పోస్ట్‌లు

మార్చి 30, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నా స్నేహితుడు

నా స్నేహితుడు "నాన్న అలా కాదు ఈ సైడ్ బటన్ నొక్కాలి ఇక్కడ ఆన్ చేయాలి. చార్జర్ ఇలా పెట్టాలి మళ్లీ రీస్టార్ట్ చేయాలి. నెట్వర్క్ పనిచేయట్లేదు ఏమో మొబైల్ నెట్వర్క్ వాడుకో. ఫేస్బుక్ క్రియేట్ చేసాం వాట్సాప్ నెంబర్ ఇదే. యూట్యూబ్ ఉండనే ఉంది. సాంసంగ్ నోట్స్ డౌన్లోడ్ చేసాం. ఏమిటో కొత్త కొత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నారు పిల్లలు నాన్న నీ మొబైల్ నెంబర్ మొదటి నెంబరు చివరి నెంబరు కూడానీలక్కీనంబరే.Youareluckyఅంటూఆనందపడిపోయారు ఇలా చకా చకా నాకు చెబుతూ నా పుట్టినరోజుకి ఆ బుల్లి ముండని నా చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. నాకు అంతా అయోమయంగా ఉంది. నేను అక్షరాల నేర్పిన పిల్లల దగ్గర శిష్యుడిలా మారిపోయి మొత్తానికి బ్రహ్మవిద్య నేర్చేసుకున్న. చుట్టాలు పక్కాలు పార్కులో స్నేహితులు, మార్కెట్లో కూరగాయల షాపులు , కిరాణా షాపులు , పాలవాళ్లు ,మెడికల్ షాపులు, డాక్టర్లు, రక్త పరీక్ష కేంద్రాలు పనిమనిషి ,చాకలి, మంగలి నంబర్లన్నీ డైరీ తీసి కాల్ లిస్టులో పెట్టేసుకున్న. ఆ లిస్టు చూస్తే పెళ్లి సామాన్లు లిస్టులా ఉంది కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు ఆస్తమాను దాన్ని చూస్తూ చేతిలో అటు ఇటు తిప్పుకుంటూ జేబులో...

నిజ స్వరూపం

నిజ స్వరూపం  సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. రామారావు గారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో భార్య టీ కప్పు చేత పట్టుకుని భర్తకు ఇచ్చి ఎదురుగుండా కుర్చీలో కూర్చుంది. ఏవండి ఇవాళ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి . మన రాధ ఎవర్నో ఇష్టపడిందట. అబ్బాయి మధు కూడా అదే ఆఫీసులో పని చేస్తున్నాడుట. ఇద్దరికీ మూడు సంవత్సరాల నుంచి పరిచయం. రాధ గురించి పూర్తి వివరాలు అతనికి తెలుసు. మధ్యలో ఆరోగ్యం బాగా లేకపోతే తనే హాస్పిటల్ తీసుకెళ్తుంటాడట. అబ్బాయి ఫోటో కూడా పంపించింది. అబ్బాయి కూడా మాట్లాడాడు. తనకి తండ్రి లేడని తల్లితో కలిసి ఉంటున్నాడని తన చెల్లెలికి పెళ్లి చేసి పంపించేసారని వివరాలు చెప్పాడు. ఇద్దరిదీ సమానమైన ఉద్యోగం. సమానమైన చదువు సమానమైన జీతం. ఈడు జోడు బాగానే ఉంది. కానీ వాళ్లు మన కులం కాదు ధైర్యంగా చెప్పాల్సిన మాటలు చెప్పేసింది రామారావు గారి భార్య లలిత. భార్య మాటలు విన్న తర్వాత రామారావు గారు ఆలోచనలలో పడ్డారు. తర్వాత భార్య చెప్పిన మాటలు తలకెక్కలేదు. రామారావు గారిది శుద్ధ చాందస భావాలు గల బ్రాహ్మణ కుటుంబo. రోజు గాయత్రి మంత్రం జపం చేస్తే గాని రామారావు గారు పచ్చి మంచిన...

