పోస్ట్‌లు

ఆర్థిక శాస్త్రవేత్త

ఆర్థిక శాస్త్రవేత్త ఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పుడూ ఎవరో ఒకరి మీద కేకలు వేస్తూనే ఉండేది ఆ హాల్లో మంచం మీద కూర్చుని. గేటు తలుపు తీసిన చప్పుడైతే ఎవరు అంటూ గట్టిగా అరిచేది. ఆ హాల్ అంతా చిన్న పోయింది. ఇప్పుడేమో ఇలా! వీధిలో చాప మీద పడుకుంటే ఏదోలా ఉంది.అప్పుడే ఆఖరి శ్వాస విడిచి మూడు గంటలు అయింది .  నిన్నటి వరకు మన మధ్య ఉన్న ఈమె ఇవాళ శవమై వాకిట్లో పడుకుంది అనుకుని బాధపడుతూ కూర్చున్నాడు చనిపోయిన సీతమ్మ గారి మనవడు రఘురాం. సీతమ్మ గారికి నలుగురు ఆడపిల్లలే. మగ పిల్లలు లేరు. అందుకే పెద్ద కూతురు కొడుకుని దత్తత చేసుకుని బంధువుల అమ్మాయిని సరళని ఇచ్చి పెళ్లి చేసింది. రఘురాం ఆ ఊర్లోనే టీచరుగా పనిచేస్తుంటాడు. తాతగారు ఇంట్లోనే కాపురం ఉంటాడు. మళ్లీ రఘురాం కూడా అందరూ నలుగురు ఆడపిల్లలే.  సీతమ్మ గారు ఆడపిల్లలు భర్తలు పిల్లలతో కలిసి వచ్చారు. బంధువులు స్నేహితులు ఒక్కొక్కళ్ళే రావడం ప్రారంభించారు . ఒకపక్క అంతిమ సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇంతలో సీతమ్మ గారి బంధువు ఒకరు రఘును పిలిచి ఇంకా ఎంతసేపు ! దూరం తీసుకెళ్లాలి కదా! ఆలస్యం అయిపోతుంది రఘుని తొందర పెట్టాడు. రఘు స్...

కమనీయ నగరం కాకినాడ

కమనీయ నగరం కాకినాడ. అసలు పేరు కోకనాడ. కోకనాడ పేరు రైల్ బండికి ఇచ్చి  కాకినాడ గా రూపాoతరం. తూర్పుగోదావరి జిల్లా కే తలమానికం. విశ్రాంతి ఉద్యోగుల భూతల స్వర్గం.       మన కాకినాడ నగరం. నాయకర్ గారి విద్యా భిక్షే M S N చారిటీస్. సాంకేతిక విద్యకు ఆలవాలం ఆంధ్ర పాలిటెక్నిక్. అదే సామాన్య విద్యార్థుల పాలిట వరం. ప్రాంగణం చుట్టూ క్షార మడుగులు. లోపల అన్నీ విద్యాలయాలు. తరతరాలుగా ఉప్పుటేరు మీద నిలుచున్న వారధి. జగన్నాధపురం వారధి. తరాలు మారినా పెరగని వారథి. నిత్యం పెరుగుతోంది రద్దీ.  చిరు వ్యాపారుల బ్రతుకు రథ జీవన సారధి.    అతి పెద్ద బోధన ఆసుపత్రి G G H. అధునాతన టెక్నాలజీతో సామాన్యుడి వైద్యం.     పనితీరు మొత్తం దేశానికే తలమానికం.     వైద్యో నారాయణో హరి పేరు సార్ధకం .     చెరువులన్నీ చరిత్ర లో మునిగి పోయిన.     బాలాజీ మటుకు T TD వారి మండపంలో.          అదే బాలాజీ చెఱువు.   విత్తనాల నుండి విందుల వరకు     దొరికే జంక్షన్. బ్రిటిష్ వారి కట్టడాలకు మచ్చు తునక కలెక్టర్ బంగ్లా. తరాలు మారి రంగ...

ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో!

ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో! సాయంకాలం ఐదు గంటలు అయింది. ఆ పల్లెటూర్లో ఉండే సోమయాజులు గారి ఇల్లంతా హడావిడిగా ఉంది. నడవలో వేసిన కుర్చీల్లో సోమయాజులు గారు కుటుంబం ఒకవైపు పెళ్ళికొడుకు రమేష్ కుటుంబం ఒకవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నా రు. అమ్మాయికి అబ్బాయికి  అబ్బాయికి అమ్మాయి నచ్చారు. కట్న కానుకలు వద్దని ముందుగానే చెప్పారు మగ పెళ్లి వారు.ఇంక పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడమే తరువాయి. సోమయాజులు గారు తూర్పుగోదావరి జిల్లాలో కాజులూరు మండలంలో ని పల్లిపాలెం స్కూలు హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఒకర్తే అమ్మాయి. అమ్మాయి పేరు వైదేహి . అచ్చు తెలుగు వారి పిల్లలా ఉంటుంది. డిగ్రీ చేసిన తర్వాత బీఈడీ కంప్లీట్ చేసి టీచర్ గా అక్కడ దగ్గరగా ఉన్న స్కూల్లోనే పనిచేస్తోంది. సోమయాజులు గారికి ఇంకా 5 సంవత్సరాలు సర్వీసు ఉంది. ఈలోగా పిల్లకు పెళ్లి చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత బాధ్యతలు ఉండవని ఆయన ఆలోచన. అయితే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈడు జోడు చూడాలంటారు. అందుకే టీచర్ ఉద్యోగం చేసే వరుడు కోసం వెతుకుతూ చివరికి కాకినాడలో టీచరుగా పనిచేస్తున్న రమేష్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. చివరికి పిల్...