పోస్ట్‌లు

మార్చి 26, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

శతజయంతి

శత జయంతి   ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగలు జరుపుకుంటూనే ఉంటాము. బంధువులని పాత స్నేహితులని కలుసుకుంటాము. అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. మా పల్లిపాలెం గ్రామవాసులు సాహిత్య అభిమానులు సూరయ్య బుధుడు కుటుంబ సభ్యులు సంక్రాంతి పండుగ తో పాటు శత జయంతి పండగ కూడా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు.  ఈ రోజా ఆ పండుగకి ఆహ్వానం అందినది. ఆహ్వానం అందిన అందకపోయినా వెళ్ళవలసిన పండగ. అయితే మామూలుగా అయితే ప్రతి సంక్రాంతికి కలుసుకునే బంధువులు స్నేహితులతో పాటు సాహితీ కుటుంబ సభ్యులను కూడా చూడాలనే కుతూహలం నాలో బాగా ఉంది. అందులో మా వంశంలో పుట్టిన ఆణిముత్యం శత జయంతి సభపద్యాలు పలికించడమే తప్ప నోటి వెంట పరుష వాక్యాలు ఎప్పుడు వినలేదు. విద్యార్థికి విద్య నేర్పే విషయంలో కొంచెం కఠినంగా ఉండడం గురువుగారికి తప్పదు. గురువు క్రమశిక్షణతోనే విద్య నేర్పాలి.  జీవితకాలమంతా ఒక గురువుగా పండితుడిగా కవిగా ఆయుర్వేద డాక్టర్ గా ఒక మంచి సోదరుడిగా సీతమ్మ లాంటి మా రత్న కలికి వదినకి భర్తగా బంధుత్వం మాట అటు ఉంచితే మా తండ్రి గారికి ఆప్త మిత్రుడు గా ఇలా ఏ పాత్ర పోషించిన నూటికి నూరుపాళ్ళు శాతం మార్కులు స...

అమ్మ కన్నీళ్లు

అమ్మ కన్నీళ్లు అమెరికా నుండి చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చిన రాజశేఖర్ ని తల్లి సీతమ్మ చూసి ఒక్కసారి అలా ఉండిపోయింది. కొడుకును గట్టిగా కౌగిలించుకుని తల మీద ముద్దు పెట్టుకుంది . ఆ సమయంలో తల్లి సీతమ్మ కళ్ళలో తడి కనిపించింది రాజశేఖర్ కి.  అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు రాజశేఖర్. కన్నీళ్లు కార్చవలసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆమె జీవితంలో.  రాజశేఖర్ తండ్రి పోయినప్పుడు, అత్తవారు ఆస్తి ఇవ్వకుండా ఏడిపించినప్పుడు, ఒక పూట తిని రెండో పూట మంచినీళ్లు తాగి పడుకున్నప్పుడు, రాజశేఖర్ తండ్రి చేసిన అప్పులు తీర్చలేకపోతే అప్పులు వాళ్ళు ఇంటి మీద పడి గొడవ చేసినప్పుడు ఎప్పుడు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేది.  రాజశేఖర్ తండ్రి పోయేటప్పటికి సీతమ్మ వయసు ముప్పై సంవత్సరాలు. సీతమ్మ తల్లిదండ్రులతో సహా అందరూ రెండో పెళ్లి చేసుకోమని ఎంత బలవంత పెట్టినప్పటికీ ఎప్పుడూ ఆమె కళ్ళు రాజశేఖర్ మీదే ఉండేవి. సీతమ్మ తల్లిదండ్రులు రాజశేఖర్ ని దత్తత తీసుకుంటామని చెప్పినప్పటికీ సీతమ్మ ససేమేరా ఒప్పుకోలేదు.  చిన్నప్పుడు రాజశేఖర్ ఆడుకుంటూ క్రింద పడిపోయినప్పుడు  ఏమి కంగారు పడకుండా ఏడవకూడదు అంటూ ధైర్యం చెప్పే...

మా చాకిరేవు

మా చాకిరేవు మన తెలుగు గడ్డలో చెరువు లేని ఊరు అంటూ ఉండదు. పల్లెటూరికి చెరువుకి అవినాభావ సంబంధం ఉంది. మంచినీళ్ళకి పశువులు కడగడానికి మరియు ఇతర అవసరాలకు రకరకాల చెరువులు ఉంటాయి. అందుకే చెరువు ప్రాముఖ్యతను చెబుతూ ఒక కవి తన రచనలో "నేను నిండుకుంటే మీకు పండగ ఎండిపోతే మీ బ్రతుకు దండగ" అంటాడు. చెరువులోని నీళ్లే కాదు చెరువుగట్టు కూడా చాలా ఉపయోగం. కాలక్షేపానికి అనువైన ప్రదేశo.. చాలా ఊళ్ళల్లో సాయంకాలం అయ్యేసరికి అక్కడ ఉండే బెంచీల మీద ఊరి వారందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మా ఊర్లో కూడా ఒక చాకలి చెరువు ఉంది. దాని పేరు ముద్దుగా చాకిరేవు. ఊరి మొదట్లోనే ఉంటుంది. ఏ ఊరు బాబు ఊరి పేరు చెప్పు అంటే మా ఊరి పల్లిపాలెం కాజులూరు మండలం కాకినాడ తాలూకా. కానీ మా ఊరు చెరువు దగ్గర ఊరి వారు ఎవరు ఉండరు కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు దానిమీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఊరి మొదట్లో అమ్మవారి గుడి దగ్గరలో విశాలమైన చెరువు, చెరువు చుట్టూ ఒక గట్టు గట్టుమీద బట్టల మూటలు ,చెరువులో మోకాళ్ళ లోతు నీళ్లలో బట్టలు మురికి వదల కొడుతున్న రజక కులస్తులు ,  చెరువు లోపల చుట్టూ బండ రాళ్లు ,ఆ బండరాళ్ళ మీద ...

మన కథ అక్కడే ప్రారంభం

మన కథ అక్కడే ప్రారంభం. " ఆడదే ఆధారం మన కథ ఆడనే ప్రారంభం అంటూ ఎక్కడో పాట వినిపిస్తోంది. నిజమే ఇది అక్షర సత్యం. మగవాడు ఉనికికి గమనానికి అభివృద్ధికి ఆడదే ఆధారం. ఆమె లేకపోతే బ్రతుకు శూన్యం. ఇది ప్రతి మహిళా దినోత్సవం నాడు చెప్పుకునే మాట కాదు. నిరంతరము తలుచుకోవాల్సిన మాట.  ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. పెరిగి పెద్దయిన తర్వాత ఆ పిల్ల అందచందాలు చూసి కళకళలాడుతూ లక్ష్మీదేవి లా ఉంది అని అంటారు. ఇంటికి ఇల్లాలు అందం. నిజమే ఇల్లాలు లేని ఇల్లు బోసిపోతుంది. వెలవెలబోతుంది. ఇల్లాలు తోటే ఆ ఇంటికి అందం. ఆ కుటుంబానికి ఆనందం. నిజజీవితంలో ఒక కుటుంబంలో ఆమె పాత్రను పరిశీలిస్తే అష్టలక్ష్మి తత్వం కనబడుతుంది. ఆ కుటుంబం కోసం పిల్లల కోసం భర్త కోసం ఆమె పడే శ్రమ వెనుక ఉన్న ఆదర్శ మూర్తులు ఎవరని అడిగితే అష్టలక్ష్మిలు అని నా ఉద్దేశం. ఒక ఇంటికి ఇల్లాలు అందం. ఆ ఇంటిలో ఉండే వారి ఆపదలన్నీ తీర్చడానికి ఆనందంగా ఉంచడానికి ఆమె అహర్నిశలు శ్రమ పడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేతులలో ఆ కుటుంబానికి అభయ వరముద్రలు ఉంటాయని అనిపిస్తుంది. ఆమె కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. ఇకపోతే ఆ ఇల్లు ఎప్పుడు పిల్ల...

నిశ్శబ్ద అనుబంధం

నిశ్శబ్ద అనుబంధం. ఏడు అడుగులు కలిసి నడిచాం  సంసార రథ చక్రాలయ్యాం  ఎన్నో అమృతం కురిసిన రాత్రులలో తడిసి  మధుస్మృతులను మిగిల్చుకున్నాం.  కష్టాల కడలిని అనురాగంతో ఈడ్చుకుంటూ వచ్చి  మన అనురాగానికి తీపి గుర్తులను తెచ్చుకున్నాం. బాధ్యతలు అన్నీ బంగారు గూటిలోకి చేర్చి  హమ్మయ్య అనుకుని నాకు నువ్వు నీకు నేను  తొలి రోజులు గుర్తు చేసుకుని గువ్వల్లాగా మిగిలిపోయాo. గూడు దాటి బయటకు అడుగుపెడితే  సందు చివర వరకు వీడ్కోలు పలికే నాకు  గుండెలో ఉన్న మాటని నా చెవిని  చేర్చే వరకు ఎప్పుడూ ఊరుకోని నీ మనసు  ఎందుకు చెప్పలేదో నువ్వు ఒంటరిగా  తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నావని ఇన్నాళ్లు మన మధ్య దాపరికాలు లేవు  ఇప్పుడే నేర్చుకున్నావు ఈ కొత్త విద్య  నేను అది తెలుసుకునే లోపలే నువ్వు గుప్పెడు బూడిదిగా మారిపోయావు.  నా గుండె బద్దలు కొట్టి.  ఏదో కాలం గడుపుతున్నాను  జీవచ్ఛవంలా బతుకుతున్నాను  నా మనసు ఎప్పుడో నీతో పాటు  కాలగర్భంలో కలిసిపోయింది. ఎప్పుడో నువ్వే చెప్పావు  భార్యాభర్త అంటే  అర్ధనారీశ్వర స్వరూపమని  సతీసహ...

అప్పగింతలు

అప్పగింతలు రాధిక పెళ్లి కోసం ఎదురుచూసినన్ని రోజులు పట్టలేదు. రాధిక అంటే ఎవరు ముకుందరావు సత్యవతి ల ముద్దుల కూతురు. ముకుంద రావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉన్నత ఉద్యోగి. ఉన్న ఒక్క కూతుర్ని దూరంగా పంపించకుండా ఉన్నచోటే డిగ్రీ చదివించి బీఈడీ ట్రైనింగ్ చేయించి టీచరుగా స్థిరపరిచాడు. ఆడవాళ్ళకి టీచర్ ఉద్యోగం ఉంటే సౌకర్యంగా ఉంటుందని అంతేకాకుండా పుట్టిన పిల్లలకి టీచర్ తల్లి మంచిగా తీర్చిదిద్దుతుందని ముకుంద రావు గారి ఉద్దేశం. ఎందుకంటే తన ఆఫీసులో పనిచేసే ఆడపిల్లల పరిస్థితి చూసి ఈ నిర్ణయం తీసుకున్నాడు.    ఉదయం నుంచి ఒకటే హడావిడి. వచ్చే బంధువులు వెళ్లి పోయే బంధువులు మర్యాదలు భోజనాలు పెళ్లి తంతులు ఆశీర్వాదాలు ఇలా ఉదయం నుంచి ఎక్కడ ఖాళీ లేదు ముకుందరావు దంపతులకు. పంతులుగారు తంతులన్ని పూర్తి చేసి అమ్మ సత్యవతమ్మ గారు ఈ పెళ్లి కొడుకుకి పెళ్లి కుమార్తెకు కాస్త భోజనం పెట్టండి. ఆ తర్వాత అప్పగింతలు తర్వాత విడిది గృహ ప్రవేశం చేయించి వెళ్ళిపోతాను. నేను కూడా నాలుగు మెతుకులు తిని వస్తానంటూ శాస్త్రి గారు చేయవలసిన పని అప్పజెప్పి డైనింగ్ హాల్ లోకి వెళ్లిపోయారు. అంతవరకు ఆనందంగా ఉన్న ఉత్సాహంగా ఉన్న ఆ దం...

కుర్చీ

మూగదే కాని మంచి మర్యాదతో మెలిగేది. కుల మతాల కుళ్లు లేనిది నాలుగు కాళ్ళు ఉన్నా నడలేనిది నలుగురి నోట్లో నిత్యం నలిగేది అలసి సొలసి వచ్చిన వాళ్ళకి ఆశ్రయo ఇచ్చేది . కుర్చీ. అధికారికి దర్పం ఇచ్చేది కుర్చీ. నాయకుడికి అధికారం ఇచ్చేది కుర్చీ. ప్రాణం పోసే వైద్యుడు ఈ కుర్చీలో కూర్చొనే వైద్యం. అందమైన ప్లానులు గీసే ఇంజినీర్ కి ఇదే ఆధారం. అతిథులను కుర్చీ చూపించి సాదరంగా ఆహ్వానo. విద్యార్థికి పాఠాలు చెప్పే మాస్టారు కుర్చీకే అందం. నోట్లో ముద్ద దిగాలంటే ఎక్కాలి డైనింగ్ టేబుల్ కుర్చీ. Software ఉద్యోగికి ప్రత్యేకం కంప్యూటర్ కుర్చీ. సామాన్యుడికి చౌకగా దొరికే కుర్చీ ప్లాస్టిక్ కుర్చీ. తర తరాలుగా మనతో ఉన్నవి చెక్క కుర్చీలు. నగిషీ పనితనం తో మెరిసిపోతున్నాయి తరతరాలు. కాలు చెయ్యి విరిగితే చెక్కు చెదరకుండ చెయ్యచ్చు. గత వైభవాన్ని మరల తీసుకురావచ్చు చెక్కముక్కకి.  ప్లాస్టిక్ ముక్కతో గుప్పెడు పప్పు బెల్లాలు కడుపు నింపచ్చు.      కుర్చీ కాలికి అడ్డం వస్తే నోటికి వచ్చినట్లు తిడతాo.       అతిథులకు కుర్చీలు చాలకపోతే కంగారుపడతాo.       బలంగా ఉన్న బక్కగా ఉన్న కిమ...

డొక్కా సీతమ్మ

చిత్రం
ఆలి జేబులు తడుముతుంది. అమ్మ డొక్క చూస్తుంది. అన్నది ప్రాచీన నానుడి. అది అమ్మతనం. కానీ ప్రతి బాటసారి ఆకలికి పట్టెడన్నం పెట్టే నిరతాన్న ధాత్రి అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు మన ఆంధ్ర ప్రదేశ్ చెందిన వారు కావడం మన దేశానికే గర్వకారణం. తూర్పుగోదావరి జిల్లా ఘనతని ప్రపంచ వ్యాప్తి పరం చేసిన ఒక అమృతమూర్తి డొక్కా సీతమ్మ గారు. అందరూ ఆడపిల్లలు లాగే ఆ అమృతమూర్తి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో అను పిండి వారి ఇంట్లో జన్మించింది. తండ్రి భవాని శంకరం. తల్లి నరసమ్మ. స్త్రీ విద్యకు ఎక్కువ అవకాశం లేకపోవడంతో సీతమ్మగారు పెద్దగా చదువుకోలేదు. తల్లిదండ్రుల దగ్గర నుండి రామాయణ మహాభారత కథలు పద్యాలు నేర్చుకోవడం జరిగింది. పెద్దబాలశిక్ష కూడా పూర్తిగా చదవలేదు. ఈలోగా తల్లి చనిపోవడంతో భవాని శంకరం గారి కుటుంబ బాధ్యత ఆమె భుజస్కంధాలపై పడింది. సాధారణంగా పెళ్లిళ్లు ఎలా కుదురుతాయి అంటే బంధువుల పెళ్ళిలో ఆడ పిల్లలను చూసినప్పుడు వరుడు తల్లిదండ్రులు పిల్లగురించి వాకబు చేస్తారు. అదేవిధంగా అనుకోకుండా వచ్చిన బంధువులు కూడా ఇంట్లో ఉన్న ఆడ పిల్లను చూసి ముచ్చటపడి మరీ సంబంధం ...

దేవుడి శాపం

దేవుడి శాపం " చూడండి రాఘవరావు గారు మీ అక్కయ్య గారి దావా  నెగ్గాలంటే కచ్చితంగా ఆమెకి వారసులు కావాలి. ఆమెకు సంతానం లేదు కదా! లేదంటే ఆస్తి అవతల పార్టీకి వెళ్ళిపోతుంది అంటూ చెబుతున్న లాయర్ మాటలు విని  సరేనండి ఆలోచిస్తాను అంటూ కోర్టు నుండి ఇంటికి తిరిగి వచ్చాడు రాఘవరావు.  రాఘవరావు అక్క గారి పేరు కాంతమ్మ. కాంతమ్మని చిన్నతనంలోనే మేనత్త కొడుకు కామేశ్వరరావు కి ఇచ్చి వివాహం చేశారు. కామేశ్వరావుకి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి గారాబంగా పెంచాడు . దాంతో కామేశ్వరరావుకి చదువు వంట పట్టలేదు . పైగా వ్యసనపరుడు. వివాహమైన కామేశ్వరరావు తిరుగుళ్ళు మాత్రం ఆగలేదు. పాపం కాంతమ్మ గారికి పుట్టిన పిల్లలందరూ పురిట్లోనే చనిపోయేవారు. దానికి తోడు సవిత అత్తగారు సుందరమ్మ గారు పెట్టే బాధలు, భర్త దగ్గర నుంచి ఆదరణ లేకపోవడం, ఆయన ప్రవర్తన సరిగా ఉండకపోవడం వీటన్నిటికి తోడు కామేశ్వరరావు గారు, కాంతమ్మ గారి మామగారు ఒకే సంవత్సరంలో చనిపోవడం తో కాంతమ్మ గారికి మతి చలించింది. ఎన్ని మందులు వాడిన ఎంత వైద్యం చేయించిన ఫలితం లేకుండా పోయింది.  ఆ సమస్య వచ్చినప్పుడల్లా ఏడాదికి ఆరు నెలల పాటు సరిగా తిండి తిప్పలు ...

తీర్థ యాత్ర

తీర్థయాత్ర ఉదయం ఆరు గంటలు అయింది  షిరిడి వెళ్లే సాయి నగర్ ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో వచ్చి ఆగింది. ఎప్పటినుండో షిరిడి వె డదామనుకున్న భాస్కరరావు కుటుంబ సభ్యులందరి తోటి S7 బో గిలో స్లీపర్ క్లాస్ లో అడుగు పెట్టాడు. బెర్త్ నంబర్లు చూసుకుని సామాన్లు సర్దుకుని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఎన్నాళ్లనుంచో షిరిడి వెళ్దామనే కోరిక బాబా గారు ఇప్పటికి తీర్చుతున్నారని మనసులోనే బాబా గారికి నమస్కారం చేసుకుని కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లోనే బోగి అంతా నిండిపోయింది. కాకినాడ నుంచి షిరిడి వెళ్లే ఏకైక రైలు ఇదొక్కటే. మర్నాడు ఉదయం 9:00కు కానీ సాయి నగర్ అంటే షిరిడి చేరుకోలేరు. అయినా అందరూ ఈ రైలుకే బుక్ చేసుకుంటారు. భాస్కర్ రావు కాకినాడలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో చిరు ఉద్యోగి. షిరిడి సాయిబాబా భక్తుడు. ప్రతి లక్ష్మీవారం కాకినాడ అశోక్ నగర్ లోని బాబా గుడికి వెళ్లి వస్తుంటాడు. బాబా గారి ఆజ్ఞ లేనిదే శిరిడీలో అడుగు పెట్టలేమనే బాబా చెప్పిన మాటలు కచ్చితంగా నమ్మి ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.   అనుకోకుండా పిల్లలందరికీ సెలవులు ఇవ్వడం రెండు...

అన్నదానం

అన్నదానం. శీతాకాలం ఉదయం నాలుగు గంటలు అయింది. ఓ పక్క చలి వణికిస్తున్న రిక్షాలో ముడుచుకుని కూర్చుని బేరాలు కోసం ఎదురుచూస్తున్నాడు నూకరాజు. "ఈ ఆటోలు వచ్చి రిక్షా వాళ్ళ కడుపు కొట్టేసాయి. రోజు ఈపాటికి విజయవాడ ప్యాసింజర్ బేరాలు దొరికేవి. ఇప్పటికే రెండు పూటలా అన్నం తినడానికి సంసారం పోషించుకోవడానికి ఆదాయం సరిపోవడం లేదు ఇక ముందు ఎలా ఉంటుందో ! అనుకుంటూ ఆ చీకట్లో అలా ఎదురు చూడసాగాడు.  ఇంతలో ఒక జంట భుజాన ఒక బ్యాగ్ తగిలించుకొని బ్యాటరీ లైట్ వెలుగులో నడుచుకుంటూ వచ్చి రిక్షా ముందు ఆగారు. "రైల్వే స్టేషన్ కి ఎంత తీసుకుంటావు అని అడిగారు. 20 రూపాయలు అండి. అమ్మో 20 రూపాయలా! ఆటో అయితే ఐదు రూపాయలే కదా !అంటూ బేరమాడుతూ నిల్చున్నారు. చివరికి 15రూపాయలకి బేరం కుదుర్చుకుని ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. నూకరాజు నెమ్మదిగా రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. బాబు కొంచెం త్వరగా పోనీయి టైం అయిపోయింది అంటూ తొందర పెట్టారు. అయినా వేగం పెంచలేకపోయాడు నూకరాజు. ఒంట్లో శక్తి లేదు. వయసు కూడా పెద్దదే. దానికి తోడు లావు. కాళ్లు నొప్పులు. రాత్రిపూట భోజనం చేయడానికి బేరాలు లేక ఇంట్లో పొయ్యి వెలగలేదు. గ్లాసుడు మంచినీళ్లు ది...

బామ్మ ఉంటే

బామ్మ ఉంటే  " అవును అమ్మ ఉంటే ఎంత బాగుండేది. ఇంట్లో ముఖ్యంగా పిల్లలకి మంచి చెడ్డ చెప్పేది. రామాయణం ,భారతం, భాగవతం కథలు రాత్రి కూర్చోబెట్టుకుని చెప్పేది. ఏది మంచి ఏది చెడు ప్రతిరోజు ప్రతి పనిలోనూ గుర్తు చేసేది. నా బాల్యంలో మా బామ్మ ఉండేది అలాగే బామ్మ క్రమశిక్షణలో గడిచిపోయింది మా బాల్యం. ఈ పిల్లల బాల్యం చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేరు. వీళ్ళ జీవితం ఎలా నడుస్తుందో ఏమిటో అంటూ తన బాల్యం గుర్తు చేసుకో సాగాడు ముప్పైఏళ్ల రాజారావు.  రాజారావు కామేశ్వరరావు గారికి ఆరో సంతానం. కామేశ్వరరావు గారి పిల్లలు అందరి బాల్యం కామేశ్వరావు గారి తల్లి సుందరమ్మ గారి పెంపకoల్లో గడిచిపోయింది. మరి అంత క్రమశిక్షణ కాదు గాని సుందరమ్మని చూస్తే పిల్లలకు హడలు. ఉదయం లేస్తూనే అందరూ స్నానాలు చేయాలి. దేవుడికి దండం పెట్టుకోవాలి. అప్పుడు గాని పాలు తాగడానికి వీల్లేదు. కాఫీ టీల ప్రసక్తే లేదు. చిన్నపిల్లలు పాలు తాగాలి రా. ఎముకలు బలంగా ఉంటాయి అoటు సైంటిఫిక్ రీజన్ చెప్పేది. అప్పట్లో ఉదయం పూట టిఫిన్ కూడా లేదు. చక్కగా చద్దన్నం పెరుగు వేసి పెట్టేది.  మళ్లీ మధ్యాహ్నం పూట స్కూల్ నుంచి వచ్చి బట్ట...

బాబోయ్ ఎండలు

బాబోయ్ ఎండలు ఎండలు బాబోయ్ ఎండలు. ఎవరి నోటి విన్నా ఇదే మాట. ఎండాకాలంలో ఎండలు కాయక వానలు కురుస్తాయా అని కొందరు అంటారు. కాదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగేయి అంటూ ప్రతి సంవత్సరం ఒకటే గోల. ప్రతి ఏటా సూర్యుడు కిందకి దిగిపోతున్నాడు. భూలోకం మీద అంత మమకారం ఎందుకో.ఏ నోట చూసినా అదే మాట. ఏ పని చేయబుద్ధి కాదు. తీక్షణమైన ఎండ చూస్తే వికారం. ఇంట్లో కూర్చున్న చెమటలు. గాలి లేదు. ఫ్యాన్ గాలి తప్పితే. ఏసీ గది వదిలి రా బుద్ధి కావడం లేదు.  అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే జీవితం ఎలా నడుస్తుంది. మూడు చక్రాల బండి స్టీరింగ్ తిప్పితే గాని తన బతుకు గడవదు ఒకరికి. నడి నెత్తి మీదకి సూర్యుడు వచ్చినా పొలం గట్ల మీద కలుపు మొక్కలు పీకక పోతే డొక్క నిండదు ఒకరికి. సర్కారు నౌకరు అయిన ఊరికే కూర్చోబెట్టి జీతం ఇవ్వరు కదా. పగలంతా ఏదో ఒక పని చేయవలసిందే. పిల్లలకి స్కూలు సెలవిచ్చిన అమ్మకి వంట పని తప్పుతుందా. ఏ జీవన చక్రాన్ని ఆపలేం. అలా నడుస్తుంటేనే నాలుగు వేళ్ళు లోపలికి పోతాయి ఎవరికైనా సరే. ఏ స్థాయి వాళ్ళకైనా సరే. మరి ఇంత ఎండలో ఆ ఊరు నుంచి ఈ ఊరికి జనాలను మోసుకుపోయే, సరుకులు తీసుకుపోయే లారీలు బస్సులు రైళ్లు విమానాలు నడిప...