పోస్ట్‌లు

ఏప్రిల్ 4, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

సగం అక్కడ _ సగం ఇక్కడ

సగం అక్కడ… సగం ఇక్కడ  ఆ మండువా లోగిల్లో, పసిపిల్లల పరుగుల గోలతో, అనుబంధాలు పెనవేసుకున్న ఆనందపు ఆవరణంలో... కాలచక్రం ముందుకు సాగింది, పలకరింపులన్నీ ఓడిపోతూ, స్నేహబంధాలు నెమ్మదిగా నీడలై మిగిలిపోయాయి. ఒకప్పుడు ఉత్సాహంగా నిండిన ఆవరణలో, ఇప్పుడో వెలితి చెమ్మగిల్లిన గాలి మిగిలింది. అన్నదమ్ములు విడిపోయారు, కన్నబిడ్డలు గువ్వల్లా ఎగిరిపోయారు, ఇంటి గూటిని వదిలి వెలుగు వీధుల వైపు వాలిపోయారు. ఏదైనా పండగకైనా, పబ్బానికైనా ఊరికి వస్తారు, తల్లిని పలకరిస్తారు. కానీ ఆ హడావుడి క్షణాలే... ఆశలు చిగురించే సమయం నిదానమే! మేము మాత్రం, రెక్కలు విరిగిన పక్షిలా, పాత గూటిలో మగ్గిపోతూ, మనసు తట్టినప్పుడల్లా, ఒక ఎర్రబస్సు ఎక్కి, ఆత్మీయుల్ని పలకరించి వస్తాం. కానీ మనసులో నిండిపోయే శూన్యం... ఏ దారి తగిలినా, అదే గమ్యం! వయసు మళ్లిన మా జీవితం— సగం అక్కడ… సగం ఇక్కడ… ఆధార్ కార్డు అడ్రస్ ఆంధ్ర రాష్ట్రమైతే, కేరాఫ్ అడ్రస్ తెలంగాణలోని అబ్బాయిదీ!  అది పరాయి రాష్ట్రం కాదు   పరిచయం లేని ఊరు కాదు. తెల్లారి లేస్తే మమ్మల్ని పలకరించేది  పల్లెటూర్లోని మన పక్కింటి వాడే అందుకే మీది ఏ రాష్ట్రం అని అడిగితే  మావి ...

అరటిపండు

అరటిపండు మేని చూడ పసుపు పచ్చగా ఉండు తొక్క తీసి చూడ చందమామ వలె నుండు అమ్మ రంగు చూడ ఆకుపచ్చగా నుండు కొరికి చూడ తియ్యగా నుండు.  ఆకుతో జత కట్టి పండు తాంబూలమగు.  శివయ్య పూజలో చేరి నైవేద్యంగా మారు  అగరబత్తికి ఆసరా ఇచ్చి పరువు నిలబెట్టు పూజలో ప్రసాదమై భక్తుల నోటికి చేరు. ఆటల్లో అరటిపండు కాదు ఆకులోని అరటిపండు ఏ కాలపు విందుకి అయిన అదే కింగ్. విందు భోజనపు విస్తరిలో కనువిందు చేయు గడ్డ పెరుగు రుచి మరింత పెంచు బక్క చిక్కిన జనులకు బలిమి పెంచు పండులోని ఖనిజం రక్తపోటుని తగ్గించు. ముడతలపడ్డ మొహానికి వెలుగునిచ్చు వెరసి అరటిపండు అంటే పేదవాడి ఆపిల్ పండు. మందు కొట్టి పసుపు పచ్చగా మార్చి అరటిపండు పరువు తీయు చున్నారు కలిజనులు. రంగు భ్రమలో పడి మందు మింగి పొట్ట చేత పట్టుకుని పరుగులు పెట్టుచున్నారు జనులు. ఏమి చెప్పను కదళీఫలము మహిమలు. పుడమి తల్లి ముద్దుబిడ్డ లీలలు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279

పల్లెకవి గోరేటి

పల్లె కవి _ గోరేటి భారతదేశం కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. ఆదికావ్యాల నుంచి ఆధునిక కవిత్వం వరకు, అనేక మంది కవులు సమాజాన్ని ప్రతిబింబిస్తూ, మన సంస్కృతిని అభివ్యక్తం చేశారు. వీరిలో కొందరు ప్రేమను, కొందరు విరహాన్ని, మరికొందరు సమాజాన్ని కవిత్వంగా మలిచారు. అయితే, ఒక కవి మాత్రం తన జన్మభూమి పల్లెను, అక్కడి జీవనాన్ని తన కవిత్వంగా అక్షరాల్లో చూపించాడు. అతను ప్రజా కవి గోరేటి వెంకన్న. గోరేటి వెంకన్న పాటలు పల్లె జన జీవనంలోని ప్రతిబింబాలు. అతని కవిత్వంలో మట్టివాసన ఉంది.పేదల కష్టసుఖాలున్నాయి, ప్రకృతితో మమేకమైన జీవన సౌందర్యం ఉంది. వేదిక మీద నిలబడి, తన స్వరంతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లే శక్తి ఆయన గీతాలలో ఉంది. ఆయన పాటలు కల్పితాలు కాదు, పచ్చి నిజాలు. పల్లె కష్టాలను, ప్రకృతిలోని మాధుర్యాన్ని ప్రతిబింబించే మహాకవి వెంకన్న. పల్లె కన్నీటి గాథ "పల్లె కన్నీరు పెడుతోంది" అంటూ చేతివృత్తులపై ఆధారపడిన ప్రజల బాధను తన గీతాల ద్వారా వ్యక్తీకరించారు. వృత్తి కోల్పోయిన పల్లె ప్రజలు పట్టణాల్లో ఎలా అల్లాడుతున్నారో, వారికి ఎదురవుతున్న అనుభవాల్ని పదాల రూపంలో చెబుతారు. "కులవృత్తికి సాటి లేదు గువ్వ...

నీటిలో దేవుడు

నీటిలో దేవుడు ఉదయం ఆరు గంటలయింది  నగరం అంతా మంచు కప్పేసి ఉంది. ఇప్పుడిప్పుడే బద్దకంగా ఒళ్ళు విరుచుకొంటోంది. నగరం అంతా నిశ్శబ్దంగా కానీ ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎక్కడి నుంచో పెద్ద శబ్దం ,రక్షించండి! రక్షించండి !అని ఎవరివో అరుపులు వినబడ్డాయి చెరువు పక్కన గుడిసెలో మంచం మీద పడుకున్న రాజుకి. ప్రతిరోజు ఇలాంటి అరుపులు మామూలే. ఆ అరుపులు విన్న వెంటనే రాజు ,అతని భార్య మీరా పరుగు పరుగున బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. ." ఎవరో పాతికేళ్లు ఉంటాయేమో ఆ అబ్బాయికి చూస్తుండగానే దూకేసాడు! అంటూ చెప్పుకొచ్చారు.   వెంటనే రాజు భార్య మీరా రాజు కేసి చూసింది. ఇది నీ కేసు అన్నట్లుగా !ఏ పక్క నుంచి దూకాడు! అని అడిగాడు రాజు. ఆ ప్రదేశం చూపించారు అక్కడ ఉన్న జనం. రాజు వెంటనే ఏమి ఆలోచించకుండా ఆ చెరువులోకి దూకి కొంచెం దూరం ఈత కొట్టి చేతికి దొరికిన కాలును పట్టుకుని చెరువు గట్టుమీదకు తీసుకొచ్చి పొట్ట మీద గట్టిగా నొక్కాడు .  అలా నాలుగు మూడుసార్లు చేయగా తాగిన నీళ్లన్నీ బయటకు వచ్చి పాపం ఆ కుర్రవాడు కళ్ళు తెరిచి బిత్తర చూపులు చూడ సాగాడు .   చుట్టూ ఉన్న జనం నీ పేరేమిటి ?నీది...