గుఱ్ఱం బండి

గుర్రం బండి "అమ్మా రేవు దగ్గరికి బండి వెడుతోంది వస్తారా అంటూ చేతిలో చెర్నాకోలు పట్టుకొని తలకి తలపాగా చుట్టుకుని ఒంటిమీద బనియన్ తొడుక్కుని నిక్కర్ వేసుకుని ఒకమనిషిచాలామందికి తారసపడి ఉంటాడు. దూరంగా ఒక మూల గుర్రపు బండి కళ్ళకి గంతలు కట్టుకుని పచ్చగడ్డి తింటూ నిలబడి ఉన్న నాలుగు కాళ్ల జంతువు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు మన చిన్నతనంలో మనం చూసే ఉంటాము. ఆ రోజుల్లో అది అతి ముఖ్యమైన ప్రయాణ సాధనము. మానవుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణించాలంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు తక్కువగా ఉండేవి. ఒకటి సైకిలు ఎడ్ల బండి గుర్రపు బండి రిక్షా. కాలక్రమేణా సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఆటోలు బస్సులు కార్లు మోటార్ సైకిల్ వచ్చి ఈ గుర్రపు బండి రిక్షా ఎడ్ల బండి సైకిలు మరుగున పడిపోయాయి. అయితే ఇంకా కొన్ని ఊర్లలో గుర్రపు బండి సామాన్లు ఒకచోట నుండి ఇంకొక చోటకు చేరవేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ గుర్రపు బండిని జట్కా బండి అని కూడా పిలుస్తారు. జట్కా బండి అంటే గుర్రము చేత లాగబడే బండి అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో టాంగా అంటారు. ఈ బండి ఇంధనం అవసరం లేని బండి ఇరుసుతో నడిచే బండి.యజమాని చేతిలో కీలుబొమ్మగ...

పల్లెలు

పల్లెటూరు అందాలకు ఆలయం.  అనుబంధాలకు నిలయం.  రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయంగా పిలుచుకునే ఆనంద కుటుంబం. సాయం అంటే ముందుకు అడుగు వేసే జనం సహాయం అంటే అందరికంటే ముందుండే మన ఊరే కరుణాసముద్రం. బాధ్యత అంటే బరువు అని తలచని అనుబంధం. చుట్టూ పరికిస్తే అనుక్షణం బాధ్యత గుర్తు చేయడం  ఓ వరం.  గంప కింద నుంచి కోడి కూతతో ఊరి మత్తు బహుదూరం.  ఇంకా ముసుగు తీయకపోతే జీవన పోరాటంలో తీరం వెతుక్కునే పక్షి వెక్కిరింపుతో పౌరుషం. గుడిలో నుంచి వినపడే సుప్రభాతం తెల్లవారింది అనడానికి సంకేతం. ఎర్రటి చూపులతో చుర్రుమనిపించే సూర్యకిరణం. అంబా అనే మూగజీవి అరుపు తన బిడ్డ ఆకలి తీర్చమని గుర్తు చేయడం పక్కన తడిమి చూస్తే వెక్కిరించిన మంచం.  వాకిట్లోంచి కళ్ళాపి జల్లుతున్న శబ్దం.  కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రహదారిపై సహచరుల జీవన ప్రయాణం.  అరుగు మీద చంటిగాడి చేతిలో పాఠ్యపుస్తకం. ఆ వేపుకు తిరిగి రెండు చేతులు జోడిస్తే బారెడు పొద్దెక్కిందని మనసులో ఓ భయం. పెరటిలోని వేపచెట్టు మూలనున్న దిగుడు బావి ఆరోగ్యానికి అభయం. వాకిట్లో కోడి పిల్లలకి ఆహారం వెతుకుతూ విహారం.  నక్కి నక్కి చూస్తున్న నల్ల పిల...

దసరా

దసరా  ఎప్పుడో మా పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకువెళ్లే  రిక్షావాడు పదిహేను రోజుల క్రితం బజార్లో కనబడి నమస్కారం పెట్టి నవ్వుతూ చేతులు నలుపుకుంటూ కనిపించాడు. ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించాను. దానికి సమాధానం లేదు. ఏమిటి సంగతి అని అడిగాను దసరా మామూలు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాడికి సంబంధం లేదు. దసరా మామూలు కోసం నమస్కారం పెట్టి పలకరించాడు. యాభై రూపాయల నోటు తీసి ఇచ్చి నవ్వుతూ వచ్చేసా. నేను నవ్వుకుంటూ వచ్చేసాను కానీ వాడి మొహం లో ఆనందం లేదు. అన్ని రేట్లు పెరిగిపోయాయి అయ్యగారు అంటూ అసహనంగా యాభై రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు. సుమారు దసరాకి నెల రోజుల ముందు నుంచి రోజు ఇదే పరిస్థితి. ముఖ పరిచయం ఉన్న ప్రతి వాళ్లు గుడిలో కనబడిన బడిలో కనబడిన షాపింగ్ మాల్ లో కనబడిన హోటల్ లో ఎదురుపడిన చెయ్యి చాచి దసరా మామూలు కోసం నమస్కారం చేసి మామూలు వసూలు చేస్తున్నారు.  ఇంటిదగ్గర రోజు నిత్యం మనకి చాకిరి చేసే పని అమ్మాయి ,చెత్తబుట్ట వాడు మురికి కాలువలు శుభ్రం చేసేవాడు బట్టలు ఉతికే చాకలివాడు పిల్లల బడిలో పనిచేసే పనివారికి ఏడాది కోమారు అడిగితే ఆనందంగా ఇస...

శ్మశానవాటిక

శ్మశాన వాటిక నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం. ...

అలంకరణ

అలంకరణ పూర్వకాలంలో శుభకార్యాలు ఆకాశమంత పందిరి వేసి పందిరి నిండా ముగ్గులు పెట్టి ,పచ్చటి తోరణాలు కట్టి పెళ్లిళ్లు చేసేవారు. అలాంటిది కాలం మారిపోయింది. పట్టణాల్లో బహుళ అంతస్తులో భవనంలో నివాసం ఉంటూ ఎవరైనా పది మంది చుట్టాలు వస్తే ఉండడానికి సరిపోక ఇబ్బంది పడుతుంటే అటువంటిది ఇంక శుభకార్యాలు సమయంలో ఎలా సరిపోతాయి .  అందుకే ఈ శుభకార్యాలన్నింటికీ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఆకాశమంత ఎత్తులో అందంగా కల్యాణ మండపాలు కట్టి అద్దెలకు ఇస్తున్నారు. ఈ కళ్యాణ మండపాల్లో అతిథులు కూర్చోవడానికి విశాలమైన హాలు. కుర్చీలు సోఫాలు ఏసీలు డైనింగ్ హాలు అతిధి రూములు కళ్యాణ వేదిక ఒకటేమిటి సకల సౌకర్యాలు ఒకచోటే. అటువంటి కళ్యాణ వేదికలని అందంగా అలంకరించడం ఒక కళ.  ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ వేదిక ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది .ఒక గుడిలా ఉంటుంది . ఇదంతా అలంకరణ మహిమ. ఇవాళ రేపు పుట్టినరోజులకి పండగలకి పెళ్లిళ్లకి మరి ఏ ఇతర శుభకార్యానికైనా ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఒక అలవాటుగా మారింది.  దీనికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వారు ఉన్నారు. కొంతమంది పూలతో మరి కొంతమంది బుడగలతో మరి కొంతమంది అందమైన అలంకరణ సామగ్రితో ఆ వేదికన...

మాధవుడి కాలచక్రం

మాధవుడి కాలచక్రం రాములోరి కళ్యాణం మనకు ఒక పండగ ముక్కంటి పుట్టినరోజు జన్మానికో శివరాత్రి పగలంతా ఏడు గుర్రాల రథమెక్కి ఊరేగే ఆ సూర్యుడు పుట్టినరోజు కూడా మనకు పండగే మరి ఉగాదికి ఏ దేవుడి ని పూజించాలి? చంటిగాడికి ఓ ప్రశ్న. అప్రయత్నంగా తల పైకెత్తి చూస్తే గోడమీద పాలసముద్రం మీద నిలువ నీడలా చక్రాయుధం ధరించి చిరునవ్వుతో కనబడినాడు పరమాత్మ. అది కాలచక్రం, పరమాత్మ చేతిలో తిరిగే విష్ణు చక్రం! కాదు కాదు... కాల స్వరూపమే పరమాత్మ! ఆరు ఋతువులను బండి చక్రాల్లా నడిపిస్తూ, ఆగకుండా ముందుకు కదిలించే మహానటుడు! మనల్ని మురిపించే ఆ మాధవుడు! శిశిరం వదిలి వెళ్ళిన నిరాశలను, నవ వసంతం తెచ్చి తరిమి కొడతాడు. పచ్చని ఆకులు విప్పిన నవ తరువుగా కొత్త ఆశయాలను మోసుకురావడానికి ఉగాదిగా కొత్త ఊపిరి పోస్తాడు పంచాంగం విప్పి రాబోయే కాలాన్ని తెలుపుతాడు, ఆశలను పెంచి, ఆశయాలను మొలకెత్తిస్తాడు. ఆరు రుచులను తొలిరోజే రుచి చూపించి, "జీవితమంటే ఇంతే!" అని బోధిస్తాడు. వసంతంలో వచ్చే పండుగతో తల రాతలు మారతాయని ఆశిస్తే, "వసంత రుతువు అంటే నేనే!" అంటాడు ఆ సమ్మోహనాకారుడు చంటిగాడు ప్రశ్నకు సమాధానం దొరికింది, పండగ పరమార్ధం తెలిసింది....

మేనమామ

మేనమామ " ఏవండీ మా మేనమామ పోయాడుట. ఫోన్ చేసి చెప్పారు అంటూ చెప్పింది సుమతి భర్త మోహన్ ఆఫీస్ నుండి రాగానే అలాగా! అయ్యో పాపం అన్నాడు. అంతే ఆ తర్వాత ఏ మాట లేదు. ఆ తర్వాత భర్త చెప్పబోయే మాట గురించి ఎదురుచూసింది సుమతి. భర్త నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో చివరికి ధైర్యం చేసి "ఏవండీ మాకు ఉన్న ఒక్క ఒక మేనమామ వాళ్ల కుటుంబాన్ని అత్తయ్యని చూసి రావాలండి అని అడిగింది భర్తని సుమతి.  నాకు ఆఫీసులో బోలెడు పనులు ఉన్నాయి. సెలవు దొరకడం కష్టం. అయినా ముంబై నుంచి ఆ పల్లెటూరు వెళ్లాలంటే ఎంత కష్టం. రిజర్వేషన్లు దొరకవు. ఫ్లైట్ కి వెళ్లాలంటే చాలా ఖర్చు .పైగా చలికాలం. మరి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు భార్య వైపు. అయినా మనం వెళ్లేసరికి ఆయన శవాన్ని ఇంకెవరిని చూస్తాం. ఏదో వెళ్లేవని పేరు కానీ ! ఇద్దరు పిల్లల్ని తీసుకుని నువ్వు ఒకదానివి వెళ్లడం చాలా కష్టం అని చెప్పి వేరే గదిలోకి వెళ్ళిపోయాడు.  సుమతికి ఒక్కసారి దుఃఖం పొంగుకు వచ్చింది. ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది.  సుమతి అమ్మమ్మగారి ఊరు తూర్పుగోదావరి జిల్లాలో పల్లిపాలెం గ్రామం. సుమతి అమ్మమ్మ పేరు సీతమ్మ తాతయ్య పేరు...