పశ్చిమగోదావరి జిల్లా విహారయాత్ర
పశ్చిమగోదావరి జిల్లా విహారయాత్ర
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాని కేంద్రం భీమవరం. ఈ జిల్లాకు తూర్పున కోనసీమ, పడమరన ఏలూరు జిల్లా, కృష్ణాజిల్లా దక్షిణ దిక్కులో బంగాళాఖాతం, ఉత్తరాన ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి.
కొల్లేరు సరస్సు. : ఈ జిల్లాలో ప్రధానంగా చూడవలసిన వాటిలో కొల్లేరు సరస్సు ఒకటి. ఎన్నో రకాల చేపలు ఇక్కడ లభ్యమవుతాయి . రకరకాల పక్షులు విదేశాల నుండి సైతం విచిత్రంగా ఇక్కడికి వలసకు వస్తాయి. చూడడానికి ఆనందకరంగా ఉంటుంది.
పాలకొల్లు: క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి. పంచారామ క్షేత్రంలో ఒకటి.
భీమవరం: మావుళ్ళమ్మ దేవస్థానం. అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు. ఈ ఊర్లో సంక్రాంతికి పండుగకు జరిగే కోడిపందాలు చూడ్డానికి చాలామంది వస్తుంటారు. అలాగే సోమేశ్వర జనార్ధన స్వామి గుడి కూడా పంచారామ క్షేత్రంలో ఒకటి
పెనుగొండ: వాసవి కన్యక పరమేశ్వరి గుడి చూడదగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఉండే గాలిగోపురo ఏడంతస్తులు ఉంటుంది.
పేరుపాలెం బీచ్: పశ్చిమగోదావరి జిల్లాలో ఉండే నరసాపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరుపాలెం సముద్ర తీర ప్రాంతం విహారయాత్రకు అనుకూలమైంది. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి