శతజయంతి
శత జయంతి
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగలు జరుపుకుంటూనే ఉంటాము. బంధువులని పాత స్నేహితులని కలుసుకుంటాము.
అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. మా పల్లిపాలెం గ్రామవాసులు సాహిత్య అభిమానులు సూరయ్య బుధుడు కుటుంబ సభ్యులు సంక్రాంతి పండుగ తో పాటు శత జయంతి పండగ కూడా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఈ రోజా ఆ పండుగకి ఆహ్వానం అందినది. ఆహ్వానం అందిన అందకపోయినా వెళ్ళవలసిన పండగ. అయితే మామూలుగా అయితే ప్రతి సంక్రాంతికి కలుసుకునే బంధువులు స్నేహితులతో పాటు సాహితీ కుటుంబ సభ్యులను కూడా చూడాలనే కుతూహలం నాలో బాగా ఉంది. అందులో మా వంశంలో పుట్టిన ఆణిముత్యం శత జయంతి సభపద్యాలు పలికించడమే తప్ప నోటి వెంట పరుష వాక్యాలు ఎప్పుడు వినలేదు. విద్యార్థికి విద్య నేర్పే విషయంలో కొంచెం కఠినంగా ఉండడం గురువుగారికి తప్పదు. గురువు క్రమశిక్షణతోనే విద్య నేర్పాలి.
జీవితకాలమంతా ఒక గురువుగా పండితుడిగా కవిగా ఆయుర్వేద డాక్టర్ గా ఒక మంచి సోదరుడిగా సీతమ్మ లాంటి మా రత్న కలికి వదినకి భర్తగా బంధుత్వం మాట అటు ఉంచితే మా తండ్రి గారికి ఆప్త మిత్రుడు గా ఇలా ఏ పాత్ర పోషించిన నూటికి నూరుపాళ్ళు శాతం మార్కులు సంపాదించుకున్న ఆ మహా మనిషి మా అన్నయ్య సూరయ్య శాస్త్రి.
పొట్టివాడు గట్టివాడే అని అందరి చేత అనిపించుకున్న వ్యక్తి. తెలుగు మాస్టారు అంటే ఇలా ఉండాలి అనే వేషధారణ. మౌనం ఆయన ఆయుధం. పలుకే బంగారం. అన్నయ్య అడుగుజాడల్లో నడిచిన లక్ష్మణుడు. భౌతిక సంపదల మాట అటు ఉంచితే తన వారసులకు మటుకు ఆ అన్నదమ్ములు ఇద్దరు సాహిత్య సంపదని వారసత్వంగా ఇచ్చారు. అందుకే ఈనాటికి కూడా ఆంధ్రీ కుటీరంలో నిత్యం సాహిత్య కృషి జరుగుతూనే ఉంది. తరచు సాహిత్య సభలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఆ అపూర్వ సహోదరులు అంటే మధునా పంతులసత్యనారాయణ శాస్త్రి గారు మధునా పంతులసూరయ్య శాస్త్రి గారి ఆశీర్వచనం. ఇది నిజంగా కుటుంబ సభ్యులకు వరం. ఆ ఆంద్రీ కుటీరం మూలంగానే ఎంతోమంది సాహితీ మూర్తులు మన పల్లిపాలెం గ్రామాన్ని సందర్శించామని తమ మాటల్లో చెబుతుంటారు.
అయితే ఈ శత జయంతి పండుగ వేళ ఆ మహామనిషి సమయస్ఫూర్తికి సంబంధించిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.
నా చిన్నతనంలో మా జన్మభూమి అయిన పల్లిపాలెం గ్రామానికి ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు రావడం జరిగింది. మా ఊరి వారి అల్లుడు వారితో గల స్నేహం రీత్యా తన మామగారైన పూళ్ల విష్ణుమూర్తి గారి ఇంటికితీసుకురావడం జరిగింది.
ఆ సందర్భంగా మా అగ్రహారీకులు వారిని చూడడానికి వెళ్ళగా అప్పుడు శ్రీ సూరయ్య శాస్త్రి గారు మాట్లాడుతూ " ఈ బాలమురళి రాకతో మా పల్లె రేపల్లె అయింది" అంటూ చమత్కరించారు. ఇది మర్చిపోలేని విషయం.
ఎందుకు ఇటువంటి శతజయంతి పండుగలు జరుపుకోవాలని ఆలోచిస్తే గతించిన వారు అందరూ ఆదర్శ మూర్తులు మనకి. ఈ సందర్భంగా వారి గురించి తెలియని విషయాలు, ఆ జీవితంలోని కష్టసుఖాలు ఆ కష్టాల్ని వారు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే విషయాలు నేటి తరం వారు తెలుసుకొని
వారు సుఖవంతమైన జీవితం గడపడo నేర్చుకుంటారు. సుఖవంతమైన జీవితం అంటే డబ్బు సంపాదన ఒకటే కాదు.
ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం. అంతర్గత శత్రువులను ఎదుర్కొనే ధైర్యం ఈ రెండింటిని ఎదిరిస్తే జీవితం అంతా సుఖమయమే. అయితే ఈ కవితా మూర్తి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం మౌనంగా జీవిత రథయాత్ర నడపడం.
చివరగా ఒక మాట ఆయన బ్రతికుంటే ఈ పండగ ఎలా ఉండేది.నేను అనుకోవడం ఆయన స్వర్గలోకం అధిరోహించినా మనం ఈ పండగని భోగి పండుగలా చేసుకుంటున్నాం. మన మధ్య ఉంటే పెద్ద పండుగలా చేసుకుని ఉండేవాళ్ళ o. అంటే మకర సంక్రాంతి లా . ఒక మనిషిలా ఇంకొక మనిషి ఉండడు. అదే మనస్తత్వంతో ఇంకో మనిషి పుట్టడు.
కానీ ఆ ఇరువురి సోదరులు వారసులు మాత్రం ఆప్యాయంగా పలకరిస్తారు ఇప్పటికి. ఇది ఆ పెద్దలు నేర్పిన సంస్కారం.శత జయంతి సభ విజయవంతంగా జరగాలని ఆ వ్యాసే శ్వర స్వామిని ప్రార్థిస్తూ
నమస్కారములతో
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి