ఉండడం అంటే చాలామందికి బెంగ. అది రెండు గదులు ఇల్లు అయినా మైసూర్ ప్యాలెస్ అయిన ఒకటే విధంగా ఉంటుంది మమకారం. ఎందుకంటే అది అలవాటైన ప్రదేశం. ఇంటితో అంత అనుబంధం ఉంటుంది ప్రతి ఒక్కరికి. సుమారు రెండు పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు ఆనందంగా కాపురం ...

మరుగున పడ్డ కథ

మరుగున పడ్డ కథ " ఏవండీ వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. ఈసారైనా కనీసం నాలుగు ప్రోగ్రాములు కుదిరితే బాగుండు ను. కనీసం పండగ రోజుల్లో కూడా ఎవరు మీ ప్రోగ్రాం పెట్టించుకోవడానికి రావడం లేదు. ఇదివరకైతే ఎప్పుడూ ఖాళీ ఉండేది కాదు. వినాయక చవితి ,దసరా ఉత్సవాలు, దీపావళికి, కార్తీక మాసం సంక్రాంతి సంబరాలు, శివరాత్రి ఉత్సవాలంటూ ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. ఏదో శాపం తగిలింది. కనీసం బతిమాలుతున్న ఎవరు ఈ ప్రోగ్రాం పెట్టించుకోవడం లేదు.  ఏమిటో ఈ రోజులు? కాలం మారిపోయింది ప్రాచీనమైన కళలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఈ కళనీ నమ్ముకుని బతుకుతున్న మనలాంటి కుటుంబాలకి గడిచేది ఎలాగా? గతంలో ప్రతి ఏడాది మీ ప్రోగ్రామ్ తప్పనిసరిగా ఉండేది కదా పల్లిపాలెం వినాయక చవితి ఉత్సవాల్లో ,వాళ్లు పిలవకపోతేనే మీరే ఒక్కసారి వెళ్లి అడిగి వస్తే మంచిది కదా !అవసరం మనది అనీ చెప్పింది పతంజలి శాస్త్రి భార్య సుమతి.  "చూడండి పండగ పూట కనీసం పచ్చడి మెతుకులతోనైనా పిల్లల కడుపు నింపాలి కదా!. ఇంక అంతకంటే మీకు నేను ఏం చెప్పను?. మనం ఏదో సర్ది చెప్పుకుని పడుకుంటాం, పిల్లలు ఎలాగండి ?అని చెప్తున్న భార్య మాటలకి దుఃఖం వచ్చింది...

కృష్ణ

కృష్ణ ఉదయం  పది గంటలు అయింది.  చుట్టూ పోలీసులు మధ్య చేతులకు బేడీలు వేసుకొని ఉన్న సుమారు ముప్పై సంవత్సరములు యువతి నడుచుకుంటూ కోర్టు లోపలికి అడుగుపెట్టింది  కోర్ట్ ఆవరణలో ఉన్న అందరూ ఆమెకేసి వింతగా చూస్తున్నారు. ఈమె కూడా నేరం చేసిందా అన్నట్లు! ఆవిడకు మినహాయింపు ఏమిటి ?అని చూస్తే పాపం ఆవిడ నిండు గర్భిణీ.  న్యాయదేవతకు అవి ఏమీ సంబంధం లేదు. సాక్ష్యం బలంగా ఉంటే ఎవరైనా నేరస్తులు. అది దొంగ సాక్ష్యం కావచ్చు ,దొరల సాక్ష్యం కావచ్చు. సాక్ష్యాన్ని నమ్మి ఇంకేముంది యావత్ జీవిత కారాగర శిక్ష  విధించింది. సాధారణంగా ప్రతి స్త్రీ  పురిటి కోసం పుట్టింటికి వెళ్తారు. కానీ  విధి వ్రాత అలా ఉంది. జైలు గోడలే పుట్టిల్లు అయింది. మానవతా దృక్పథంతో  కోర్టు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిస్తే మరో ప్రాణికి జన్మనిచ్చింది సరిత.  ఆ బిడ్డను చూసి కుమిలి కుమిలి ఏడ్చింది  సదరు ఖైదీ సరిత.  రేపటి సమాజంలో దీని బ్రతుకేమిటి?   సరిత భర్త ఎప్పుడో పారిపోయాడు. ఇంక నా అన్న వాళ్ళు ఎవరూ లేరు సరితకి. ఆ నాలుగు గోడల మధ్య ఆ పిల్లని పెంచుకోవడానికి అనుమతించింది ప్రభుత్వం. శ్రీకృష్ణ పరమాత్...

ఇది ఏమి ఉప్మా చెప్మా!

ఇది ఏమి ఉప్మా చెప్మా!  ప్రతిరోజు ఇంటి ఇల్లాలికి అనేక సమస్యలు. ఏమిటా సమస్యలు? ఆర్థిక సమస్యలు కాదు. అల్పాహారం సమస్యలు. పదుగురు మెచ్చే అల్పాహారం చేయాలని తాపత్రయం. అందుకే ప్రతి ఉదయం కాఫీ తాగిన వెంటనే ఇవాళ ఏం టిఫిన్ చేసుకుందాం అoటు పిల్లలు మరియు భర్త మనోగతం తెలుసుకుంటుంది. ఎవరు ఏమి చెప్పకపోతే మౌనంగా తనకు నచ్చినది తయారు చేసుకుంటుంది. ఇంటి పనులతో అలసిపోయి ఉంటే కాస్తంత ఉప్మా కలియబెట్టి పెట్టేస్తుంది. ఆ అల్పాహారం చూడగానే కుటుంబ సభ్యుల మొహాలు మాడిపోయిన పెసరట్టులా అయిపోతాయి. అయినా తప్పదు మరి. అయితే ఒకటి ఉంది చెయ్యి తిరిగిన ఇల్లాలు చేసిన ఉప్మా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.  ఇప్పుడైతే రకరకాల టిఫిన్లు వచ్చేయ్ గాని ఒకప్పుడు సదరు ఉప్మాయే పెళ్లి వారికి అల్పాహారం. ఆకుపచ్చటి అరిటాకులో నూనెలో తేలియాడుతూ తెల్లగా మెరిసిపోయే ఆ ఉప్మా ఆ పెళ్లి వారికి అమృతమే.ఆ రోజులు కాబట్టి అలా ఉండేది. ఈ రోజుల్లో ఉప్మా చూస్తే తేలికగా చూస్తారు. పెసరట్టు కాంబినేషన్తో అయితే మారు అడుగుతారు. మాట్లాడకుండా తినేస్తారు. అప్పట్లో ఈ ఉప్మాలో పసుపు రంగులో మెరిసిపోయే శనగపప్పు తప్ప ఈ రోజుల్లో లాగ రకరకాల పప్పులు ఉప్మా తో పాటు ఉడికే...

గుండెల్లో నిలిచిన వైద్యుడు

గుండెల్లో నిలిచిన వైద్యుడు  ప్రతిరోజు ఎంతోమంది రోగుల గుండెలకి స్వాంతన చేకూర్చే డాక్టర్ రామారావు కి ఆరోజు గుండెల్లో చాలా గుబులుగా ఉంది. ఆ వయసులో కూడా చాలా ఉత్సాహంగా జూనియర్ డాక్టర్లతో కలిసిమెలిసి పని చేస్తూ గుండె శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ రామారావు మనసు అదోలా ఉంది. నాలుగు దశాబ్దాల పాటు గవర్నమెంట్ డాక్టర్ గా సేవలందించిన రామారావు కి ఆ రోజుతో ఆసుపత్రితో అనుబంధం తెగిపోతోంది డాక్టర్ రామారావు గుండె సంబంధిత వ్యాధులు చికిత్స చేసే డాక్టర్ గా ఆ మండలంలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. వృత్తిపరంగా ఎన్నో సమస్యలున్న తన తోటి ఉద్యోగులతో మంచిగా ఉంటూ కాలక్షేపం చేశాడు ఇన్ని రోజులు. ఎప్పటిలాగే సాయంకాలం ఆరోజు కూడా ఐదు గంటలు అయింది . పదవి విరమణ సభ మొదలైంది. ఒక్కొక్కరే లేచి డాక్టర్ గారితో తన అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు.  ఇంతలో చివర వరుసలో కూర్చున్న ఒక జూనియర్ డాక్టర్ లేచి మైక్ తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. నా పేరు రవి ప్రకాష్. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ జూనియర్ డాక్టర్ గా జాయిన్ అయ్యి నెలరోజులు అయింది. అయితే డాక్టర్ గారితో పని చేసిన అనుభవం కంటే ఒక పేషెంట్ కొడుకుగా నా అనుభవం ఎక్కువ...

కాఫీ తాగారా

కాఫీ తాగారా!  " దిక్కుమాలిన అలవాటయింది! ఇలా మొహం కడుక్కుంటున్నారో లేదో అలా కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చిందులు తొక్కుతారు అంటూ ప్రతిరోజులాగే దండకం చదివి కాఫీ కప్పు అక్కడ పెట్టింది మా శ్రీమతి రాజ్యలక్ష్మి. కాఫీ రుచి ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ కాఫీ తాగదు. 'కప్పు కాదండి పెద్ద స్టీల్ గ్లాస్. ఆ గ్లాస్ తో కాఫీ తాగకపోతే కాఫీ తాగినట్టు ఉండదు. ఇంకా నయం మా తాతగారు ఒకాయన పెద్ద చెంబుతో కాఫీ తాగేవాడుట. అయితే మేము మటుకు తక్కువేముంది . ఒక్కసారి తాగే బదులు నాలుగు సార్లు తాగుతున్నాం.  ఇంట్లో ఉంటే ఏ బెంగ ఉండదు. ఎన్ని తిట్లు తిట్టినా వేళకు  కాఫీ వచ్చి పడిపోతుంది. మరి ఎక్కడికైనా వెళ్తే మనకా ఉదయం లేచి కాఫీ తాగడం అలవాటు. అవతల వాళ్ళు లేస్తారా! లేచిన వెంటనే కాఫీ ఇస్తారా! అనేది ఒక పెద్ద బెంగ. సరే పెళ్లిళ్లకి ఫంక్షన్లకి వెళితే ఆ కాఫీ తాగితే ఏడుపొస్తుంది . డోసు తక్కువ  రుచి నేను వర్ణిస్తే బాగుండదు. మా చిన్నతనంలో పొయ్యి మీద కాచిన కాఫీ ఎంత రుచికరంగా ఉండేది. ఇప్పుడు కాఫీ మేకర్లు వచ్చేసి పని సులువు అయింది గానీ సరుకు రుచి మరి ఏమో!  ఉదయం లేచిన దగ్గర్నుంచి మామూలుగ...

ఒంటరితనం 2.0

". ఒంటరితనం 2.0 " " అమ్మ నువ్వేమీ బెంగ పడకు. నేను ప్రతిరోజు వీడియో కాల్   చేస్తుంటాను గా. నువ్వు కావాలంటే అమెరికా రావచ్చు నేను  కూడా ఇండియా రావచ్చు ఇప్పుడు నేను ఉద్యోగస్తుడిని. ఏమి ఇబ్బంది లేదు అంటూ పార్వతమ్మ గారి కొడుకు రాకేష్ ధైర్యం చెబుతూ అమెరికాకి విమానం ఎక్కేసాడు.  రాకేష్ కి అమెరికాలో ఉద్యోగం రావడం తో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోయినప్పటికీ పార్వతమ్మ గారు ఒంటరిది అయిపోయింది . రాకేష్ తండ్రి పోయినప్పటి నుంచి ఎంతోమంది రెండో పెళ్లి చేసుకున్న సలహా ఇచ్చినప్పటికీ ఒప్పుకోకుండా అన్నీ తానై పెంచుకుంటూ వచ్చింది రాకేష్ ని . మూడో వ్యక్తి ఇంట్లో లేకపోవడం మూలంగా రాకేష్ బాగా అలవాటయ్యాడు పార్వతమ్మకి. ఇద్దరు కలిసి భోజనం చేయడం కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం అలవాటు. అస్తమాను అమ్మ అమ్మ అంటూ పార్వతమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు రాకేష్. ఇప్పుడు రాకేష్ అమెరికా వెళ్ళిపోవడంతో తీవ్రమైన వంటరితనంతో బాధపడుతోంది పార్వతమ్మ. అప్పుడే రాకేష్ అమెరికా వెళ్లి ఆరు నెలలు అయిపోయింది. మొదట్లో వారానికి ఒకసారి ఫోన్ చేసి రాకేష్ క్రమేపీ పని ఎక్కువగా ఉంటుందంటూ పదిహేనురోజులకు ఒకసారి ఫోన్ చేయడo మొదలుపెట్...

కాలమహిమ

కాల మహిమ " అన్నింటికన్నా బలమైనది ఏది? అని అడిగారు తెలుగు ఉపాధ్యాయులు పదో తరగతిలోని పిల్లలకి తెలుగు పాఠం చెబుతూ.  " అందరికన్నా బలమైన వాడు భీముడు ఒక విద్యార్థి లేచి చెప్పాడు.  " కాదు మాస్టారు ఆంజనేయుడు ఇంకో విద్యార్థిని నువ్వు తప్పు చెప్పావు అని ఆ విద్యార్థి కేసి చూస్తూ.  ఇంకెవరైనా చెప్పగలరా ! అని తరగతి గది అంతా చూశారు తెలుగు ఉపాధ్యాయులు.  ఎప్పుడూ చివరి బెంచిలో కూర్చుని ఉండే కుర్రవాడు గబుక్కున లేచి అన్నిటికన్నా బలమైనది "కాలము" సార్ అన్నాడు. నీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అని అడిగారు మాస్టారు.  మా అమ్మ చెబుతూ ఉంటుందండి. ఒకప్పుడు మాకు తినడానికి తిండి ఉండేది కాదట. ఇప్పుడు మా పరిస్థితి బావుంది . అంతా ఆ ఈశ్వరుడు దయ అని రోజు చెబుతూ ఉంటుందండి. కాలస్వరూపమే ఈశ్వరుడని మీరే చెప్పారు అని అన్నాడు ఆ కుర్రాడు.  ఆ తెలుగు ఉపాధ్యాయుడు ఆ కుర్రవాడు తెలివితేటలకు ఆనందించి అభినందించి కూర్చోబెట్టాడు. కాలం కళ్ళకి కనపడదు. అది ఏదో అదృశ్య శక్తి. కానీ అత్యంత బలీయమైనది. ఈ లోకంలోకి మనం తీసుకొచ్చేది తీసుకువెళ్లిపోయేది కూడా కాలమే. సమయం అయిందంటే ఒక క్షణం కూడా ఉంచదు. కాలం గమనించలేని వేగంతో ...