భాష

భాష 

మనసులోని భావం వ్యక్తీకరించడానికి భాష ఆధారం. భాష
మనుషుల్ని దగ్గర చేస్తుంది. మనస్సులను కలుపుతుంది.
భాషాభివృద్ధి ఎలా జరిగిందనే విషయం ఆలోచిస్తే పూర్వం కాలంలో గురువులు ఋషులు మునులు తమ శిష్యులకి పంచ కావ్యాలు చెప్పేవారు. రాజుల కాలంలో కవులను పోషించి మంచి మంచి కావ్యాలను వ్రాయించేవారు.తదుపరి కాలంలో పాఠశాలలో తెలుగు భాషకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.

 అయితే ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించిన కాలంలో వారు కూడా మన భాష అభివృద్ధికి కొంతవరకు దోహదం చేశారని చెప్పాలి.ఏవిధంగాఅంటేభారతదేశానికివ్యాపారంకోసం వచ్చిన
  తెల్ల దొరలు మన ప్రజల్ని పీడించి బాధ పెట్టినా వారు
     కొన్ని రంగాలలో తీసుకొచ్చిన మార్పులు మనకు
 తదుపరి కాలంలో మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు.
ఉదాహరణకి బ్రిటిష్ వారు తీసుకొచ్చిన రైలు మార్గం తదుపరి
 కాలంలో ఒక మహా సంస్థగా ఎదిగి భారతదేశానికి కోట్ల
 రూపాయల్లో ఈనాడు ఆదాయం తెచ్చి పెడుతోంది. అలాగే విద్యా విధానంలో ప్రజల్లో మార్పు తీసుకురావడానికి పెద్ద బాలశిక్ష అనే గ్రంధాన్ని తెలుగులో ఆంగ్లేయులు వ్రాయించడం జరిగింది. ఇదంతా వారి స్వలాభం కోసం చేసిన మనకు కొంత వరకు మేలు జరిగిందని చెప్పచ్చు .ఆనాటి గురుకుల పాఠశాలల్లో పెద్ద బాలశిక్ష తప్పనిసరిగా చదివించేవారు.

 పెద్ద బాలశిక్ష ని తెలుగు భాషకు ఎన్సైక్లోపిడియాగా చెప్పవచ్చు.
అంటే తెలుగు భాష లోని కథలు సామెతలు చరిత్ర పొడుపు కథలు వ్యాకరణం చందస్సు సర్వస్వం ఇందులో ఉంటాయి.
ఆ కాలంలో పెద్దబాల శిక్ష చదివితే ఒక డిగ్రీ వచ్చినట్లుగా
 భావించేవారు. తెలుగు భాష గురించి ప్రాథమిక పరిజ్ఞానం
 అంతా ఇందులో ఉంటుంది. ఇటువంటి పుస్తకాలు చదివితేనే
బాల్యంలో భాష పట్ల అభిమానం ఏర్పడుతుంది. సుమారు 60
 70 సంవత్సరాల క్రితం పిల్లలు పెరిగే వాతావరణ పరిస్థితులుఈ
 రోజుల్లో లేవు కాబట్టి పిల్లలకు తెలుగు భాషఅంతగాతెలియడం లేదు. దానికి తోడు ఒక ఉపాధికి సంబంధించినపోటీ పరీక్షలు ఆంగ్ల భాషలోఉండడంవలనవిద్యార్థులుతెలుగు భాష నేర్చుకోవడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం లేదు. 

  చిన్నప్పుడు మా ఊర్లో అంటే కాజులూరు మండలం
 పల్లిపాలెం గ్రామంలో కోసూరి నరసింహాచార్యులు మాస్టారు
తెలుగు అక్షరాలని గుండ్రంగా అందంగా చాలా ఓపికగా 
 నేర్పించేవారు. ఇంటిదగ్గర అమ్మ రక్త సంబంధాల పేర్లు
 తెలుగులో నేర్పించేది. అరుగు మీద పురాణ పఠనం చేసే నాన్న
పద్యాల పట్ల మక్కువ నేర్పించారు. రామాయణం భారతం
 భాగవతం పూర్తిగా అర్థం కాకపోయినా వాటిలోని పాత్రల పేర్లు
 కొంచెం వరకు తెలిసేవి. మా పల్లెటూరు ప్రకృతిని చూపించి తెలుగులో వాటి పేర్లు నేర్పించింది. ఊర్లో జరిగే గణపతి ఉత్సవాలు అమ్మవారి జాతర వ్యాశేశ్వరుడు కళ్యాణం
తెలుగు సంస్కృతి గొప్పదనం చెప్పింది. ఇలా మా పల్లెటూరు
తెలుగు భాషను నేర్పించింది. 
మా ఇంట్లో ఉండే అద్దాల బీరువా గ్రంథాలపేర్లు తెలుసుకునేలా చేసింది . చిన్నప్పుడుచదువుకున్న చందమామ కథలు కాశీ మజిలీ కథలు అమ్మ నేర్పించిన పద్యాలు తెలుగు భాష తీయదనాన్ని తెలిపాయి. అలాగే ఆనాడు రేడియోలలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసేవి. ఇటువంటి వాతావరణం ఈనాటి పిల్లలకు లేదు అసలు భాష ఎలా తెలుస్తుంది భాష గొప్పదనం ఎలా తెలుస్తుంది. భాష మీద మక్కువ ఎలా ఏర్పడుతుంది.
ఇటువంటి వాతావరణం ఈనాడు మనం తీసుకురాలేం కాబట్టి పెద్దబాలశిక్ష లాంటి పుస్తకాన్ని చదవడం కంపల్సరీ చేయడంప్రభుత్వాలుచేయవలసినపని.ఇకపోతేతల్లిదండ్రులుఇంటిదగ్గర ఇటువంటి పుస్తకాన్ని చదివించడం చాలా మంచిది.

 భాషను మరింత సరళతరం చేసి వ్యావహారిక భాషఉద్యమానికి పాటుపడిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం గా
జరుపుకుని ఆ మహనీయుడిని స్మరించుకుంటున్నాము. అటువంటి మహానుభావుడు మరలా జన్మించి తెలుగు భాష పూర్వవైభవాన్ని తీసుకువస్తారని ప్రభుత్వాలు అందుకు సహకరిస్తాయని ఆశిద్దాం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట